-
మెరైన్ మత్స్య ఉత్పత్తుల్లో ఏపీకి ఐదు అవార్డులు
కైకలూరు(ఏలూరు జిల్లా): నేషనల్ ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే అవార్డుల్లో ఏపీకి 5 విభాగాల్లో చోటు దక్కింది. ఏ, బీ కేటగిరీలుగా ఎంపిక చేసిన జాబితాను ఎన్ఎఫ్డీబీ శుక్రవారం ప్రకటించింది. ఏపీలో ఉత్తమ మెరైన్ జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉత్తమ మెరైన్ చేపల రైతుగా ఏలూరు జిల్లా మట్టగుంటకి చెందిన తిరుమాని నాగరాజు, ఉత్తమ హేచరీగా కాకినాడ జిల్లాకు చెందిన సప్తగిరి హేచరీస్, ఉత్తమ ల్యాబ్గా తూర్పు గోదావరి జిల్లా రెడ్డి డ్రగ్స్.. ల్యాబ్కు చెందిన నరేష్కుమార్, ఉత్తమ ఆర్టెమియా టెక్నాలజీ ఇన్ఫ్యూషన్గా కవితారెడ్డికి అవార్డులు దక్కాయి. -
బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా?
ముంబై: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల ప్రారంభం నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటకి మే 31 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయమాలకు సడలింపులు ఇచ్చింది. దాంతో మెరైన్ డ్రైవ్ వద్ద జనాలు గుంపులు, గుంపులుగా చేరారు. మాస్క్ ధరించారు కానీ సామాజిక దూరం పాటించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నిహారికా కులకర్ణి ఈ ఫోటోని షేర్ చేశారు. ‘అన్లాకింగ్ మొదటి దశలో భాగంగా జూన్ 3 నుంచి ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ కార్యకలాపాలు అనుమతించారు. జూన్ 6, 2020 సాయంత్రం మెరైన్ డ్రైవ్లో భారీగా జనం గుమిగూడారు’ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. View this post on Instagram Huge crowd at Marine drive in the evening. June 6, 2020. In phase 1 of unlocking, outdoor physical activities have been allowed across the state from June 3 from 5 am to 7 pm. #MarineDrive #Phase1 #unlocking1.0 #lockdown5.0 #mumbai #everydaymumbai #everydayeverywhere #indiapictures #thingstodoinmumbai #instagram #instadaily #everydayindia #india_gram #india_ig #indiaclicks #indianphotography #desi_diaries #photojournalism #gettyimages #reportagespotlight #mymumbai #insta_maharashtra #myhallaphoto #storiesofindia #_soi A post shared by Niharika kulkarni (@niharika_kulkarni) on Jun 6, 2020 at 10:44am PDT దీనిపై నెటిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా’.. ‘మాస్క్ కూడా సరిగా వేసుకోని ఈ జనాలు ఇళ్లకు వెళ్లి కరోనా గురించి లెక్చర్లు దంచుతారు’.. ‘మెరైన్ డ్రైవ్ పేరును కరోనా డ్రైవ్గా మార్చాలి’.. ‘కరోనా గిరోనా జాన్తా నై’’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
పోలీసులపై కత్తితో యువకుడి దాడి
ముంబై : పోలీసులపై దాడులు జరగడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. ఇటీవల పంజాబ్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ను అమలయ్యేలా చూస్తున్న ఓ పోలీసు అధికారి చేతిని కొందరు దుండగులు నరికేయడం తెలిసిందే. తాజాగా ముంబైలో కూడా దాదాపు అలాంటి ఘటననే చోటు చేసుకుంది. కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావని అడ్డగించినందుకు పోలీసులపై దాడి చేశాడో 27 ఏళ్ల యువకుడు. ఈ ఘటనపై ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ ముంబైలోని సిల్వర్ ఓక్స్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కరణ్ ప్రదీప్ నాయర్(27) శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలోచేతిలో పెద్ద కత్తి పట్టుకొని చౌపట్టి నుంచి మెరైన్ డ్రైవ్ వరకు ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో అక్కడే నైట్ డ్యూటీ చేస్తున్న మెరైన్ డ్రైవ్ పోలీసులు అతన్ని చూసి అడ్డగించబోయారు. దీంతో కరణ్ వారికి దొరకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై యువకుడు కత్తితో దాడి చేశాడు.ఈఘటనలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ముగ్గురు పోలీసులను స్థానికి ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్కి తీసుకెళ్లారు. కరోనా వైరస్ భయం వల్ల వారు ఆస్పత్రిలో ఉండలేకపోయారని, పోలీసు స్టేషన్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సీనియర్ పోలీసులు అధికారి పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడు కరణ్ ఓ నిరుద్యోగి అని, తల్లి, చెల్లితో కలిసి కుంబాల హిల్స్లో నివసిస్తున్నాడని తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తల్లితో గొడపడి, ఇంట్లో నుంచి ఓ పెద్ద కత్తి తీసుకొని ఒకరిని చంపేస్తానంటు బయటకు వచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
నీటమునిగి నగరం ఏడుస్తుంటే వీళ్లేమో..!
ముంబై: రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. నిత్యం వేలాది మంది సేదతీరే మెరైన్ డ్రైవ్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షం.. నలుగురి మృతి: శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ముంబై మహానగరం, శివారులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నాటికి వర్షపాతం సరాసరి 100 మిల్లీమీటర్లుగా నమోదయింది. దాదర్, పరేల్ టీటీ, ధారావి, కింగ్స్ సర్కిల్, కోలాబా, సియోన్ రోడ్ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. వర్షాభావ పరిస్థితిని చక్కదిద్దేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ), నేవీ, విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో 3000పైచిలుకు మంది సిబ్బంది పాల్గొంటున్నారని బీఎంసీ కమిషనర్ అజొయ్ మెహతా తెలిపారు. నడిరోడ్డుపై బరితెగింపు: ముంబైలో అత్యంత శోభాయమానంగా కనిపించే.. నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. (కింద వీడియో) ఆ దృశ్యాన్ని చూసి షాక్కు గురైన వారిలో చాలా మంది సెల్ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ మొబైల్ వ్యాన్ అక్కడికి చేరుకున్న ఖాకీలను చూసి జంట దుకాణం సర్దుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.. కొనసాగుతోన్న వేట: పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్ అడిక్ట్ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించిన పోలీసులు.. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. మెరైన్ డ్రైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదుచేయలేదు. -
ఎలా అనుమతి ఇచ్చారు
- ఓపెన్ ఎయిర్ జిమ్పై ఎంసీజీఎంను ప్రశ్నించిన హైకోర్టు - ఆగస్టు 6 లోగా స్పందించాలని బీఎంసీకి ఆదేశం ముంబై: మెరైన్ డ్రైవ్లో ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఎలా అనుమతిచ్చారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం)ను బాంబే హైకోర్టు ఆదేశించింది. విజయ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏకే మీనన్తో కూడిన ధర్మాసనం, ఆగస్టు 6 లోపల స్పందించాలని దాఖలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేని, వారసత్వ సంపదగా గుర్తించిన చోట జిమ్ ఏర్పాటు చేశారని పిటిషన్లో విజయ్ ఆరోపించారు. ‘ఫుట్పాత్ ఉన్నది నడవడానికి, కాని శివసేనతో సంబంధం ఉన్న డీఎన్ ఫిట్నెస్ అనే సంస్థ అక్కడ జిమ్ ఏర్పాటు చేసింది. ఎంసీజీఎం శివసేన నేతృత్వంలో ఉండటంతో అక్రమంగా ఏర్పాటు జరిగింది’ అని విజయ్ విమర్శించారు. 2013లో ఓ కాంగ్రెస్ ఎంపీ జిమ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరినపుడు ‘వారసత్వ సంపద’ అన్న కారణంతో నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్ సారోగి అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement