-
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?
ఐటీ మేజర్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొడుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపివేశాయి. చాలామంది ఫ్రెషర్లను తొలగించాయి. ఇది చాలదన్నట్టు తాజాగా వేతనాల పెంపును వాయిదా వేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగుల వార్షిక వేతనాల్లో కోత విధించేందుకు యోచిస్తున్నాయని తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇది పరిశ్రమలో నెలకొన్న గడ్డు పరిస్థితులను అద్దం పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఇండియాలో టాప్ శాలరీ అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్లలో ఒకరైన హెచ్సీఎల్టెక్ సీఈఓ సీ విజయకుమార్ ఐటి పరిశ్రమలో మాంద్యం భయం వాస్తవమనే ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 క్యూ1లో ఐటి దిగ్గజం లాభం, రాబడికి సంబంధించిన అంచనాలను మిస్ అయిన తర్వాత విజయ్కుమార్ ఎకనామిక్ టైమ్స్తో ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటి మేజర్లు బలహీనమైన ఆదాయ అంచనాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల టర్నోవర్ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా యన్నారు. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) జూన్ త్రైమాసికంలో చెప్పుకోదగిన చెల్లింపుల కంటే తక్కువే అందిస్తోందనే అంచనాలను లైవ్మింట్ నివేదించింది. జూన్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు వేరియబుల్ వేతనం దాదాపు 60-80శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మనీకంట్రోల్ నివేదించిన ప్రకారం, ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది. మరో సంస్థ విప్రో తొలి త్రైమాసికానికి ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని 80శాతానికి పరిమితం చేసింది. అయితే ఇందులో టీసీఎస్ కాస్త బెటర్గా ఉందని. ఇటీవలి ఫలితాల తరువాత వేతన పెంపుదలలు సగటున 6-8 శాతం మధ్య టాప్ పెర్ఫార్మర్లు 12-15 శాతం వరకు పొందుతున్నారని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. అయితే కొత్త ఉద్యోగ నియామకాలు మాత్రం భారీగా 96 శాతం తగ్గిందని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి గూగుల్ షాకింగ్ న్యూస్!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనంలో కంపెనీలు కొంత మొత్తం కట్ చేసే అవకాశం ఉందా? అంటే అవును, అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మహమ్మారికి ముందు కార్యాలయంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడానికి మారితే వేతనంలో కొతలు విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇప్పుడు ఈ విషయం గురుంచి సిలికాన్ వ్యాలీ అంతటా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్ళే రిమోట్ ఉద్యోగులకు వేతనాన్ని తగ్గించాయి. ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ ఉద్యోగులు ఉంటున్న లొకేషన్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, సంస్థ వారి ఉద్యోగుల లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది. "ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్యాకేజీలు ఎల్లప్పుడూ స్థానం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ఒక ఉద్యోగి ఎక్కడ నుంచి పనిచేస్తాడో దాని ఆధారంగా మేము ఎల్లప్పుడూ స్థానిక మార్కెట్లో ఉన్న వారికంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు" గూగుల్ ప్రతినిధి తెలిపారు. వేతనం అనేది నగరం నుంచి నగరానికి, రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. జూన్ లో ప్రారంభించిన కంపెనీ వర్క్ లొకేషన్ టూల్ అంచనాల ప్రకారం.. ఇంటి నుంచి పనిచేసే వారి వేతనంలో సుమారు 10 నుంచి 20 శాతం కోత విధించనున్నట్లు తెలుస్తుంది. -
వేతనాల కోతతో తీవ్ర పరిణామాలు
సాక్షి, న్యూఢిల్లీ : జీతాల కోత నిర్ణయంపై ఎయిరిండియా పైలట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలను భారీగా తగ్గించాలన్న ప్రభుత్వం నిర్ణయం తమ కుటుంబ సభ్యులపై వినాశకర ప్రభావాన్ని చూపించిందటూ సీనియర్ పైలట్లు ఆరోపించారు. ఈ మేరకు వారు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ పూరీకి ఒక లేఖ రాశారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో ఫ్రంట్లైన్లో సేవలందిస్తున్న 60 మంది పైలట్లు వైరస్ బారిన పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ల జీతం 75శాతం వరకు వేతనాన్ని తగ్గించే ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమైందని పైలట్లు ఆగ్రహం వక్తం చేశారు. ఈ అసంబద్ధమైన, వివక్షాపూరిత నిర్ణయం తీవ్ర మానసిక ప్రభావాన్ని పడేస్తుందని, ఇది చాలాసార్లు నిరూపితమైందని ఆరోపించారు. అంతేకాదు ఇది విపరీత చర్యలకు దారితీసే అవకాశం ఉందని సీనియర్ పైలట్లు హెచ్చరించారు. మరోవైపు ఎయిరిండియా ఇటీవల లీవ్ వితౌట్ పే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల వరకు వేతనం లేకుండా కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపించాలని నిర్ణయించింది. (కరోనా: ఎయిరిండియా ఉద్యోగులకు చేదువార్త) వందేభారత్ మిషన్ ద్వారా ఎయిరిండియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7,73,000 మంది భారతీయులను తీసుకొచ్చినట్టు హర్దీప్ స్వయంగా ప్రకటించారు. ఈ నెల(జూలై)16న ఆయన మాట్లాడుతూ ఎయిరిండియా మనుగడ కొనసాగాలంటే లీవ్ వితౌట్ పే నిర్ణయం తప్పదంటూ సమర్ధించారు. ఒకవేళ ఎయిరిండియా మొత్తానికే మూతపడితే ఎవరికీ ఉద్యోగాలుండవని పేర్కొన్నారు. మిగులు సిబ్బంది అధికంగా ఉన్నారనీ, దీనికి తోడు శిక్షణ పొందిన వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) కాగా కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ఆంక్షలతో దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రదానంగా దేశీయ విమానయాన సంస్థలు వేతన కోతలు, సిబ్బంది కోత లాంటి ఖర్చు తగ్గించే చర్యలను చేపట్టాయి. సుమారు 70 వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. -
ఉద్యోగులకు షాక్ : టీవీఎస్లో వేతనాల కోత
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ఎఫెక్ట్తో ఉద్యోగుల వేతనాల్లో కోతను విధిస్తున్నట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. వేతన కోతను ప్రకటించిన దేశంలో తొలి టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ కావడం గమనార్హం. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్డౌన్తో ఉత్పాదకత, అమ్మకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులందరికీ ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకూ వేతనాలను తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్త లాక్డౌన్తో అమ్మకాలు తీవ్రంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఉద్యోగులకు వేతనాలను బట్టి 5 నుంచి 20 శాతం వరకూ వేతన కోత విధించారు. ఆటోమొబైల్ సేల్స్ దారుణంగా పడిపోవడంతో ఇతర ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగుల్లోనూ వేతన గుబులు మొదలైంది. చదవండి : కేసీఆర్ తాతా కనికరించవా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement