-
జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ
సాక్షి, కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. దీంతో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన-టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. కాగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. గత మంగళవారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగారు.. తాజాగా జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు -
ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట..
ఏపీ రాజకీయాలకు తూర్పును మార్పుగా చెబుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అధికంగా సీట్లు వస్తాయో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేవారు. గత ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్ పనిచేసింది. తూర్పు జిల్లాలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైంది. వైఎస్ జగన్ దండయాత్రతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయింది. చదవండి: దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..! ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ స్ధానానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పచ్చ పార్టీకి అభ్యర్ధులే దొరకడంలేదట. గత ఎన్నికల్లో టీడీపీ తరపున చలమల శెట్టి సునీల్ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీలో పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్ధి కరువయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా టీడీపీ నుండి పోటీ బరిలోకి దిగుతారని గతంలో ప్రచారం జరిగింది. కాని తనకు అసెంబ్లీ స్ధానం చాలని.. పార్లమెంటు స్ధానం వద్దని రాజప్ప నిర్ణయం తీసుకున్నారట. పైసలుంటేనే బాబు టికెట్లిస్తారట.! రాజప్ప వద్దనడంతో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ను దింపుతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం నవీన్ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ ఏరియా అధ్యక్షుడుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ఉంచారట. ఐతే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలంటే కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తన వద్ద డబ్బు లేక పోయినా... ప్రజా బలం ఉందని నవీన్ చెప్పారట. కాని వచ్చే ఎన్నికల్లో ప్రజాబలం కాకుండా ధన బలంతోనే పనవుతుందని చెప్పిన చంద్రబాబు.. నవీన్ ప్రతిపాదనను పక్కన పెట్టారని చర్చ నడుస్తోంది. ఆ తరువాత ప్రత్తిపాడు టిడిపి నేత వరుపుల రాజా అనుకున్నప్పటికీ.. ఆయన కూడా ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకే పరిమితమవుతానని చెప్పారట. ఒక నేతను చంద్రబాబు వద్దంటే..మరొకరు తానే వద్దనడంతో ఇంకో అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది. ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్.? ప్రజాబలం ఎలాగూ లేదు.. డబ్బుంటే చాలని చంద్రబాబు చెప్పడంతో ఇద్దరు సీనియర్ నేతలకు సాన సతీష్ బాబు పేరు మదిలో మెదిలింది. కొంత కాలం క్రిందట మనీలాండరింగ్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన సతీష్ బాబు ఐతే వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసేందుకు వెనుకాడడని ఆ సీనియర్లు భావించారు. దీంతో సాన సతీష్ బాబు పేరును చంద్రబాబు చెవిలో వేశారట. ఆ పేరు విని ఉలిక్కి పడ్డ చంద్రబాబు.. అతని పేరును అలానే హోల్డ్ లో ఉంచండి.. ఎన్నికలు సమీపించినప్పుడు చూద్దామని తనకు ఆ పేరు చెప్పిన సీనియర్ నేతలతో చెప్పారట. సతీష్ పేరును హోల్డ్లో ఉంచమని చంద్రబాబు ఎందుకో చెప్పారో అని సీనియర్ నేతలు ఆలోచిస్తే.. అసలు కథేంటో వారికి తర్వాత అర్ధమైందట. మాకొక అభ్యర్థి కావలెను.? వచ్చే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే కాకినాడ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలని... ఒక వేళ బీజేపీ, జనసేన పార్టీలు రెండింటితోను పొత్తు పెట్టుకుంటే కాకినాడ పార్లమెంటు సీటును బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశారట. కాని ఇటీవల విశాఖ వేదికగా జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు టీడీపీని ఒంటరి చేశాయనే సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు సీటు కోసం అభ్యర్ధిని వెతికే పనిలో పడ్డారు జిల్లా నేతలు. సతీష్ను బరిలో దింపితే వర్కవుట్ కాదని పార్టీలో మరి కొందరి వాదన. అయితే డబ్బు బాగా ఖర్చుచేసే అభ్యర్థి కావాలని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు కాకినాడ పార్లమెంటు స్ధానానికి టీడీపీకి అభ్యర్ధి దొరికడం కష్టంగా మారిందని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
జ్యోతుల వెలుగుకు తోట చెక్
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కొన్నాళ్లుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఎంపీ తోట నరసిం హం తెరపైకి వచ్చారు. తన కేడర్ను ఇబ్బందులు పెడుతూ అష్టకష్టాలకు గురి చేస్తున్న జంప్ జిలా నీ, ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను లక్ష్యంగా చేసుకొని రాజకీయ చదరంగానికి పావులు కదుపుతున్నారు. అనారోగ్యంతో ఎంపీగా పోటీ చేయలేనంటూనే గతంలో రెండుసార్లు గెలిచిన జగ్గంపేట అసెంబ్లీ స్థానాన్ని తన సతీమణికి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ‘తోట’ అనుచరులకు అడుగడుగునా చెక్ జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే, ఎన్నికై గత ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలతో కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. లోక్సభ లో టీడీపీ నేతగా కొనసాగారు. అయితే, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ ఫిరా యించిన జ్యోతుల నెహ్రూ రాకతో నియోజకవర్గంలో ఎంపీ తోట జోరుకు అధిష్టానం అడ్డుకట్ట వేసింది. జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడమే తరువాయి తోట కేడర్ను టార్గెట్ చేసి, వారికి ఏ విధమైన పనులు దక్కకుండా చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అవమాన పరిచిన ఘటనలున్నాయి. చెప్పాలంటే తోట నరసింహం కేడర్ను నిర్వీర్యం చేసేందుకు జ్యోతుల నెహ్రూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తోటకు అనుచరులే లేకుండా చేసేందుకు పన్నాగం పన్నారు. రాజకీయంగా వేధించడమే కాకుండా నరసింహం అరోగ్యంపై పుకార్లు పుట్టించి గందరగోళం సృష్టించడంలో జ్యోతుల వర్గం హస్తం ఉందన్న అనుమానం ఉంది. దీంతో ఒకానొక సందర్భంలో తన కేడర్కు ‘నేనున్నాంటూ’ భరోసా ఇవ్వడమే కాకుండా తన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఎంపీ నరసింహానికి ఏర్పడింది. పాత పరిచయాలతో పితలాటకం... తనకున్న కేడర్ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాగైనా జగ్గంపేట నుంచి బరిలోకి దిగాలని ఎంపీ తోట ఫ్యామిలీ నిర్ణయించుకున్నారు. అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేనందున తన సతీమణి వాణిని పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. మంగళవారం తన కుటుంబమంతా అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. తన సతీమణి వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ భేటీ అనంతరం బయటికొచ్చిన ఎంపీ నరసింహం ‘ఇక తేల్చాల్సింది చంద్రబాబే’ అని చెప్పుకొచ్చారు. జంప్ జిలానీకి షాక్ ... గెలిపించిన పార్టీని మోసం చేసి స్వప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన జ్యోతుల నెహ్రూకు షాక్ తగిలినట్టయింది. జగ్గంపేట టిక్కెట్ను తోట తన సతీమణికి కోరడంతో టీడీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడినట్టయింది. గడిచిన ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన ఎంపీ తోట వెనుక ఉండాలా? ఇప్పటికే తనదే సీటు అని నియోజకవర్గంలో పర్యటిస్తున్న జ్యోతుల నెహ్రూ వెనుక తిరిగాలా...?అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. -
ఎమ్మెల్యే జోతుల నెహ్రూకు చేదు అనుభవం
-
అన్నింటా విఫలమైనందుకే అవిశ్వాసం
♦ వైఎస్సార్సీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూ స్పష్టీకరణ ♦ విపక్షనేతపై టీడీపీ ఎమ్మెల్యేల దూషణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యమైన విధానాలతో అన్నింటా విఫలమైనందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వైఎస్సార్సీపీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. టీడీపీ సర్కారుపై సోమవారం ఆయన అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభించి, చర్చకు అంగీకరించినందుకు ధన్యవాదాలంటూ ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. వాస్తవాలను చర్చించి తమ తీర్మానానికి మద్దతు పలకాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై చర్చను విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించేందుకు స్పీకర్ అనుమతితో పైకిలేచారు. అయితే అవిశ్వాస తీర్మానం నోటీసు, తీర్మానానికి మద్దతు ఇచ్చిన వారి సంతకాల్లో పేరు లేనివారు చర్చను ప్రారంభించడానికి వీలుకాదంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు రూల్ 49ని తెరపైకి తేవడం ద్వారా విపక్ష నేతను అడ్డుకున్నారు. అయితే వేరేవారు చర్చను ప్రారంభిం చిన తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రసంగించడానికి తమకు అభ్యం తరం లేదన్నారు. దీంతో జ్యోతుల నెహ్రూ ఈ తీర్మానంపై చర్చను ఆరంభించి తదుపరి అవకాశాన్ని తమ నేత వైఎస్ జగన్కు ఇవ్వాలని కోరారు. వెంటనే మంత్రి యనమల లేచి విపక్ష సభ్యుడు ఒకరు మాట్లాడగానే అధికార పక్ష సభ్యులకు ఇద్దరికి అవకాశమివ్వాలని, తర్వాతే మళ్లీ విపక్షానికి అవకాశం ఇవ్వాలంటూ మరో రూల్ను కోట్ చేశారు. తదుపరి టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణ్కుమార్, బోండా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. వారిద్దరూ తమ ప్రసంగాల్లో ప్రభుత్వం చేసిన పనులు చెప్పడం కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విపక్షనేత, రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. రాజధానిలో టీడీపీ నేతల భూ దందా గురించి వార్తలు రాసిన ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement