-
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు
‘‘కరోనా సమయంలో ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్ నొక్కి, దాని గురించి విష్ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నారాయణ్ దాస్గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడయ్యాడు. ‘లవ్ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది.. ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య వెరీ కూల్ బాయ్. యంగ్స్టర్స్ అంతా ఎగసి పడుతుంటారు.. కానీ ఎప్పుడూ కంపోజ్డ్గా ఉంటాడు చైతన్య. కూల్ ఫాదర్కి (నాగా ర్జున) కూల్ సన్ నాగచైతన్య. తను నిలకడగా వెళుతుంటాడు.. అది ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు ఆమిర్ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్ తేజ్ ‘ఫిదా’చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక వరుణ్ వచ్చి, ‘డాడీ.. డ్యాన్స్ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా.. నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను. నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు.. అయితే తను కుదరదు అంది.. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్తో నేను డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా?.. పిలవలేను. నా పక్కన రొమాంటిక్ హీరోయిన్గా చేయగలిగితే ఓకే. శేఖర్ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్’’ అన్నారు. హీరో ఆమిర్ఖాన్ మాట్లాడుతూ – ‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, బాగుందని చైతూకు(నాగచైతన్య) మెసేజ్ చేశా. నా ‘లాల్సింగ్ చద్దా’ చిత్రంలో తను నటించారు. నా సినిమా సెట్స్లో చైతన్యను ఫస్ట్టైమ్ చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఫీలింగ్ కలిగింది. చైతూ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సంస్కారవంతుడు. ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని థియేటర్స్లోనే చూస్తాను. ముంబయ్లో థియేటర్స్లో స్క్రీనింగ్కు ఇబ్బందులు ఉంటే అధికారుల అనుమతితో ప్రత్యేక స్క్రీనింగ్లో అయినా చూస్తాను’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ–‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు. ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టా ర్లలో పుంజుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్ ఖాన్గార్లకు థ్యాంక్స్. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మా ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్ దాస్ నారంగ్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మీరు(చిరంజీవి) నాకు ఆన్స్క్రీన్ మెగాస్టార్. ఆఫ్ స్క్రీన్ మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా కష్టకాలంలో మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేసిన తీరు స్ఫూర్తిదాయకం. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, అభినందించి ఈ వేడుకకు వస్తానని ఆమిర్ఖాన్గారు వచ్చారు. ‘లాల్సింగ్ చద్దా’ సినిమా కోసం 45 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆమిర్గారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి. ‘లవ్ స్టోరీ’ లో ఇంతలా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కారణం శేఖర్ కమ్ములగారే. సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. యాభైఏళ్ల క్రితం తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ‘ప్రేమ్నగర్’ సినిమా విడుదలైన తేదీనే ‘లవ్స్టోరీ’ వస్తోంది.. అన్నీ రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శరత్ మరార్, భరత్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, కెమెరామెన్ విజయ్ సి.కుమార్, సంగీత దర్శకుడు పవన్ సి.హెచ్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, పాటల రచయితలు భాస్కర భట్ల, సురేంద్ర, ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా, నటి ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ మహా అయితే 20శాతం. ఈమాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందనుకుంటారు. కానీ, కష్టాలు పడేవారు, సాధక బాధకాలు అనుభవించే వారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కరోనా సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రత్యక్షంగా చూశాం. ఏ విపత్తు వచ్చినా సాయానికి ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది.. సినిమా నిర్మాణం ఖర్చు పెరిగిపోయింది.. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ – చిరంజీవి -
‘బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే ఫ్రంట్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది బీజేపీ అనుకూల ఎజెండా, రహస్య ఎజెండా అని తాము ముందు నుంచీ చెబుతున్నామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్..మళ్లీ మోదీ వద్దకు వెళ్లడాన్ని బట్టి ఈ ఎజెండాను అర్థం చేసుకోవచ్చన్నారు. కాళేశ్వరంప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానిని కలిశానని కేసీఆర్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని అన్నారు. ఐదేళ్లలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సాధించలేదని మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతోపాటు బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేసీఆర్ తీరు గతంలోనే బయటపడిందని పేర్కొన్నారు. -
ధర్నాలు నిషేధించడం నియంతృత్వం
సీపీఐ నేత నారాయణ సాక్షి, న్యూఢిల్లీ: ధర్నాల ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఇందిరా పార్కు వద్ద ధర్నాలను నిషేధించడం ద్వారా తన నియంతృతత్వాన్ని ప్రదర్శించుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండి పడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లా డుతూ.. ఉద్యమాలు చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని, దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే వారిని అణచాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ సాయిబాబా జీవితఖైదును పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులివ్వండి:శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో మౌలికసదుపాయాలకై రూ.500 కోట్లు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్జవదేర్ను ఏఐఎస్ఎఫ్ నేతలు కోరారు. ఎంపీ డి.రాజా ఆధ్వర్యంలో నాయకులు స్టాలిన్, వలీఉల్లా ఖాద్రీ ఆసిఫ్ తదితరులు కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. -
న్యాయ వ్యవస్థకే అవమానకరం
జస్టిస్ రూపన్వాల్ ప్రకటనపై నారాయణ సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల దళితు డు కాదని జస్టిస్ రూపన్వాల్ ప్రకటించడం న్యాయ వ్యవస్థకే అవమానకరమని సీపీఐ నేత కె.నారాయణ మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులపై విచారణ చేయమని కేంద్రం ఆదేశిస్తే.. అతను దళితుడు కాదని కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషనర్ విచారణాంశాలలో రోహిత్ ఏ కులం వాడో విచారించమని పేర్కొనలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీలోని వ్యవస్థీకృత హింస వల్లనే రోహిత్ ప్రాణం కోల్పోయాడన్నారు. రోహిత్ దళితుడేనని గతంలో గుంటూరు కలెక్టర్ నివేదిక ఇచ్చారని, ఎమ్మార్వో కుల ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేశారని, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ దళితుడేనని తెలిపిందన్నారు. మరి ఇప్పుడు రూపన్వాల్ చెప్పింది నిజమైతే గుంటూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రూపన్వాలా నివేదికను చెత్తబుట్టలో వేయాలని నారాయణ డిమాండ్ చేశారు. -
వారిద్దరూ మోదీ చేతిలో బకరాలు
వెంకయ్య,బాబులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ చేతిలో బకరాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో క లసి నారాయణ విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య, చంద్రబాబు హోదా వల్ల ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి జరిగిందో లేదో చూద్దామా? అని నారాయణ సవాల్ విసిరారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement