-
హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో (2023లో క్యూ2) అంతకుముందు మూడు నెలలతో పోలిస్తే అద్దె ఇళ్లకు డిమాండ్ (అన్వేషణ) 22 శాతం పెరిగింది. అదే సమయంలో అద్దె ఇళ్ల సరరా జూన్ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 2.1 శాతం తగ్గింది. సగటు అద్దె ధరల్లో త్రైమాసికం వారీగా 4.5 శాతం పెరుగుదల నమోదైంది. ఈ వివరాలను ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ మ్యాజిక్బ్రిక్స్ ‘రెంటల్ ఇండెక్స్, ఏప్రిల్–జూన్ 2023’ను విడుదల చేసింది. ► గచ్చిబౌలి, కొండాపూర్ ఈ రెండూ హైదరాబాద్లో ఎక్కువ మంది అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్న ప్రాంతాలుగా (మైక్రో మార్కెట్) ఉన్నాయి. కీలకమైన ఉపాధి కేంద్రాలకు ఇవి సమీపంగా ఉండడం, ఓఆర్ఆర్కు సైతం చక్కని అనుసంధానత కలిగి ఉండడం అనుకూలతలుగా మ్యాజిక్బ్రిక్స్ పేర్కొంది. ► భాగ్యనగరంలో ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమైన ప్రాంతాల్లో (ప్రైమ్ లొకాలిటీస్) 2బీహెచ్కే ఇంటి అద్దె ధరలు రూ.20,000–32,000 మధ్య ఉంటే, 3బీహెచ్కే ధరలు రూ.30,000–45,000 మధ్య ఉన్నాయి. ► కిరాయిదారులు ఫరి్న‹Ù్డ 2బీహెచ్కే ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం మార్కెట్లో ఫరి్న‹Ù్డ 2బీహెచ్కే యూనిట్ల వాటాయే 55 శాతంగా ఉంటోంది. 1 బీహెచ్కే ఇళ్ల డిమాండ్ 23 శాతంగా ఉంటే, 3 బీహెచ్కే ఇళ్ల డిమాండ్ 20 శాతం చొప్పున ఉంది. ► కానీ, 2బీహెచ్కే ఇళ్ల సరఫరా 58 శాతం ఉంటే, 1 బీహెచ్కే 13 శాతం, 3బీహెచ్కే 25 శాతం, అంతకుమించిన ఇళ్ల సరఫరా 4 శాతం చొప్పున ఉంది. ► ముఖ్యంగా రూ.10,000–20,000 మధ్య అద్దె లున్న ఇళ్లకే 55 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఆ తర్వాత 19 శాతం ఆసక్తి రూ.20,000 –30,000 మధ్య ధరలశ్రేణి ఇళ్లకు ఉంది. ► అది కూడా 1,000–1,500 చదరపు అడుగుల ఇళ్లకే 50 శాతం డిమాండ్ ఉంది. కానీ, వీటి సరఫరా 39 శాతంగానే ఉంది. అద్దె ఇళ్లకు డిమాండ్ 18 శాతం దేశవ్యాప్తంగా 13 ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ జూన్ త్రైమాసికంలో, ఏప్రిల్ త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 18.1 శాతం పెరిగినట్టు మ్యాజిక్బ్రిక్స్ తెలిపింది. అదే సమయంలో సరఫరా చూస్తే 9.6 శాతమే పెరిగిందని.. ఇళ్ల అద్దెలు 4.9 శాతం ఎగిసినట్టు మ్యాజిక్ బ్రిక్స్ తన రెంటల్ ఇండెక్స్ నివేదికలో వెల్లడించింది. మ్యాజిక్ బ్రిక్స్ ప్లాట్ఫామ్పై 2 కోట్ల మంది కస్టమర్ల అన్వేషణ, ప్రాధాన్యతల ఆధారంగా ఈ వివరాలను రూపొందించింది. త్రైమాసికం వారీగా (సీక్వెన్షియల్గా) చూస్తే బెంగళూరులో 8.1 శాతం, నవీ ముంబైలో 7.3 శాతం, గురుగ్రామ్లో 5.1 శాతం చొప్పున అద్దెలు పెరిగాయి. ఢిల్లీ, ముంబైలో మాత్రం నికరంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అద్దె ఇళ్లకు డమాండ్ అత్యధికంగా 27.25 శాతం పెరగ్గా, ఆ తర్వాత అత్యధిక డిమాండ్ హైదరాబాద్ మార్కెట్లోనే (22 శాతం) నమోదైంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 18.35 శాతం, పుణెలో 19.3 శాతం, బెంగళూరులో 12.8 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది. 13 పట్టణాల్లో మొత్తం డిమాండ్లో ఒకటి, రెండు పడక గదుల ఇళ్లకే 80 శాతం మేర ఉంది. 53 శాతం డిమాండ్ 2బీహెచ్కే ఇళ్లకు ఉంది. సరఫరా కూడా ఈ విభాగంలోనే ఎక్కువగా ఉంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండడం, విద్యార్థుల రాక ఇందుకు మద్దతుగా ఉంది. ప్రాపరీ్టల విలువలు గణనీయంగా పెరిగిపోవడంతో వాటిని అద్దెకు ఇవ్వడం కంటే విక్రయించే అవకాశాలను యజమానులు సొంతం చేసుకున్నారు. ఇది సరఫరా తగ్గేందుకు దారితీసింది. దీనికితోడు అధిక డిమాండ్తో కొన్ని పట్టణాల్లో చెప్పుకోతగ్గ అద్దెలు పెరిగాయి’’అని మ్యాజిక్బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ వివరించారు. హెదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో అద్దెలు ప్రాంతం 2బీహెచ్కే 3బీహెచ్కే గచ్చిబౌలి 24,000 35,000 కొండాపూర్ 21,000 30,000 హైటెస్ సిటీ 32,000 47,000 మాధాపూర్ 21,000 30,000 కోకాపేట్ 23,000 33,000 నార్సింగి 22,000 32,000 కూకట్పల్లి 16,000 23,000 బంజారాహిల్స్ 20,000 30,000 నల్లగండ్ల 21,000 30,000 జూబ్లీహిల్స్ 23,000 33,000 మణికొండ 17,000 24,000 నోట్: 2బీహెచ్కే 900 ఎస్ఎఫ్టీ చదరపు అద్దె 3బీహెచ్కే 1300 ఎస్ఎఫ్టీ చదరపు అద్దె -
అద్దెకా! ఆ రోజులు పోయాయమ్మా.. రెండేళ్లలో గృహ ప్రవేశమే!
న్యూఢిల్లీ: భారతీయులు దాదాపు 45 శాతం మంది రాబోయే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్నారు. ఎక్కువ మంది అద్దెకు బదులుగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకుంటున్నరు. ‘వాయిసెస్ ఫ్రమ్ ఇండియా’’ పేరుతో ప్రాపర్టీ కన్సల్టెంట్-సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన ఒక సర్వే ఈ అంశాలను వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా 20,000 మంది ఈ సర్వేలో పాల్గొంటే ఇందులో భారతీయుల సంఖ్య 1,500. వీరిలో జెన్-జెడ్ (18-25 సంవత్సరాలు), లేట్ మిలీనియల్స్ (26-33 సంవత్సరాలు) ఎర్లీ మిలీనియల్స్ (34-41 మధ్య వయస్సులు), జెన్ ఎక్స్ (42-57 సంవత్సరాలు) బేబీ బూమర్స్ (58 దాటినవారు) ఈ సర్వేలో ఉన్నారు. ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని ఇండియా మార్టిగేజ్ గ్యారెంటీ కంపెనీ (ఐఎంజీసీ) ఇటీవలే తన తాజా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30-50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఐఎంజీసీ వివరించింది. -
యజమానుల్లో ‘టులెట్’ గుబులు
ఉప్పల్లో ఉంటున్న భీమన్న ఓ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సరిపోక అప్పు చేసి మరీ పెద్ద ఇల్లు కొని నాలుగు పోర్షన్లుగా మార్చి అద్దెకిచ్చాడు. ఆ అద్దెతో నెలవారీ ఈఎంఐ కట్టుకోవచ్చనే ధీమానే రెండేళ్లుగా ఆయన్ను నడిపించింది. అయితే కరోనా మహమ్మారితో అంతా తల్లకిందులైంది. మూడు పోర్షన్లలో కిరాయిదారులు ఖాళీ చేయడంతో ఇప్పుడు బ్యాంక్ లోన్, అప్పులు కట్టేందుకు సతమతమవుతున్నాడు. చాదర్ఘాట్లో గతంలో అద్దెకు షాపు కావాలంటే విపరీతమైన డిమాండ్ ఉండేది. రూ. లక్షల్లో అడ్వాన్స్ కడతామన్నా అనువైన ప్రాంతంలో అద్దెకు దుకాణం దొరికేది కాదు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఓ షాపును నడుపుతున్న వారు పెద్దగా వ్యాపారం జరగట్లేదని ఖాళీ చేస్తామని చెప్పగా యజమాని మాత్రం సగం అద్దె ఇచ్చినా పర్వాలేదు కానీ ఖాళీ మాత్రం చేయొద్దని బతిమిలాడుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గ్రేటర్ హైదరాబాద్లో సొంతిళ్లు, షాపుల యజమానులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పోర్షన్లను అద్దెకివ్వడం ద్వారా వచ్చే సొమ్ముతో దర్జాగా బతికిన పరిస్థితి నుంచి ఇప్పుడు కిరాయిదారుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘టులెట్ బోర్డు’లతో కాలం వెళ్లబుచ్చాల్సిన రోజులొచ్చాయని వాపోతు న్నారు. బ్యాంకు రుణాలతో కట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తారుమారు: గతంలో డిమాండ్ ఉన్న ఏరియాలు, అన్నింటికీ అందుబాటులో ఉన్న ప్రాంతా ల్లోని ఇళ్లు అద్దెకు దొరకాలంటే గగనంగా ఉండేది. అద్దె ఇళ్ల కోసం రెంటల్ ఏజెన్సీలపై కూడా కిరాయిదారులు ఆధారపడాల్సి వచ్చేది. పైగా ఓనర్లు పెట్టే ఆంక్షలు, నిబంధనలు అంగీకరించాల్సి వచ్చేది. పొద్దుపోయాక రావొద్దు.. బంధువులను పిలవకూడదు.. నీళ్ల ట్యాంకును రోజుకొకసారే నింపుతాం... ఇలా అనేక షరతులకు లోబడి అద్దెకున్న వారు ఉండేవారు. అయితే ఎప్పుడైతే కరోనా నియంత్రణకు కేంద్రం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిందో అప్పటి నుంచి ఇంటి ఓనర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధి అవకాశాలు కోల్పోయి సరైన ఆదాయం రాని వారు, చిన్నాచితకా వ్యాపారాలు చేసే వారు అద్దె కట్టే పరిస్థితులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లారు. హైదరాబాద్లో ఇంకా కరోనా పూర్తిగా అదుపులోకి రానందున వారిలో చాలా మంది తిరిగి నగరానికి వచ్చేందుకు జంకు తున్నారు. స్వగ్రామాల్లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. దీంతో ఇళ్ల యజమానుల పరిస్థితి తారుమారైంది. నెలవారీ అద్దెలు రాకపోవడంతో గతంలో తీసుకున్న బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నారు. సగం అద్దె ఇచ్చినా ఓకే: ఇప్పుడు కొత్తగా వచ్చే కిరాయిదారుల కోసం యజమానులు నెలల తరబడి వేచిచూడాల్సిన రోజులొచ్చాయి. దీంతో ఎవరైనా ఖాళీ చేస్తామని సూచనప్రాయంగా చెప్పినా యజమానులు కంగారుపడుతున్నారు. సగం అద్దె ఇచ్చినా పరవాలేదని బతిమాలుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. -
బెజవాడలో లాక్డౌన్ ప్రభావం..
అద్దెలకు దిగేవారు లేక బెజవాడలో ఇళ్లు, అపార్ట్మెంట్లు బోసిపోతున్నాయి. మూడు నెలల కిత్రం వరకు ఇక్కడ చిన్నపాటి ఇల్లు దొరకడం సైతం గగనమై పోయేది. రోజులు, వారాలకు తరబడి వెతికినా ఫలితం ఉండేది కాదు.. వేల రూపాయలు ఇస్తామన్నా అద్దె ఇల్లు దొరకడం అతికష్టంగా ఉండేది. కానీ నేడు పరిస్థితి తల్లకిందులయింది. రోజుల తరబడి ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి వచ్చేవారే కరువయ్యారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగులు, కారి్మకులు, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోవడం, మరలా వచ్చేవారు లేకపోవడంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏ ప్రాంతంలో చూసినా టూలెట్ బోర్డులు కట్టిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. అయితే మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్నా.. అద్దె తగ్గించుకునేందుకు యజమానులు ముందుకురాకపోవడం ఇక్కడ కొసమెరుపు.. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిలోకి దిగే వారే కరువయ్యారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మార్చి మూడో వారం నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. పరిశ్రమలు, షాపులు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఉపాధినిచ్చే అనేక రంగాలు మూతపడ్డాయి. దీంతో వాటిలో ఉపాధి పొందుతున్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన అనేకమంది తాము ఉంటున్న అద్దె ఇళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో బ్యాచిలర్లుగా ఉంటున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ల ఇళ్లు ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దాదాపు మూడు నెలల నుంచి నగరంలోని అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం సడలింపులతో పరిశ్రమలు, షాపులు, హోటళ్లు వంటి వివిధ సంస్థలు తెరచుకోవడానికి అనుమతినిచ్చినా అవి పూర్వ స్థితికి చేరుకోలేదు. స్వస్థలాలకు వెళ్లిపోయిన వారు అరకొరగా తప్ప పూర్తిస్థాయిలో వెనక్కి రాలేదు. అడిగేవారే కరువయ్యారు.. మరోవైపు విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. దాదాపు అన్ని డివిజన్లనూ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి అద్దె ఇళ్లలో ఉండడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో బెజవాడలో ఎటు చూసినా టు–లెట్ బోర్డులు వేలాడదీసిన అద్దె ఇళ్లు అనేకం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అద్దె ఇళ్ల కోసం గాలించడం ప్రహసనంగా మారేది. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన కొంతమంది రెంటల్ ఏజెన్సీలు, బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలోని ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ టు–లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇల్లు కావాలని అడిగే వారే కరువయ్యారని ఇంటి యజమానులు ఆవేదన చెందుతున్నారు. ‘నేను టు–లెట్ బోర్డు పెట్టి రెండు నెలలయింది. ఇప్పటివరకు అద్దెకు దిగుతామని ఒక్కరూ వాకబు చేయలేదు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు’ అని సత్యనారాయణపురానికి చెందిన దుర్గా భవానీ అనే ఇంటి యజమానురాలు ‘సాక్షి’తో చెప్పారు. మొగల్రాజపురానికి చెందిన ప్రసాదరావు కూడా మూడు నెలల నుంచి ఖాళీగా ఉన్న తన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి బోర్డు పెట్టారు. కానీ ఆయనదీ అదే పరిస్థితి. ఇలా నగరంలో అనేకమంది ఇంటి యజమానులు అద్దెలకు ఎవరొస్తారా? అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇంటి అద్దెల సొమ్ముతోనే జీవనం సాగించే వారూ ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందోనని వీరు ఆవేదన చెందుతున్నారు. అద్దెల తగ్గింపుపై ససేమిరా.. నగరంలో ఇంటి అద్దెలు కనీసం రూ.3 వేల నుంచి గరిష్టంగా 20 వేల వరకు ఉన్నాయి. ఇతర పట్టణాలు, నగరాలతో పోల్చుకుంటే విజయవాడలో ఇంటి అద్దెలు ఎక్కువగానే ఉంటున్నాయి. రేకుల షెడ్లకు కూడా రూ.3–4 వేలు వసూలు చేస్తున్నారు. సాదాసీదా డబుల్ బెడ్రూమ్కు కనీసం రూ.10 వేలు అద్దె తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్నా అద్దెలను తగ్గించడానికి మాత్రం చాలామంది యజమానులు ముందుకు రావడం లేదు. -
అద్దె భవనాల్లో...
జైనథ్ : శిశువులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తూ వారి మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడే అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో చాలీచాలని వసతుల నడుమ చిన్న చిన్న పెంకుటింట్లలో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన కూడ కేంద్రాలు నడిపే పరిస్థితి కనిపిస్తలేదు. దీంతో శిశువులు, గర్బిణులు, బాలింతలతో పాటు కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు, ఆయాలు సైతం నానా అవస్థలు పడుతున్నారు. మధ్యలోనే నిలిచిన మోడల్ కేంద్రం మండల కేంద్రంలో బీసీ హస్టల్ వెనుక వైపు నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రం పనులు మధ్యలోనే అగిపోయాయి. 2004లో మొదలైన ఈ పనులు దాదాపు 11 సంతత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. నిధుల కొరతతో అప్పట్లో ఈ పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం అది పశువులకు స్థావరంగా మారింది. కొద్దిపాటు ఖర్చుతో ఈ భవనం పూర్తిచేసి, ఒక కేంద్రాన్ని నడిపే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నతా«ధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదు. దీంతో చుట్టు పిచ్చిమొక్కలు, ముండ్ల పొదలతో ఈ భవనం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకుంది. కొనసాగుతున్న కొత్త భవనాలు... మండలంలోని జైనథ్–1, ఆకోలి, కామాయి, గిమ్మ–3, కౌఠ, పార్డి(బి), జైనథ్–2 కేంద్రాలకు గత సంవత్సరమే స్వంత భవనాలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కొక్క భవనానికి రూ.6.25లక్షలు కేటాయించినప్పటికీ నిధులు లేక భవన నిర్మాణ పనులు మొదలు కానీ దుస్థితి నెలకొంది. భోరజ్, మార్గుడ గ్రామాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ గత సంవత్సర కాలంగా పూర్తి కాలేదు. దీంతో నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. 10 కేంద్రాలకే సొంత భవనాలు... మండలంలో 29 గ్రామ పంచాయితీల పరిధిలో 56 గ్రామాల్లో 70 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 66 కేంద్రాలకు ప్రస్తుతం రెగ్యూలర్ టీచర్లు ఉండగా, ఇంకా నాలుగు కేంద్రాలకు ఇన్చార్జిలు ఉన్నారు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం 66 మంది కార్యకర్తలు, 63 మంది ఆయాలు, ఒక సూపర్వైజర్ పనిచేస్తున్నారు. ఈ 66 కేంద్రాల్లో కేవలం కూర, జైనథ్–3, కరంజి(బి), లక్ష్మీపూర్, సావాపూర్, బాలాపూర్, లేఖర్వాడ, సిర్సన్న, గూడ, పార్డి(బి) గ్రామాల్లోని 10 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇంకా 15 కేంద్రాలు పాఠశాల భవనాలు, జీపీ భవనాల్లో సాగుతున్నాయి. మిగిలిన 41 కేంద్రాలు మాత్రం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని మారుమూల గ్రామాల్లో అద్దెకు భవనాలు కూడ దొరకని పరిస్థితి. గత్యంతరం లేక తడకలు, ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ప్రారంభానికి ముందే పగుళ్లు... మండలంలోని భోరజ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ రూ.6.5లక్షలతో పక్క అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి 2014లో నిధులు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసికరంగా పనులు చేపట్టడంతో భవనం పూర్తికాక ముందే పగుళ్లు తేలాయి. ఇప్పటికీ ఇంకా కిటికీలు, తలుపులు బిగించడం వంటి పనులు అలానే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తికాకముందే భవనానికి పగుళ్లు తేలడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పనులపై అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ తీవ్రంగా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తుల చెబుతున్నారు. దీనికి తోడు సరిగా క్యూరింగ్ కూడ చేపట్టకపోవడంతో ఎటుచూసిన పగుళ్లే దర్శనమిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటువైపు దృష్టి సారించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement