-
వేగంగా ముగిసిన ర్యాటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు. ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదులకు ఆధారాల్లేవా? ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు. ప్రైవేటు కాలేజీలు ఖుషీ ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: టీడీపీ పెద్దల గుప్పిట్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్ల నివాసాలలో ఈడీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈనాడు రామోజీరావుకు సమీప బంధువు కూడా అయిన ఎన్ఆర్ఐ ఆస్పత్రి కోశాధికారి అక్కినేని మణి నివాసంతోపాటు విజయవాడలో ఆమె నిర్మించిన ‘అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి’లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 40 మంది ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా 8 గంటలపాటు సోదాలు నిర్వహించడం గమనార్హం. అక్కినేని మణి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ భారతీనగర్లోని అక్కినేని ఉమెన్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు ఎలా సమకూర్చారని ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులను దారి మళ్లించి, ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు భావిస్తున్నారు. అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి నిర్మాణ బిల్లులను ఎన్ఆర్ఐ ఆస్పత్రినిధుల నుంచి చెల్లించడం గమనార్హం. ఈ మేరకు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించి, అక్కినేని మణిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దల పాత్రపైనా దృష్టి టీడీపీ పెద్దలు తమ అక్రమాలకు అక్షయపాత్రగా ఎన్ఆర్ఐ అకాడమీని వాడుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజ) కుటుంబం నియంత్రణలో ఎన్ఆర్ఐ అకాడమీ పాలక మండలి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆలపాటి రాజ, ఆయన సతీమణి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపు వ్యవహారం వెనుక వీరి కుటుంబం పాత్రపైనా ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వైద్య పరికరాల కొనుగోలు పేరిట కూడా నిధులు నొక్కేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ అకాడమీ డైరెక్టర్గా వ్యవహరించిన తన సోదరుడు రవి ద్వారా రాజా ఈ వ్యవహారాలు సాగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి చేతిలో ఎన్ఆర్ఐ అకాడమీ రిమోట్ కంట్రోల్ ఉందన్నది బహిరంగ రహస్యం. ఈ అకాడమీలో అక్రమాలపై కేసులు నమోదైన నేపథ్యంలో సుజనా చౌదరి వ్యూహాత్మకంగా తన సన్నిహితుడిని ఆస్పత్రిలో కీలక స్థానంలో చేర్చారు. ఆయన ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నిధులు దారి మళ్లించారు. కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకు కూడా యత్నించారని తెలుస్తోంది. కంప్యూటర్లలో హార్డ్ డిస్క్లను గల్లంతు చేసినట్టు సమాచారం. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి, డైరెక్టర్లు, ఇతర కీలక వ్యక్తుల నివాసాల్లో ఈడీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగిస్తారని సమాచారం. కాగా తాజా సోదాలపై ఈడీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సీట్ల పేరిట భారీగా వసూలు చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో కూడా నిధుల మళ్లింపునకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు మళ్లించినట్టు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరిట నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. 2020–21లో ఆస్పత్రి నిధులను ఎన్ఆర్ఐ పాలక మండలి సభ్యులు తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న దాదాపు 2 వేల మంది వివరాలను కూడా ఈడీ అధికారులు అడగడం గమనార్హం. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కొందరు ఉద్యోగులను అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ముందుగా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారని తెలిసింది. ఆ సమాచారం ఆధారంగానే కొందరు ఆస్పత్రి ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. -
రాయితీ తాయిలాలు తల్లిదండ్రులతో బేరాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల బేరం జోరుగా సాగిస్తున్నాయి. తక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళను గుర్తించి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సు పేరుతో అడ్డూ అదుపు లేకుండా పిండేస్తున్నాయి. కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకం కోసం దాదాపు అన్ని కాలేజీలు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఎంక్వైరీ కోసం వచ్చే వారికి, తల్లిదండ్రులకు ఫోన్లు చేసి.. సీట్లు అయిపోతున్నాయని చెబుతూ వల వేస్తున్నాయి. ముందే బుక్ చేసుకుంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రాయితీ ఇస్తామంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో 35 వేల మేనేజ్మెంట్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లు 35 వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది వందకు పైగా కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, టాప్ కాలేజీల యాజమాన్యాల వద్ద సీట్ల కోసం క్యూ కడుతున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ.. ఎంసెట్ ఫలితాలు వెల్లడైన మరుక్షణం నుంచే కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా ప్రజా సంబంధాల అధికారులను (పీఆర్వోలు), ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళు 40 వేల ర్యాంకు పైన వచ్చిన విద్యార్థుల ఫోన్ నంబర్లు సంపాదించి, సీటు కోసం ఎర వేస్తున్నారు. నగర శివార్లలోని ఓ కాలేజీ ఏకంగా ఆరుగురు పీఆర్వోలను ఇందుకోసం తాత్కాలికంగా నియమించుకుంది. ప్రతి సీటుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు కన్సల్టెన్సీలకు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకుంది. దీంతో ఏజెంట్లు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, సీట్లు అయిపోతున్నాయంటూ, ఇప్పుడే బుక్ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సీటు మాట్లాడేందుకు రమ్మని కాలేజీ యాజమాన్యం వద్దకు తీసుకెళ్ళి, రాయితీ ఇస్తున్నట్టుగా చూపించి అక్కడే అడ్వాన్సుగా రూ.25 వేలు కట్టిస్తున్నారు. రూ.లక్షల్లో బేరం వాస్తవానికి మేనేజ్మెంట్ కోటాలో 15% ఎన్ఆర్ఐ కోటా, 15% స్థానిక మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు భర్తీ చేయాలి. దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు కాబట్టి, ఎఫ్ఆర్సీ నిర్ధారించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. ముందుగా జేఈఈ ర్యాంకు ఉన్నవారికి ఇవ్వాలి. ఇంకా మిగిలితే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వాలి. యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పాటించడం లేదు. ముందే సీట్లు అమ్మేస్తున్నాయి. ప్రముఖ కాలేజీల్లో సీఎస్ఈ సీటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజుకు ఈ డొనేషన్ అదనం అన్నమాట. ఈ మొత్తం నాలుగేళ్లకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అవుతుంది. ఇది ఒకేసారి కడితే రాయితీ ఇస్తామంటున్నారు. ఇక ఎన్ఆర్ఐ కోటా కింద అవసరమైన అన్ని పత్రాలు కాలేజీలే సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా 5 వేల యూఎస్ డాలర్లు తీసుకోవాలి. అంటే రూ.4 లక్షలు... నాలుగేళ్ళకు రూ.16 లక్షలు ఉంటుంది. ఇది కాకుండా ఇంకో రూ.5 లక్షలు అదనంగా బాదుతున్నారు. విద్యార్థులే దరఖాస్తు చేశారంటూ.. ఇలాముందే మాట్లాడుకున్న విద్యార్థుల పేర్లను ఉన్నత విద్యామండలికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మెరిట్ ప్రకారమే ఇచ్చామని, వాళ్ళే తమకు సీటుకోసం దరఖాస్తు చేశారని చెబుతున్నారు. ఆన్లైన్ విధానం లేకపోవడంతో ఎవరు దరఖాస్తు చేశారు? మెరిట్ పాటించారా? అనేది తెలియకుండా పోతోంది. దీంతో మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా దండుకుంటున్నాయి. మెరిట్ ఉన్నా మేనేజ్మెంట్ కోటా సీటు ఇవ్వలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల కమిటీ చైర్మన్ స్వరూప్రెడ్డి గతంలో పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు నేరుగా తమకు దరఖాస్తు చేసినా వాటిని కాలేజీలకు పంపుతామని చెప్పింది. గత ఏడాది ఇలాంటి ఫిర్యాదులు 50 వరకు వచ్చాయి. వాళ్ళు మళ్ళీ ఏం జరిగిందనేది చెప్పలేదని ఎఫ్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలి కన్వీనర్ కోటా మాదిరిగానే మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలి. ఈ మేరకు మేం అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విధంగా యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకునేందుకు అధికారులే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రతిభ ఉన్న వారికి సీట్లు రావడం లేదు. – ప్రవీణ్రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నియంత్రించాల్సిందే మేనేజ్మెంట్ కోటా పేరిట దోపిడీ పేదవాడికి శాపంగా మారింది. అసలు కాలేజీల్లో తనిఖీలు చేయకుండా, కాలేజీల్లో మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? చూడకుండా, బి కేటగిరీ సీట్లు అమ్ముకునే అధికారం ఎవరిచ్చారు? బహిరంగంగా సాగుతున్న ఈ అక్రమాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. – అయినేని సంతోష్కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రైవేట్ మెడికల్ ఫీజుల..పెంపునకు ‘నో’
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కరోనా వేళ పెంపు సరికాదని భావించి కాలేజీల విన్నపాన్ని తిరస్క రించింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చేసిన ఫీజుల సవరణ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. ప్రస్తుతం ఉన్న ఫీజులనే కొనసాగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫీజులపై స్పష్టత రావడంతో వెంటనే ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీట్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రకాల సిఫారసులు...: బీ, సీ కేటగిరీ ఫీజులను పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏఎఫ్ఆర్సీకి విన్నవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు ఉండగా దీన్ని రూ. 14 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు కోరినట్లు తెలిసింది. కల్పించిన మౌలిక సదుపాయాలు, పెరిగిన ఖర్చులు తదితర వివరాలతో అకౌంట్ల సమగ్ర నివేదికలను కాలేజీలు ఏఎఫ్ఆర్సీకి సమర్పిం చాయి. కాలేజీల్లో వసతులను బట్టి, వాటి ఖర్చును బట్టి ఒక్కో కాలేజీకి ఒక్కోరకంగా ఫీజు ఉంటే బాగుంటుందని ఏఎఫ్ఆర్సీ భావించి ప్రభుత్వానికి నివేదించింది (ఈ ఏడాది పీజీ మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల ఫీజును అలాగే ఖరారు చేసిన సంగతి తెలిసిందే). అలాగే రెండో ప్రతిపాదన కూడా చేసింది. ప్రస్తుతం ఉన్నట్లుగానే అన్ని కాలేజీలకు ఒకే ఫీజును కూడా నిర్ణయించవచ్చని సిఫారసు చేసింది. ఈ రెండింటిపై చర్చించిన ప్రభుత్వం ఈసారి అసలు ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం ఈసారి కూడా బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు వసూలు చేసుకోవచ్చు. ఇక సీ కేటగిరీలో దీనికి రెట్టింపు ఫీజు.. రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సర్కారు నిర్ణయంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కంగుతిన్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజల ఆదాయాలు పడిపోవడం, ఉన్న ఫీజులే భరించలేని పరిస్థితుల్లో పెంచడం సబబు కాదనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 17 వరకు వెబ్ ఆప్షన్లు... ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన వెంటనే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్శిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు మైనారిటీ, నాన్న్మైనారిటీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా బీ, సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్ల భర్తీకి ఆన్లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. అర్హులైన అభ్యర్థులు 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకోవడానికి కేవలం 48 గంటలే సమయం ఇవ్వడం గమనార్హం. కళాశాల వారీగా సీట్ల వివరాలను వర్శిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి ఠీఠీఠీ. జుnటuజిట. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn వెబ్సైట్ను సందర్శించాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ముందే మేనేజ్ చేశారు..!
ఇంటర్లో 94% మార్కులు తెచ్చుకున్న దుష్యంత్ ఎంసెట్కు సిద్ధమవుతున్నప్పటికీ మంచి కాలేజీలో సీటు కోసం మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకొనేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న ఓ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో చేరేందుకు యాజమాన్యాన్ని సంప్రదించాడు. అయితే ఇప్పటికే మెజారిటీ సీట్లు అయిపోయాయని, ట్యూషన్ ఫీజుతోపాటు అదనంగా డొనేషన్ రూ. 12 లక్షలు చెల్లిస్తే సీటు కేటాయిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి 25% డొనేషన్ను అడ్వాన్స్గా చెల్లించి సీటు సొంతం చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బరితెగించాయి. ఇంకా ఎంసెట్ జరగ కున్నా యాజమాన్య కోటా సీట్లను అప్ప నంగా విక్రయించేస్తున్నాయి. ఏ కాలేజీలో కటాఫ్ ఎలా ఉంటుందో తెలియకున్నా భారీ మొత్తంలో డొనేషన్లు దండుకునేందుకు యాజమాన్య కోటా సీట్లను వేలం వేస్తు న్నాయి. కరోనా నేపథ్యంలో కళాశాలలన్నీ మూతపడినప్పటికీ అంతర్గతంగా బోధన, బోధనేతర సిబ్బందితో మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని బ్రాంచుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లన్నింటినీ నింపేశాయి. మరో పది రోజుల్లో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానుండగా... ఆలోపే సీట్లన్నీ భర్తీ చేసేలా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘కరోనా’ను క్యాష్ చేసుకుంటూ... రాష్ట్రంలో 183 ఇంజనీరింగ్ కాలేజీలుండగా ఈ ఏడాది వాటిలో కొన్నింటికి ఇంకా అనుమతులు రాలేదు. దీంతో ఆ కాలేజీలు మినహాయిస్తే మిగిలిన వాటిలో 70% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా మిగతా 30% సీట్లు ఆయా యాజమాన్యాలు నింపుకుంటున్నాయి. వాస్తవానికి ఈపాటికే ఎంసెట్ ముగిసి అడ్మిషన్ల కౌన్సెలింగ్ సైతం కొలిక్కి వచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో ఎంసెట్ ఇంకా జరగలేదు. దీంతో 2020–21 విద్యా సంవత్సరంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొంది. ఈ పరిస్థితిని అదనుగా చేసుకున్న కాలేజీ యాజమాన్యలు... మేనేజ్మెంట్ కోటా సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. సీటు కన్ఫర్మ్ చేసుకుంటే పాఠ్యాంశ బోధన ప్రారంభమవుతుందని, ఎంసెట్లో ర్యాంకు వచ్చినా, రాకున్నా ఇబ్బందులుండవనే కోణంలో ప్రచారం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆకర్షితులవుతున్నారు. దండిగా డొనేషన్లు... ఇంజనీరింగ్లో ప్రస్తుతం సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ కోర్సులకు డిమాండ్ ఉంది. సీఎస్ఈ కోటాలో ఉన్న మేనేజ్మెంట్ సీట్లు టాప్ కాలేజీల్లో దాదాపుగా భర్తీ అయ్యాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ కోర్సుల్లో అడ్మిషన్ కోసం వచ్చే విద్యార్థులపై యాజమాన్యలు డొనేషన్ల పేరిట భారీగా దండుకుంటున్నాయి. సగటున రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. టాప్ కాలేజీలుగా పేరున్న వాటిలో రూ. 10 లక్షలకు తక్కువగా డొనేషన్ లేదు. డొనేషన్తోపాటు రెగ్యులర్ ట్యూషన్ ఫీజును ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెల్లించాలి. ఈసారి కొత్తగా సీఎస్ఈలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ (డీఎస్), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కేటగిరీలకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ కోర్సులవైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిమాండ్కు తగినట్లు యాజమాన్యలు డొనేషన్లను వసూలు చేస్తున్నాయి. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచీలలో అడ్మిషన్కు రూ. 3 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులోనూ డిమాండ్కు తగినట్లు యాజమాన్యాలు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. ఎంసెట్లో ర్యాంకు వస్తే డబ్బు వాపస్ ఇస్తామని కూడా యాజమాన్యాలు చెబుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ కింద కొంత మేర చెల్లించి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్న వాళ్లు కూడా అధికంగా ఉన్నారు. ఆ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులే... టాప్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్లకు భారీగా డొనేషన్లు డిమాండ్ చేస్తుండగా ఆ తర్వాతి వరుసలో ఉన్న కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాంటి డొనేషన్లు వద్దంటూ ప్రచారం చేస్తున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందిని రంగంలోకి దింపి కేవలం ట్యూషన్ ఫీజు చెల్లిస్తే చాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఈ కాలేజీల్లోనూ సీఎస్ఈ, ఐటీ బ్రాంచీలలో సీట్ల భర్తీ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో సీటు వస్తే బుకింగ్కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెబుతుండటంతో విద్యార్థులు ముందస్తుగా బుకింగ్కు ఆసక్తి చూపుతున్నారు. ఎల్బీ నగర్కు చెందిన మనుశ్రీని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలని నిర్ణయించిన తండ్రి... ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రఖ్యాత కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. సీఎస్ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ బ్రాంచ్లో సీటు కోరగా రూ. 15 లక్షల డొనేషన్తోపాటు ట్యూషన్ ఫీజు భరించాల్సి వస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంసెట్ మాక్ టెస్ట్లో మనుశ్రీ స్కొర్ను అంచనా వేసుకున్నాక ఆ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటును కన్ఫర్మ్ చేసుకున్నాడు. అడ్వాన్స్గా కొన్ని రూ. లక్షలు చెల్లించి ఎంసెట్ ర్యాంకు, సీటును బట్టి మిగతా మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement