-
హోండా సిటీ : కొత్త వేరియంట్స్
సాక్షి, ముంబై: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) తన పాపులర్ సెడాన్ హోండా సిటీ 2020ని మంగళవారం లాంచ్ చేసింది. హోండీ సిటీ కి చెందిన నాల్గవ తరం రెండు పెట్రోల్ వేరియంట్లను తాజాగా ఆవిష్కరించింది. 9.29 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభధరగా నిర్ణయించింది. ఇటీవలే హోండా సిటీ సెడాన్ సరికొత్త 5 వ తరం వెర్షన్ను విడుదల చేసిన సంస్థ, 4 వ తరం కారును ఎస్ వీ, వి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో (మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలతో , సమకాలీన స్టైలింగ్తో తమ పాపులర్ మోడల్ 4వ తరం హోండా సిటీ అమ్మకం కొనసాగించాలని ఆశిస్తున్నామని హెచ్సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ తెలిపారు. (చదవండి : ఒకినావా ఆర్30 ఈ స్కూటర్) -
విటారా బ్రెజా కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన పాపులర్ ఎస్యూవీ మోడల్, విటారా బ్రెజాలో పెట్రోల్ వేరియంట్ను అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.11.4 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్–సిక్స్ పెట్రోల్ విటారా బ్రెజాను 1.5 లీటర్ కె–సిరీస్ ఇంజిన్తో రూపొందించామని పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్లో 5 గేర్లు(మాన్యువల్) వెర్షన్తో పాటు ఏఎమ్టీ(ఆటోమేటిక్ ట్రాన్సిషన్)ను కూడా అందిస్తున్నామని తెలిపారు. డీజిల్ కార్లకు టాటా... ఈ కొత్త విటారా బ్రెజాకు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించగలదన్న ధీమాను కెనిచి అయుకవ వ్యక్తం చేశారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. విటారా బ్రెజాలో డీజిల్ వేరియంట్ను దశలవారీగా ఉపసంహరిస్తామని వివరించారు. 2016లో విటారా బ్రెజా (డీజిల్) మోడల్ను మారుతీ సుజుకీ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. అనతికాలంలోనే యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఐదు లక్షల విటారా బ్రెజాలు అమ్ముడయ్యాయి. -
హ్యుందాయ్ ‘ఆరా’.. ఆగయా
చెన్నై: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ), కాంపాక్ట్ హ్యాచ్బాక్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, వైర్లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్వెప్ట్బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, బూమరాంగ్ షేప్లో ఉండే ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్షోరూమ్ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్
ధర రూ.52.75 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన ‘ఏ6 మ్యాట్రిక్స్ 35 టీఎఫ్ఎస్ఐ’ సెడాన్ కారు మోడల్లో తాజాగా పెట్రోల్ వేరియంట్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52.75 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇం జిన్, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8 ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలేషన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. -
మెర్సిడెస్ అన్ని మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లు!
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్-బెంజ్’ తాజాగా తను భారత్లో విక్రయించిన అన్ని మోడళ్లకీ పెట్రోల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జీఎల్ఈ 400లో పెట్రోల్ వేరియంట్ కంపెనీ తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘జీఎల్ఈ 400’లో పెట్రోల్ వేరియంట్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.74.90 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇందులో శక్తివంతమైన 2,996 సీసీ ఇంజిన్ను అమర్చారు. ఎస్యూవీ విభాగంలో పెట్రోల్ వేరియంట్ల పోర్ట్ఫోలియోను విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ వెహికల్ను మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న పెట్రోల్ వేరియంట్ల విక్రయాలు రానున్న కాలంలో 30%కి చేరొచ్చని అంచనా వేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement