-
చంద్రబాబు యాత్ర అట్టర్ ఫ్లాప్
-
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు
-
‘ప్రతిపక్షంలో కూడా అదే పనిచేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక విఫల నాయకుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబును భస్మాసురుడి పెద్దన్నగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎం గా ఉన్న గత ఐదేళ్లు.. రాష్ట్రం మొత్తం తగలబడిపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. (‘ఆయనకు అందుకే మతి భ్రమించింది’) చైతన్యయాత్రలు వెలవెల.. చంద్రబాబు చేస్తున్న చైతన్య యాత్రలు జనాలు లేక వెలవెల బోతున్నాయని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి.. ఎన్నికల వాయిదా వేయించేందుకు ఆయన సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీకి అభ్యర్థులు లేక స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. లిటికేషన్లు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వేయిస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్నారు.. ‘ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏపీ ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. సిట్ ఏర్పాటుతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. ఆయన అధికారంలో ఉంటే రాష్ట్రం కరువు కటాకలతో ఉండేది. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని’ కోటంరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అణగదొక్కారని, ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు అదే పని చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. -
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం
సాక్షి, వరంగల్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలనే అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళుతామని చెప్పారు. తెలంగాణలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీచేస్తామని వెల్లడించారు. వరంగల్లో జనచైతన్యయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి టీవీ’తో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కోసం చేపట్టిన జన చైతన్యయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. సొంత సర్వేలతో బలంగా ఉన్నామని కేసీఆర్ భావిస్తే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్ళాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, కుటుంబపాలనకు తావు లేదని, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు. -
‘కామారెడ్డి నుంచే మార్పు.. ’
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ పాలనలో ప్రజస్వా మ్యం అపహాస్యమైందని, నాలుగేళ్ల పాలన నలుగురి పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మాయమాటలతో మోసపోయిన ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో దగాకోరు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. మార్పు కామారెడ్డి నుంచే మొదలైందని తెలిపారు. బీజేపీ జన చైతన్య యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డికి వచ్చిన లక్ష్మణ్కు మహిళలు బో నాలతో మహిళలు స్వా గతం పలికారు. బైక్ ర్యాలీతో యువకులు ముం దుకు సాగారు. అనంతరం సీఎస్ఐ గ్రౌండ్స్లో ని ర్వహించిన బహిరంగ సభలో డాక్టర్ లక్ష్మ ణ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం పాలైందని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని, ఇళ్ల కోసం నిరుపేదలు తపిస్తున్నారని, భూమి కోసం దళితులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ ఏ ఒక్కరికి టీఆర్ఎస్ హయాంలో న్యాయం జరుగలేదన్నారు. కనీసం మంత్రి మండలిలో మహిళలకు అవకాశం లేకుం డా పోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బోనమెత్తిన మహిళలు ఇప్పుడు కేసిఆర్ను గద్దెదింపడానికి బోనమెత్తారని తెలిపారు. దగా పడ్డ దళితులకు ధైర్యం నింపడానికి, మోసపోయిన మహిళలకు ఆత్మవిశ్వాసం నింపడానికి, అభాసుపాలైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, అసువులు బాసిన అమరుల ఆశయాలను సాధించడానికి, తెలంగా ణ నుదుటి తలరాతను మార్చడానికి జన చైతన్య యాత్ర చేపట్టినట్లు వివరించారు. మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకోసమేనని విమర్శించారు. బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం ఎంత మందికి కట్టించాడో వెల్లడించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్రంలో సామాజిక న్యాయమే లేదని విమర్శించారు. గల్ఫ్ బాధితులకు టీఆర్ఎస్ పాలనలో తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. సీఎం కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ బాధితులు అనేక కష్టాలు పడుతున్నారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గల్ఫ్ బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపై పుర్రెగుర్తు తీసుకొచ్చి బీడీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాడన్నారు. 2019 లో బీజేపీ అధికారంలోకి రాగానే బీడీ కార్మికులను ఆదుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల విషయంలో సీఎం బెది రింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి వాటితో మాయచేశాడని ఆరోపించా రు. యూపీఏ హాయాంలో సీపీఎస్ విధానం వస్తే సీఎం కేసీఆర్ దానిని అమలు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమ బదిలీలతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, సీపీఎస్ విధానానికి స్వస్తి చెబుతామన్నారు. రుణమాఫీని గుదిబండగా మార్చి రైతులపై వడ్డీల భారం పడుతుందన్నారు. రైతుబంధులో కౌలు రైతులను మినాహాయించి వారికి అన్యా యం చేయడమే కాకుండా వారిని అవహేళన చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అ«ధికారంలోకి రాగానే కౌలు రైతులను, పోడు రైతులను గౌరవిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులందరికి ఉచితంగా బోర్లు తవ్విస్తామన్నారు. రాష్ట్రంలో మజ్లిస్తో కుమ్మక్కై నిజాం పాలన సాగిస్తున్న కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ల్యాండ్, స్యాండ్, వైన్ మాఫియా పేట్రేగిపోయాయని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు, రేషన్ డీలర్లు, వారి కుటుంబాలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాయన్నారు. రామమందిర నిర్మాణం అనేది దేశ ప్రజల మనోభిప్రాయమని, దీనిని టీఆర్ఎస్ మతపరమైన ఆంశంగా పేర్కొనడం సరికాదన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి కుటుంబ పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. సభ అనంతరం బీజేపీ నేతలు కామారెడ్డిలో రాత్రి బస చేశారు. ఆదివారం మద్నూర్లో నిర్వహించే జన చైతన్యయాత్రలో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, మనోç ßæర్, ఆచారి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, కేపీ వెంకట్రమణారెడ్డి, మురళీధర్గౌడ్, మోతే కృషా గౌడ్, మర్రి రాంరెడ్డి, నీలం చిన్నరాజులు, చింతల రమేశ్, పోతంగల్ కిషన్రావు, జూలూరి సుధాకర్, తేలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువును రిజర్వాయర్గా మారుస్తాం బీబీపేట: బీజేపీ అధికారంలోకి వస్తే బీబీపేట పెద్ద చెరువును రిజర్వాయర్గా మారుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బీజేపీ రథయాత్రలో భాగంగా సిద్దిపేట నుంచి శనివారం మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బీబీపేట మండలం ప్రసిద్ది గాంచినటువంటి తమలపాకు తోటల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. మండలానికి ప్రభు త్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement