-
నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
రాజస్థాన్లోని టోంక్లో ఒక గర్భిణి ఒకేసారి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం వజీర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఆ మహిళ పెళ్లయిన నాలుగేళ్లకు గర్భం దాల్చింది. ఆమె ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనివ్వడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గర్భిణికి చికిత్సనందించిన డాక్టర్ షాలినీ అగర్వాల్ మాట్లాడుతూ ఆదివారం సాయంతం ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు వచ్చారని, అర్ధరాత్రి దాటాక ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయన్నారు. తరువాత ఆమెకు డెలివరీ చేశామన్నారు. సోమవారం ఉదయం 5 గంటల 51 నిముషాలకు తొలి శిశువు జన్మించిందని, తరువాత ఒక్కొక్కరుగా నాలుగు నిముషాల్లో ముగ్గురు శిశువులు జన్మించారని తెలిపారు. ఆ నలుగురు శిశువుల్లో ఇద్దరు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆ మహిళ గర్భం ధరించిన రెండవ నెలలోనే ఆమె కడుపులో నాలుగు పిండాలు ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ షాలిని తెలిపారు. నాల్గవ నెలలో గర్భశ్రావం అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించామన్నారు. దీంతో ఆమెకు గర్భం నిలిచిందని, ఇప్పుడు డెలివరీ చేయగలిగామని డాక్టర్ షాలిని తెలిపారు. మెడికల్ సైన్స్లో కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు జన్మించడం అనేది జరుగుతుంటుంది. కానీ నలుగురు శిశువులు జన్మించడం అనేది బహ అరుదుగా జరుగుతుంది. 10 వేల ప్రసవాలలో ఒక గర్భిణి విషయంలోనే ఇలా జరుగుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఒకే కాన్పులో ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల
బొమ్మనహళ్లి/హుబ్లీ: ఒక కాన్పులో కవలలు జన్మిస్తే విశేషం. ముగ్గురు పుడితే వింత. ఏకంగా నలుగురు జన్మిస్తే పెద్ద విడ్డూరమే. కర్ణాటకలోని హుబ్లీలో ఓ గర్భిణి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. హావేరి జిల్లాలోని సవణూరు గ్రామానికి చెందిన మహబూబ్ బీ అనే గర్భిణి నెలలు నిండడంతో ప్రసవం కోసం హుబ్లీలోని ప్రభుత్వ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్ కాన్పు చేశారు. ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల జన్మించారు. ఒక్కో బిడ్డ బరువు రెండు కేజీల వరకూ ఉందని వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. మొదటి ప్రసవంలో ఒక కొడుకు పుట్టాడు. -
ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్) : ప్రతి ఏడు లక్షలమందిలో ఒకరు ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చే అరుదైన ఘటన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తునికి పట్టణానికి చెందిన జి.శేఖర్, నళిని భార్యాభర్తలు. శేఖర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా నళిని గృహిణి. నళిని గర్భం దాల్చినప్పటి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. నెలలు నిండటంతో ఈ నెల 4వ తేదీన శుక్రవారం రాత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీనియర్ గైనకాలజిస్టులు భాగ్యలక్ష్మి, మాధవీలతలతో పాటు 15 మంది వైద్య బృందం నళినికి ఆపరేషన్ నిర్వహించి పురుడుపోశారు. పుట్టిన నలుగురు ఆడ శిశువులూ ఆరోగ్యంగా ఉండటంతోపాటు 1.2 కేజీల చొప్పున బరువున్నారు. తల్లి నళిని కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. -
65 ఏళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చింది!
జర్మనీకి చెందిన ఓ బామ్మగారు సరికొత్త రికార్డు సృష్టించింది. 65 ఏళ్ల వయసులో ఆమె ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బెర్లిన్ నగరంలోని ఓ ఆస్పత్రిలో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఆనీగ్రెట్ రౌనిక్ అనే ఆ టీచర్కు పుట్టారు. పిల్లలు నలుగురూ క్షేమంగానే ఉన్నారని, అయితే వారికి ఏమైనా సమస్యలు రావని మాత్రం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. వాళ్లంతా ఆమె గర్భం దాల్చిన 26వ వారంలోనే (ఏడో నెల) పుట్టడంతో కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఆనీగ్రెట్కు ఇప్పటికే 13 మంది పిల్లలున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిసి మొత్తం 17 మంది పిల్లలయ్యారన్న మాట. తాను గర్భం దాలుస్తానని, ఫలదీకరణ చెందిన అండాలను తన గర్భాశయంలో ప్రవేశపెట్టాలని కోరగా.. వైద్యులు ముందు వద్దన్నారు. ఆమె శరీరం అందుకు సహకరిస్తుందో.. లేదోనని అనుమానపడ్డారు. అయితే ఆమె మాత్రం తనకు పిల్లలు కావాల్సిందేనని పట్టుబట్టడంతో వాళ్లు సరేననక తప్పలేదు. దాంతో బామ్మగారు ఆరు పదుల వయసు దాటిన తర్వాత నలుగురికి జన్మనిచ్చిందన్నమాట. -
నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ
బెర్లిన్: ఇంట్లో కూర్చొని మనవళ్లతో ఆడుకునే వయసులో తల్లి కాబోతోంది ఓ వృద్ధురాలు. అది కూడా నలుగురు పిల్లలకి ఒకే సారి జన్మనివ్వబోతోంది. జర్మనికి చెందిన అనిగ్రట్ అనే 65 ఏళ్ల బామ్మ మరికొద్ది రోజుల్లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకి జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అనిగ్రట్ ఐదు నెలల గర్భవతి. తన తొమ్మిదేళ్ల కూతురు బుజ్జిబాబు గానీ, పాప కానీ కావలని కోరడంతో గర్భందాల్చినట్టు చెప్పింది. ఇప్పటికే అనిగ్రట్కు 13 మంది పిల్లలు ఏడుగురు మనవళ్లు,మనవరాళ్లు ఉన్నారు. టీచర్గా పని చేసిన అనిగ్రట్ ఇటీవటే రిటైర్ అయింది. వీర్యకణాలు, అండాన్ని దాతల ద్వారా సేకరించి కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భందాల్చింది. ఈ వయసులో కూడా పిల్లల్ని పెంచే ఓపిక పుష్టిగా ఉందని చెప్పుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement