-
పుతిన్తో ఇంటర్వ్యూ: ‘డ్రెస్ ఏంటి.. నీ ఎక్స్ప్రెషన్స్కి అర్థం ఏంటి?’
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, సీఎన్బీసీ న్యూస్ రిప్రజెంటర్ను ఉద్దేశించి అందంగా ఉంది.. ప్రెట్టీగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పుతిన్ వ్యాఖ్యలపై నెటిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రష్యా మీడియా ఎదురుదాడి ప్రారంభించింది. సదరు న్యూస్ రిప్రెజెంటరే పుతిన్ని డిస్టర్బ్ చేయాలని భావించింది.. ఆమె బాడీ ఎక్స్ప్రెషన్స్, డ్రెస్ చూస్తే.. పుతిన్కి సిగ్నల్ ఇచ్చినట్లే ఉందని ఎదురుదాడికి దిగింది. రష్యా మీడియాపై నెటిజనుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రధాని మరీ అంత బలహీన మనస్తత్వం కలవాడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదానికి ఆజ్యం పోసిన సంఘటన వివరాలు.. మాస్కోలోని ఎనర్జీ ఫోరమ్లో రష్యన్ ప్రధాని వ్లాదిమర్ పుతిన్ పాల్గొన్న సెషన్కు సీఎన్బీసీ ఉద్యోగి హాడ్లీ గ్యాంబుల్ మోడరేటర్గా ఉన్నారు. యూరోప్లో ఏర్పడ్డ గ్యాస్ సంక్షోభం గురించి జరిగిన సెషన్లో పుతిన్ ఆమెను ఉద్దేశించిన అందంగా ఉంది.. ప్రెట్టీగా ఉందని ప్రశంసించాడు. పుతిన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవహారం కాస్త ముదురుతుండటంతో పుతిన్ ప్రచారకుడు వ్లాదిమిర్ సోలోవియోవ్ రంగంలోకి దిగారు. (చదవండి: రష్యాకు ఊహించని దెబ్బ.. భారత్లో పడిపోయిన డిమాండ్) సోలోవియోవ్ తన రోసియా 1 న్యూస్ ఛానల్లో హాడ్లీ గ్యాంబుల్, పుతిన్ మధ్య జరుగుతున్న సంభాషణకు సంబంధించిన వీడియోను టెలికాస్ట్ చేశాడు. దీనిలో గ్యాంబుల్, పుతిన్ 'దృష్టి మరల్చడానికి' అన్ని విధాలుగా ప్రయత్నించిందని ఆరోపించాడు. ఫుటేజ్లో ప్రధానంగా ఆమె కాళ్లపై దృష్టి పెట్టాడు. పుతిన్తో మాట్లాడుతున్నప్పుడు హాడ్లీ తన కాళ్లను ముందుకు వెనక్కి ఊపుతూ ఉంటుంది. హాడ్లీ చర్యలపై రష్యా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘హాడ్లీ ఈ పనుల ద్వారా తనను తాను ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా ప్రదర్శించుకుంది. పుతిన్ దృష్టిని మరల్చాలని విఫల యత్నం చేసింది’’ అంటూ మండిపడుతుంది. ఈ దుమారంపై సీఎన్బీసీ కానీ, గ్యాంబ్లర్ కానీ స్పందించలేదు. కానీ గ్యాంబ్లర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పుతిన్తో ఇంటర్వ్యూ సందర్భంగా తీసిన ఓ ఫోటోని పోస్ట్ చేసి.. ‘నా ఫేవరెట్ యాంగిల్’ అని పేర్కొంది. దీనిలో ఆమె కాలు పుతిన్ వైపు చాపినట్లు ఉంది. (చదవండి: రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం.. ‘ఏ క్షణంలోనైనా మృతి’) ఇక రష్యా మీడియా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికన్ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అంటే జర్నలిస్ట్ అన్న వాడు మీ ఇంటర్వ్యూని శ్రద్ధగా వినాలని రూల్ ఏమైనా ఉందా.. వినకపోవడం ఏమైనా అమర్యాదకర చర్యా’’.. ‘‘పుతిన్ వ్యాఖ్యలు చూస్తే.. పిరికివాడు తన అనుచిత ప్రవర్తనను కప్పిపుచ్చుకునే విధంగా ఉన్నాయి. అక్కడ ఓ మగ జర్నలిస్ట్ ఉంటే పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడా’’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. చదవండి: పుతిన్ కండబలం -
ఆ ‘కోపధారి మనిషి’.. జాక్పాట్ కొట్టేశాడు
Chand Nawab Karachi Se: కోపధారి మనిషి.. ఈ వీడియో గురించి బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలాకాలం క్రితమే ఈ తరహా యాటిట్యూడ్తో పాకిస్తాన్లోనూ ఓ రిప్టోరర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ‘చాంద్ నవాబ్.. కరాచీ సే..’ అంటూ వార్తల కవరేజ్కి విఫలయత్నం చేసిన పాక్ జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా!. ఆ జర్నలిస్ట్ సాబ్.. ఇప్పుడు జాక్పాట్ కొట్టేశాడు. ఈ వైరల్ వీడియోను నాన్ ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) కింద వేలం వేయబోతున్నారు. జర్నలిస్ట్ చాంద్ నవాబ్.. పాక్లోనే కాదు ఇండియాలో.. ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయీజాన్(2015)లో ఈయన క్యారెక్టర్ను బేస్ చేసుకుని ఓ స్ఫూఫ్ వీడియో కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ అద్భుతంగా పోషించాడు కూడా. సుమారు 12 ఏళ్ల క్రితం వైరల్ అయిన ఆ వీడియోను.. ఇప్పుడు ఎన్ఎఫ్టీ నుంచి ఫౌండేషన్ యాప్ ద్వారా వేలం వేయబోతున్నారు. ఇంతకీ ప్రారంభ బిడ్ ఎంతో తెలుసా? ఒత్తిడిలోనే అలా చేశా డిజిటల్ ఆక్షన్ ప్లాట్ఫామ్ మీద స్వయంగా చాంద్ నవాబ్.. ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. ‘‘నేను చాంద్ నవాబ్ని. వృత్తిరీత్యా జర్నలిస్ట్/రిపోర్టర్ని. 2008లో నా వీడియో ఒకటి యూట్యూబ్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. పండుగ పూట రైల్వే స్టేషన్లో కవరేజ్ చేస్తుండగా.. ప్రయాణికులు అడ్డురావడంతో నాకు విసుగొచ్చింది. జర్నలిజంలో ఉన్న ఒత్తిడి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫ్రస్టేషన్లోనే అలా ప్రవర్తించా. అయితే ఆ వీడియో నన్ను మీకు పరిచయం చేసింది. నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నా క్యారెక్టర్ స్ఫూర్తితోనే కబీర్ఖాన్ డైరెక్షన్లో వచ్చిన భజరంగీ భాయీజాన్ సినిమాలో నవాజుద్దీన్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ ద్వారా నన్ను మరోసారి వైరల్ చేశారు. నాపై అభిమానం చూపిన వాళ్లందరికీ థ్యాంక్స్’ అంటూ పేర్కొన్నాడు కరాచీకి చెందిన చాంద్ నవాబ్. ఇక ఈ వీడియోను ప్రారంభ బిడ్ ధర అక్షరాల 46 లక్షల రూపాయలు(63వేల డాలర్లు)గా నిర్ణయించింది ఎన్ఎఫ్టీ ఫౌండేషన్. మరి ఇది ఎంతకు అమ్ముడు పోతుందో, చాంద్ నవాబ్కు ఎంత లాభం తెచ్చిపెడుతుందో చూడాలి మరి. ఎన్ఎఫ్టీ అంటే బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. క్లిక్ చేయండి: ఎన్ఎఫ్టీ.. తొలి హీరో ఎవరో తెలుసా? -
కంచికచర్ల వద్ద పట్టుబడ్డ డబ్బు ఎవరిది?
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడిన రూ.50 లక్షలు ఎవరివనే ప్రశ్న పోలీసుల బుర్రను తొలుస్తోంది. ఆ డబ్బులు తీసుకెళ్తున్న మహా న్యూస్ రిపోర్టర్ ఏఎన్వీ సూర్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ మొత్తానికి సరైన ఆధారాలు చూపించక పోవడంతో పూచీకత్తు రాయించుకుని అతడిని విడిచి పెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్లో రూ.3 కోట్లు నగదు దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. బస్సులో ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించే దశలో టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఒకరు, గతంలో టీడీపీలో కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఈ విషయంలో పోలీసులు లోతుగా వెళ్లకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల తీరుపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ డబ్బును హైదరాబాద్లో ఉండే ఆ చానల్ కీలక ప్రతినిధికి అందజేసేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. టీడీపీ హయాం నుంచి ఒక వెలుగు వెలుగుతున్న ఆ సీనియర్ జర్నలిస్టు విశాఖలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ను బెదిరించి ఈ డబ్బు రాబట్టినట్లు సమాచారం. కాగా, పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖ మహా న్యూస్ రిపోర్టర్ క్రాంతికుమార్ తనకు ఇచ్చినట్లు ఏఎన్వీ సూర్యనారాయణ చెప్పాడని, అతన్ని కూడా పిలిచి ఆరా తీస్తామని రూరల్ సీఐ సతీష్ తెలిపారు. -
స్టోరీ రాస్తావా..! అంటూ రిపోర్టర్పై దాడి
-
స్టోరీ రాస్తావా..! అంటూ మాఫియా దాడి
సాక్షి, బెంగుళూరు: అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. సరైన బలగం లేనందున కబేళం లోనికి వెళ్లలేమని హెచ్చరించిన పోలీసులు పశువుల అక్రమ రవాణా మాఫియాకు ఉప్పదించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రాంనగర్ జిల్లాలోని కుడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొడిపాల్యా గ్రామంలో అక్రమ కబేళం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఓ జంతు ప్రేమికుడు పోలీసులకు సమాచారమిచ్చారు. రోజూ 200 ఆవుదూడలను వధించి, మాంసాన్ని రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తగిన పోలీసు బలగం లేనందున కబేళంలోనికి ప్రవేశించడానికి జంతు ప్రేమికుడు జాషైన్ ఆంథోని, ఓ జాతీయ పత్రికకు చెందిన రిపోర్టర్కు డీఎస్పీ అనుమతిన్విలేదు. మరుసటి రోజు (మంగళవారం) ఇద్దరు పోలీసులతో పాటు ఆంథోని, రిపోర్టర్ అక్కడికి చేరుకున్నారు. డీఎస్పీ ఆదేశాలతో కుడూర్ పోలీసులు ఆ కబేళంపై దాడి చేశారు. అయితే అప్పటికే కబేళం నిర్వహిస్తున్న మాఫియాకు సమాచారం అందడంతో అక్కడ ఆవుదూడల జాడ లేకుండా చేశారనీ, ఎవరికీ అనుమానం రాకుండా వాటిని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారని రిపోర్టర్ ఆరోపించారు. పరిసరాల్లో లభ్యమైన పశువుల వ్యర్థాలు, ఎముకలు, రక్తపు మరకలతో అక్కడ కబేళం నిర్వహిస్తున్నారనే నిర్ధారించుకున్న రిపోర్టర్ ఆవుదూడలు దాచిపెట్టిన స్థలాన్ని కనుగొన్నాడు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అక్కడే కాపుగాసిన కబేళం నిర్వహిస్తున్న కొందరు రిపోర్టరుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. 71 ఆవుదూడలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిపోర్టరుపై దాడి చేసిన గజీపీర్, ఖాసీ, సయ్యద్, ముబారఖన్, నూర్, ఇంతియాజ్, తాబ్రేజ్లపై కేసు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణలపై కూడా కేసులు పెట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement