-
భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ!
విజయవాడ: ఉదయం పూజా సమయంలో భక్తుడిలా దేవాలయంలోకి ప్రవేశించి.. రాత్రికి ఇనుపరాడ్డుతో తలుపులు తెరిచి దేవతామూర్తుల బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లే ఓ ఘరానా అంతర్రాష్ట్ర దొంగను విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 60.9 లక్షల విలువ చేసే 80 కేజీల వెండి, 224 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన విజయవాడ వన్టౌన్లోని కుసుమ హరనాథ మందిరంలో జరిగిన దొంగతనంపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. సీసీ పుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఈ నెల 12వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సికింద్రాబాద్ తుకారం గేటు ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల అంగోత్ రాములునాయక్ను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. విచారణలో నిందితుడు చేసిన తాజా చోరీతో పాటు గతంలో చేసిన దొంగతనాలను అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అవనిగడ్డలోని సూర్య దేవాలయంలో నిందితుడు రాము 2011లో దొంగతనం చేసి అరెస్టు అయి జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. జైలు నుంచి విడుదలయిన తరువాత అదే పంథాలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చోరీ చేసిన సొత్తును కొద్ది రోజుల పాటు దేవాలయానికి సమీపంలోనే దాచి, పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత ఆభరణాల రూపం మార్చి విక్రయిస్తుంటాడని కమిషనర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్, చేబ్రోలు, ఆకివీడు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నకిరేకల్, కొల్లిపర, తెనాలి, నగరంపాలెం, చేబ్రోలు, వినుకొండ, కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ప్రకాశం జిల్లాలోని నాగులపాడు, తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు రాములునాయక్పై ఇప్పటి వరకు 14 పోలీస్ స్టేషన్లలో 18 కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న డీసీపీ బాబురావు, ఏసీపీ హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు శంకర్, మూర్తిని సీపీ అభినందించారు. -
మొక్కులు తీర్చుకున్న పోలీసులు
సాక్షి, చెన్నై: కొలిక్కిరాని కేసు ఛేదించడంతో పోలీసులు మొక్కులు తీర్చుకున్నారు. సమయపురం మారియమ్మన్ను దర్శించుకుని తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లలిత జ్యువెలరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మురుగన్ దోపిడీల అనంతరం నటీమణులతో జల్సా చేసినట్టు విచారణలో తేలడం ఆ నటీమణులు ఎవరో అని ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరిలో తిరుచ్చి సమయపురం టోల్గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. 470 సవర్ల నగలు, రూ. 19 లక్షల నగదును దుండగులు అపహరించుకు వెళ్లారు. ఈ కేసు విచారణ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కనీసం ఆదారం కూడా లభించకపోవడంతో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తిరుచ్చిలో మరో దోపిడీ జరిగింది. ప్రముఖ నగల షోరూమ్ లలిత జ్యువెలరీలో జరిగిన దోపిడీ స్టైల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టైల్ ఒకే రకంగా ఉండడంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. లలిత జ్యువెలరీ కేసు విచారణలో లభించిన సమాచారాలు, ఆధారాలు, దోపిడీ దొంగల చెంతకు పోలీసుల్ని తీసుకెళ్లింది. లలిత జ్యువెలరీ కేసులో తొలుత సెంగం కోర్టులో సురేష్ అనే నిందితుడు లొంగిపోయాడు. అతడ్ని విచారించగా, గణేష్ అనే మరో దొంగ దొరికాడు. ఈ దోపిడీల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న తిరువారూర్ మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయాడు. ఇతగాడ్ని ఇక్కడకు తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టిన బంగారాన్ని బయటకు తీశారు. మళ్లీ బెంగళూరు పోలీసులు తమ పరిధిలో ఉన్న కేసుల విచారణ నిమిత్తం మురుగన్ను పట్టుకెళ్లారు. తలనీలాలు సమర్పించుకుని.. మురుగన్ను తమ కస్టడీకి తీసుకునేందుకు తిరుచ్చి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే, బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్న దృష్ట్యా, అక్కడ విచారణ ముగించినానంతరం, ఇక్కడకు అతడ్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించి ఉన్నారు. లలితా జ్యువెలరీ దోపిడితోపాటు తొమ్మిది నెలల క్రితం జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కూడా మురుగన్ ముఠా పనితనంగా తేలింది. ఈ కేసులో రాధాకృష్ణన్ అనే నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులు కొలిక్కిరావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసును విచారిస్తున్న బృందంలోని ఇద్దరు పోలీసులు హరిహరన్, విజయకుమార్ ఉదయాన్నే సమయపురం మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసును ఎట్టకేలకు ఛేదించడంలో తమకు దేవుడి ఆశీస్సులు సైతం ఉన్న దృష్ట్యా, మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించుకోవడం గమనార్హం. 25 కేజీలు బంగారం స్వాధీనం.. లలిత జ్యువెలరీ కేసులో ఇప్పటి వరకు 25 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నట్టు తిరుచ్చి పోలీసు కమిషనర్ అమల్రాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ గురించి వివరించారు. ప్రస్తుతం నిందితుడు మురుగన్ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అక్కడ విచారణ ముగించినానంతరం ఇక్కడ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతడిపై మరెన్ని కేసులు ఉన్నాయో అని ఆరా తీస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ సాగుతున్నదన్నారు. కాగా నిందితుడు మురుగన్ దోపిడీల అనంతరం మోడల్స్, నటీమణులతో కలిసి జల్సా చేసేవాడుగా విచారణలో తేలినట్టు సమాచారం. కొందరికి దోపిడీ చేసిన నగలను సైతం ఇచ్చి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడం, రెండు సినిమాలకు సైతం ఫైనాన్స్ చేసి ఉన్నట్టు తేలడంతో ఆ నటీమణులు ఎవరో, ఆ సినిమాల వెనుక ఉన్న వాళ్లు ఎవరో ఆరా తీసే పనిలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది. -
డీజిల్ చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
నేరేడ్మెట్: డీజిల్ చోరీ కేసులో పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబందించి గత నెలలో నలుగురిని అరెస్టు చేసిన విదితమే. తాజా బుధవారం ప్రధాన సూత్రదారితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో ఘట్కేసర్–చర్లపల్లి మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), భారత్ పెట్రోల్ కార్పొరేషన్(బీపీసీ)కు చెందిన ప్రధాన పైప్లైన్కు కన్నం వేసిన అంతర్రాష్ట్ర ముఠా దాదాపు 1.30లక్షల లీటర్ల డీజిల్ను చోరీ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు గత జనవరి 17న నలుగురు నిందితులను అరెస్టు చేసి రూ.90.40లక్షల నగదును స్వాధీనం చేసుకొని, ట్యాంకర్ను సీజ్ చేశారు. స్క్రాప్ వ్యాపారం పేరుతో ఘట్కేసర్ ప్రాంతంలో స్థలం లీజుకు తీసుకొని ముఠా సభ్యులతో కలిసి ఈ చోరీకి పథకం రూపొందించిన సూత్రదారి ముంబైకి చెందిన స్క్రాప్ వ్యాపారి సర్వర్ షేక్ అలియాస్ సజ్జు, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ట్యాంకర్ యజమాని/డ్రైవర్ సురేష్కుమార్ ప్రజాపతిలను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4,29,878 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన డీజిల్ను ప్రజాపతి తన ట్యాంకర్లో మహారాష్ట్రలోని కరాడ్, సిరూర్లోని కేన్ అగ్రోస్, సాయికృపా షుగర్ కంపెనీలకు తరలించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. సర్వర్షేక్పై ముంబైలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు జియాఉల్ చాంద్ షేక్, సునీల్అనిల్, వాసు, శ్రీకాంత్, నరేష్రెడ్డి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్లో డీజిల్ విక్రయంపై ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ శివకుమార్, మల్కాజిగిరి సీసీఎస్ ఇన్స్పెక్టర్లు లింగయ్య, జగన్నాథ్రెడ్డి, రుద్రభాస్కర్, కీసర సీఐ ప్రకాష్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణారావు, నర్సింహులు, శివప్రసాద్, శ్రీకృష్ణ, రవి, గోవింద్ పాల్గొన్నారు. -
ఓవర్ టు చెన్నై
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగ కర్రి సతీష్ను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఇతడితో పాటు ప్రధాన అనుచరుడైన నరేంద్రనూ ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్పై చెన్నై తరలించారు. హైదరాబాద్ సహా మొత్తం మూడు రాష్ట్రాల్లో 56 చోరీలు చేసిన ఈ ఘరానా దొంగలను సిటీ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన విషయం విదితమే. రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని చేసిన ఏడు దొంగతనాల్లో ఈ ముఠా రూ.1.05 కోట్ల సొత్తు ఎత్తుకుపోయింది. ఓ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కేవలం ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు మాత్రమే ఎత్తుకుపోవడం వీరి నైజం. ‘సతీష్ అండ్ కో’ చెన్నైలోని నాలుగు చోట్ల దొంగతనాలు చేసినట్లు తేలింది. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ 13 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతడిపై సిటీ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్గూడ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్ సహా మరొకరితో కలిసి ముఠా కట్టాడు. ఈ ఏడాది మార్చ్లో జైలు నుంచి విడుదలైన ఈ గ్యాంగ్ వరుసపెట్టి చోరీలు చేసింది. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరు, ఏపీల్లోనూ పంజా విసిరింది. గూగుల్ మ్యాప్లో ‘గుర్తుపెట్టుకుని’... సతీష్, నరేంద్ర ఖరీదైన ప్రాంతాలు, ప్రముఖులనే టార్గెట్గా చేసుకుని రెచ్చిపోయారు. జూన్లో తమిళనాడుకు వెళ్లిన వీరు లాడ్జిలో మకాం వేశారు. స్థానికంగా అద్దెకు తీసుకున్న బైక్పై పగటిపూట సంచరిస్తూ అక్కడి అనువైన ప్రాంతాల్లో తాళం వేసున్న ఇళ్లను గుర్తించారు. రాత్రి చోరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇంటిని మర్చిపోకుండా ఉండేందుకు దాని లోకేషన్ను గూగుల్ మ్యాప్ ద్వారా ఒకరి నుంచి మరొకరి సెల్కు షేర్ చేసుకునే వారు. దీని సాయంతో రాత్రి వేళ మళ్లీ ఇంటి వద్దకు వెళ్లి తమ ‘పని’ పూర్తి చేసుకునే వారు. ఈ పంథాలో మొత్తం నాలుగు చోరీలు చేశారు. చెన్నై, నుంగంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే డాక్టర్ కౌసిఖ్ ఇంట్లో పంజా విసిరి 146.6 గ్రాముల ప్లాటినం నగలు ఎత్తుకుపోయింది. ఆ తర్వాత తైనంపేట్, ముంబాలమ్, మైలాపూర్ల్లోనూ మూడు ఇళ్లల్లో దొంగతనాలు చేసింది. చెన్నైలో చోరీ చేసిన ప్లాటినం నగలను అమ్మడానికి హైదరాబాద్తో పాటు కడప, పొద్దుటూరుల్లోనూ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివ రకు ముంబైలో అమ్ముదామనే ప్రయత్నాల్లో అక్కడకు పట్టుకుని వెళ్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉత్తర మండల టాస్క్ఫోర్స్ బృందానికి సొత్తుతో సహా చిక్కేసింది. అప్పట్లో వీరి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1.05 కోట్ల విలువైన 1712 గ్రాముల బరువున్న ప్లాటినం, బంగారం, వజ్రా లు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పోలీసులకు సమాచారం... సతీష్, నరేంద్రల విచారణ నేపథ్యంలోనే వారిపై ఉన్న కేసులు, నాన్–బెయిలబుల్ వారెంట్ల నేపథ్యంలో సత్తిబాబు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు వాంటెడ్గా ఉన్నారని తేలింది. దీంతో వెంటనే సిటీ పోలీసులు ఆయా అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం వీరిద్దరినీ పీటీ వారెంట్పై అక్కడకు తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు కేసుల్లోనూ అరెస్టుల పరంపర పూర్తి చేసి సోమవారం నాటికి తిరిగి హైదరాబాద్ తీసుకురావాలని భావిస్తోంది. కేవలం సీసీ కెమెరాలు లేని ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసే ఈ గ్యాంగ్ నేరం స్థలంలో తమ వేలిముద్రలు సైతం దొరక్కుండా గ్లౌజులు ధరిస్తుంది. డాక్టర్ కౌశిఖ్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. సతీష్ ముఠా బెంగళూరులోని ఇందిరానగర్లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లోనూ చోరీ చేసింది. అక్కడి సదాశివనగర్లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులూ ఈ గ్యాంగ్ను పీటీ వారెంట్లపై తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
పోలీసుల అదుపులో అంతర్ రాష్ట్ర దొంగ
ప్రకాశం, సింగరాయకొండ: పలు రాష్ట్రాల్లో హత్యలు, పిల్లల కిడ్నాప్లతో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర దొంగ సీజో చంద్రన్ తమ అదుపులో ఉన్నట్లు సీఐ ఆర్. దేవప్రభాకర్ ఆదివారం తెలిపారు. గత జూలై 21న క్యాబ్ డ్రైవర్పై దాడి కేసులో ముద్దాయి అయిన సిజోచంద్రన్ను విచారించామన్నారు. దీంతో నాగపూర్ లో ఒక చిన్నారి కిడ్నాప్ను చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్టు అయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సారంగపూర్ జైలులో ఉన్నాడని తెలిసిందని తెలిపారు. అతన్ని విచారణ నిమిత్తం సింగరాయకొండ పోలీస్స్టేషన్కు తీసుకుని వచ్చినట్లు సీఐ ఆర్. దేవప్రభాకర్ తెలిపారు. బండారం బట్టబయలు గత జూలై 21న సిజోచంద్రన్ అరక్కోణం నుంచి హైదరాబాద్కు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఈ సమయంలో సిజోచంద్రన్ తనకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ జెరాక్స్లను క్యాబ్ డ్రైవర్ బి. పార్థిపన్కు ఇచ్చాడు. అరక్కోణంలో ఇతనితో పాటు మరో ఇద్దరు ఎక్కారు. కారు కావలి సమీపంలోకి రాగానే క్యాబ్ డ్రైవర్ను బెదిరించి కట్టేసి అతని వద్ద ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని అందులో నుంచి రూ. 4 వేలు డ్రాచేసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్ను సింగరాయకొండ పరిసరాల్లోని జాతీయరహదారిపై శానంపూడి అడ్డరోడ్డు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఉన్నత చదువులు చదువుకున్న పార్థిపన్ గాయాలతోనే అర్ధరాత్రి సమయంలో సింగరాయకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సీఐ దేవ ప్రభాకర్ తన సిబ్బందిని మూడు బృందాలుగా పంపి క్యాబ్ను వెతికే కార్యక్రమం చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ బి. పార్థిపన్ది తమిళనాడు రాష్ట్రం తిరువెళ్లూరు జిల్లా అయ్యపాకం గ్రామం. తరువాత జూలై 24న చిలకలూరిపేట టౌన్ లో క్యాబ్ను గుర్తించిన ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు కారుకు అడ్డువచ్చిన పోలీసుల పైకి కారును ఎక్కించే ప్రయత్నం చేయడంతో వారు త్రుటిలో తప్పించుకున్నారు. చివరికి చిలకలూరిపేట సమీపంలోని ఎడ్డపాడు పోలీస్స్టేషన్ పరిధిలో మట్టిరోడ్డువద్ద కారును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే సిజోచంద్రన్తో సహా మిగిలిన ఇద్దరూ పరారయ్యారు. కేసును ఛాలెంజ్గా స్వీకరించి సీఐ దేవ ప్రభాకర్ విచారణ చేపట్టి చివరికి ముద్దాయి అయిన సిజో చంద్రన్ను అరెస్టు చేశారు. సిజో చంద్రన్ది కేరళ రాష్ట్రం కాగా అతను ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. ఇతను మొత్తం 15 రకాలైన.. చిన్నారుల కిడ్నాప్, బ్యాంకు మేనేజర్తో పాటు పలు హత్యలతో సంబంధం ఉంది. ఇతను ప్రధానంగా మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పలు నేరాలతో సంబంధం ఉంది. ఇతను జైలులో తన సహచరులతో సహవాసం ఏర్పరచుకుని వారి సహాయంతో కార్లు దొంగిలించడం తరువాత ఆకారులో ప్యాసింజర్లను ఎక్కించుకోవటం కొంతదూరం పోగానే వారిని బెదిరించి వారి వద్ద డబ్బు లాక్కోవటం చేసేవాడు. వారు వినకపోతే చంపేయటం వీరి నైజం. ఈ విధంగా 2015వ సంవత్సరంలో తునిలో జరిగిన బ్యాంకు మేనేజర్ హత్య కేసులోకూడా ఇతనికి సంబంధం ఉంది. అంతేకాక వాడి, పచోరి పోలీస్స్టేషన్లలో పలు కేసులున్నాయి. విచారణ పూర్తి కాగానే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement