-
నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా అరెస్టు
► రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లు స్వాధీనం ► మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్ ఫోన్ స్వాధీనం వరంగల్: భారత ప్రభుత్వం రద్దు చేసిన నోట్లను కమీషన్ల పద్ధతిలో మార్పిడికి పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను నుంచి రూ.19,52,500 రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్లతోపాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఏసీపీ పూజ వివరాలు వెల్లడించారు. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన పోలెబాక అంబు అలియాస్ కీర్తి, సుబేదారికి చెందిన కందుకూరి సుమన్, పెద్దమ్మగడ్డకు చెందిన కంజర్ల అశోక్కుమార్, ఆర్ఎన్టీరోడ్కు చెందిన ప్రవీణ్, గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన నోముల మల్లికార్జున్, నయీమ్నగర్కు చెందిన కొండ వెంకటేశ్వర్లు, మడికొండకు చెందిన పసుకుల మౌళి అలియాస్ నాని, ఎస్ఆర్ఆర్తోటకు చెందిన అరకుల మహేందర్ కలిసి రద్దయిన నోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడికి పాల్పడుతున్నారని చెప్పారు. పోలెపాక అంబు అలియాస్ కీర్తి వరంగల్ లేబర్ కాలనీలో అభయ ఫౌండేషన్ నెలకొల్పింది. ఈ ఫౌండేషన్ చాటున విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రణాళికలను వేస్తుండేది. ఈక్రమంలో 2014 సంవత్సరంలో అభయ స్వయం సేవక సంఘం పేరుతో మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ల వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేసి తిరిగి వారికే రుణాల రూపంలో డబ్బు ఇచ్చేది. ఈ సమయంలో వెయ్యి, ఐదు వందల నోట్లు రద్దు అయ్యాయి. కొద్ది మొత్తంలో రద్దయిన నోట్లను అంబు మార్పిడి చేసింది. ఆ దశలో అంబుకు సుమన్, అశోక్కుమార్తో పరిచయం ఏర్పడింది. రద్దయిన నోట్లను పెద్ద మొత్తంలో కమీషన్ రూపంలో మార్పిడికి చేయడం ద్వారా వచ్చే డబ్బును అందరం పంచుకోవచ్చని అంబు నిందితులైన సుమన్, అశోక్కుమార్లకు తెలిపింది. ఈ ఇద్దరి సూచన మేరకు మిగితా నిందితులైన మల్లికార్జున్ రూ.9,88,000, ప్రవీణ్ రూ.8,87,500, వెంకటేశ్వర్లు రూ.77 వేలు రద్దయిన వెయ్యి, ఐదు వందల నోట్ల సమకూర్చుకున్నారు. ఈ నోట్లను ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో అంబు ఇంటికి వచ్చారు. పక్కా సమాచారం రావడంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజు సిబ్బందితో కలిసి అంబు ఇంటికి వెళ్లి సోదా చేశారు. రద్దయిన నోట్లు లభించడంతో ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఏసీపీ పూజ వెల్లడించారు. కాగా, రద్దయిన నోట్లను మార్పిడి చేస్తున్న నిందితులను గుర్తించి అరెస్టు చేసిన క్రైం ఏసీపీ పూజ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ సుభ్రమణేశ్వరరావు, ఏఎస్ఐ సంజీవరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శోభారాణి, స్వప్న, శ్రీనివాస్రాజు, కానిస్టేబుల్ మహమ్మద్అలీ(మున్నా), రవికుమార్, జంపయ్యలను వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుదీర్బాబు అభినందించారు. -
భారీగా పాత నోట్ల పట్టివేత
బెంగళూరు: పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.28 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్సూద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కోణణకుంటెకు చెందిన జిమ్మి రాహుల్, హొన్నావర నివాసి అజయ్లు శేషాద్రిపురం పైప్లైన్ రోడ్డులోని ఒక అపార్టుమెంటును అద్దెకు తీసుకున్నారు. ఇందులో పాత నోట్లను నిల్వచేసి కొత్త నోట్లు మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా గురువారం ఉదయం వారిని అరెస్టు చేసినట్లు కమిషనర్ సూద్ తెలిపారు. నగదు మార్పిడి చేయడానికి అపార్టుమెంట్లో దాచి ఉంచారని ఆయన తెలిపారు. చెలామణి చేయడానికి సాధ్యం కాకపోవడంతో అక్కడే ఉంచారని అన్నారు. నిందితులు రియల్ఎస్టేట్ దందా నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును సేకరించారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరులో ఇంత పెద్దమొత్తంలో పాత నోట్లు దొరకడం ఇదే మొదటిసారి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement