-
కువైట్ చేరుకున్న ఎంపీ కవిత
కువైట్: తెలంగాణ ప్రవాసీయులను కలవడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం కువైట్కు చేరుకున్నారు. కువైట్లో ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు వినయ్ కుమార్, పూర్ణచంద్రరావు, ఇమ్రానుద్దీన్ ఇమ్మూ తదితరులు కువైట్ విమానాశ్రయానికి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. కువైట్ లోని వివిధ వర్గాల తెలంగాణ ప్రవాసీయులతో కవిత సమావేశం అయ్యేందుకు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లేబర్ క్యాంపులో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు కువైట్లోని భారతీయ రాయబారి సునిల్ జైన్తో సమావేశం అవుతారు. అనంతరం కేంబ్రిడ్జి పాఠశాలలో జరిగే సభలో పాల్గొంటారు. శుక్రవారం బహ్రెయిన్లో జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొంటారని హరిప్రసాద్ తెలిపారు. ఈసా టౌన్లోని భారతీయ పాఠశాల మైదానంలో ఆ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు ఈ రెండు దేశాల్లో పర్యటించటం ఇదే తొలిసారి. గతవారం కవిత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయి, అబుదబి నగరాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. -
ఎంపీ కవిత వ్యాఖ్యలపై ప్రైవేటు ఫిర్యాదు
హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత్ లో విలీనం చేశారని, కాశ్మీర్లోని కొన్ని భాగాలు ఇండియా భూభాగంలోవి కావని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. బీజేపీ లీగల్ సెల్ హైదరాబాద్ విభాగం కన్వీనర్ కరుణాసాగర్ ఫిర్యాదును పరిశీలించిన ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిజాముద్దీన్ విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. -
ప్రమాదం కానే కాదు.. నిర్లక్ష్యమే: కవిత
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటన నిర్లక్ష్యమే కారణమని నిజమాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నేత కే. కవిత ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మండీ ఘటన ప్రమాదం వల్ల జరిగింది కాదు.. నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుందని కవిత అన్నారు. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేక పోవడం, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడమే వల్లనే రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు మృత్యువాత పడ్డారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కవిత సంతాపం వ్యక్తం చేశారు. హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ అప్పటివరకు ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. -
బెర్త ఎవరికో..
కేసీఆర్ కేబినెట్లో చోటుకు ఎమ్మెల్యేల ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ తొలి మంత్రివర్గంలో జిల్లా నుంచి ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం కొలువుదీరే సమయం దగ్గరపడుతుండడంతో చర్చ జోరందుకుంది. మంత్రి వర్గంలో చోటు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా టీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు, కె.తారకరామారావు, కె.కవితతో ఎవరికివారుగా సిఫారసులు చేయించుకుంటున్నారు. జిల్లాల వారీగా, సామాజిక సమీకరణ పరంగా, సీనియారిటీ ఆధారంగా తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించుకుంటున్నారు. తమ అనుకూలతను చెప్పుకోవడంతోపాటు జిల్లాలోని ఇతరులకు ప్రతికూలమైన అంశాలను వివరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు నుంచి బిజీగా ఉన్న కేసీఆర్ను ఏదోరకంగా రెండు రోజులకు ఒకసారి కలిసి వస్తున్నారు. 12 అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లాలో టీఆర్ఎస్ ఏకంగా 8 స్థానాలను గెలుచుకుంది. గులాబీ దళానికి మొదటి నుంచి అనుకూలంగా ఉన్న జిల్లా కావడంతో మంత్రివర్గంలోనూ ఇదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు. జిల్లా నుంచి కనీసం ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్నారుు. సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రుల సంఖ్య మూడు వరకు ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. ములుగు నుంచి గెలిచిన ఆజ్మీరా చందూలాల్కు మంత్రి పదవి ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గిరిజన వర్గం నుంచి సీనియర్ నేతగా ఉండడం ఆయనకు అనుకూలంగా మారింది. చందూలాల్కు గతంలోనే మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. లోక్సభ సభ్యుడిగా కూడా పని చేశారు. తెలంగాణలో గిరిజన శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని... ఇందులో చందులాల్ పేరు ఉంటుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కూడా చందూలాల్కు కలిసివచ్చే అంశమని ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. 2009లో జిల్లాలో టీఆర్ఎస్ తరఫున ఆయన ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉప ఎన్నిక, తాజా ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత సాధారణ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. ఐదేళ్లుగా సాగిన ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మొదటి నుంచి విధేయుడిగా ఉండడం, ఇతర నేతలు కేటీఆర్, హరీశ్రావుతో మంచి సంబంధాలు ఉండడం వినయభాస్కర్కు అనుకూలంశాలుగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి కీలక సమయంలో టీఆర్ఎస్లో చేరిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. మారిన టీఆర్ఎస్ విధానం... దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఈ వర్గానికి పెద్దపీట వేయనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాజయ్యకు సైతం సామాజికవర్గం అనుకూలంగా ఉంది. కేసీఆర్పై విమర్శలు చేసే జిల్లాకు చెందిన ఒక ఉద్యమ నేతను ఎదుర్కొనేందుకు రాజయ్యకు అవకాశం ఇస్తారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేతపై భారీ మెజారిటీతో విజయం సాధించిన కొండా సురేఖకు మహిళా కోటాలో మంత్రివర్గంలో చోటుదక్కుతుందని ప్రచారం జరుగుతోంది. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రివర్గంలో సురేఖకు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేల్లో గతంలో మంత్రులుగా పని చేసిన వారు ఎవరూ లేకపోవడం, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనే విషయంలో మహిళా నేతగా ఉన్న గుర్తింపు సురేఖకు అనుకూలంశాలుగా ఉండనున్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ నేత కావడంతో కేసీఆర్తో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉండడంతో తనకు అవకాశం ఇవ్వాలని మధుసూదనాచారి కోరుతున్నారు. బీసీ సామాజికవర్గం కావడంతో మంత్రివర్గంలో సిరికొండకు స్థానం ఉంటుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్నాయక్ మొదటిసారి గెలిచారు. మొదటిసారి గెలిచిన వారికి అవకాశాలు ఉంటాయా లేదా అనేది సందేహంగా మారింది. జిల్లాలోని సీనియర్లలో ఏ వర్గం వారికి మంత్రులుగా అవకాశం ఉంటుందనేదాన్ని బట్టి వీరికి పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్, ఇతర ముఖ్య పదవుల విషయంలో వీరి పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ. వందకోట్ల నిధి
లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత నిజామాబాద్, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. వంద కోట్ల నిధులను కేటాయిస్తామని నిజామాబాద్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత పేర్కొన్నారు. నిజామామాబాద్లోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్లో బుధవారం ఆమె న్యాయవాదులతో మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు చేసిన త్యాగాలు, పోరాటాలు మరువలేనివన్నారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement