-
ఫలితం రేపే!
43 రోజుల ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజయాన్ని చవిచూస్తారో.. కొన్ని గంటల్లో తేలిపోనుంది. అందుకే యువకుల నుంచి వృద్ధులదాకా.. తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ అంతా ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడు 23వ తేదీ వస్తుందా ? ఫలితాలు ఎప్పుడొస్తాయా ? జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ‘ఎగ్జిట్పోల్స్’తో ఇప్పటికే ఫలితాలపై స్పష్టమైన అవగాహనకు వచ్చినా, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల వెల్లడికి సాయంత్రం దాకా సమయం పట్టినా అనధికారికంగా అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం ఒంటి గంటకే తెలిసిపోనుంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల ఫలితాల కోసం యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. జిల్లాలోనూ కౌంటింగ్ టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ఫలితాలతో పోలిస్తే అనంతపురం జిల్లా ఫలితాలపై జిల్లావాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ మెజార్టీ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీనే అధికారం చేపట్టనుంది. పైగా ఈ సారి జిల్లా నుంచి జేసీ దివాకర్రెడ్డి, పరిటాల సునీత వారసులు రాజకీయ ఆరంగేట్రం చేయడం.. ముఖ్యమంత్రి బావమరిది నందమూరి బాలకృష్ట ‘పురం’ బరిలో ఉండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. రెండు పార్టీల మధ్య పోటీ జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి 14 మంది, హిందూపురం పార్లమెంట్ నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 14 అసెంబ్లీస్థానాల నుంచి 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. ఫలితాలు వెల్లడైతే ఎవరి జాతకం ఎలా ఉండబోతుందనే చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి చాలా చోట్ల జనసేన అభ్యర్థులు సహకరించగా.. ప్రజాశాంతిపార్టీని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లుపోలిన వారితోనే నామినేషన్లు దాఖలు చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఈ నెల 19న వెల్లడైన ఎగ్జిట్పోల్స్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనమేనని స్పష్టమైంది. అలాగే అనంతపురంలో 10 నుంచి 12 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని ‘పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అనంత’లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి బాగా వీచిందని, అందులో పెద్దపెద్ద రాజకీయవటవృక్షాలు నెలకొరిగి కొట్టుకుపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిటాల కుటుంబానికి తొలి ఓటమి తప్పదా? జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది రాప్తాడు ఫలితం గురించే. పరిటాల కుటుంబంపై రెండుసార్లు పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మూడోదఫా బరిలో ఉన్నారు. మంత్రి సునీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె బరిలో ఉంటే ఓటమి తథ్యమని భావించిన టీడీపీ అధిష్టానం... శ్రీరామ్ను బరిలో నిలపింది. అయితే ఈ నియోజకవర్గంలో కురుబ, బోయలాంటి ప్రధాన కులాలతో పాటు బీసీలు టీడీపీని కాదని ప్రకాశ్రెడ్డి పక్షాన నిలిచినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. నియోజకవర్గంలో ఏ పల్లెలో ఏ పదిమందిని పలకరించినా... ఈ దఫా ప్రకాశ్ గెలుస్తాడని 10 మందిలో ఏడు మంది చెబుతున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో వారసుడిగా బరిలోకి దిగిన శ్రీరామ్కు ఓటమి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ కుటుంబానికి తొలిఓటమి ఎదురైనట్లే. కీలక స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ హవా రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకింగ్ ఇస్తే బాలకృష్ణ చివరిస్థానంలో ఉంటారు. ఐదేళ్లు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించినా...సీఎం చంద్రబాబు నోరు మొదపలేదు. కానీ ‘పురం’ ప్రజలు మాత్రం బాలకృష్ణ పనితీరుపై తీర్పు ఇచ్చినట్లే తెలుస్తోంది. ఇక్కడ కూడా నిజాయతీగల పోలీసు అధికారిగా పేరుపొందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ పక్షానే ప్రజలు నిలిచినట్లు ‘పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. అలాగే టీడీపీ కంచుకోటగా చెప్పుకునే పెనుకొండలో ఈ దఫా బీకే పార్థసారథిని కాదని, సౌమ్యుడైన శంకర్నారాయణను ప్రజలు ఆశీర్వదించినట్లు ‘ఎగ్జిట్ పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. మంత్రి కాలవ శ్రీనివాసులకు కూడా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినట్లేనని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మూడోస్థానంలోనే పీసీసీ చీఫ్ రఘువీరా? కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారని ‘ఎగ్జిట్ పోల్స్’ స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నా, విజయం మాత్రం వైఎస్సార్సీపీనే వరించే అవకాశాలున్నాయి. అలాగే ఉరవకొండ, అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. వైఎస్సార్సీపీ గాలి బాగా వీచిందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే టీడీపీ అభ్యర్థులు మాత్రం లగడపాటి సర్వేపై ఆశపెట్టుకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏదిఏమైనా రేపటి మధ్యాహ్నంలోపు అభ్యర్థుల భవితవ్యంతో పాటు వీరిపై రూ.కోట్లలో పందెం కాసిన బెట్టింగ్ రాయుళ్ల జాతకం తేలనుంది. జేసీ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ రాప్తాడు తర్వాత అదేస్థాయిలో ఆసక్తి నెలకొన్న నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడ జేసీ ప్రభాకర్రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్రెడ్డి బరిలో ఉన్నారు, దీంతో పాటు అనంతపురం పార్లమెంట్ బరిలో జేసీ దివాకర్రెడ్డి కుమారుడు పవన్ పోటీలో నిలిచారు. ఈ రెండుస్థానాల్లో కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ అంతర్గత సర్వేల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్లలో 6 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని తేలింది. ఆరుస్థానాల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్లు లేవు. దీనికి తోడు పోలింగ్ సరళి కూడా వైఎస్సార్సీపీకి అనుకూలంగా జరిగింది. జేసీ దివాకర్రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడి జనాల్లో చులకన అయ్యారు. తాడిపత్రిలో జేసీ కుటుంబం అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా జనాలు ఓట్లేశారు. దీంతో ఈ దఫా ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇదే జరిగితే 40 ఏళ్ల జేసీ కుటుంబ రాజకీయ ప్రస్థానానికి ఈ ఎన్నికలతో కాలం చెల్లినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రఘవీరాకు చంద్రబాబు లిఫ్ట్!
-
ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం
-
కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం
విజయవాడ: కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కలకలం రేగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎదుట పీసీసీ సభ్యుడు శివాచారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనున్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని తాను భావించానని, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తన చేత రూ.50 లక్షలు ఖర్చు పెట్టించాడని, ఇప్పుడు తనను పక్కకు పెట్టి వేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని శివాచారి తెలిపారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ కూడా అక్కడే ఉన్నారు. -
గాంధీభవన్లో కాంగ్రెస్ నాయకుల దీక్ష
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకై ఏప్రిల్ 9న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదీతరులు ఉన్నారు. వీరికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ మార్చిపోయారని గుర్తు చేశారు. మంథనిలో దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉన్నదని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. శాసనసభలో దళితుల గురించి మాట్లాడకుండా దళిత ఎమ్మెల్యేగా ఉన్న సంపత్ కుమార్ని బయటకు పంపించారని విమర్శించారు.గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని, రాహుల్ గాంధీ దాంట్లో పాల్గొంటారని తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు,మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచం లాంటిది పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత బ్రిటిష్ పాలన గుర్తొస్తుందని వ్యాఖ్యానించారు. అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని అన్నారు. బీజేపీ దళితులను, మైనారిటీలను ద్వేషిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుందని చెప్పారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటేనని, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement