-
మహిళా రైతు ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో జోగు పోచవ్వ(47) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోచవ్వ ఇటీవల తనకున్న ఐదు ఎకరాలలో పత్తిపంట వేసింది. వేసిన పంట సరైన వర్షాలు లేకపోవడంతో ఎండిపోయింది. చేసిన అప్పులు తీర్చడానికి ఇటీవల ఒకటిన్నర ఎకరం పొలాన్ని అమ్మింది. అయినా అప్పులు తీరకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్న తల్లిని కడతేర్చిన కర్కశ కొడుకు
బీర్కూర్ : నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే క్షణికావేశంలో బండతో మోది కడతేర్చాడు ఓ కర్కశ కొడుకు. దురలవాట్లకు బానిసై, వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక, దంపతుల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయత్నించిన తల్లిపై బండరాయితో దాడిచేశాడు. ఎస్సై రాజ్భరత్ రెడ్డి కథనం ప్రకారం. జిల్లాలోని బీర్కూరు మండలం దుర్కి గ్రామానికి చెందిన మేతిరి బశెట్టి, తన తల్లి పోశవ్వ (65)తో కలిసి ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సవితతో బశెట్టికి వివాహమైంది. తరచూ భార్య భర్తలు గొడవ పడుతుండేవారు. 15 రోజుల క్రితం సవిత భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి బుధవారం దుర్కి గ్రామానికి వచ్చింది. రాత్రి మళ్లీ భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని బశెట్టి బయటకు వెళ్లి విద్యుత్ తీగను పట్టుకోవడంతో పాటు తలను బండకేసి మోదుకోగా తల్లి అడ్డుపడింది. దీంతో ‘నీ వల్లే మా మధ్యలో గొడవలవుతున్నాయని’ కోపోద్రిక్తుడైన బశెట్టి ఇంటి వద్ద నున్న బండరాయితో తల్లిని మోది తీవ్రంగా గాయపర్చాడు. గమనించిన కూతురు రజిత వెంటనే 108కు సమాచారం అందించగా, పోచవ్వను వెంటనే బాన్సు వాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement