-
'కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు'.. సొంత పార్టీ నేతపై జేడీయూ అసహనం!
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి గైర్హాజరైన కార్యక్రమానికి డిప్యూటి ఛైర్మన్ వెళ్లడంపై విచారం వ్యక్తం చేశారు. 'జర్నలిజం కోటాలో డిప్యూటీ ఛైర్మన్ పదవికి హరివంశ నారాయణ్ సింగ్ పేరును జేడీయూనే ప్రతిపాదించింది. అలాంటప్పుడు ప్రతిపక్షాలకు అండగా ఉండకుండా.. కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికిది చీకటి రోజు' అని నీరజ్ కుమార్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేడీయూతో సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. అయితే హరివంశ నారాయణ్ సింగ్ జేడీయూకు చెందిన నేత. జర్నలిస్టుల కోటాలో భాగంగా రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ కు జేడీయూనే అప్పట్లో ప్రతిపాదించింది. దీంతో తమ సొంత పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి.. డిప్యూటి ఛైర్మన్ హోదాలో హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. హరివంశ నారాయణ్ సింగ్ 2018లో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ పదవి చేపట్టారు. డిప్యూటి ఛైర్మన్గా కాంగ్రెస్కు చెందని మూడో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్నారు. ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్ -
సీఎం వైఎస్ జగన్కు నితీష్ కుమార్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్కి మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్ను ఫోన్లైన్లో కోరారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్కు చెందిన బీకే హరిప్రసాద్ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్ మరోసారి పోటీలో నిలిచారు.(చదవండి : ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు) -
ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం నవీన్ పట్నాయక్కు ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనికి స్పందించిన నవీన్ తమ పార్టీ నేతలతో చర్చించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షం జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ను ఎన్డీయే అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిపింది. (సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు) మొత్తం 245 సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 114 సభ్యల మద్దతుంది. మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకుని తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షాల మద్దతు కోరనుంది. మరోవైపు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై ఇతర పార్టీల నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపామని వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ల ప్రక్రియకు రేపు (శుక్రవారం) ఆఖరి రోజు కావడంతో నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ ఇదివరకే నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ తొలిరోజు సమావేశాలైన సెప్టెంబర్ 14న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఇదివరకే విప్ను సైతం జారీచేసింది. (అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్) -
మాజీ ప్రధానుల కోసం మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానులందరి సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ఓ భారీ మ్యూజియంను ఏర్పాటు చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేలా కొత్త రాజకీయ సంస్కృతిని తాము తీసుకొస్తామని ఆయన అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్పై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ రాసిన ఓ పుస్తకాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఓ కుటుంబానికి చెందిన మాజీ ప్రధాన మంత్రుల జ్ఞాపకాలు తప్ప మిగిలిన ప్రధానుల వివరాలు ఏ మాత్రం లేకుండా చెరిపేసేందుకు ఓ వర్గం రాజకీయ నాయకులు ప్రయత్నించారు. చంద్రశేఖర్ నాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడితే, దానికి వ్యాపారవేత్తలు డబ్బులిచ్చారని ఆ వర్గం రాజకీయ నాయకులు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలని చూశారని మోదీ గుర్తుచేశారు. ఇలాగే బీఆర్.అంబేడ్కర్, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ తదితర అనేక మంది గొప్ప నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు కూడా స్వాతంత్య్రానంతరం కుటిల ప్రయత్నాలు జరిగాయని మోదీ అన్నారు. ఈనాటి యువతరంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లంతా మొదట ప్రజల మెదళ్ల నుంచి అదృశ్యమయ్యారు. ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉండొచ్చు కానీ ఓ వర్గం రాజకీయ నేతలే అలా చేశారు. కానీ మీ అందరి ఆశీస్సులతో మాజీ ప్రధానులందరికీ కలిపి ఓ పెద్ద మ్యూజియంను నిర్మించాలని నేను నిర్ణయించాను. ఆనాటి నుంచి ఇటీవలి ఐకే గుజ్రాల్, దేవె గౌడ, మన్మోహన్ సింగ్ల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దేశాభివృద్ధికి కృషి చేశారు. వారి సేవలను మనం గుర్తించాలి. గౌరవించాలి’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్కు చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ను కాదని జవహర్లాల్ నెహ్రూను తొలి ప్రధానిగా నియమించిన విషయాన్ని మోదీ హాస్యంతో చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతనేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. -
ఇప్పుడు.. కాంగ్రెస్కు తాకట్టు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, పార్లమెంటు తలుపులు మూసి మరీ నిట్టనిలువునా చీల్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని విభజిం చిందని, రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆ పార్టీని నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిట్టిపోశారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేసిందని కూడా అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం తిడుతూనే ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పునాదులపైన. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది. అంతేకాదు జాతీయస్థాయిలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలన్నిటినీ ఐక్యం చేసిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం పార్టీని వెన్నుపోటుతో కైవసం చేసుకున్న చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీని కాంగ్రెస్కు పాదాక్రాంతం చేయడం చూసి ప్రజలే కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అవకాశవాదానికి పరాకాష్ట వంటి చంద్రబాబు తీరు చూసి నిర్ఘాంతపోతున్నారు. ఆ పార్టీల ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు.. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ను విభజన చట్టంలో పెట్టినట్లయితే సుప్రీంకోర్టుకైనా వెళ్లి దానిని సాధించుకునే అవకాశం ఉండేది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకపోవడం వల్ల మరింత నష్టపోయారు.. దారుణంగా మోసపోయారు. పోనీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలనైనా కూడా తప్పనిసరిగా అమలు చేయాలి అని విభజన చట్టంలో కాంగ్రెస్ పెట్టిందా అంటే అదీ లేదు. 13వ షెడ్యూలులో పెట్టిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సినవేననే అర్ధంలో చట్టంలో రాయకుండా కాంగ్రెస్పార్టీ మరో ద్రోహం చేసింది. 13వ షెడ్యూలులో పెట్టిన .. రైల్వే జోన్ నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ వరకు, క్రూడాయిల్ రిఫైనరీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు ఇలా ఏది తీసుకున్నా అన్నీ చట్టంలో.. ‘మే.. మే.. మే’అని పెట్టింది. అంటే చేయవచ్చు అనే అర్ధంలో రాశారన్నమాట. మే అని కాకుండా షల్ అని పెట్టి ఉంటే తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ రోజు చట్టంలో షల్ అని పెట్టకుండా కాంగ్రెస్పార్టీ మోసం చేసింది. కచ్చితంతా చేయాలి అనే అర్ధంలో షల్ అని పెట్టి ఉంటే ఇవాళ బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టడంలో బీజేపీ వారు కూడా భాగస్వాములే. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఆ రెండు పార్టీలు అలా తుంగలో తొక్కాయి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందంటూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇపుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే వైఖరి తీసుకోవడం, ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ సూత్రబద్ధవైఖరి.. రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ ద్రోహం చేశాయి.. రెండు పార్టీలూ రాష్ట్ర ప్రజలను వంచించాయి.. కాబట్టి ఆ రెండు పార్టీలకూ మద్దతివ్వరాదన్న వైఖరి తీసుకుంది. అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేయగా.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ.. అవకాశం ఉండీ.. అధికారంలో ఉండీ.. మోసం చేసింది. అందుకనే ఈ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయారని ఆపార్టీ నేతలు ప్రకటించారు. ఎన్డీయే ఓ బీజేపీయేతర అభ్యర్థిని బరిలో దింపగా కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన అభ్యర్థినే రంగంలో నిలిపింది. అలాంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఎలాంటి సంకోచమూ లేకుండా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతిచ్చి తన నిజస్వరూపాన్ని చాటుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసుల నుంచి రక్షణ కోసమే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి. ఎందుకంటే తన కేసుల నుంచి రక్షణ కావాలి. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు ఎపుడు ఎలాంటి ముప్పు తెచ్చినా ఓ జాతీయ పార్టీ ఆదుకోవాలని ఆయన ఆశిస్తారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో సంబంధాలు తెగిపోయిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. ఒకవైపు బీజేపీతో లోపాయికారి సంబంధాల కోసం లాబీయింగ్ నడుపుతూనే కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతిచ్చే స్థితికి చేరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుమ్మరించిన కేసులో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఇక రాష్ట్రంలో లక్షల కోట్లకు చేరుకున్న అవినీతి గురించి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సంస్థలు నివేదికలిస్తున్నాయి.. వీటి నుంచి చంద్రబాబుకు రక్షణ అవసరం. అందుకే రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని, రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి మరో జాతీయ పార్టీకి చేరువయ్యారని వినిపిస్తోంది. అంత ద్రోహం చేసినా కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతివ్వడానికి, ఓటు వేయడానికి చంద్రబాబు ఎలాంటి సంకోచం లేకుండా వ్యవహరించడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement