-
5జీ స్పెక్ట్రం బేస్ ధర 35% తగ్గించవచ్చు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల కనీస ధరను 35 శాతం మేర తగ్గించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. 5జీ మొబైల్ సర్వీసులకు ఉపయోగించే 3300–3670 మెగాహెట్జ్ బ్యాండ్లో స్పెక్ట్రం రేటును మెగాహెట్జ్కు రూ. 317 కోట్లుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ట్రాయ్ గతంలో సూచించిన రూ. 492 కోట్లతో (మెగాహెట్జ్కు) పోలిస్తే ఇది సుమారు 35 శాతం తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక కీలకమైన 700 మెగాహెట్జ్ బ్యాండ్కు సంబంధించి బేస్ రేటును గతంలో ప్రతిపాదించిన దానికన్నా 40 శాతం తక్కువగా రూ. 3,927 కోట్లుగా నిర్ణయించవచ్చని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 700 మెగాహెట్జ్ మొదలుకుని 2500 మెగాహెట్జ్ వరకూ ఉన్న ప్రస్తుత ఫ్రీక్వెన్సీలతో పాటు కొత్తగా చేర్చిన 600, 3300–3670, 24.25–28.5 మెగాహెట్జ్ బ్యాండ్లను కూడా వేలంలో విక్రయించనున్నట్లు వివరించింది. టెలికం రంగం నిలదొక్కుకోవడానికి, దీర్ఘకాలంలో వృద్ధి సాదించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడం, ద్రవ్య లభ్యతను పెంచడం, స్పెక్ట్రం కోసం సులభతర చెల్లింపుల విధానాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ట్రాయ్ తెలిపింది. అత్యంత వేగవంతమైన 5జీ మొబైల్ సర్వీసులను 2022–23 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
టమాటా రైతు 'పంట' పండింది
సాక్షి, అమరావతి: మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టమాటా మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం కిలో రూ.2–4 మధ్య పలికిన ధర నేడు రూ.7–14ల మధ్య పలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వచ్చే కొద్దిరోజుల్లో లాక్డౌన్ సడలింపులతో ఎగుమతులు పుంజుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. టమాటా పంట రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,090 హెక్టార్లు, అనంతపురంలో 19,340 హెక్టార్లు, కర్నూలులో 3,203 హెక్టార్లలో సాగవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 22.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తుంది. ఇలా మార్కెట్కు వచ్చే టమాటాలో మూడొంతులు వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకే పరిమితమైన ఎగుమతులు మంగళవారం పది రాష్ట్రాలకు పెరిగింది. మరో నాలుగు రాష్ట్రాలకు ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వేలం పాటల్లో మార్కెటింగ్ శాఖ.. నిజానికి.. కరోనావల్ల ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ఎగుమతుల్లేక, మార్కెట్లో ధరలేక కిలో టమాటా రూ.2–4కు మించి ధర పలకలేదు. ఈ దశలో ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర తక్కువగా ఉన్న మార్కెట్లలో వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొంది. ఇలా కిలో రూ.5–7 చొప్పున రూ.11లక్షలు వెచ్చించి 52 మంది రైతుల నుంచి సుమారు 130.39 టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం రైతుబజార్ల ద్వారా విక్రయాలు జరిపింది. మరోవైపు.. ఏపీ మహిళా అభివృద్ధి సంస్థ ద్వారా 410 మంది రైతుల నుంచి రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా కిలో రూ.4కు మించి పలకని టమాటా ధర ప్రస్తుతం గరిష్టంగా రూ.14లు పలుకుతోంది. జాతీయ స్థాయిలో టమాటా మార్కెట్గా పేరొందిన మదనపల్లెతో పాటు పలమనేరు, మలకల చెరువు మార్కెట్ యార్డుల్లో టమాటా రైతుకు నేడు మంచి రేటు వస్తోంది. కనిష్ట, గరిష్ట ధరలిలా.. ► మదనపల్లె మార్కెట్ యార్డులో మంగళవారం మొదటి రకం టమాటా కిలో కనిష్టం రూ.11, గరిష్టం రూ.14.. రెండో రకం కనిష్టం రూ.7, గరిష్టం రూ.10 పలికింది. ► అలాగే, పలమనేరు మార్కెట్ యార్డులో రెండో రకం కనిష్టం రూ.9, గరిష్టం రూ.12 ధర పలికింది. ► మలకలచెరువు మార్కెట్ యార్డులో కిలో కనిష్టంగా రూ.7, గరిష్టంగా 10 పలికింది. ఈ మూడు మార్కెట్ యార్డులకు సగటున రోజుకు 2వేల టన్నుల చొప్పున టమాటా వస్తోంది. రైతుల వద్ద మరో 10 లక్షల టన్నుల టమాటా ఉన్నట్లు అంచనా. ► ఇదిలా ఉంటే.. టమాటా ధరలు ఈనెలాఖరులో భారీగా పెరిగే సూచనలు ఉన్నట్టు మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. లాక్డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాలకు ఎగుమతులు మొదలైతే వ్యాపారుల మధ్య పోటీతో ధరలు ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం జోక్యంవల్లే.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంవల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఒకసారి పతనమైతే మళ్లీ పెరిగిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఈసారి కిలో రూ.2–4ల మధ్య ప్రారంభమైన ధర నేడు కిలో రూ.14లు పలుకుతోంది. మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ ఇది నిజంగా శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మదనపల్లె మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతోంది. 10 కిలోల టమాటా 1వ రకం గరిష్టంగా రూ.140 పలకడం నిజంగా శుభపరిణామం. ప్రస్తుతం సాగు రకాల్లో 1వ రకం టమాటా 60 శాతం కంటే ఎక్కువగా సాగవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు
అన్ని పంటల్లాగే పొగాకును కూడా కొనుగోలు చేస్తాం. మార్కెట్కు వచ్చిన అన్ని రకాల పొగాకుకు కనీస ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి. ఈ రేట్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలి. ఈ రేట్లను ప్రామాణికంగా తీసుకుని కనీస రేట్లకుపైనే వేలం కొనసాగాలి. తద్వారా రైతుల్లో విశ్వాసం, భరోసా కల్పించాలి. పొగాకు కొనుగోలు వ్యవహారాన్ని రింగ్ చేసే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. వ్యాపారాలు చేయని వారి లైసెన్స్లను తొలగించాలి. వ్యాపారాలు చేయకపోతే వారికి లైసెన్స్లు ఎందుకు? ఇవి చేయగలిగితే చాలా వరకు పరిస్థితి అదుపులోకి వస్తుంది. సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా పొగాకు రైతులకు మేలు జరిగేలా కనీస ధర ప్రకటించి, ఆపై ధరలకే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్లో పొగాకు కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి వివిధ కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు రైతుల సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పటికప్పుడే స్పందిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లైసెన్స్ తీసుకున్నారంటే కొనుగోలు చేయాల్సిందే ► ఈ ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. అరటి, మొక్క జొన్న, పసుపు, శనగ ఇలా అన్ని రకాల పంటలను కరోనా సమయంలో కూడా భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేశాం. ► పొగాకును కూడా అలాగే కొనాలి. పొగాకు బోర్డు, కంపెనీలు కలిసి రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి. లైసెన్స్లు తీసుకుని, వేలంలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీల విషయంలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి. ► ఏపీ మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు చేయాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పొగాకు మార్కెట్లో జోక్యం కోసం రెండు మూడు రోజుల్లో ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పొగాకు కొనుగోలు కోసం లైసెన్స్ తీసుకుంటుంది. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో ఆ సంస్థ నడుస్తుంది. ► బోర్డు.. పొగాకు కొనుగోలు కంపెనీలు, వ్యాపారుల సహకారంతో ముందుకు వెళ్తుంది. ప్రకటించిన కనీస ధరల కన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా చూస్తుంది. ► పొగాకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలి. అలాగే లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వేలం కేంద్రాల వద్ద ప్రతిరోజూ కొనుగోలు చేయాలి. వేలం జరిగే అన్ని రోజులూ పాల్గొనాలి. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పొగాకును వారు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ► రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోవాలనే లక్ష్యంతో కాకుండా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది మా అజెండా. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపారులు రింగ్ కాకుండా చూడాలి ► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుంది. మార్కెట్లో పోటీతత్వం పెంచింది. రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఇక్కడ ఉంది. దీన్ని మీరు సానుకూలంగా తీసుకోవాలి. ► ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ముందుకు రావాల్సి ఉంది. లక్ష్యాల మేరకే పంట సాగవుతున్నప్పుడు కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారు. ► 920 మందికి లైసెన్స్లు ఇచ్చినా.. 15 మందికి మించి పొగాకు వేలం పాటల్లో పాల్గొనడం లేదు. వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని రైతులు అంటున్నారు. రైతులు వేలం కేంద్రానికి తీసుకు వచ్చినప్పుడు కేవలం నాణ్యమైన పొగాకును మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ► వ్యాపారులు ఒక రింగులా ఏర్పడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాల్సిందే. మార్కెట్లో పారదర్శకత, ఫెయిర్ విధానాలు, పోటీని పెంచే విధానాలు ఉండాలి. ► రైతుల సరుకును నిరాకరించడం వల్ల వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. చివరకు వారు ఎంతో కొంతకు తెగనమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. వేలం కేంద్రానికి సరుకు వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. ► రైతుల నుంచి ఎంత కొనుగోలు చేస్తామన్నది ముందే మీరు పరిమితి విధిస్తున్నప్పుడు.. కొనుగోలు చేయకపోవడం కరెక్టు కాదు. తిప్పి పంపే పరిస్థితి ఉండకూడదు. కేవలం మేలు రకం కొనుగోలు చేయడం వల్ల రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు అవుతుంది. ► ప్రాసెస్ చేసే అవకాశం రైతుకు లేదు కాబట్టి.. రైతు ఎంతో కాలం సరుకును నిల్వ చేసుకోలేడు. చివరకు వ్యాపారులు రింగ్ అవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ► పొగాకు కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇండెంట్ ఇచ్చి, తమ చేత పంట పండించి.. చివరకు వేలం కేంద్రం వద్దకు వ్యాపారులు రావడం లేదని వాపోయారు. కరోనాకు ముందు ధరలు బాగున్నా, ఇప్పుడు ధరలు తగ్గిపోయాయన్నారు. ► గడువు ముగిసినా.. వారం.. పది రోజులు అంటూ కొనుగోలు చేయడం లేదన్నారు. వేలం కేంద్రాల వైపు వ్యాపారులు చూడడం లేదని వాపోయారు. ఎకరాకు రూ.1.4 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ► కేంద్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు, ఎగుమతుల రూపంలో మరో రూ.6 వేల కోట్ల ఆదాయం పొగాకు ద్వారా వస్తోంది. రైతులకు మాత్రం అప్పులు తప్పడం లేదన్నారు. ఒక ఏడాది పెట్టబడులు వస్తే.. వరుసగా ఆరేళ్లు నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ► పొగాకు కొనుగోలు కోసం రిజిస్టర్ చేసిన కంపెనీలు కూడా వేలంలో పాల్గొనడం లేదని.. మీడియం, లోగ్రేడ్ పొగాకు రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ► ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ బాలశౌరి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్దారులంతా వేలంలో పాల్గొనాల్సిందే లైసెన్స్ తీసుకొని పంట సాగు చేసిన రైతు నష్టపోకుండా ఉండే విధంగా దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేçస్తున్నాం. కొంతమంది లైసెన్స్దారులు కంపెనీలతో కుమ్మక్కయి రైతులు తక్కువ ధరకు అమ్ముకునే విధంగా చేయడం ఇకపై సాధ్యం కాదు. ఇక నుంచి ప్రతీ లైసెన్స్దారుడు విధిగా వేలంలో పాల్గొనే విధంగా నిబంధన తీసుకువస్తాం. జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్గా స్థానిక రైతులనే నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా ఇంచార్జిమంత్రి గౌరవ అధ్యక్షులుగా, మండల కమిటీలకు స్థానిక ఎమ్మల్యేలు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. ఈ కమిటీలో కౌలు రైతు, మహిళా రైతు విధిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్ను భారత్కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
ధాన్యం కొనేవారేరి..?
వీణవంక(హుజూరాబాద్): పంట పండించడం ఒక ఎత్తయితే.. వచ్చిన దిగుబడిని విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఇక మగ వడ్లు సాగు చేసిన అన్నదాతలు కల్లాల్లో ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆడ, మగ వరి సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ పండించిన ధాన్యం ఆరేళ్లయినా మొలకెత్తే స్వభావం కలిగి ఉంటుంది. హైబ్రీడ్ వరిని 32 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది మగ వడ్లను ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయకపోవడంతో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించగా.. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి.. ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించి మగ వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు. అప్పుడు కొనుగోలు చేసిన సంస్థలు మళ్లీ ఈ రబీలో ముఖం చాటేశాయి. కేంద్రాలకు తరలించిన మగ ధాన్యం కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు మగ వడ్లను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్–ఏకు క్వింటాల్కు రూ.1770, కామన్ రకం రూ.1750 ఉండగా మిల్లర్లు మగ వడ్లను రూ.1200కే అతికష్టం మీద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో.. మగ(హైబ్రీడ్) ధాన్యం గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారు. కనీసం గ్రేడ్ బీ(కామన్రకం) కింద కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగసంస్థలు చేతులెత్తేశాయి. మగ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి విక్రయించడం సవాల్గా మారింది. కొందరు రైతులు గత్యతంరం లేక మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. ఆడ వడ్లను విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తాయి. వీటికి మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మగ ధాన్యాన్ని రైతులే మార్కెట్లో అమ్ముకోవాలి. రైతులతో కంపెనీలు ముందస్తుగా అలా ఒప్పందం చేసుకుంటున్నాయి. మార్కెట్లో మగ ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతోపాటు కనీసం కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు. సాగుకు అనుకూలం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45వేల ఎకరాలలో హైబ్రీడ్ వరి సాగులోకి వచ్చింది. ఇందులో 8వేల ఎకరాలు ఎండిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో 40 నుంచి 50 వేల క్వింటాళ్లు మగ ధాన్యం పండినట్లు సమాచారం. ప్రస్తుతం వరి కోతలు 60శాతం పూర్తయ్యాయి. హైబ్రీడ్ వరి సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈసారి ఎకరాకు 6నుంచి 9క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా. ఆడ వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు కంపెనీలు ధర చెల్లిస్తున్నాయి. ఎకరాకు రూ.38వేల వరకు పెట్టుబడి పెట్టామని, మగ ధాన్యం కొనుగోలు చేస్తేనే కష్టాల నుంచి గట్టేక్కుతామని రైతులు అంటున్నారు. కొనుగోలు చేయని ప్రభుత్వ రంగసంస్థలు.. ప్రభుత్వ రంగ సంస్థలు మగ ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. గ్రేడ్ ఏ రకం కింద 1010ధాన్యం, కామన్ రకం కింద మరి కొన్ని రకాల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశతో కొందరు రైతులు కళ్లాల వద్ద రాశులు పోసి వేచి చూస్తున్నారు. ధాన్యం మిల్లర్ల పాలు.. మగ ధాన్యం మిల్లర్ల పాలవుతోంది. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో వివాహ శుభకార్యాలు ఉండడంతో ఖర్చుల కోసం రైతులు గత్యంతరం లేక మిల్లర్లకే విక్రయిస్తున్న సంఘటనలు ఉన్నాయి. క్వింటాల్కు ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 ఉండగా మిల్లర్లు రూ.1200లోపే చెల్లిస్తున్నారు. తరుగు, తేమ పేరుతో మరింత కోత విధిస్తున్నారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకొని మగ ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలి.. మగ ధాన్యాన్ని ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయాలి. గింజ పొట్టిగా ఉంటుందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఎలా..? రైతులు సెంటర్లకు ధాన్యం తరలిస్తే వెళ్లగొడుతున్నరు. మిల్లర్లు రూ.1200కే అడుగుతున్నరు. కనీసం కామన్ రకం కిందనైన కొనుగోలు చేయాలి. ఎక్కువ మంది రైతులు మగ వడ్లనే పండించారు. ఎవ్వరూ కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నరు. – అంబాల రంగయ్య, రైతు ఐక్యవేదిక నాయకులు ఆదేశాలు రాలేదు.. మగ వడ్లను కొనుగోలు చేయాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకే గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నాం. మా పరిధిలో 14సెంటర్లను ప్రారంభించాం. గతంలో జమ్మికుంట మార్కెట్లో మాత్రమే మగ వడ్లను కొనుగోలు చేశారు. రైతులు మగ వడ్లను సెంటర్లకు తరలించ వద్దు. – ప్రకాశ్రెడ్డి, పీఏసీఎస్, సీఈవో
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement