-
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
‘నదిలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది. సహాయక చర్యలకు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 28, 252 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం కూడా శ్రీశైలంలోకి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులి చింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో 4,5 50 క్యూసెక్కులను సాగునీటి కాలువలకు ఇస్తూ.. మిగులుగా ఉన్న 4,530 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 66 వేల క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 59 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
జలాశయాలు విలవిల
సాక్షి, అమరావతి: జాతీయ జలవిధానం, కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి(వర్కింగ్ ప్రొటోకాల్)లను తుంగలో తొక్కుతూ.. శ్రీశైలం, సాగర్, పులిచింత ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండడాన్ని రెండు రాష్ట్రాల్లోని విద్యుత్, నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. సాగునీటి అవసరాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఏపీకే కాదు.. తెలంగాణకూ నష్టమేనని తేల్చిచెబుతున్నారు. అయినా సరే.. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కల్పించడం లక్ష్యంగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండటం బరితెగింపునకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలల్లో విద్యుదుత్పత్తిని చేయకుండా తెలంగాణను నిలుపుదల చేసి.. తమ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం పదే పదే లేఖలు రాస్తోంది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు.. విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు సరి కదా శ్రీశైలం, సాగర్, పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద పోలీసులను మోహరించి మరీ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ యథేచ్ఛగా దిగువకు నీటిని విడుదల చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో.. గేట్లు ఎత్తి జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇరు రా ష్ట్రాల్లోని ప్రాజెక్టులనూ బోర్డు అధీనంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం: 885 అడుగులు తెలంగాణ ఏం చేస్తోంది? ► జూన్ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంది. కనీస నీటి మట్టం కంటే దిగువన ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి, కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ► శ్రీశైలంలో 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు, రాయలసీమ, నెల్లూరు కోసం రోజుకు ఏడు వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. 848 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే.. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చుక్క నీటిని తరలించడానికి అవకాశం ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి(ప్రోటోకాల్) ప్రకారం విద్యుదుత్పత్తిని ఎప్పుడు చేయవచ్చు: ► 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉండి, వరద ప్రవాహం వస్తున్న సమయంలో స్వచ్ఛందంగా విద్యుదుత్పత్తి చేయవచ్చు. ► సాగర్ ఆయకట్టు కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినప్పుడు.. బోర్డు కేటాయించిన మేరకు ఏపీ, తెలంగాణలు రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ సమానస్థాయిలో నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఎవరికి ఎంత నష్టం ► శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం 823.33 అడుగుల్లో 43.35 టీఎంసీలు నిల్వ ఉండగా.. ప్రాజెక్టులోకి 13,340 క్యూసెక్కులు వస్తుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 30,610 క్యూసెక్కులను తెలంగాణ సాగర్కు విడుదల చేస్తోంది. ► జలాశయంలో ఎక్కువ ఎత్తులో నీటి నిల్వ ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్.. తక్కువ ఎత్తు నీటి నిల్వ ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్కు సమానం. ఎందుకంటే ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ నీటిని విడుదల చేసినా.. టర్బైన్లు వేగంగా తిరుగుతాయి. తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ నీటిని విడుదల చేసినా టర్బైన్లు వేగంగా తిరగవు. తక్కువ ఎత్తు నుంచే నీటిని తరలించడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం పెరగదు. దీని వల్ల తెలంగాణకూ నష్టమే. ఇది తెలంగాణ జెన్కో అధికారులకు తెలియంది కాదు. ► కేవలం.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు.. చెన్నైకి తాగునీటి అవసరాలకు నీటిని దక్కకుండా చేయాలన్న కారణంతోనే ఏకపక్షంగా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తోంది. నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం: 590 అడుగులు తెలంగాణ ఏం చేస్తోంది? కృష్ణా డెల్టాలో ఇప్పటిదాకా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయలేదు. డెల్టాకు నీటిని కృష్ణా బోర్డు కేటాయించలేదు. నీటిని విడుదల చేయాలని కృష్ణా డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలు పంపలేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 32,190 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది.. ఆ జలాలు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. సాగర్ నిర్వహణ నియమావళి ఏం చెబుతోంది? ► నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుని.. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పుడు తెలంగాణ, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక విద్యుదుత్పత్తిని నిలిపేయాలి. ► కృష్ణా బోర్డు కృష్ణా డెల్టాకు కేటాయించిన జలాలను.. రోజుకు నిర్ధిష్ట పరిమాణంలో విడుదల చేయాలని ఎస్ఈ ప్రతిపాదనలు పంపినప్పుడు.. ఆ జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల్లో రెండు రాష్ట్రాలు చెరి సగం వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. ఎవరికి ఎంత నష్టం వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్లో నీటి మట్టం పెరగదు. దీని వల్ల ఏపీలో సాగర్ కుడి కాలువ కింద.. తెలంగాణ, ఏపీలోని సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేయలేని పరిస్థితి. పులిచింతల ప్రాజెక్టు తెలంగాణ ఏం చేస్తోంది? కృష్ణా డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ 4,600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఆ జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. ‘పులిచింతల’ ప్రోటోకాల్ ఏం చెబుతోంది? కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం నిర్మించిన బ్యాలెనింగ్స్ రిజర్వాయర్ ఇది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. సముద్రంలోకి వరద జలాలు కలుస్తున్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక.. కృష్ణా డెల్టా అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలు పంపినప్పుడే.. ఆ నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఎవరికి ఎంత నష్టం కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఇప్పటిదాకా నీటిని విడుదల చేయలేదు. అవసరం లేకపోయినా దిగువకు విడుదల చేయడం వల్ల పులిచింతల ప్రాజెక్టు ఖాళీ అవుతుంది. కృష్ణా డెల్టా ప్రయోజనాలకు ఇది విఘాతం కల్పిస్తుంది. ప్రకాశం బ్యారేజీ జాతీయ జలవిధానం ఏం చెబుతోంది? ► ప్రాజెక్టులలో నిల్వ చేసిన జలాలను వినియోగించడానికి కేంద్రం జాతీయ జలవిధానాన్ని (నేషనల్ వాటర్ పాలసీ) ప్రకటించింది. ఆ విధానం ప్రకారం ► మొదటి ప్రాధాన్యం: తాగునీటి అవసరాలు ► రెండో ప్రాధాన్యం: సాగునీరు ► మూడో ప్రాధాన్యం: సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే సమయంలోనే విద్యుదుదుత్పత్తి చేయవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement