-
చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్.. ‘కళా’ కుటుంబంలో కుంపటి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబంలో చంద్రబాబు చిచ్చు రగిల్చారు. సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న రాజకీయ ఆటలో కళా వెంకటరావు పావుగా మారారు. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని వెంకటరావుకు చంద్రబాబు ఆఫర్ ఇస్తూనే, మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు చల్లారు. విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తే తుదకు కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం లోక్సభ ఆశ చూపించి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేశ్కు సన్నిహితుడిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్ఠానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది. ఇందుకు ఐవీఆర్ఎస్ సర్వే కారణం చూపిస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారంటూ లీకులు ఇచ్చింది. అక్కడ వెంకటరావు సోదరుడు, ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీపురుపల్లికి వెంకటరావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గిరాజుకుంది. తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల కిందటి వరకు నాగార్జున, మూడు రోజుల కిందటి వరకు గంటా శ్రీనివాసరావు, తాజాగా కళా వెంకటరావు.. ఇలా రోజుకో పేరును టీడీపీ అధిష్టానం తెరమీదకు తెస్తుండడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి కళా వెంకటరావు పేరు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు తాజాగా లీకులు ఇస్తున్నారు. ఫలించిన పురందేశ్వరి స్కెచ్ నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) ఇటీవలి వరకూ ఎచ్చెర్లలో గ్రామస్థాయి నాయకుడు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతో 2014–19 మధ్య కాస్త హవా చూపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని, పురందేశ్వరి పంచన చేరారు. ఆమె చలువతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవీ దక్కించుకున్నారు. ఇక్కడ బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వరరావుని జిల్లా అధ్యక్షుడిని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ నేరుగా ఎన్ఈఆర్కు ప్రకటించకుండా నెమ్మదిగా స్కెచ్ అమలుచేశారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలో చూపించారు. అక్కడ గుండ లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చేయడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న ఎచ్చెర్ల బీజేపీ కోటాలో వేసేశారు. తద్వారా ఎచ్చెర్ల టికెట్ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళావెంకటరావు ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇప్పుడు ఎన్ఈఆర్ను రంగంలోకి తెస్తున్నారు. బాబు పితలాటకంతో నాగార్జున బలి చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున బలవుతున్నారు. ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి టీడీపీలో చేరారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసేశారు. -
కళా వెంకటరావు మెడకు చీపురుపల్లి గంట
అటు తిరిగి ఇటు తిరిగి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ను పార్టీ సూచించినట్లు సమాచారం. ఎచ్చెర్లలో పార్టీ శ్రేణులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ‘కళా’ను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధినేత మొదట్లోనే సూచించారు. కానీ ‘కళా’ అంగీకరించలేదు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి పంపించి పోటీ చేయించాలని అనుకున్నారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో అక్కడ మంత్రి బొత్సపై పోటీకి సరైన అభ్యర్థి దొరకలేదు. దాంతో మళ్లీ కళా మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విస్తృత బంధువర్గం, పరిచయాలు ఉన్న సీనియర్ నేత అయిన కళా అయితేనే బొత్సకు కొంత పోటీ ఇవ్వగలరన్నది చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ఎచ్చెర్లలో పంచాయితీని కూడా పరిష్కారం సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలో స్వపక్షంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గం మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకుండా చీపురుపల్లి నియోజకవర్గంలో బరిలో దించితే ఎలా ఉంటుందనేదానిపై ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసినా ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకటరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే ప్రకారం కళాను బరిలో దించుతారా? లేదంటే అక్కడా సానుకూలత లేదని పక్కన పెట్టేస్తారా? అంత రిస్క్ చేయడమెందుకని ఓడిపోయే సీట్లలో ఎవరు పోటీ చేస్తే ఏముందని ఎచ్చెర్లకే వదిలేస్తారా? అన్నది ప్రస్తుతం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. గ్రూపుల గోల..! ఎచ్చెర్లలో టీడీపీ బలహీనంగా ఉంది. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమాత్రం బలపడలేదు. సరికదా గ్రూపులుగా తయారై టీడీపీ శ్రేణులు విడిపోయి మరింత పట్టుకోల్పోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి ఇక్కడ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఒకవైపు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మరోవైపు గ్రూపుగా తయారై రాజకీయాలు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. ఎన్నాళ్లు కళా వెంకటరావు పల్లకిమోస్తామని, ఈ సారి కలిశెట్టికి టికెట్ ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా టీడీపీలో ఓ గ్రూపు పట్టుబడుతూ వస్తోంది. చెప్పాలంటే కళా వెంకటరావుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. చౌదరి బాబ్జీ తదితర నాయకులు సైతం కళా వెంకటరావుతో తాము వేగలేమని.. అణగదొక్కే రాజకీయాలు ఇంకెంత కాలమని స్వరం విన్పిస్తున్నారు. అనుకున్నట్టుగా చివరికొచ్చేసరికి కళాతో పోటీగా కలిశెట్టి రేసులో నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రకరకాల సర్వేలు.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేస్తే సమస్యే లేదని ఒకవైపు ఆలోచిస్తుండగానే మరోవైపు కళా, కలిశెట్టిలో ఎవరి బెస్ట్ అన్నదానిపై ఐవీఆర్ఎస్తో పాటు రకరకాల సర్వేలను చంద్రబాబు చేయించారు. కొన్నింటిలో కలిశెట్టికి సానుకూలత రాగా, మరికొన్నింటిలో కళాకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి గుదిబండగా తయారైంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే నాయకత్వం అక్కడ లేకపోవడంతో చంద్రబాబు రకారకాల ఆలోచనలు చేస్తున్నారు. తరుచూ నియోజకవర్గాలు మార్చి ఎన్నికల్లో గట్టెక్కుతున్న గంటా శ్రీనివాసరావును అక్కడ బరిలో దించాలని చూసింది. పార్టీకి సమస్యగా మారిన గంటాను ఈ రకంగానైనా వదిలించుకోవాలని చంద్రబాబు అండ్కో చూస్తోంది. దానిలో భాగంగా ఓడి పోయిన సీట్లలో గంటాను పోటీ చేయిస్తే పీడ విరగడయిపోతుందని భావించారు. కానీ, గంటా దాని కి ససేమిరా అంటున్నారు. బొత్సతో పోటీ చేయలేనని చెప్పేస్తున్నారు. ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదన్న ఆలోచనకొచ్చి తన మనసులో మాటను అధిష్టానానికి చేప్పేశారు. కాకపోతే, పైరవీలు, లాబీయింగ్ చేసే గంటా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గంటా పోటీ చేసే సీటుపై ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. ఎచ్చెర్లలో ఎలాగూ కష్టం.. చీపురుపల్లిలో కనీసం పోటీ అయినా ఇచ్చి బొత్సతో ఢీకొనాలని చూస్తోంది. అందులో భాగంగానే చీపురుపల్లికి కళా వెంకటరావును పంపిస్తారని ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది. బీజేపీకి ఎచ్చెర్ల ఇచ్చేస్తే.. సీనియర్కు కనీసం చీపురుపల్లిలోనైనా సీటు ఇచ్చి గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ సమీకరణాలు చివరి వరకు నడుస్తాయా? లేదంటే ఆఖరి నిమిషంలో మారుతాయో తెలియదు గానీ ప్రస్తుతం చీపురుపల్లికి కళాను పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. -
కిమిడి కళావెంకటరావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో టిక్కెట్ కోసం సిగపట్లు తారస్థాయికి చేరాయి. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నవారు ఆనందంలో ఉంటే... ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు, కటౌట్లకు భారీగా చేతిచమురు వదిలించుకున్నవారు మాత్రం నైరాశ్యంలో కూరుకుపోయారు. తమకు న్యాయం చేయకపోతే తడాఖా చూపిస్తామని ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు కుటుంబానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. చివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఇన్నాళ్లూ పనిచేసిన కిమిడి నాగార్జున పేరు తొలి జాబితాలో వెల్లడిగాకపోవడం గమనార్హం. పారాచ్యూట్ నాయకుడు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లికి వెళ్లమని అధిష్టానం ఒత్తిడి చేస్తోందని తెలుసుకున్న నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కె.ఎ.నాయుడికి ఎదురుదెబ్బ... గజపతినగరం నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ను కొండపల్లి శ్రీనివాస్కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు (కె.ఎ. నాయుడు), ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో వారంతా శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇప్పటివరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కోసం కష్టపడ్డానని, మూడు పార్టీలు మారివచ్చిన కొండపల్లి కొండలరావుకు, ఆయన కుమారుడు శ్రీనివాస్కు అధిష్టానం పెద్దపీట వేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతో పాటు 500 మంది తన అనుచర గణం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం గజపతినగరంలో నిరసనకు పిలుపునిచ్చారు. గజపతినగరం టికెట్ను ఆశించిన మరో టీడీపీ నాయకుడు కరణం శివరామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చేసిన ద్రోహానికి కంటతండి పెట్టారు. ‘కళ’ తప్పింది.. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు విజయనగరం జిల్లా రాజకీయాలపై గతంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత తన సొంత ప్రాంతమైన రాజాం విజయనగరం జిల్లాలో విలీనమైన దృష్ట్యా ఇక చక్రం తిప్పాలని విశ్వప్రయత్నాలు చేశారు. తీరా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి చెల్లని కాసు అయిపోయారు. ఎచ్చెర్ల టికెట్ను మరోసారి ఆశిస్తున్న ఆయన పేరు తొలి జాబితాలో ప్రకటించకపోవడం గమనార్హం. ఆయన సోదరుడి కుమారుడు, టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడైన కిమిడి నాగార్జున కూడా మరోసారి చీపురుపల్లి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. తొలి జాబితాలో ఆయన పేరు కూడా వెల్లడించలేదు. కిమిడి కళావెంకటరావు కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా రాజాం టికెట్ను కోండ్రు మురళీమోహన్కు చంద్రబాబు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కోండ్రుకు బదులుగా స్వర్ణరాణికి టికెట్ ఇవ్వాలంటూ కిమిడి కుటుంబం, మాజీ ఎంపీపీ కొల్లా అప్పలనాయుడు చేసిన ప్రతిపాదన కూడా గాలికి కొట్టుకుపోయింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, మహానాడులో తొడకొట్టి సవాలు చేసిన ఆమె కుమార్తె గ్రీష్మ పేర్లను చంద్రబాబు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరి తీరు ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకం. నివురుగప్పిన నిప్పులా అసమ్మతి... బొబ్బిలి టికెట్ దక్కించుకున్న ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) మినహా తొలి జాబితాలో పేరు వెల్లడైన అందరికీ తమ నియోజకవర్గాల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అస్త్ర సన్యాసం చేసి తన కుమార్తె అదితికి విజయనగరం టికెట్ ఇప్పించుకోగలిగారు. ఈ నియోజకవర్గంలో అశోక్ అణచివేసిన బీసీ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాత్రం కిమ్మనలేదు. ఆమె అనుచరులు మాత్రం రగిలిపోతున్నారు. పార్వతీపురం టికెట్ను ఎన్నారై బోనెల విజయచంద్రకే చంద్రబాబు కేటాయించారు. దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు మొండిచేయి చూపించారు. విజయచంద్రను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట కూడా చెల్లలేదు. సాలూ రులో భంజ్దేవ్ వర్గం ఎంత వ్యతిరేకించినా టికెట్ మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికే దక్కింది. కురుపాంలో ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకించినా తోయక జగదేశ్వరికే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వ్యతిరేక వర్గాలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థులను డిపాజిట్లుకూడా రాకుండా ఓడిస్తే తప్ప చంద్రబాబుకు బుద్ధిరాందంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. బీసీలకు చంద్రబాబు మోసం... కేవలం ఓట్ల కోసమే బీసీల జపం చేసే చంద్రబాబు అసలు నైజం బయటపడింది. బీసీల జిల్లాగా పేరొందిన విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీ–జనసేన కూటమి తరఫున తొలిజాబితాలో టికెట్లు దక్కించుకున్నవారిలో బీసీ అభ్యర్థి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజాం మినహాయిస్తే మిగిలిన నాలుగు జనరల్ సీట్లలో బీసీలకు ఒక్క సీటు మాత్రమే దక్కింది. విజయనగరం, బొబ్బిలి టికెట్లను రాజులకే (క్షత్రియ సామాజిక వర్గానికి) కేటాయించింది. ఏకులా వచ్చి మేకు అయ్యింది... నెల్లిమర్ల ఎమ్మెల్యే నేనే అవుతానంటూ ఇన్నాళ్లూ ఉబలాటపడిన కర్రోతు బంగార్రాజు నెత్తిన పిడుగుపడింది. జనసేన కోటాలో టికెట్ దక్కించుకున్న లోకం మాధవిని తొలుత తక్కువగా అంచనా వేశారు. ఆమె పవన్ కల్యాణ్ మద్దతుతో బరిలోకి దిగేసరికి బంగార్రాజు సహా నెల్లిమర్ల టీడీపీ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. శనివారం సాయంత్రం విజయనగరంలోని ఒక హోటల్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బంగార్రాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, నెల్లిమర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కడగల ఆనంద్కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మునాయుడు తదితరులంతా హాజరయ్యారు. మూడ్రోజుల్లో లోకం మాధవిని మార్చకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయాలని, తాడేపల్లి వెళ్లి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాలెస్ వద్ద నిరసన తెలిపివద్దామని నిర్ణయించారు. లోకం మాధవి వర్గం మాత్రం సంతోషంలో ఉంది. అయితే, మాధవి ఎలా గెలుస్తుందో చూస్తామని టీడీపీ వర్గాలు బహిరంగంగానే సవాల్ చేస్తుండడం గమనార్హం. -
టీడీపీ కుట్రలివే.. అబద్ధాలతో ‘రాజకీయ’ అంతస్తులు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న వివాదం జరిగినా దానికి వైఎస్సార్సీపీతో లంకె పెట్టేయడం.. తద్వారా రాజకీయ మైలేజ్ కోసం కక్కుర్తి పడటం టీడీపీకి పరిపాటిగా మారింది. వ్యక్తిగతమా, కుటుంబ గొడవా, వర్గ పోరాటమా.. అన్నది చూడకుండా.. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా.. ఏదైనా సంఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, లోకేష్ నుంచి కిందిస్థాయి నేతల వరకు ఏమాత్రం ఇంగితం లేకుండా అధికార పార్టీపై నిందలు మోపేస్తారు. చదవండి: పవన్ విషప్రచారానికి దిమ్మతిరిగే కౌంటర్ చాలా సంఘటనల్లో అసలు వాస్తవాలు బయటకొచ్చి తమ పార్టీ పరువే పోతున్నా.. వారి తీరు మారడంలేదు. హరిపురంలో ఏళ్లనాటి కుటుంబ గొడవ నేపథ్యంలో ఇద్దరు మహిళలపై దాడి ఘటనలో కూడా టీడీపీ ఇలాగే అభాసుపాలైంది. ఈ కేసులో నిందితులు తమ పార్టీకి సన్నిహితులేనన్న విషయం విస్మరించి విషం చిమ్మడానికి తెగబడింది. అసలు విషయం బయటపడటంతో టీడీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. టీడీపీ మళ్లీ అబద్ధాలను, అవాస్తవ ప్రచారాలనే నమ్ముకుంటోంది. ఎక్కడో ఏదో జరిగిన దానికి వైఎస్సార్సీపీ నాయకులను, ప్రభుత్వాన్ని ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మందస మండలం హరిపురంలో నెలకొన్న ఘటనలోనూ ఇదే జరిగింది. మందస మండలం హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర పోసే వరకూ వెళ్లింది. కొట్ర రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటినుంచో వివాదం ఉంది. గత తొమ్మిదేళ్లుగా వీరి మధ్య స్థల వివాదం నడుస్తోంది. 2017 నుంచి బాధితులైన తల్లీ కూతుళ్లు పోరాటం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, ఆయన అల్లుడు వద్దకు పంచాయతీ వెళ్లింది. కానీ వివాదాన్ని పరిష్కరించలేదు. అందులోనూ కొట్ర రామారావుకు శివాజీ, కళా వెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల వివాదం పరిష్కారానికి చొరవ చూపలేదన్న ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వంలోనే బాధిత మహిళలు 2017, 2019లో నిరహార దీక్షలు కూడా చేశారు. చివరికి వివాదం కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆ మహిళలపై కొట్ర రామారావు అండ్కో బాధిత మహిళలపై కంకర పోసి సజీవ సమాధి చేసేందుకు యత్నించారని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు చెప్పుకొస్తున్నారు. ఈ ఫొటోలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుతో ఉన్న వ్యక్తే హరిపురంలో బాధిత మహిళలపై కంకర పోసిన ఘటన కేసులో ఏ1గా ఉన్నారు. ఈయన పేరు కొట్ర రామారావు, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనడానికి ఈ ఫొటోనే నిలువెత్తు సాక్ష్యం. మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, గౌతు శిరీష దగ్గరి నుంచి టీడీపీ కీలక నేతల వరకు సత్సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన బాధిత మహిళలపై కంకర పోసి, సజీవ సమాధి చేసేందుకు టీడీపీ కీలక నేతలు అండగా నిలిచారని చెప్పడం సమంజసం కాదు. రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం చినికి చినికి గాలివానగా మారి మహిళలపై కంకరపోసే వరకు వెళ్లిందే తప్ప కింజరాపు రామ్మోహన్నాయుడో, కళా వెంకటరావో, గౌతు శ్యామ సుందర్ శివాజీయో చేయించరాని అనడం తప్పు. ఆరోపణలు, విమర్శలు చేయడం కూడా సరికాదు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్కు కనీసం ఇంగితం లేకుండా సోమవారం ట్వీట్లపై ట్వీట్లు పెట్టారు. ఇక్కడ జరిగిన ఘటనను ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లింకు పెట్టి దుష్పచారం చేశారు. వైఎస్సార్సీపీకి ఆపాదించి, పోలీసు వ్యవస్థను కూడా వదలకుండా అబద్ధపు ప్రచారం చేశారు. పోలీసులు చర్యలు తీసుకోలేదనే స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లారు. వాస్తవంగా ఈ ఘటనపై సోమవారమే కేసు నమోదు చేసి, అభియోగాలున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇదేమీ చూడకుండా తమ రాజకీయ లబ్ధి కోసం హరిపురం ఘటనను వైఎస్సార్సీపీతో ముడిపెట్టి కుట్రపూరితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించారు. చివరికి ఆ ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా అబద్ధమని తేలిపోవడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. గతంలో టీడీపీ కుట్రలివే.. టెక్కలిలో ఎప్పుడో బుద్ధుడి విగ్రహం మణికట్టు విరిగిపోతే.. దాన్ని రాజకీయం చేసి మత విద్వేషాలు రెచ్చగొడతామని యతి్నంచి తెలుగు తమ్ముళ్లు దొరికిపోయారు. దీంట్లో తెరవెనక అచ్చెన్నాయుడు కీలక పాత్ర వహించారు. సంతబొమ్మాళి మండలం పాలేశ్వరపురం ఆలయంలోని పాత నంది విగ్రహాన్ని టీడీపీ నేతలు పట్టపగలే తరలించి, నడిరోడ్డుపై ఉన్న సిమెంట్ దిమ్మపై ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిష్టించి అపచారానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇదంతా చేసిందని, హిందు మతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని దు్రష్పచారం చేసేందుకు కుట్ర పన్నారు. కానీ సీసీ కెమెరాల పుటేజీలో టీడీపీ నేతల బాగోతం బయటపడింది. అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు కేసు పెడితే.. విగ్రహం మార్చినంత మాత్రాన కేసులు పెడతారని బుకాయింపునకు దిగారు. పరీక్షల సీజన్లో సరుబుజ్జిలి మండలం రొట్టవలస, కొత్తకోట జెడ్పీహెచ్ స్కూళ్లలో పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం టీడీపీ నాయకులు లీక్ చేసి, దానిని ప్రభుత్వంపై మోపి దుష్ప్రచారానికి యత్నించి దొరికిపోయారు. చివరికీ వారంతా అరెస్టు అయ్యారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, ప్రసారాల శాఖ ప్రెస్నోట్ జారీ చేసినట్టుగా ఒక ఫేక్ ప్రెస్నోట్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అనుచరుడైన సంతబొమ్మాళి మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన అప్పిని వెంకటేష్ సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లి దుష్ప్రచారానికి దిగారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలతో విష ప్రచారం చేస్తున్నట్టుగా వెంకటేష్ను గుర్తించి సీఐడీ అధికారులు విచారణ కూడా చేశారు. హరిపురం ఘటనలో ఇద్దరి అరెస్ట్ మందస: మండలంలోని హరిపురంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు మందస ఇన్చార్జి ఎస్ఐ మధు తెలిపారు. హరిపురంలో భూ వివాదానికి సంబంధించి కొట్ర దాలయ్మ, మజ్జి సావిత్రిలపై ట్రాక్టర్తో కంకర వేసి హత్యాయత్నం చేశారన్న సంఘటన సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు హరిపురానికి చెందిన కొట్ర రామారావు, పిడిమందస గ్రామానికి చెందిన కంచిలి ప్రకాశరావులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. -
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. భవిష్యత్లో తనకు ప్రతిబంధకంగా త యారవుతున్న నాయకులను సాగనంపే పనిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. తనకు పోటీగా తయారవుతున్న నాయకులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ టీడీపీ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయగా, నేడు టీడీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడును సస్పెండ్ చేస్తున్న ట్టు కళా వెంకటరావు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి కళా వెంకటరావుకు నియోజకవర్గంలో అసమ్మతి పోరు ఎక్కువైంది. ముఖ్యంగా కళా కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును నియోజకవర్గంపై వదలడం, రాష్ట్ర స్థాయి పదవి అప్పగించడంతో కళాపై కినుకు ఎక్కువైంది. అసలే వలస నేత, ఆపై ఆయన కుటుంబ సభ్యులు తమపై పెత్తనం చేయడమేంటని ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో కళా అలెర్ట్ అయ్యారు. వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు, పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులపై దృష్టి సారించారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం సీనియర్ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావును ఏకపక్షంగా సస్పెండ్ చేయగా, నేడు నియోజకవర్గంలో కీలకమైన కలిశెట్టి అప్పలనాయుడుపైనా అదే వేటు పడింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కళాకు ఆ అధికారం ఎక్కడిదని, ఏ ఆదేశాలైనా పార్టీ నుంచి రావాలని ఆయన్ని వ్యతిరేకిస్తున్న నాయకులంతా ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో దోస్తీ.. ఒక వైపు కళా వెంకటరావు సోదరుడు కుటుంబీకులంతా ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నారు. సోము వీర్రాజు తదితర నేతలతో మంతనాలు జరిపారు. మే నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా ఎప్పటికప్పుడు కళా వ్యతిరేక వర్గీయులు బయటపెడుతున్నారు. ఏ రోజుకైనా కళా వెంకటరావు బీజేపీలో చేరడం ఖాయమని కూడా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు వ్యతిరేకంగా నడుస్తున్న నాయకులపై వరుసగా సస్పెన్షన్ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ఉండాలంటే అసమ్మతి నేతలందరినీ బయటికి పంపించాలనే షరతుతో అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తమపై వేటు వేస్తున్నారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలకు పాల్పడి, పార్టీని అప్రతిష్ట పాలుజేసి, ఇప్పుడు కష్టపడ్డ సీనియర్లను పార్టీ నుంచి దూరం చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరికీ పదవీ గండం? ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement