-
ఎయిర్పోర్టు ఆశలకు రెక్కలు..!
అడ్డాకుల: జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్పోర్టు ఆశలకు మరోసారి రెక్కలు తొడుగుతున్నారు. రెండేళ్లక్రితం గుడిబండ వద్ద మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అయితే విమానయాన శాఖ అధికారులు కూడా వస్తారని ప్రచారం జరిగినా వారు రాలేదు. దీంతో విమానాశ్రయం ఆశలపై అప్పట్లో నీళ్లు చల్లినట్లయింది. తాజాగా మరోసారి విమానాశ్రయం ఏర్పాటుకుస్థలాన్ని పరిశీలించేందుకు అధికారులు రానున్నట్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో మళ్లీ ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఆశలకు రెక్కలు తొడిగినట్లవుతోంది. సీఎం కేసీఆర్ ప్రకటనతో.. రెండేళ్ల కిందట జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ అడ్డాకుల మండలంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఆ వెంటనే రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులు అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. గుడిబండ గ్రామం పక్కనే ఉన్న సర్వే నంబర్ 118లో ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పలుమార్లు పరిశీలిచారు. ఆర్అండ్బీ అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత మూసాపేట మండలంలోని తుంకినీపూర్, దాసర్పల్లి, వేముల, భూత్పూర్ మండలంలోని రావులపల్లి గ్రామాల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలన చేశారు. మూడు మండలాల్లో తిరిగిన రెవెన్యూ అధికారులు భూముల వివరాలు, మ్యాపులను ఉన్నతాధికారులకు పంపించారు. ఇక అంతటితోనే విమానాశ్రయం ఏర్పాటుకు స్థలాల పరిశీలన చేయడం ముగిసింది. అయితే అప్పట్లోనే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల మూడు మినీ విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో పాలమూరుకు విమానాశ్రయం మంజూరు కాలేదు. వైమానిక అధికారుల ఆరా గుడిబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలపై ఇటీవల వైమానిక శాఖ అధికారులు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆరా తీశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం, దాని చుట్టూ ఉన్న ప్రైవేటు భూముల వివరాలను సేకరించడంతో పాటు ఈనెల 6న ఆర్అండ్బీ అధికారిణి సంధ్య, సర్వేయర్ బాల్యానాయక్ సర్వే నంబర్ 118లోని స్థలాన్ని పరిశీలించారు. వైమానిక శాఖ అధికారులు కూడా ఇక్కడి స్థలాన్ని పరిశీలించడానికి త్వరలో రానుండటంతో మళ్లీ విమానాశ్రయ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. విమానాశ్రయం కోసం దాదాపు 500ఎకరాలు భూమి అవసరమైన నేపథ్యంలో సర్వే నంబర్ 118లో 70ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ భూమిని కొందరు రైతులకు ప్రభుత్వం కేటాయించినా ఇప్పటి అవసరం దృష్ట్యా దాన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భూమికి కూడా సర్కారు ధర ప్రకారం రెండింతల పరిహారం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎయిర్పోర్టుకు ఈ స్థలం అనుకూలంగా ఉన్నట్లు అధికారులు భావిస్తే చుట్టుపక్కల రైతుల ప్రైవేట్ భూములను సేకరించే అవకాశం ఉంటుంది. తేదీ ఖరారు కాలేదు..! వైమానిక అధికారులు గుడిబండ వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తామని చెప్పారు. వారు వచ్చేలోపే మేము ఈనెల 6న గుడిబండకు వచ్చి స్థలాన్ని పరిశీలించాం. ఇదివరకే అధికారులు రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు వస్తారన్న తేదీ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే స్థలం పరిశీలించే అవకాశం ఉంది. – సంధ్య, డిప్యూటీ ఈఈ ఆర్అండ్బీ, మహబూబ్నగర్ -
మినీ ఎయిర్పోర్టుగా ‘దొనకొండ’ పరిశీలన
దొనకొండ: దొనకొండలోని రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బ్రిటీష్వారు నిర్మించిన ఎయిర్పోర్టును ఢిల్లీకి చెందిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం శుక్రవారం పరిశీలించింది. నాటి ఎయిర్పోర్టు భవనాన్ని, గ్రౌండ్ను బృంద సభ్యులు పరిశీలించారు. రాష్ట్రంలో మూడు మినీ ఎయిర్పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. వాటిలో ఒకటి దొనకొండలో ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరిపారు. ఇక్కడి వాతావరణ అనుకూలతను పరికరాల ద్వారా పరిశీలించారు. జిల్లా సర్వేయర్ నరసింహారావు ఎయిర్పోర్టు, చుట్టుపక్కల ప్రాంతాలను మ్యాపులో గుర్తించారు. ముందుగా జిల్లా కోఆప్షన్ షేక్ మగ్బుల్ అహ్మద్, మండల వినియోగదారుల సంఘ కన్వీనర్ షేక్ నవాబు, మరికొంత మంది స్థానికులు దొనకొండలోని పరిస్థితులను, అనుకూలతలను బృందానికి తెలియజేశారు. అనంతరం స్థానిక రైల్వే గెస్ట్హౌస్లో బృంద సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్పోర్టుకు సంబంధించి 136.5 ఎకరాల స్థలం, ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించామని, మినీ ఎయిర్పోర్టుకు అనుకూలంగా ఉందని వివరించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. బృందంలో ఢిల్లీకి చెందిన ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్ నరేందర్ మకీజా, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సుధేష్ శర్మ, ఆర్కిటెక్చర్ మహమ్మద్ వసీం, విజయవాడకు చెందిన ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ రాజా కిషోర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జేఎస్.గుప్తా, తహశీల్దార్ కేవీ సత్యనారాయణ, ఆర్ఐ సుబ్రహ్మణ్యం, సర్వేయర్ అల్లూరయ్య, వీఆర్వోలు ఉన్నారు. -
అనంతపురం సమీపంలో మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు
అనంతపురం సమీపంలో మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం పది నెలల క్రితం సర్వే చేసిన ఏఏఐ అధికారులు ప్రత్యేక ప్యాకేజీలో మినీ ఎయిర్పోర్ట్ ప్రస్తావనే లేని వైనం విమానాశ్రయం ఏర్పాటైతే పారిశ్రామిక ప్రగతి, విద్యాభివృద్ధికి మార్గం సుగమం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చేతుల్లో భవితవ్యం సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం సమీపంలో మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హడావుడి చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు అనువైన ప్రదేశాల కోసం పర్యటించినప్పుడు రెండు స్థలాలను కూడా గుర్తించారు. ఇదంతా జరిగి పది నెలలైనా ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన అశోక్ గజపతిరాజు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి స్వీకరించడంతో మినీ ఎయిర్పోర్ట్పై ఆశలు చిగురిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. విమాన సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో గతంలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు యూపీఏ సర్కారు జూలై 30న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అనంతపురం నగర నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమ ఆవిర్భావానికి దారితీసింది. ఉద్యమం మహోగ్రరూపం దాల్చిన సమయంలోనే.. అనంతపురంలో మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హడావుడిగా ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం ఆగష్టు 31న జిల్లాలో పర్యటించింది. ఆరు కిలోమీటర్ల మేర రన్ వేతో పాటు మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రెండు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని ఏఏఐ అధికారులు తేల్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, రెవెన్యూ అధికారులతో కలిసి ఏఐఐ అధికారుల బృందం.. మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం అన్వేషించింది. అనంతపురం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో బళ్లారి-అనంతపురం రోడ్డుకు సమీపంలో ఒక ప్రదేశాన్ని.. ఎన్హెచ్-44కు దగ్గరలో కనగానిపల్లి-రాప్తాడు మండలాల సరిహద్దులోని మరొక ప్రదేశాన్ని మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు గుర్తించింది. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదించింది. ఈలోగా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేశాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోయింది. విభజన సమయంలో సీమాంధ్రకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని కేంద్రం పేర్కొంది. కానీ.. అనంతపురం జిల్లాలో మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడా పొందుపరచలేదు. ఈలోగా ఎన్నికలు రానే వచ్చాయి. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 8న ఏర్పాటు కానుంది. మన రాష్ట్రానికే చెందిన అశోక్గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత తరుణంలో అనంతపురంలో మినీ ఎయిర్పోర్టు ఏర్పాటు ఆయన చేతుల్లో ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మినీ ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తే.. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి బీజం వేయవచ్చు. జిల్లాలో ఇనుప ఖనిజం, సున్నపురాయి వంటి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. చౌకగా భూమి లభిస్తుంది. విస్తారంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు, రవాణా మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే పారి శ్రామికాభివృద్ధి ఊపందుకునే అవకాశం ఉంది. దీనికి సమాంతరంగా విద్యారం గం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉం టుంది. జిల్లాకు మంజూరైన ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు త్వరితగతిన ఏర్పాటవుతాయి. ఈ పరిస్థితిలో మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement