-
IPL 2024: పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా భయం అదే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్ సేవలను వందకు వంద శాతం ఉపయోగించుకోవాలని సీఎస్కే భావిస్తోందని.. దాని వల్ల తాము నష్టపోయే పరిస్థితి వస్తుందన్నాడు. అదే విధంగా.. ఇప్పటికే ముస్తాఫిజుర్ తానేంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్నాడని.. అతడు కొత్త ఐపీఎల్లో కొత్త నేర్చుకునేది ఏమీ లేదని యూసన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా సీఎస్కే రూ. 2 కోట్ల కనీస ధరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ముస్తాఫిజుర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి 10 వికెట్లు తీశాడు. చెన్నై విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముస్తాఫిజుర్ రహ్మాన్కు కేవలం మే 1 వరకే ఐపీఎల్లో ఆడేలా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) జారీ చేసింది. జింబాబ్వేతో సిరీస్ నాటికి తిరిగి రావాలని నిబంధన విధించింది. అయితే, సీఎస్కే మాత్రం ఒకరోజు గడువు పొడిగించాలని విజప్తి చేసింది. మే 1న పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం అతడిని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు బీసీబీకి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు బీసీబీ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యూనస్ బంగ్లా మీడియా ‘డైలీ స్టార్’తో మాట్లాడుతూ.. ‘‘మే 1 వరకు ముస్తాఫిజుర్ ఐపీఎల్లో ఆడేందుకు అనుమతించాం. అతడు మే 2న తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు నుంచి అతడు బంగ్లా జట్టుకు అందుబాటులో ఉంటాడు. అయినా.. ముస్తాఫిజుర్ ఐపీఎల్లో ఆడటం ద్వారా కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. అతడు నేర్చుకునే దశ పూర్తైంది. నిజానికి చాలా మంది అతడిని చూసే నేర్చుకుంటున్నారు. ఐపీఎల్లో ఆడించడం ద్వారా బంగ్లాదేశ్కు ఒరిగేదేమీ లేదు. పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా బాధ మాది! మా ఆందోళనంతా ముస్తాఫిజుర్ ఫిట్నెస్ గురించే! వాళ్లు అతడి నుంచి 100 శాతం ఎఫర్ట్ రాబట్టాలని చూస్తున్నారు. అతడి ఫిట్నెస్ గురించి వాళ్లకెందుకు పట్టింపు ఉంటుంది. మాకు మాత్రం అతడు ముఖ్యం. అందుకే తనని వెనక్కి రప్పిస్తున్నాం. కేవలం జింబాబ్వేతో సిరీస్లో ఆడేందుకే కాదు.. అతడిపై పనిభారం తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా యూనస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్లో తమ ఆటగాడిని వాడుకుంటున్నారని బాధపడే బదులు అతడిని మొత్తానికే పంపకుండా ఉండే బాగుండేదని యూనస్కు చురకలు అంటిస్తున్నారు సీఎస్కే ఫ్యాన్స్. ఫ్రాంఛైజీ క్రికెట్లో డబ్బు కోసమే అందరూ ఆడతారని.. అలాంటపుడు వేలంలోకి రాకుండా ముస్తాఫిజుర్ను ఆపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మే 3 - 12 వరకు బంగ్లాదేశ్ స్వదేశంలో జింబాబ్వేతో టీ20 సిరీస్లో తలపడనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK Vs MI: వావ్ వాట్ ఏ క్యాచ్.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ హైవోల్టేజ్ పోరులో సీఎస్కే ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో దంచి కొట్టిన సీఎస్కే.. తర్వాత బౌలింగ్లోనూ సత్తాచాటింది. అయితే ఈ మ్యాచ్లో చెన్నై ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ కళ్లు చెదిరే క్యాచ్ను అందుకున్నాడు. ముస్తాఫిజుర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ముస్తాఫిజుర్ అద్బుతమైన క్యాచ్తో ముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పతిరాన తొలి బంతికే ఇషాన్ కిషన్ను పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అయితే ఆ ఓవర్లో మూడో బంతిని పతీరణ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధిచాడు. సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బౌండరీ లైన్వద్ద ముస్తాఫిజుర్ అద్బుత విన్యాసం చేశాడు. థర్డ్మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న రెహ్మాన్ కాస్త ఎడమవైపు జరిగి జంప్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. కానీ జంప్ చేసే క్రమంలో సమన్వయం కోల్పోయిన రెహ్మన్.. బంతిని గాల్లోకి విసిరేసి తిరిగొచ్చి అందుకున్నాడు. ఇది చూసిన మిస్టర్ 360 బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్య ఖాతాతెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Ishan Kishan ✅ Suryakumar Yadav ✅ Relive Matheesha Pathirana's double-delight over which also included a magnificent catch by Mustafizur Rahman at the ropes 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/XbSsEiXLgZ — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
IPL 2024 CSK Vs KKR: కేకేఆర్తో నేటి మ్యాచ్కు ముందు సీఎస్కేకు బిగ్ న్యూస్
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (ఏప్రిల్ 8) జరుగబోయే మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ న్యూస్ అందింది. వేర్వేరు కారణాల చేత ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు దూరంగా ఉండిన ఆ జట్టు స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణ నేటి మ్యాచ్కు అందుబాటులోకి రానున్నారని తెలుస్తుంది. టీ20 వరల్డ్కప్ వీసా ప్రాసెస్ కోసం స్వదేశానికి (బంగ్లాదేశ్) వెళ్లిన ముస్తాఫిజుర్ చెన్నైకి బయల్దేరాడని సమాచారం. గాయం కారణంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న పతిరణ పూర్తి ఫిట్నెస్ సాధించాడని తెలుస్తుంది. ముస్తాఫిజుర్, పతిరణ కేకేఆర్తో జరుగబోయే నేటి మ్యాచ్కు అందుబాటులో ఉంటారని సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు అందుబాటులోకి రాకపోయినా సీఎస్కే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. కేకేఆర్తో మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కాగా ముస్తాఫిజుర్, పతిరణ లేని లోటు సీఎస్కేకు గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఇద్దరి గైర్హాజరీలో ఆ జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. ముస్తాఫిజుర్, పతిరణ స్థానాల్లో వచ్చిన విదేశీ ప్లేయర్లు రాణించినప్పటికీ (మొయిన్, తీక్షణ).. లోకల్ పేసర్లు ముకేశ్ చౌదరీ, తుషార్ దేశ్పాండే దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్తో నేటి మ్యాచ్లో సీఎస్కే వీరిద్దరిని నమ్ముకుని బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. ప్రస్తుత ఎడిషన్లో ముస్తాఫిజుర్ 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు.. పతిరణ 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నారు. వీరిద్దరు నేటి మ్యాచ్కు అందుబాటులోకి వస్తే సీఎస్కే విజయావకాశాలు మెరుగవుతాయి. ఇదిలా ఉంటే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్ రెండో స్థానంలో.. సీఎస్కే నాలుగో స్థానంలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడింట విజయాలు సాధిస్తే.. సీఎస్కే నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో ఢిల్లీని మట్టికరిపించగా.. సీఎస్కే సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. -
సన్రైజర్స్తో మ్యాచ్కు ముందు CSKకు బిగ్ షాక్
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. వీసా పనులు పూర్తి చేసుకునేందుకు మంగళవారమే అతడు బంగ్లాదేశ్కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సీఎస్కే.. అనంతరం గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. అయితే, మూడో మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది రుతురాజ్ గైక్వాడ్ సేన.విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మాత్రం అభిమానులను అలరించాయి. ఇక తదుపరి మ్యాచ్లో సీఎస్కే సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్కు సీఎస్కే లీడింగ్ వికెట్ టేకర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ దూరం కానున్నట్లు సమాచారం. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్కప్-2024 జూన్లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో యూఎస్ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సన్రైజర్స్తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారం రోజుల పాటు ముస్తాఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్తో సీఎస్కే మ్యాచ్(ఏప్రిల్ 8) నాటికి ముస్తాఫిజుర్ ఇండియాకు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్ పేర్కొంది.కాగా ఐపీఎల్-2024లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఏడు వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్గా పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. మరోవైపు.. ఢిల్లీతో మ్యాచ్లో ధోని కుంటుతూ కనిపించడం కూడా అభిమానులను కంగారూ పెడుతోంది. The ruler of our hearts! 💛✨ #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/jTxedB9sQa— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2024చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! -
సన్రైజర్స్తో మ్యాచ్కు ముందు CSKకు బిగ్ షాక్
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. వీసా పనులు పూర్తి చేసుకునేందుకు మంగళవారమే అతడు బంగ్లాదేశ్కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సీఎస్కే.. అనంతరం గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. అయితే, మూడో మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది రుతురాజ్ గైక్వాడ్ సేన. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మాత్రం అభిమానులను అలరించాయి. ఇక తదుపరి మ్యాచ్లో సీఎస్కే సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్కు సీఎస్కే లీడింగ్ వికెట్ టేకర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ దూరం కానున్నట్లు సమాచారం. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్కప్-2024 జూన్లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సన్రైజర్స్తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారం రోజుల పాటు ముస్తాఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్తో సీఎస్కే మ్యాచ్(ఏప్రిల్ 8) నాటికి ముస్తాఫిజుర్ ఇండియాకు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్ పేర్కొంది. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఏడు వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్గా పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. మరోవైపు.. ఢిల్లీతో మ్యాచ్లో ధోని కుంటుతూ కనిపించడం కూడా అభిమానులను కంగారూ పెడుతోంది. The ruler of our hearts! 💛✨ #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/jTxedB9sQa — Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2024 చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement