-
కాపు కార్పొరేషన్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూముల వేలం పాటకు తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు వెళ్లారని, ఈ వ్యవహారంలో వివరాలు తెలియక ఇరుక్కుపోయామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సత్రం భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయని, పైగా కోర్టు వివాదాలు ఉన్నాయన్నారు. వేలంపాటలో నిబంధనల మేరకే భూములు కొనుగోలు చేసినట్లు రామనుజయ తెలిపారు. అయితే ఎకరా రూ.6.5 కోట్లు విలువ చేస్తుందని, ఎండోమెంట్ అధికారి తేల్చిన విషయం తెలియదా అన్న మీడియా ప్రశ్నకు రామనుజయ సమాధానం దాటవేశారు. కాగా గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలోని లోపభూయిష్ట విధానాలను, దేవాదాయ శాఖలో సంబంధిత ఫైలు కదిలిన వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సదావర్తి సత్రం భూములు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితో పాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ భూముల వేలంపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
సదావర్తి భూములపై ఏపీ సర్కార్కి నోటీసులు
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో విచారణ జూలై 4కు వాయిదా పడింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి సత్రానికి తమిళనాడులో రూ.1080 కోట్ల విలువ చేసే 83.11 ఎకరాల భూమి ఉందని, దీనిని ఏపీ సర్కార్ రూ.22.44 కోట్లకే అమ్మేసిందని, దీని వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లందని, ఈ అమ్మకాలను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కుమార్ వాదనలు వినిపిస్తూ, దేవాదాయశాఖకు చెందిన భూములను తమ అనుమతి లేకుండా విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని 2005లో ఇదే హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఉత్తర్వుల్లో అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కారు చౌకగా అమ్మేసిందన్నారు. దీంతో ధర్మాసనం ఆయనకు పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం ప్రభుత్వానికి ముఖ్యంగా సదావర్తి సత్రం ఈవోకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కష్ణప్రకాశ్ స్పందిస్తూ, ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే జరిగిన సదావర్తి సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement