-
చేజింగ్.. చేజింగ్
విజయ్ దేవరకొండ ఎవర్నో చేజ్ (వెంబడించడం) చేస్తున్నారు. ఇంతMీ వాళ్లతో విజయ్కి పనేంటి? దాని వెనక ఉన్న కారణమేంటి? ఆ కథేంటి? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాలి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సింగరేణి ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కణల్ కణ్ణన్ ఆధ్వర్యంలో ఓ చేజింగ్ సీన్ని చిత్రీకరిస్తున్నారు. -
తెలుగువారికీ చూపించాలనిపించింది
‘‘తమిళ చిత్రం ‘కణ’ చూసి ఆశ్చర్యపోయా. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలనుకున్నాం. అందుకే ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’గా రీమేక్ చేసి, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమైంది. కానీ ఎక్కువమంది ఆడియన్స్కు రీచ్ కావాలని ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేష్ నటించిన క్రికెట్ బ్యాక్డ్రాప్ చిత్రం ఇది. తమిళంలో ఐదు పెద్ద సినిమాల మధ్య విడుదలై కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి ఒక మంచి కథకు భీమనేని శ్రీనివాసరావుగారైతే న్యాయం చేయగలరని దర్శకునిగా తీసుకున్నాం. ఆయన బాగా తీశారు. హనుమాన్ చౌదరి చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఈ నెల 18న ప్రీ–రిలీజ్ వేడుక జరుపబోతున్నాం’’ అన్నారు. ‘‘ఏ సినిమా చేసినా ఒకే కమిట్మెంట్తో చేస్తాను. పెద్దా, చిన్నా అనే తేడాలు ఆలోచించకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు భీమనేని. ‘‘నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కేయస్ రామారావుగారికి థ్యాంక్స్. భీమనేనిగారితో ‘సుడిగాడు’ సినిమాకు వర్క్ చేశాను. అలాగే ‘కేజీఎఫ్’ తర్వాత నేను డైలాగ్స్ రాసిన చిత్రం ఇది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత హనుమాన్ చౌదరి. -
కొత్త కథల్ని ఆదరిస్తున్నారు
‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైకుంఠపాళి’. ఎస్కెఎమ్యల్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్తో హారర్ సినిమా చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 5గా హరీష్ కుమార్ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్ ప్రియా వల్లభి, నీలమ్ నైనా తదితరులు పాల్గొన్నారు. ‘‘వైకుంఠపాళి’ చిత్ర నిర్మాత ఆదినారాయణకు సినిమాలంటే ప్యాషన్. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తోన్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు అన్నారు. సాయికేతన్, మేరి జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైకుంఠపాళి’. ఎస్కెఎమ్యల్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమా పాటలను కె.యస్. రామారావు విడుదల చేశారు. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘వైకుంఠపాళి’ అందరికీ బాగా తెలిసిన ఆట. అలాంటి గేమ్తో హారర్ సినిమా చేయడం మంచి ఆలోచన. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోన్న ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ‘‘ఓ కొత్త పాయింట్తో తీసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆదినారాయణగారిలాంటి నిర్మాతలు ఉంటే సినిమా విడుదల కోసం కష్టపడాల్సిన పనేలేదు’’ అన్నారు అజ్గర్ అలీ. ‘‘మంచి కథ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్ ఇస్తున్నారు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. త్వరలో సినిమాని విడుదల చేస్తున్నాం. మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 5గా హరీష్ కుమార్ ముక్కి దర్శకత్వంలో ‘మిస్టర్ లోన్లీ’ (‘వీడి చుట్టూ అమ్మాయిలే’ అన్నది ఉపశీర్షిక) షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నాం’’ అన్నారు కాండ్రేగుల ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, సంగీత దర్శకుడు ప్రమోద్, సాయి కేతన్, హీరోయిన్స్ ప్రియా వల్లభి, నీలమ్ నైనా తదితరులు పాల్గొన్నారు. -
అదే అంకిత భావంతో ఉన్నా
‘‘యాభై ఏళ్ల క్రితం నా మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అలాగే పని జరగనప్పుడు వచ్చే కోపం కూడా అలానే ఉంది. కానీ పని విషయంలో మాత్రం అంకిత భావం తగ్గలేదు. టెక్నికల్గా చాలా అడ్వాన్డ్స్ స్టేజ్కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. తమిళంలో రూపొందిన ‘కనా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ కమర్షియల్పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎస్. రామారావు చెప్పిన విశేషాలు. ► మా బ్యానర్లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో విడుదలైన ‘కనా’ సినిమాను చూశాను. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్ స్టోరీ. క్రికెట్ బేస్తో పాటు కంటెంట్ ఉన్న స్టోరీ. ఈ చిత్రం క్రికెట్ అభిమానులతోపాటు యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లు భీమనేని తెరకెక్కించారు. ► ఒక సాధారణ రైతుబిడ్డగా పుట్టి ఇండియా క్రికెట్ టీమ్లో ఆడాలని కష్టపడే ఓ యువతి పాత్రలో ఐశ్వర్య నటించింది. ప్యారలల్గా రైతుసమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి అమర్నాథ్ సీనియర్ హీరో. మన కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు తను. వీరిద్దరి వారసత్వ నటన ఐశ్వర్యకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్గారు అద్భుతమైన పాత్ర చేశారు. శివ కార్తికేయన్, ‘వెన్నెల’ కిశోర్, కార్తీక్రాజు క్యారెక్టర్స్కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. జూలై 2న ప్రీ–రిలీజ్ ఈవెంట్ను జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి విమెన్ టీమ్ ఇండియా కెప్టెన్గా చేసిన మిథాలీరాజ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. ► పెద్దసినిమాలు చేస్తున్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటానో ‘పుణ్యస్త్రీ, మాతృదేవోభవ, ముత్యమంత ముద్దు’ తీస్తున్నప్పుడూ అంతే సంతృప్తిగా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై ఇంకోవైపు నాకున్న ఇంట్రెస్ట్ను తెలియజేసే చిత్రాలు..‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటిదే. -
టీయస్సార్ మీద బయోపిక్ తీయాలి
2010 నుంచి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి టీవీ 9తో కలసి ‘టీయస్సార్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ పేరుతో అవార్డ్ ఫంక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017–2018 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను వచ్చే నెల 17న విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా టీయస్సార్ వ్యవహరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, కేయస్ రామారావు, నరేశ్, రఘురామ కృష్ణంరాజు, కామినేని శోభనా, జీవిత, నగ్మా, మీనా, జ్యూరీ సభ్యులు. అవార్డు వేడుక వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ – ‘‘సినిమా పవర్ఫుల్ మీడియమ్. కోట్లాది మందిని ఆనందింపజేస్తుంది. కళాకారులని జనం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలాగే మా అవార్డ్స్ ఫంక్షన్లో నిర్ణయం కూడా ప్రజలదే. వాళ్ల ఓటింగ్ని పరిగణించి జ్యూరీ సభ్యులు విజేతలను ప్రకటిస్తారు. కళాకారులు ఆనందం పొందితే నాకు కొత్త శక్తి వస్తుంది. విద్యాబాలన్కు శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ అందిస్తాం’’ అన్నారు. ‘‘బ్రతికున్నంత కాలం అవార్డులు గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు ఓసారి నాతో అన్నారు. కళాకారుల ఆకలి అలాంటిది. ఆ కళాకారుల ఆకలి తీరుస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. శివుణ్ణి నటరాజు అంటాం. ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపించిందే చేస్తున్నారు టీయస్సార్గారు. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీయస్సార్గారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన నిర్మించిన ‘గ్యాంగ్మాష్టార్’ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నగ్మా. ‘‘చలికి దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు ముఖ్యం’’ అన్నారు నరేశ్. ‘‘నాన్నగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. కళాకారులను అభినందించడానికి ఎంతో శ్రమపడతారు నాన్న. నాన్నగారి ఆటోబయోగ్రఫీ రాయిస్తున్నాం. ‘టీచింగ్స్ ఆఫ్ టీయస్సార్’ పేరుతో ఆ బుక్ ఈ ఏడాది తీసుకొస్తాం’’ అన్నారు పింకీ రెడ్డి. ‘‘గవర్నమెంట్లు నంది అవార్డ్స్ ఫంక్షనే వరుసగా చేయలేకపోతున్న తరుణంలో టీయస్సార్ వరుసగా ఈ అవార్డ్ పంక్షన్స్ చేయడం అభినందనీయం’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. ‘‘హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది. సంతోషంగా ఉంది. మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా నియమించినందుకు మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం’’ అన్నారు మీనా. ఈ కార్యక్రమంలో కామినేని శోభన పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement