-
సాహితీవనంలో తులసిమొక్క ‘అద్దేపల్లి’
సంస్మరణసభలో ప్రముఖుల నివాళి ‘అల్లూరి’ వీరగాథ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ : ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహితీవనంలో తులసి మొక్కవంటి వారని ప్రముఖ సాహితీవేత్త గిడ్డి సుబ్బారావు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో అద్దేపల్లి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అద్దేపల్లి సంస్మరణ సభ గిడ్డి అధ్యక్షతన అదివారం జరిగింది. అద్దేపల్లి రచించిన వచనకవితా విప్లవ వీరకథాకావ్యం ‘అల్లూరి సీతారామరాజు’ను గిడ్డి ఆవిష్కరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గిడ్డి మాట్లాడుతూ అద్దేపల్లి నడిచే గ్రంథాలయం వంటి వారన్నారు.‘అల్లూరి సీతారామరాజు’ కావ్యంపై సాహిత విమర్శకులు మేడి రవికుమార్ సమీక్ష చేశౠరు. తెల్లదొరల పాలనపై పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు గాథ మనందరికి ఆదర్శంగా నిలిచే విధంగా అద్దేపల్లి రచించారన్నారు. అద్దేపల్లి కవిత్వమే శ్వాసగా జీవించారని మరో రచయిత డాక్టర్ శిరీష అన్నారు. దేశ విదేశాల్లో పేరుగాంచిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి సంధించిన విమర్మనాస్త్రం సంచలనం సృష్టించిందని కవి, విమర్శకులు కె.వి.రమణారెడ్డి అన్నారు. కవనలోకంలో వెలుగులు విరజిమ్మే ధృవతార అద్దేపల్లి మనల్ని వదిలి వెళ్ళి వసంతం గడిచినా, ఆయన రచనల గుబాళింపు తగ్గలేదని విమర్మకులు వాసా భూపాల్ అన్నారు. అద్దేపల్లి సాహిత్య వ్యవసాయంలో ఎందరో కవులు పుట్టుకొచ్చారని రచయిత పి.సీతారామరాజు అన్నారు. మహాకవి అద్దేపల్లి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనని కవి సయ్యద్ సాలర్ అన్నారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపై ఆయన వందలాది వ్యాసాలను రచించి ప్రజలను ఉత్తేజపరిచారని కవి పద్మవాణి అన్నారు. అనేక మంది యువకవుల్ని తయారు చేసిన ఘనత అద్దేపల్లి సొంతమని రచయిత అద్దేపల్లి రాధాకృష్ణ అన్నారు. సమకాలీన పరిస్థితులపై అప్పటికప్పుడు రచనలు చేయడం ఆయన శైలి అని వక్తిత్వ వికాస సమాజం కో ఆర్డినేటర్ అద్దేపల్లి ఉదయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితివేత్తలు, కవులు దేవదానంరాజు, భగవాన్, పి.వెంకటప్పయ్య, వీరలక్షీ్మదేవి తదితరులు పాల్గొన్నారు. -
రేపు కాకినాడలో ఆర్ఆర్బీ మోడల్ పరీక్ష
బాలాజీచెరువు(కాకినాడ) : రాజీవ్గాంధీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకోపైలట్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కుసుమశాంతి ఆదివారం తెలిపారు. ప్రతిభ ఎడ్యుకేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ ఉత్తీర్ణులతో పాటు ఆ విభాగాల బీటెక్ అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల వారు సోమవారం సాయంత్రంలోగా రాజీవ్గాంధీ కళాశాలలో పేర్లు నమోదు చేయించుకోవాలని, ఇతర వివరాలకు 85229 86347లో సంప్రదించాలని సూచించారు. -
కాకినాడలో మూడు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు
ఈ రైల్వే బడ్జెట్లోనూ జిల్లాకు ప్రాధాన్యం ఎంపీ తోట నరసింహం కరప: కాకినాడలో మూడు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు ఎంపీ తోట నరసింహం తెలిపారు. సోమవారం సాయంత్రం కరపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలను కాకినాడలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ » బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఈ ఏడాది సాధారణ, రైల్వే బడ్జెట్లు కలిపి పెట్టనున్నట్టు తెలిపారు. రైల్వే బడ్జెట్లో గత ఏడాది పిఠాపురం మెయి¯ŒSలైన్, కాకినాడ–నరసాపురం లై¯ŒSకు కేటాయించిన రూ.200 కోట్లతో పనులకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రైల్వేమంత్రి సురేష్ప్రభును ఆంధ్రా మంత్రులు, ఎంపీలు కల్సి ఈ ఏడాదికూడా రైల్వేబడ్జెట్లో నిధుల కేటాయింపుపై చర్చించామన్నారు. గత ఏడాది కేటాయించిన దానికి తగ్గకుండా నిధులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, దానికి ప్రజలు కూడా సహకరించారని చెప్పారు. తాను దత్తత తీసుకున్న బూరుగుపూడి రోల్మోడల్గా తయారైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టంలోని అన్నిప్రాంతాలవారినీ అక్కడకు పంపి, అలాచేసుకోవాలని సూచిస్తున్నారని చెప్పారు. కరప మండలంలోని దత్తత గ్రామమైన గొర్రిపూడిని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తానన్నారు. ఉపాధి అనుసంధానంతో ఇప్పటికే రూ.70 లక్షలు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, మండల టీడీపీ అధ్యక్షుడు దేవు మధువీరేష్, జిల్లా క్రికెట్ అసోషియేష¯ŒS ఉపాధ్యక్షుడు దేవు మధువీరేస్ తదితరులు ఎంపీ వెంట ఉన్నారు. -
సంబరాలు ఆరంభం
బీచ్ ఫెస్టివల్ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప పర్యాటకులకు కనువిందు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తీరంలో నాలుగు రోజులు కొనసాగనున్న సందడి ఉవ్వెత్తున ఎగసే జలధి తరంగాలు మనసులో వెల్లువెత్తే ఉత్సాహానికి ఉపమానాలు. ఆ అలల సాక్షిగా.. కాకినాడ కడలి తీర సందర్శకుల మదిలో అటువంటి ఉత్సాహమే ఉరకలెత్తింది. గురువారం ప్రారంభమైన సాగర సంబరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో, వివిధ రకాల పశు ప్రదర్శనలు, స్టాల్స్.. ఇటు విజ్ఞానాన్ని, అటు ఆనందాన్ని పంచాయి. సంక్రాంతి సందడి ఈ సంబరాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నిశి ముసిరిన వేళ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను అలరించాయి. కాకినాడ బీచ్లో గురువారం సాగర సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ«ధ్యాత్మికత విలసిల్లే ఆలయ నమూనాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే థింసా.. కొమ్ము నృత్యాలు, చేనేతల అందాలు, రంగురంగుల పూల సోయగాలు, నోరూరించే వంటకాలు, కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టే శిల్పాలు, చిత్రాలు, జాతీయ సమైక్యతను చాటి చెప్పే సాంస్కృతిక ప్రదర్శనలు సాగరతీరంలో కొలువుదీరి పర్యాటకులకు కనువిందు చేశాయి. బెంగళూరు ఫ్లవర్ షో, వ్యవసాయశాఖ, పురావస్తుశాఖ, ఇండియ¯ŒS కోస్ట్గార్డ్, ఏపీ టూరిజం, ఉద్యానవనం, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మత్య్సశాఖ ఆధ్వర్యంలో రొయ్యల పుట్టుక, పెరిగే విధానం, వాటిని ఎగుమతి చేసే పద్ధతులు వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్లో వివిధ రకాల మత్స్యసంపదను ప్రదర్శించారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే విధానాలు, నేత, దారాలకు రంగులు అద్దె తీరు, వస్రా్తలు తయారు చేసే పద్ధతిని వివరించే విధంగా స్టాల్స్ పెట్టారు. పశుసంవర్ధక శాఖకు చెందిన స్టాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో డాగ్ షోను, పుంగనూరు ఆవు, దూడ, ఒంగోలు ఆవు, ముర్రాగేదె, గిరి ఆవులను ప్రదర్శనలో ఉంచారు. – కాకినాడ రూరల్ నోరూరించిన వంటకాలు గోదావరి వంటకాలు, పెరుమాళ్లపురం బెల్లంగారెలు, మారేడుమిల్లికి చెందిన బ్యాంబూ చికెన్, గోదావరి మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన 36 రకాల సముద్ర ఉత్పత్తుల వంటకాలు, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామం జీడిపప్పు, పచ్చళ్ల వ్యాపారం, ఆత్రేయపురం నేతి పూతరేకులు, మాడుగుల అల్వా, రాయలసీమ బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి, పెద్దాపురం పాలకోవా ఇలా 100కి పైగా వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్తో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన తినుబండారాలు నోరూరించాయి. ఇలా సాగరతీరంలో 400 రకాల స్టాల్స్ పర్యాటకులకు కనువిందు చేశాయి. అలరించిన శిల్పాలు, చిత్రాలు ఒడిశాకు చెందిన కళాకారులు బీచ్లో వేసిన నగదు రహిత విధానాన్ని తెలిపేలా, జిల్లా నమూనాలో ఉన్న సముద్ర ఉత్పత్తులు, వివిధ పంట ఉత్పత్తులతోను, మత్స్యకన్య, బుద్ధుడు, తిరుమల, తిరుపతి దేవస్థానం, శ్రీకృష్ణుడు వంటి సైకత శిల్పాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. దీన్ని ప్రకాశంజిల్లా అద్దంకికి చెందిన కళాకారులు ఏర్పాటు చేశారు. విరుల విందు బెంగళూరు, చెన్నైలతో పాటు జిల్లాలోని కడియం, కడియపులంక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 350 వరకు వివిధ జాతుల పూల మొక్కలు, బోన్సాయ్, వివిధ రకాల కొటా¯Œ్స మొక్కలు, వివిధ పండ్లతో తయారు చేసిన దేవుళ్ల ఆకారాలను ప్రదర్శించారు. నమూనా ఆలయాలకు పోటెత్తిన భక్తులు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి నమూనా దేవస్థానాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా సముద్రతీరంలో తాటాకులతో ప్రత్యేక ఇళ్లను జిల్లా విద్యాశాఖ నిర్మించింది. సంక్రాంతి పండగ గ్రామాల్లో ఏ విధంగా ఉండేదో వివరిస్తూ గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గంగిరెద్దులు, హరిదాసు, గరగల నృత్యం, కోలాటం, కాళికానృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే «థింసా, కొమ్ము నృత్యం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. జిల్లా సంస్కృతి చాటేలా బీచ్ఫెస్టివల్ కాకినాడ రూరల్ : జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నాలుగురోజులపాటు ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం రాత్రి కాకినాడ సాగరతీరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. తూర్పుగోదావరి ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతీసంప్రదాయాలకు పర్యాటక పరమైన ప్రాచుర్యం కల్పించేందుకు ఏటా క్రమం తప్పకుండా కాకినాడ బీచ్ ఫెస్టివల్, కోనసీమ, మన్యం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ నుంచి అంతర్వేది, రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, మారేడుమిల్లి సర్క్యూట్లను రూ.350 కోట్లతో అభివృద్ధి చేసి జిల్లాను టూరిజం హబ్గా రూపుదిద్దుతున్నట్టు చినరాజప్ప వివరించారు. వచ్చే ఏడాది బీచ్ ఫెస్టివల్ను జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.23 కోట్లతో మొదట దశ పనులు పూర్తి చేశామన్నారు. బీచ్ ఫెస్టివల్ తరహాలో ఫిబ్రవరిలో కోనసీమ ఉత్సవాలు, మార్చిలో మన్యం ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రూ.100 కోట్లు బీచ్ అభివృద్ధికి కేటాయించారన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్కుమార్, జేసీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యులు కాకరపల్లి సత్యవతి, ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణమూర్తి, స్థానిక సర్పంచ్ యజ్జల బాబ్జీ తదితరులు ఈ సాగర సంబరాలను పర్యవేక్షించారు. -
కవిత్వమే ఊపిరిగా బతికిన ప్రజాకవి
నేడు ‘అద్దేపల్లి’ ప్రథమ వర్ధంతి ∙ 22న ‘అల్లూరి వీరగాథ’ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ (కాకినాడ సిటీ): కవిత్వమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు. తన సుదీర్ఘ సాహిత్య ప్రస్థానంలో అభ్యుదయ భావాలకు పట్టం కట్టిన ఆయన గత ఏడాది జనవరి 13న తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన చేతినుంచి జాలువారిన ‘అల్లూరి సీతారామరాజు వీరగాథ’ కావ్యం(వచన కవిత)ను ఈనెల 22న స్థానిక రోటరీ క్లబ్లో జరగనున్న అద్దేపల్లి ప్రథమ వర్ధంతి సభలో ఆవిష్కరించనున్నారు. ‘నిరంతర సాహితీ సంచారి’గా పేరొందిన అద్దేపల్లి 1936లో సెప్టెంబరు 6న మచిలీపట్నంలో అద్దేపల్లి సుందరరావు, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివి, మచిలీ పట్నం, నందిగామలలో అధ్యాపకునిగా పనిచేసారు. తదుపరి 1972లో కాకినాడలోని మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా చేరిన ఆయనకు ఈ నగరమే శాశ్వత నివాసం అయింది. కవిగా, విమర్శకునిగా, వక్తగా, కవిత్వ కార్యకర్తగా రాష్ట్రం అంతా పర్యటించి వందలాది యువకవుల్ని తయారు చేశారు. ‘మధుజ్వాల, అంతరŠాజ్వల, రక్తసంధ్య, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, గోదావరి నా ప్రతిబింబం’ మొదలైన ఎన్నో కవితా సంకలనాలు వెలువరించారు. నిరంతరం ముఖంలో చెదరని చిరునవ్వు, వినూత్నమైన హెయిర్ స్టైల్, ఇ¯ŒSషర్ట్లతో కనిపించే ఆయన సాహితీ లోకానికి సుపరిచితుడు. సాహిత్య లోకానికి ఆయన ఒక సంచార గ్రంథాలయం. మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి రాసిన విమర్మనాగ్రంథం సంచలనం సృష్టించింది. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపైనా విమర్శకునిగా వందలాది వ్యాసాలను రచించారు. కవిత్వంలో ప్రతిష్టాత్మకమైన చిన్నప్పరెడ్డి పురస్కారం, నాగభైరవ అవార్డు లాంటి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. దాదాపు వెయ్యిమంది నూతన కవుల సంకలనాలకు ముందుమాటలు రాసి ప్రోత్సహించారు. నిరంతరం రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో జరిగే సాహిత్య సభలలో సైతం పాల్గొని కవిత్వాన్ని ప్రచారం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement