-
పురందేశ్వరిపై ఫైర్ ఐన పరిపూర్ణానంద స్వామి
-
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా స్వామి పరిపూర్ణానంద
హిందూపురం టౌన్: ‘‘బీజేపీ టికెట్ ఇస్తే ఆ పార్టీ సింబల్తో పోటీలో నిలుస్తా.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా హిందూపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తా’ అని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. వార్డులు, డయాలసిస్ కేంద్రం, సీటీ స్కాన్, ఎక్సరే విభాగాలను పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ... హిందూపురం అభివృద్ధికి ‘సప్తపది’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. మొదటి అడుగుగా గణేష్ సరోవరం, రెండో అడుగుగా హిందూపురం ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు కూడా రూ.500 నోటుకు ఆశపడకుండా ఐదేళ్ల అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. దేశంలో హిందూపురాన్ని రోల్ మోడల్గా చేయాలన్నదే తన సంకల్పం అన్నారు. -
ఆలయాలు రాజకీయ అడ్డాలయ్యాయి..
సాక్షి, కొత్తగూడెం: దేశవ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాలు ‘రాజకీయ’ కబంధ హస్తాల నుంచి త్వరలో బయటప డనున్నాయని శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణా నంద అన్నారు. ఆదివారం ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన లక్షదీపోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందూ దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నప్పటికీ రాజ కీయ అడ్డాలుగా మారిపోయాయన్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యం కలిగించే వాతావరణం నెలకొల్పాల్సిన అవస రముందన్నారు. ఆలయాలు హిందువుల సొత్తని.. అవి హిందువులకే ఉపయోగపడా లని పేర్కొన్నారు. దేవాలయాల్లో హిందూ భావజాలం, సంస్కృతి రూపు దిద్దుకునేలా మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసిందని చెప్పారు. హిందూ దేవాలయాల విషయమై పదేళ్లుగా తాము సుప్రీంకోర్టులో న్యాయపో రాటం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాల నిర్వహణ, విధివిధానాల రూపకల్పన తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసు కోవాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ సత్యపాల్సింగ్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని, ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని అన్నారు. -
కేసీఆర్ దుకాణం బంద్: పరిపూర్ణానంద
సాక్షి, నారాయణపేట: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానందస్వామి ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, అచ్చంపేట, గద్వాల బీజేపీ అభ్యర్థులు రతంగ్పాండురెడ్డి, మల్లీశ్వర్, వెంకటాద్రిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓటుదెబ్బతో తెలంగాణలో కేసీఆర్ దుకాణం బంద్ కాబోతుందని బీజేపీ రాష్ట్ర నేత, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ జనం నోట మట్టికొడుతున్న కేసీఆర్ను తరిమికొట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం దామరగిద్దలో మార్పు కోసం బీజేపీ.. బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రతంగ్పాండురెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రజాకార్ల హయాంలో పెట్టిన మహబూబ్నగర్ పేరును పాలమూరు జిల్లాగా మారుస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. పాలమూరుతో నాకు చాలా అనుబంధం ఉంది.. ఇక్కడే గుడిసె వేసుకొని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. జిల్లాలో పారుతున్న భీమా, కృష్ణానదుల నుంచి సాగునీరు తీసుకువచ్చి ప్రతి ఎకరాకు అందిస్తామన్నారు. అభివృద్ధి పథంలో దేశం.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో యావత్ భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఉజ్వల పథకం కింద నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు అందిస్తుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, ప్రత్యేక తెలంగాణ టీఆర్ఎస్ పాలన చూశారు.. ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేటలో రతంగ్పాండురెడ్డి, కొడంగల్లో నాగూరావు నామాజీ, మక్తల్లో కొండయ్యలకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దళితుడిని సీఎంగా ప్రకటించాలి.. కేసీఆర్కు దమ్ముంటే దళితుడిని సీఎంగా చేస్తానని ప్రకటిస్తే ఇప్పుడే తాను పోటీలోంచి తప్పుకొంటా నని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగూరావు నామాజీ సవాల్ విసిరారు. జి ల్లా కావాలని పేట డివిజన్ ప్రాంత సకలజనులు ఉద్యమం చేపడితే స్పందించని కేసీఆర్.. ప్రస్తుతం ఓటమి పాలవుతామని భయపడి జిల్లా మాట ఎత్తారని, ఆయన మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితుల్లో పేట ప్రజలు లేరన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి రతంగపాండురెడ్డి, నాయకులు సత్యయాదవ్, హన్మిరెడ్డి, ప్రభాకవర్వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివసేన సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందస్వామి’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేరును అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఖరారు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శివసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో శివసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement