-
సార్.. అన్నంలో పురుగులు ఎట్ల తినాలి?
హైదరాబాద్: ‘సార్.. మధ్యాహ్న భోజనంలో పురు గులు వస్తున్నాయి.. ఎట్ల తినాలి’ అంటూ నాలుగో తరగతికి చెందిన ఓ విద్యార్థిని తన తల్లితో కలసి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య కథనం ప్రకారం.. మీర్పేట సిర్లాహిల్స్కు చెందిన పూజిత స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. అన్నంలో పురుగు రావడంతో పడేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయులు అన్నం ఎందుకు పడేశావని అడగ్గా పురుగు వచ్చిందని చెప్పింది. అన్నం తినేది ఉంటేనే పాఠశాలకు రావాలని..లేకపోతే రావొద్దని ఉపాధ్యాయులు మందలించారు. దీంతో పూజిత బుధవారం మధ్యా హ్నం తల్లి రాణితో కలిసి మీర్పేట సీఐ మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ తిరుపతయ్య తనిఖీ చేయగా కూరగాయలు వారం రోజుల క్రితం తెచ్చినవి కావడంతో దాదాపు పాడైపోయి ఉండడం, బియ్యం కూడా నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ను వివరణ కోరగా బాలిక రెండురోజుల నుంచి పాఠశాలకు గైర్హాజరైందని తెలిపారు. పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ అన్నంలో పురుగులు వచ్చాయని బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలియగానే మండల విద్యాధికారి కృష్ణయ్య వెంటనే పాఠశాలను తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం నాణ్యతగానే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం వరకే పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, గురువారం విచారణ చేపడతామని తెలిపారు. -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
అనంతపురం సెంట్రల్/ రాయదుర్గం: అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేవలం చిన్నారులకే భోజనం వడ్డిస్తున్నారు. శుక్రవారం నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,079 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గర్భిణులు 21,480 మంది, బాలింతలు 19,870, ఏడాది లోపు పిల్లలు 20,728, ఏడాది నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,960 , మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,140 మంది ఉన్నారు. రక్తహీనత నివారించడం కోసం వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారం అందిస్తున్నారు. నాణ్యమైన భోజనం సరఫరా.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రభ్తుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న సమయంలో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు కూడా రుచికరమైన భోజనం అందించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు చేరాయి. పాల కొరత ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భోజనం తర్వాత తల్లులకు 200 మిల్లీలీటర్లు పాలు, పిల్లలకు 100 ఎంఎల్ పాలు తప్పనిసరిగా అందించాలని నిర్ణయించారు. -
పురుగులు.. ఎలుకలు!
సాక్షి, మెదక్: కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో మధ్యాహ్న భోజన బియ్యం పాడైపోతున్నాయి. సంచులను ఎలుకలు కొరికివేయడం.. పురుగులు పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది క్వింటాళ్ల మేర వృథాగా మారాయి. రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో 41 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 55 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 100 గ్రాముల చొప్పున.. ఆరు నుంచి పదో తరగతి వరకు రోజుకు 150 గ్రాముల చొప్పున మధ్యాహ్న భోజన బియ్యం కేటాయిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సరిపడా బియ్యాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపిణీ కేంద్రం నుంచి తీసుకొచ్చి నిల్వ ఉంచుతున్నారు. ఇలా నిల్వ ఉంచిన వాటిలో సుమారు ముప్పావు వంతు బియ్యం ముక్కిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాలు, పాఠశాలల వారీగా లెక్కలు తీస్తున్న విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించారు. సుమారు 15 వేల క్వింటాళ్లు వృథా జూన్లో విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఇప్పటి వరకు బడులు తెరుచుకోలేదు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు గత నెల నుంచే స్కూళ్లకు వస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో పరిశీలిస్తే స్కూళ్లు మూతపడే నాటికి సుమారు 1,633.62 క్వింటాళ్ల సన్న బియ్యం నిల్వ ఉంది. ఇందులో 493.21 క్వింటాళ్లు పాడైపోయాయి. 236.31 క్వింటాళ్లు పాక్షికంగా.. 256.90 క్వింటాళ్లు పూర్తిగా పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల క్వింటాళ్ల మేర మధ్యాహ్న భోజన బియ్యం వృథా అయినట్లు విద్యాశాఖ అధికారుల అంచనా. జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు స్కూళ్లు తెరవకపోవడంతో పాఠశాలల్లో నిల్వ ఉన్న మధ్యాహ్న భోజన బియ్యం పాడవుతున్నాయని ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకొచ్చారు. ఎట్టకేలకు గ్రహించిన రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలు, పాఠశాలల వారీగా సమాచారం సేకరించారు. అంతేకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. పాఠశాలలు తెరిచిన తర్వాత వాటిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. 25% బియ్యం పాడైపోయాయి శివ్వంపేట మండలంలో 75 పాఠశాలలకు సంబంధించి 85.11 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంది. పలు స్కూళ్లలో తడవడం, పురుగులు పట్టడం మూలంగా 25 శాతం మేర పాడైపోయాయి. పనికి రాని బియ్యంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు. – బుచ్చనాయక్, ఎంఈఓ, శివ్వంపేట, మెదక్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బియ్యం పురుగులు పట్టాయి. అసలే పనికి రాని వాటిని వేరు చేశాం. వాటిని వినియోగించకుండా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రస్తుతం ఉన్న వాటిని బల్లాలపై, కుర్చీల్లో తేమలేని చోట నిల్వ చేసేలా చర్యలు తీసుకున్నాం. – రమేష్ కుమార్, డీఈఓ, మెదక్ -
విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల భలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కళాశాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కార్.. దానిలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. (ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం) డ్రాపవుట్స్ నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. -
మధ్యాహ్న భోజనం పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేయంతో అందులో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు కోర్టు పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. కరోనా కారణంగా చాలా స్కూళ్లు మూతపడటంతో కోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారించింది. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీతోపాటు అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. ఒమర్ విడుదలపై వారంలో తేల్చండి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడుదలపై వారంలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 37 రద్దు సమయంలో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఒమర్ను నిర్బంధించింది. ఒమర్ నిర్బంధంపై ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్. షా ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఒమర్ విడుదలకు సంబంధించి వారంలోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ‘ఒమర్ను విడుదల చేస్తారా? లేదా? ఒకవేళ చేయాలని భావిస్తే వెంటనే విడుదల చేయండి. లేని పక్షంలో ఈ పిటిషన్పై విచారణ చేపడతాం’అని పేర్కొంది. ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వేరే కోర్టులో వేరే కేసు విచారణలో ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement