-
ఎంఐఎం నేతను ఉరి తీయాలి
సాక్షి, ఆసిఫాబాద్ : హైదరాబాద్ పాత బస్తీలోని చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎంఐఎం నాయకుడు షకీల్ను ఉరి తీయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మొండయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అంకుసాపూర్లో ఆయన మాట్లాడారు. మలక్పేట ఎమ్మెల్యే హైమద్ అనుచరుడు షకీల్ పథకం ప్రకారమే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాలిక కుటుంబానికి ప్రాణ భయం ఉందన్నారు. బాధితురాలికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నా గోశ శంకర్, రేగుంట సాగర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి
సాక్షి, బోథ్(మంచిర్యాల) : ఆర్టీసీ కార్మికుల సమస్యను పరష్కరించకుండా జాప్యం చేస్తూ మధ్య తరగతి, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, తుడుం దెబ్బ, బీజేపీ, కాంగ్రెస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడల స్వామి మాట్లాడారు. ఆర్టీసీలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను సీఎం సెల్ఫ్ డిస్మిస్ చేస్తామని ప్రకటించడం ఆయన దొరతనానికి నిదర్శనమన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మాట్లాడుతూ.. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడే మానాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బుర్గుల మల్లేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మాదిగ స్డూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ మాట్లాడుతూ సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు మద్దతు తెలిపి ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు బుచ్చి బాబు మాట్లాడుతూ ఆర్టీసీ అప్పులకు ప్రభుత్వమే కారణమన్నారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు అత్రం మహేందర్, గెడం నగేందర్, బీజేపీ నాయకులు కదం బాబారావు, మాదవ్ అమ్టె, మచ్చనారయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు దుబాక సూభాష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాథోడ్ ప్రకాశ్, శ్యామ్, జ్ఞానోబా, గంగాధర్, ఆర్టీసీ కార్మికులు గణపతి, భూమారెడ్డి, బాబాన్న, హైదర్, మోహన్రెడ్డి, కళ, పద్మ, ఫాయిమ్, దేవన్న, పాండురంగ్, స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి'
శింగనమల (అనంతపురం): ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా శింగనమల తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం మాదిగా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు పేరూరు శ్రీరాములు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని.. డప్పు కళాకారులకు నెలకు రూ. 2 వేలు భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement