-
13 మంది దళ సభ్యుల అరెస్ట్
పట్టుబడిన వారంతా సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)ని వీడిన చంద్రన్న వర్గం సభ్యులే 9 తుపాకులు, 344 తూటాలు, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే నినాదంతో ప్రత్యేక దళంగా ఏర్పాటైన 13 మంది సభ్యులు గల సాయుధ బృందాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నుంచి బయటకొచ్చి చంద్రన్న వర్గంగా ఏర్పాటైన అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, ఒక మోటార్సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరిపారు. అరెస్టైన వారిలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం యర్రాయిగూడెంకు చెందిన దళ కమాండర్ కుంజా రవి, ఖమ్మం జిల్లా గుండాల మండలం కేశన్నపల్లికి చెందిన డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్ అలియాస్ వెంకటేష్, బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెంకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, వీరమద్దిగూడెంకు చెందిన కరకాల రాము అలియాస్ రామన్న, తూర్పురేగులకుంటకు చెందిన మోకల మురళీకృష్ణ అలియాస్ వెంకటేశ్వరరావు, కైకాల సూర్యనారాయణ, అలివేరుకు చెందిన కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న, కామవరపుకోట మండలం జోగడిగూడెంకు చెందిన తలారి ప్రకాష్తోపాటు రాములు, ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన మహ్మద్ అబ్దుల్లా రషీద్, పాల్వంచకు చెందిన అమరాజు గట్టయ్య, పెనుమాక మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పాయం వెంకటేష్ అలియాస్ మురళి, కొత్తగూడెంకు చెందిన బడపటి వీరన్న ఉన్నారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాలో నూతనంగా దళాన్ని ఏర్పాటు చేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని ఎస్పీ రఘురామ్రెడ్డి చెప్పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులను జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, వీరందరినీ బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు గ్రామ సమీపంలోని విప్పలమ్మ కొయ్య వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నట్టు తెలిసింది. దళ సభ్యుల వద్ద తుపాకులు ఉన్నప్పటికీ, వారు వాటిని ధరించకుండా వాహనంలోనే ఉంచుకున్నట్టు సమాచారం. దళ సభ్యులు అప్రమత్తమయ్యే అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారని భోగట్టా. పోలీసులు తమను ముట్టడించిన సమయంలో దళ సభ్యులు పొగాకు బ్యారన్ల వద్ద గల కర్రలతో వారిపై దాడిగి తెగబడగా, పోలీసులు ప్రతిఘటించి వారందరినీ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. తొలుత దళ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రేగులకుంట సమీపంలోని వంతెన కింద తలదాచుకుంటున్న మరికొందరిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, వారినుంచి ఆయుధాలు,బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఉన్మాది పనేనా
సంచలనం రేకెత్తించిన చేబ్రోలుజంట హత్యలు చేబ్రోలు (ఉంగుటూరు) : చేబ్రోలులో సోమవారం తెల్లవారుఝామున జరిగిన జంట హత్యలు సంచలనాన్ని రేకెత్తించాయి. గ్రామంలో జాతీయ రహదారి పక్కన గుడి ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్న ఓ యాచకురాలు, చిరుద్యోగిని బండరాతితో మోది ఓ ఉన్మాది కిరాతక చర్యకు ఒడిగట్టాడు. అయితే ఎప్పటినుంచో ఇక్కడే తిరుగాడే ప్రేమ అనే హిజ్రా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఇక్కడ తచ్చాడుతూ ‘నలుగురు రౌడీలు తిరుగుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ స్థానికులతో చెప్పిన హిజ్రా ఈ ఘటన తరువాత అదృశ్యం కావడంతో పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు. సోమవారం ఉదయం జంట హత్యల సమాచారాన్ని అందుకున్న ఎస్పీ రఘురామ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, గుడి ఆవరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. యాచకురాలు పార్వతిని బండతో మోది చంపి, మృతదేహాన్ని గుడి వెనుకకు ఈడ్చుకెళుతుండగా అలికిడికి లేచిన చిరుద్యోగి ఏసుబాబు తమను ఎక్కడ గుర్తు పడతాడోననే భయంతోనే అతనిని కూడా బండరాతితో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హిజ్రా కాకపోతే గ్రామానికి తరచుగా వచ్చి పోయేవారి పనే అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో యాచిస్తున్న దామాల పార్వతిది విజయనగరం జిల్లా. తన కుమార్తెకు పెళ్లి చేయాలని తరచూ గ్రామస్తులతో అంటూ ఉండేదని, కూడబెట్టిన డబ్బును నెలకోసారి వెళ్లి కుమార్తెకు ఇస్తుండేదని గ్రామస్తులు చెబుతున్నారు. మొదటి నెల జీతం ఇచ్చాడు నెలన్నర క్రితమే హైవే పెట్రోలింగ్ వాహనం సహాయకుడిగా చేరిన ఏసుబాబు రెండు రోజుల క్రితమే తన మొదటి నెల జీతాన్ని తల్లికి ఇచ్చాడు. కుటుంబానికి ఆసరాగా ఎదిగిన కొడుకు అంతలోనే దూరం కావడంతో ముసలి తల్లిదండ్రులు బొబ్బిలి వెంకటేశ్వరరావు, మంగతాయారు ఆవేదన అంతా ఇంతా కాదు. అతను నివాసం ఉంటున్న సాయిరామ్పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏసుబాబు అన్న త్రిమూర్తులు, వారి మేనకోడలు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం చూపరులను కంటతడిపెట్టించింది. ఇంటికి వెళ్లినా.. హోటల్ లో నిద్రించినా బతికేవాడేమో.. ఆదివారం రాత్రి ఏసుబాబు విధులకు ఆలస్యంగా రాగా అప్పటికే హైవే పెట్రోలింగ్ వాహనం మిగిలిన సిబ్బందితో వెళ్లిపోయింది. అనంతరం రాత్రి 12గంటలకు వాహనం తణుకు నుంచి తిరిగొచ్చింది. అక్కడే ఉన్న ఏసుబాబును ఇంటికి వెళ్లి ఉదయమే రావాలని పెట్రోలింగ్ డ్రైవర్ మారిశెట్టి రవి కోరాడు. దీనికి నిరాకరించగా, వాహనం తాళాలు ఇచ్చి డ్రైవర్ రవి, మిగిలిన సిబ్బంది కొంత దూరంలో ఉన్న హోటల్లో నిద్రించేందుకు వెళ్లిపోయారు. వాహనంలో సీటును తెచ్చుకొని ఆలయం అరుగుపై యాచకురాలు పార్వతికి సమీపంలో ఏసుబాబు నిద్రించాడు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి నా, లేక తమతో పాటు హోటల్లో నిద్రించేందుకు వచ్చినా బతికేవాడంటూ డ్రైవర్ రవి, ఇతర సిబ్బంది వాపోయారు. అర్ధరాత్రి వరకు తమతో ఉన్న ఏసుబాబు హత్యకు గురికావడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement