-
రూ. 2వేల నోట్ల రద్దు.. వాటికి బీభత్సమైన డిమాండ్, ఒక్కరోజులోనే!
దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏది జరిగినా ఇతర రంగాలపై ప్రభావం పడుతుందేమో గానీ బంగారం అమ్మకాలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపదన్న సంగతి తెలిసిందే. ఇటీవల రూ.2000 నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన తర్వాత మరోసారి ఈ విషయం నిరూపితమైంది. తమ దగ్గర ఉన్న నోట్లను చెల్లుబాటు కోసం ప్రజలు బంగారం దుకాణాలకు క్యూలు కడుతున్నారట. అంతేకాకుండా కొందరు ఫోన్ చేసి ఎంత వరకు కొనుగోలు చేయచ్చు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. బంగారానికి భారీ డిమాండ్ ప్రస్తుత రెండు వేల నోట్లు సెప్టంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలపై ఆ ప్రభావం తీవ్రంగా చూపింది. అయితే ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు రద్దు విషయంలో అంత ప్రభావం చూపకపోవచ్చు అనే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం మార్కెట్ ఈ నోట్ల చలమాణి శాతం తక్కువగా ఉండడమే. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా జనం ఈ నోట్లను ఖర్చుపెట్టడమో లేదా బ్యాంకుల్లో మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బ్యాంకులకు సెలవు దినాలు, కేవైసీ తదితరల కారణాల వల్ల మరో దారిపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నగల షాపులకు వెళ్లి రెండు వేల రూపాయల నోట్ల చలామణికి ప్రయత్నిస్తున్నారట. దీంతో పాటు ఎంతమేరకు నగదుతో కొనుగోలు చేయొచ్చు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలలో ఇతర సాధారణ వారాంతాల్లో కంటే శనివారం ఒక్కరోజే 50% ఎక్కువ ఫుట్ఫాల్ను చూసినట్లు సమాచారం. గతంలో 500 రూపాయల నోట్లు రద్దు చేసిన సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ప్రజలు అదే దారిని ఎంచుకున్నారని అంటున్నారు బంగారం షాపు యజమానులు. అయితే పెద్ద మొత్తంలో 2వేల రూపాయల నోట్లు ఉన్నవారు మాత్రం వాటిని బంగారంగా మార్చడానికే ఇష్టపడుతున్నారట. చదవండి: సిద్ధరామయ్య హయాంలో రూ.2,42,000 కోట్ల అప్పులు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్ -
డిస్కౌంట్లు ఇస్తున్నా... కొనేవారు కరువు!
బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనలో కస్టమర్లు ♦ కేంద్రం వచ్చే బడ్జెట్లో పుత్తడి దిగుమతి సుంకం తగ్గిస్తుందని ఆశలు ♦ ఔన్స్కు 25 డాలర్లమేర డిస్కౌంట్నిస్తున్న జ్యువెలరీ రిటైలర్లు ♦ అయినా పసిడి కొనుగోళ్లు నిల్! ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కారణంగా పుత్తడి ధర పెరుగుతున్నా, వినియోగదారులు మాత్రం బంగారం, ఆభరణాల కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. దేశంలో పలు ప్రాంతాల్లో కస్టమర్లని ఆకర్షించేందుకు జ్యువెలరీ షాపులు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా బంగారానికి వినియోగ డిమాండ్ పెరగడం లేదు. వినియోగదారులు మాత్రం బంగారం కొనుగోలు విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. కేంద్రం రానున్న బడ్జెట్లో బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుందనే వార్తల నేపథ్యంలో.. జ్యువెలర్స్ పసిడి ధరలను తగ్గిస్తున్నప్పటికీ కూడా కస్టమర్లు ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారని ట్రేడర్లు వాపోతున్నారు. కొనుగోళ్లు లేవు.. బంగారానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కొనుగోళ్లు జరగడంలేదని ఎంఎన్సీ బులియన్ డెరైక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు. ఈయన చెన్నైలో బంగారాన్ని హోల్సెల్ ధరకు విక్రయిస్తారు. పసిడి విక్రయాల పెరుగుదలకు, కస్టమర్లను ఆకర్షించడానికి డీలర్లు అధిక మొత్తం డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన కరువైందని తెలిపారు. లండన్ బంగారం ధరలపై ప్రీమియంను చార్జ్ చేసే భారతీయ బంగారం విక్రయదారులు కూడా ప్రస్తుతం ఔన్స్కు(31.1గ్రాములు) 25 డాలర్లమేర డిస్కౌంట్ను అందిస్తున్నాయి. అంటే 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు. మంగళవారం రోజు ఏ చిన్న పుత్తడి ఆభరణాన్ని కూడా విక్రయించలేదని జవేరి బజార్లోని ఒక జ్యువెలర్ తెలిపారు. ఆఖరికి బంగారపు 9 ధరల పరిస్థితి ఎలా ఉందని కస్టమర్లు ఎలాంటి విచారణ కూడా చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది బంగారం ధరలు 13 శాతం పెరిగాయని, ఇది పసిడి డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపించిందని కొందరు రిటైల్ కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. డిమాండ్ పెరగొచ్చు! పెళ్లిళ్ల సీజన్ వల్ల బంగారం డిమాండ్ వ్యూహాత్మకంగా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా చాలా మంది కస్టమర్లు వచ్చే కాలంలో ధరలు మరింత తగ్గొచ్చనే అంచనాల వల్ల పసిడి కొనుగోలుకు దూరంగా ఉండే పరిస్థితులు లేకపోలేదు. కాగా గత రెండు రోజులుగా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా ఔన్స్కు 1,200 డాలర్లకు పైగా పెరిగాయి. ఈ చర్య పుత్తడి డిమాండ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. బంగారం దిగుమతి సుంకం తగ్గేనా? కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరిలో (ఫిబ్రవరి 29) 2016-17 సంవత్సరానికి గానూ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వం ఈ బడ్జెట్లో పుత్తడిపై దిగుమతి సుంకాన్ని 10 శాతంమేర తగ్గిస్తుందని జ్యువెలరీ పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే సరఫరా పెరిగి బంగారం ధరలు తగ్గే అవకాశముంది. గతేడాది బడ్జెట్ ముందు కూడా పసిడి ధరలు తగ్గాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement