-
సుజలం.. నిష్పలం!
1003 - పంచాయతీలు 3,312 - గ్రామాలు 39 - ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు సమస్యలు: నిర్వహణ, బోర్లు ఎండిపోవడం, విద్యుత్ ప్రభుత్వ హామీ : ప్రతి గ్రామంలో ఒక వాటర్ప్లాంట్ ఇది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్. ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో ఒక శుద్ధ నీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటమే భాగ్యంగా మారింది. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ఆయన మాత్రం సినిమాలకే పరిమితం కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రామాల్లో వేలల్లో ఉండగా.. ప్లాంట్లు యాభై కూడా దాటని పరిస్థితి. ఇవి కూడా సక్రమంగా పని చేయకపోవడంతో ప్రజలకు ‘పానీ’పట్టు యుద్ధం తప్పడం లేదు. మామూలు నీళ్లిస్తే చాలు ఎన్నికల సమయంలో అన్ని పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే లేపాక్షిలో మత్రమే ప్లాంట్ ఏర్పాటయింది. అక్కడ కూడా నీటి సరఫరా అరకొరగానే ఉంటోంది. ప్రైవేటు వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి బిందె నీరు రూ.10, క్యాన్ రూ. 15లతో కొంటున్నాం. మినరల్ వాటర్ కాకపోయినా.. మామూలు నీళ్లిస్తే చాలు. - హనుమంతు, లేపాక్షి -
సుజలాం విఫలాం..!
ఎన్టీఆర్ సుజలకు ఒక్క రూపాయీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం 150 భారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పది రోజుల క్రితం ప్రకటన వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిందే రూ. 59 కోట్లు అయినా నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఆ పథకానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఘనంగా చెప్పుకున్నారు. అధికారం చేపట్టినపుడు పెట్టిన ఐదు సంతకాల్లో ఆ పథకాన్నీ చేర్చారు. పేరు ఘనంగా పెట్టి పబ్లిసిటీ చేసుకున్నా ఆ పథకానికి మాత్రం నిధులు ఇవ్వడంలేదు. అదే ఎన్టీఆర్ సుజల పథకం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించడం పథకం లక్ష్యం. అయితే ఈ పథకం ద్వారా అన్ని గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ఏడాదికి రూ. 150 నుంచి రూ. 200 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. 2014-15లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. గత బడ్జెట్లో మాత్రం రూ. 11 కోట్లు కేటాయించారు. వాటిల్లోనూ పైసా ఖర్చు పెట్టలేదు. అయితే, ఈ ఏడాది మార్చి చివర నాటికి ఆ రూ. 11 కోట్లలో రూ. 69 లక్షలు ఖర్చు పెడతామంటూ రివైజ్డు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్లో అయితే పైసా కూడా కేటాయించలేదు. దాతలిచ్చిన నిధులే రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 821 గ్రామాల్లో 826 మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో వాటిలో దాదాపు సగం మూత పడేదశకొచ్చాయి. మరోపక్క ఎన్టీఆర్ సుజల పథకంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గ్రామానికో మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు బదులు 15 గ్రామాలకొకటి చొప్పన భారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్లాంట్కు కోటిన్నర వరకు ఖర్చు పెట్టి మూడేళ్లలో రాష్ట్రంలో 1,000 భారీ మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. ప్లాంటు ఏర్పాటుకయ్యే ఖర్చులో దాతలుగానీ, దానిని నిర్వహించడానికి గాను ముందుకొచ్చే వారు 74 శాతం నిధులు భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 26 శాతం ఆర్థిక సహాయం చేస్తుందని కొత్త విధానంలో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే వచ్చే ఏడాది ఒక్కొక్క ప్లాంటుకు రూ. 39 లక్షల చొప్పున 150 భారీ మంచినీటి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయినా బడ్జెట్లో మాత్రం పైసా కూడ కేటాయింపులు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రస్ఫుటమవుతోంది. -
మంత్రి పీతలకు తమ్ముళ్ల షాక్
పంగిడిగూడెంలో సొంత పార్టీ నేతలే అడ్డగింత ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభోత్సవం రసాభాస జంగారెడ్డిగూడెం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఓ వర్గం నేతలు అడ్డగించారు. తమకు న్యాయం జరిగే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ భీష్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోట రమేష్ అనే వ్యక్తి గత నెల 20న తనను అకారణంగా కొట్టాడని, ఈ విషయాన్ని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కేసు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేత బేతాళ రమేష్ మంత్రి సుజాత దృష్టికి తీసుకెళ్లారు. కోట రమేష్కు మరోవర్గం వారు మద్దతు పలుకుతున్నారని బేతాళ రమేష్, అతని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ శ్రేణులే తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వద్ద వాపోయాడు. దీనిపై మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడంతో బేతాళ రమేష్, అతడి వర్గీయులు తమకు న్యాయం చేసే వరకు మంచినీటి పథకాన్ని ప్రారంభించేది లేదంటూ మంత్రిని అడ్డుకున్నారు. దీంతో రెండో వర్గం వారు రంగంలోకి పరస్పర దూషణలకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక సమయంలో మంత్రి స్వయంగా ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి అరుపులు, కేకలు వేసుకోవడం ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి సుజాత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఈ గొడవ పెట్టించారా అంటూ కార్యకర్తలపై మంత్రి మండిపడ్డారు. గొడవ జరుగుతుండగానే మంచినీటి పథకం ప్రారంభాన్ని మమ అనిపించి వెళ్లిపోయారు. ఇసుక తరలింపునకు సంబంధించి అధికారపార్టీ నేతలైన బేతాళ రమేష్, కోట రమేష్ల మధ్య లావేదేవీల విషయంలో వివాదం తలెత్తినట్టు సమాచారం. -
‘జన్మభూమి’కి శ్రీకారం
సాక్షి, ఏలూరు : ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం జిల్లాలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మొదటి రోజు ర్యాలీలు,స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 34 చోట్ల వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఏలూరు 26వ డివిజన్లో జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సదస్సు జరిగింది. రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. 2019 నాటికి సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా... సదస్సులో మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ 2019 అక్టోబర్ 2 నాటికి జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయూలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్-స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మంది డ్వాక్రా మహిళల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రూ.2కే 20 లీటర్ల తాగునీరు అందించేందుకు 480 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవం తి పథకం కింద వాటర్ ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు. తొలి రోజున 34 ప్లాంట్లను ప్రారంభించామని, 785 చోట్ల ర్యాలీలు జరిగాయని మంత్రి చెప్పారు. జవాబుదారీగా ఉండండి ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ పథకాల అమలు విషయంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల న్నారు. జిల్లాలో 39 లక్షల జనాభా ఉండగా, వారిలో అర్హులైన 3లక్షల మంది నిరుపేదలకు పింఛన్లు అందించేందుకు ఏటా రూ.350 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోం దని చెప్పారు. శాసనమండలి విప్ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ప్రతి గ్రామంలో పారిశుధ్యం, ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరి సహకారం అవసరమన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం సాధించడానికన్నా పారిశుధ్యమే మిన్న అన్న మహాత్మాగాంధీ సూక్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని ఆలపించే సందర్భంలో కొందరు తడబడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి), నగర మేయర్ షేక్ నూర్జహాన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని, జన్మభూమి ప్రత్యేకాధికారి శ్రీధరన్, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.రమణ, డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో ఎ.నాగరాజువర్మ, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీమన్నారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ వేణుగోపాల్, ఏలూరు ఆర్డీవో తేజ్భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె2 సాధన, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ అధికారి ఆర్.సూయిజ్ పాల్గొన్నారు. -
కాలక్షేపానికి పథకాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడ : చేతినిండా నిధులుంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా ముందుకు సాగటం కష్టం. కానీ, అసలు నిధులు ఇవ్వకుండా పబ్బం గడిపేందుకు ప్రభుత్వం పలు ‘పథకాలు’ రచిస్తోంది. వాటిలో రెండు పథకాలకు అక్టోబర్ 2న శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం గురించి ఇప్పటికే అన్ని మార్గదర్శకాలు అధికారులకు చేరాయి. ‘జన్మభూమి-మా ఊరు’ పథకం గురించి పలుమార్లు చర్చించిన ప్రభుత్వం మంగళవారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ పథకం ద్వారా ప్రచారం ఎలా ఉండాలనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఇలా.. ప్రతి మండల కేంద్రంలోనూ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించింది. లీటరు మంచినీరు రూ.2కు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. నిర్వహణ కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు, స్థానికంగా దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక ప్లాంటుకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ దాతల నుంచి స్పందన లేదు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఒక్కోచోట మంచినీటి ప్లాంటు ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు గన్నవరంలో అదనంగా మూడు, జగ్గయ్యపేట, కానూరు, పెనమలూరులలో మరో మూడు ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడితో పాటు నిర్వహణ భారం కూడా దాతలపైనే.. ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు ఖర్చవుతుంది. నిత్యం ప్లాంటులో పని చేసేందుకు ఒక ఉద్యోగి కావాలి. విద్యుత్ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాబట్టి దాత పెట్టుబడి పెట్టడంతోపాటు మెయింటినెన్స్ కూడా చూడాల్సి రావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ, జిల్లావ్యాప్తంగా 19 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నూజివీడులో మాత్రమే ప్లాంటు పెట్టేందుకు దాతలు ముందుకువచ్చారు. మండల అభివృద్ధి అధికారి ఒత్తిడి మేరకు ఫౌల్ట్రీ సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణస్వామి చందాలు వసూలు చేసి స్థానికంగా బస్షెల్టర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కురుమద్దాలిలో, గన్నవరం నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తరిగొప్పల, వేలేరులలో ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలోని కురుమద్దాలి, చల్లపల్లి మండలంలోని నడకుదురు గ్రామాల్లో ఎన్ఆర్ఐల సాయంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్లాంట్ల ఊసే లేదు. మరోవైపు ప్రస్తుతానికి ఒక్కో ప్లాంటుకు రూ.80వేలు మెయింట్నెన్స్ కోసం అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. ‘జన్మభూమి-మా ఊరు’ తీరూ అంతే.. జన్మభూమి-మా ఊరు పథకం కూడా కేవలం ప్రచారం కోసమే రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద గ్రామాల్లో పెన్షన్కు అర్హులైన వారిని గుర్తిస్తారు, హెల్త్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. గ్రామంలో మైక్రో లెవల్ ప్లానింగ్, స్వర్ణగ్రామానికి పంచసూత్రాలు, స్వర్ణపురానికి పంచసూత్రాలు, పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛాంధ్ర తదితర కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తారు. అందరూ భావిస్తున్నట్లు 70శాతం ప్రభుత్వ నిధులు, 30 శాతం ప్రజల నిధులతో పనులు చేసేందుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండండి... అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, రైతులు రుణమాఫీపై నిలదీసే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement