-
కాంగ్రెస్తో టీడీపీ పొత్తు దారుణం
కమలాపురం: టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం దారుణం అని, చిరంజీవి లాగే చంద్రబాబు కూడా త్వరలో టీడీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయం అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ పీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఇందిరాగాంధి, సోనియా, రాహుల్లను విమర్శించిన వారేనన్నారు. అలాంటిది తిరిగి కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం దారుణం అని, ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుతున్న చంద్రబాబును చూసి ఊసరివెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ దక్కడం కష్టమేనని జోస్యం చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తులు కుదుర్చుకున్నాడని, త్వరలో ఏపీలో కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇక ప్రజలు బాబును నమ్మరని స్పష్టం చేశారు. ఏపీలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదని, ఇంత చిన్న రాష్ట్రంలోనే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మ పోరాట సభకు సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 1400 బస్సులు ఏర్పాటు చేసినా 25వేల మంది దాటలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. బాబుతో పాటు ఆయన తోక పత్రికలకు హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు జగన్ అభిమానిగా కనిపిస్తున్నాడని దుయ్యబట్టారు. అభిమాని అయితే పూల మాల వేస్తాడు.. వీరాభిమాని అయితే వేలు కోసుకుని వీర తిలకం దిద్దుతాడే గాని హత్యాయత్నం చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు. అలిపిరి ఘటన జరగ్గానే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేశారని, అదీ వైఎస్ కుటుంబం హుందాతనం అని గుర్తు చేశారు. ఇక్కడ జగన్పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వి హేలన చేస్తాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు సంబటూరు ప్రసాద్ రెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, ఎన్సీ పుల్లారెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, అల్లె రాజారెడ్డి, లక్ష్మి నారాయణరెడ్డి, సుధా కొండారెడ్డి, నారదా గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ సీఎం అయితేనే అభివృద్ధి
చెన్నూరు : వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి చెన్నూరు బెస్తకాలనీలో పార్టీ మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కమలాపురం నియోజకవర్గంలో ఏడాదికి 100 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నవర త్నాలు పథకం ద్వారా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతుల, మహిళల, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరి అభివృద్ధికి పాటు పడతామన్నారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ బోలా పద్మావతి, పార్టీ నాయకులు ఆర్వీ సుబ్బారెడ్డి, పొట్టిపాటి ప్రతాప్రెడ్డి, చీర్ల సురేష్యాదవ్, ముదిరెడ్డి రవీంద్రనా«థ్రెడ్డి, ఉప సర్పంచు ఖరీం మత్స్యకారుల సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇది ప్రజా విజయం
కడప సెవెన్రోడ్స్ : గాలేరు–నగరిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్కు ఈనెల 25 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజా విజయమని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. నీటి విడుదల కోరుతూ సర్వరాయసాగర్ నుంచి ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం ముగిసింది. వందలాది మంది రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గండికోటకు 4500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో సర్వరాయసాగర్కు నీరు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీంతో తొలుత కలెక్టర్, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు నీరు విడుదల చేశారన్నారు. అయితే కాంట్రాక్టర్ తనకు ఆరు కోట్ల రూపాయల మామూళ్లు ఇవ్వలేదనే దాంతో ఓ టీడీపీ నేత మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి నీటి విడుదలను ఆపించారని ఆరోపించారు. దీంతో తాను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని, ప్రజల్లో వచ్చిన అపూర్వ స్పందనకు భయపడ్డ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి నీటి విడుదలకు అంగీకరించిందని తెలిపారు. వీఎన్ పల్లె మండలంలో 1200 అడుగుల్లో భూగర్బజలం ఉందన్నారు. చీనీ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పారు. రిజర్వాయర్లో నీరు నింపితే భూగర్బ జలాలు పెరిగి పంటలు రక్షించుకోవచ్చన్నారు. నీళ్లు వచ్చే వరకు ప్రభుత్వం మాటలు నమ్మాల్సిన పని లేదన్నారు. మాట తప్పితే కలెక్టరేట్ను దిగ్బంధిస్తామని, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు హోరెతిస్తామని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే గాలేరు–నగరి పూర్తి చేసి కమలాపురం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కరువుకు నిలయమైన జిల్లాను కోస్తా లాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 250 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నీటిని వైఎస్ తీసుకొచ్చారన్నారు. గాలేరు–నగరికి రూ. 4800 కోట్లు కేటాయించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన మృతి చెందాక ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలేవి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పోరాట పటిమ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత శాశ్వత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సర్వరాయసాగర్కు నీరివ్వాలన్న కోరిక అసాధ్యమైనదేమి కాదన్నారు. నీరిస్తే ప్రజలకు వైఎస్ గుర్తొస్తాడనే ఉద్దేశంతోనే ఆపేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప రైతులు పట్టడం లేదన్నారు. పోలవరం కాలువలను ఏనాడో పూర్తి చేసింది వైఎస్సారేనని అన్నారు. తాను, దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి కలిసి తెలుగుగంగను పూర్తి చేయాలని కోరగా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డబ్బులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ఆయనకు ఏనాడూ చిత్తశుద్ధి లేదన్నారు. కడప ఎమ్మెల్యే అంజద్బాష మాట్లాడుతూ పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందని, ఎట్టకేలకు దిగొచ్చి సర్వరాయసాగర్కు నీరిస్తామని ప్రకటించిందన్నారు. గండికోటలో పుష్కలంగా నీరున్నప్పటికీ సర్వరాయసాగర్ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం రిజర్వాయర్లలో ముఖ్యమంత్రి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నంపై ఖర్చు చేసిన డబ్బును పోలవరంపై చేసి ఉంటే రాయలసీమకు నీరొచ్చి ఉండేదని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. 2004లో అధికారంలోకి రాగానే జలయజ్ఞం చేపట్టారన్నారు. పుష్కలంగా నిధులు కేటాయించి పనులను పరుగులెత్తించారన్నారు. ప్రస్తుతం గండికోటలో 8 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ ఫేజ్–1లో ఉన్న సర్వరాయసాగర్కు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు.పాదయాత్ర ఫలితంగానే ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన చేసిందన్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి లేదన్నారు. వైఎస్ హయాంలో 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 15 శాతం పనులు ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలు చేసిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. వైఎస్సార్ సీపీకి పేరొస్తుందనే పుత్తా నరసింహారెడ్డి నీటి విడుదలను ఆపు చేయించారన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. కలెక్టర్ ప్రకటించిన విధంగా నీరు విడుదల కాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీటి విడుదల ఆగదు తాము ప్రకటించిన విధంగా ఈనెల 25వ తేది నుంచి సర్వరాయసాగర్కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేస్తామని, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని తనకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులకు కలెక్టర్ బాబూరావునాయుడు స్పష్టం చేశారు. సర్వరాయసాగర్ గేట్లు, ఇతర చిన్నచిన్న పనులు పెండింగ్లో ఉండడం, నాణ్యతపై కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వాన్ని నివేదించామన్నారు. దీంతో నిపుణుల కమిటీని ప్రభుత్వం పంపిందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలు పరిశీలించి నీటి విడుదలకు ఆదేశించారన్నారు. కనుక నీటి విడుదల ఆగే ప్రశ్నే లేదన్నారు. ఇదే కాకుండా జిల్లాకు మరో 10 టీఎంసీల నీరు రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు దేవుడు, సుధాకర్రెడ్డి, సునీల్కుమార్, వినోద్కుమార్, నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
30 నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర
సాక్షి, కడప: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈ నెల 30 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్వరాయసాగర్ ప్రాజెక్టు నుంచి కడప కలెక్టరేట్ వరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలనే డిమాండ్తో మూడు రోజుల పాటు రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అనంతరం 2 వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
ఘనంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి జన్మదిన వేడుకలు
కడప కార్పొరేషన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి సన్రైజ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ్భాస్కర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీంద్రనాథ్రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరెన్నో నిర్వహించుకోవాలని, రాజకీయాల్లో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. సంధ్యా సర్కిల్లో...కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక సంధ్యా సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వల్లూరు జెడ్పీటీసీ అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి, సన్రైజ్ హాస్పిటల్ ఎండీ విజయ్భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి అరుణమ్మలు హాజరై కేక్ కట్ చేశారు. ఎన్ఆర్ఐల శుభాకాంక్షలు పుట్టిన రోజు సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డికి వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు వారు పూలమాలలు వేసి, పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బి. నిత్యానందరెడ్డి, బాబు, డిష్ జిలాన్, జీఎస్ బాబూరాయుడు, జరుగు రాజశేఖర్రెడ్డి, కరిముల్లా, పసుపులేటి మనోజ్ పాల్గొన్నారు. చౌడమ్మ వృద్ధాశ్రమంలో... కడప వైఎస్ఆర్ సర్కిల్ : కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు యం. చంద్రశేఖర్ రెడ్డి, 9వ డివిజన్ ఇన్చార్జ్ మల్లికార్జున, కిరణ్ సబ్జైల్ సమీపంలో చౌడమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement