-
అయోధ్యలో కళ్యాణ్ జువెల్లర్స్ స్టోర్
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయంలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ 250వ షోరూమ్ను ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మార్చిలోగా ప్రారంభించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 2023–24 నాల్గవ త్రైమాసికంలో కొత్తగా భారత్లో 15 కళ్యాణ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో 2 కళ్యాణ్, 13 క్యాండీర్ స్టోర్లను తెరువనుంది. 2023 డిసెంబర్ 31 నాటికి సంస్థ ఖాతాలో మొత్తం 235 కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్–డిసెంబర్లో ప్రారంభించిన కంపెనీ యాజమాన్యంలోని కేంద్రాలను ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ (ఫోకో) విధానంలోకి మార్చనున్నట్టు కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. 2024–25లో కొత్తగా 80 ఔట్లెట్లు రానున్నాయి. ఇందుకు కావాల్సిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఎక్కువ దుకాణాలు ఫ్రాంచైజీ విధానంలో తెరుచుకోనున్నాయి. -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
న్యూఢిల్లీ: దక్షిణాదియేతర మార్కెట్లలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ వెల్లడించింది. దీపావళిలోగా కొత్తగా 20 షోరూమ్లను ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. అలాగే తమ తొలి ఎఫ్వోసీవో (ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్) షోరూమ్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మధ్యప్రాచ్యంలో ప్రారంభించనున్నట్లు సంస్థ వివరించింది. అలాగే వచ్చే ఆరు నెలల్లో తమ ఆన్లైన్ జ్యుయలరీ ప్లాట్ఫాం క్యాండియర్కి సంబంధించి 20 ఫిజికల్ షోరూమ్లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశ విదేశాల్లో కంపెనీ మొత్తం షోరూమ్ల సంఖ్య 194కి చేరింది. -
కళ్యాణ్ జువెల్లర్స్లో హైడెల్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్లో వార్బర్గ్ పింకస్కు చెందిన హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 2.26 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో రూ.256.6 కోట్లకు విక్రయించింది. ఎన్ఎస్ఈలో బల్క్ డీల్ సమాచారం ప్రకారం ఒక్కొక్కటి రూ.110.04 చొప్పున 2,33,25,686 షేర్లను హైడెల్ విక్రయించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? డిసెంబర్ త్రైమాసికంలో కళ్యాణ్ జువెల్లర్స్లో హైడెల్కు 26.36 శాతం వాటా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు ధర మంగళవారం 9.06 శాతం పడిపోయి రూ.107.90 వద్ద స్థిరపడింది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్కైనా చెల్లింపులు -
కల్యాణ్ జువెల్లర్స్ చైర్మన్గా మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్
న్యూఢిల్లీ: మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ తమ సంస్థ చైర్మన్, స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులైనట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా వెల్లడించింది. నియంత్రణ సంస్థ, షేర్హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొంది. టీఎస్ కల్యాణరామన్ ఇకపైనా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారని వివరించింది. పారదర్శకమైన వ్యాపార విధానాలు, కార్పొరేట్ గవర్నెన్స్తో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కల్యాణ్ జువెల్లర్స్తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వినోద్ రాయ్ తెలిపారు. వివిధ అంశాల్లో రాయ్ అపార అనుభవం తమ సంస్థ పురోగతికి తోడ్పడగలదని కల్యాణరామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఎక్స్టర్నల్ ఆడిటర్ల కమిటీకి చైర్మన్గా కూడా రాయ్ గతంలో వ్యవహరించారు. అలాగే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటైన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చైర్మన్గా కూడా వ్యవహరించారు. దేశానికి అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. (చదవండి: అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల హోరు) -
కాగ్ వినోద్రాయ్.. ఇప్పుడు కళ్యాణ్ జ్యూయల్లర్స్లో
కాగ్ (కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) మాజీ అధికారి వినోద్రాయ్కి కీలక బాధ్యలు అప్పగించింది కళ్యాణ్ జ్యూయల్లర్స్ యాజమాన్యం. కంపెనీ బోర్డులో చైర్మన్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కాగ్ ఆడిటర్ జనరల్ పని చేయడంతో పాటు యూనెటైడ్ నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్కి, బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో తదితర సంస్థలకు కూడా గతంలో చైర్మన్గా వినోద్రాయ్ వ్యవహరించారు. కేంద్ర, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో వినోద్ రాయ్ కీలకంగా వ్యవహరించారు. కాగా మార్కెట్లో దూకుడుగా వెళ్తున్న కళ్యాణ్ జ్యూయల్లర్స్.. తాజాగా వినోద్రాయ్ వంటి సమర్థుడికి అనుభవజ్ఞుడికి బోర్డులో చోటు కల్పించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement