-
స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే...
*ఐఎంటి ఓర్టస్ సదస్సులో వక్తల అభిప్రాయం హైదరాబాద్ :ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు విజయవంతం కావాలంటే కొన్ని సూత్రాలకే లోబడే వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ’భారత్లో స్టార్టప్ కంపెనీలకు ఉన్న అవకాశాలు –నిలదొక్కుకొనే సమర్ధత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వాణిజ్యరంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొత్త కంపెనీలకు ఉండాల్సిన నైపుణ్యత, లక్షణాలు, సాధించాలనే లక్ష్యం, నూతన ఆవిష్కరణల కోసం పరుగులు తీసే సమర్ధత ఉన్నప్పుడే విజయాన్ని కైవసం చేసుకోగలవని ప్యానల్లో ఉన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఇండియాలో స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే కొన్ని లక్ష్యాలను అధికమించాలని వారు పేర్కొన్నారు. సరైన వ్యాపార వాతవరణాన్ని సృష్టించుకోగలగటంతో పాటు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటేనే స్టార్టప్ కంపెనీలు విజయవంతం కాగలుగుతాయని ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యారంగం, పరిశ్రమ వర్గాలు సమిష్టిగా కృషిచేస్తేనే స్టార్టప్ కంపెనీలు ధృడంగా రూపొందుతాయని ఆయన అన్నారు. సాధించాలనే బలమైన లక్ష్యంతోపాటు పరిశ్రమల్లో వస్తున్న మార్పులను గమనించకల్గిన ముందుచూపు అవసరమని ఆర్ఏ కెమ్ ఫార్మా డైరక్టర్ శిరీష్ కుమార్ రావుల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు ఎదుర్కోంటున్న సమస్యలను ఎడ్వాంటా సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకులు, సీఈవో రవి దేవులపల్లి వివరించారు. డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో పాటు డబ్బుపై గౌరవం, విలువ ఉండాలని ఆయన అన్నారు. అదే విజయానికి సోపానాలను నిర్మిస్తుందని రవి దేవులపల్లి అన్నారు. గత దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలనుంచి ప్రయివేటు సంస్థలలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, అలాగే స్టార్టప్ కంపెనీలతో పెరుగుతున్న ఉద్యోగఅవకాశాలను వయలెట్ స్ట్రీట్ సహవ్యవస్థాపకులు నయన్ కుమార్ వివరించారు. స్టార్టప్ కంపెనీలు తప్పక విజయంసాధిస్తాయన్న ఆశాభావాన్ని వెక్ట్రా ఫ్యామిల్టీ ఎండి మను శ్రీనివాసన్ వ్యక్తం చేశారు. ఇంకుబేషన్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ప్రభుత్వంనుండి సహాయసహకారాలు అందితే స్టార్టప్ కంపెనీలు అగ్రగామిగా దూసుకెళ్తాయని శ్రీనివాసన్ అన్నారు. చదువుకు, సరదాలకు మధ్య మంచి సమన్వయం సాధించి సమయపాలన చేయగలిగినప్పుడే విజయం వారిని వరిస్తుందని నిపుణులు ఐఎంటి బిజినెస్ స్కూల్ విద్యార్ధులకు సూచించారు. చివరగా, సరైన మానసిక పరిపక్వతో పాటు, తమ ఆలోచనలలో స్పష్టత, నూతనత్వం ఉన్న వ్యక్తులకు విజయ తధ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి సంధానకర్తగా వ్యవహరించారు. విద్యార్ధుల్లో వ్యాపార వ్యవస్థాపనకు కావాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకొనే శక్తిని కలిగించేందుకు ఓర్టస్ తరహా సదస్సులను నిర్వహిస్తున్నట్టు డా.. సతీష్ ఐలవాడి చెప్పారు. -
విజేతలుగా నిలిచిన ఐఎంటీ, ఐబీఎస్
హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన పిరియడోస్ 16 వార్షిక క్రీడోత్సవాలు ఆదివారంనాడు ఘనంగా ముగిశాయి. ఈ క్రీడల్లో ఐఫ్ఎంఆర్, ఎస్ఐబీఎమ్, హైదరాబాద్, ధృవ మేనేజిమెంట్ కళాశాల, ఎన్ఎంఐఎమ్ఎస్, ఐబీఎస్ హైదరాబాద్ టీమ్ లు పోటీపడ్డాయి. క్రికెట్ లో ఐబీఎస్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. బాస్కెట్ బాల్ టైటిల్ ను ఐఎంటీ హైదరాబాద్ గెల్చుకుంది. వాలీబాల్ లో ఐబీఎస్ హైదరాబాద్ విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్ పురుషులు, మహిళల విభాగంలో ఐబీఎస్ హైదరాబాద్ విజయకేతనం ఎగురవేసింది. కౌంటర్ స్ట్రైక్ మ్యాచ్ లో ఐఎంటీ హైదరాబాద్ గెలిచింది. క్రీడలు ముగిసిన సందర్భంగా జరిగిన ఏర్పాటు చేసిన సాంస్క్రతిక ప్రదర్శనల్లో ముంబయికి చెందిన రాక్ బ్యాండ్ ఓక్ ఐలాండ్ అందరిని అలరించింది. చివరగా, హిందీ రాక్ బ్యాండ్ రాహీ బృందం చేసిన గానం విద్యార్ధులను విశేషంగా ఆకట్టుకుంది. -
ఐఎంటీలో పిరెయోడ్స్ 2016 ప్రారంభం
హైదరాబాద్: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) వార్షిక క్రీడలు పిరియోడ్స్ - 2016 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఐఎంటీ, ఐఎఫ్ఎంఆర్, ఎస్ఐబిఎమ్ తదితర టీమ్ లు ఈ క్రీడల్లో తమ ప్రతిభను కనబర్చాయి. శనివారం జరిగిన పోటీల్లో ప్రధానంగా క్రికెట్ లో ఐఎఫ్ ఎంఆర్, ఐబిఎస్ హైదరాబాద్ టీములు తలపడగా... ఐబీఎస్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో ఐఎంటి హైదరాబాద్, ఎస్.ఐబిఎం తలపడగా...ఐఎంటి హైదరాబాద్ 46 పరుగులతో గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్ లో ఐబీఎస్ హైదరాబాద్, ధృవ కాలేజితో పోటీపడగా.. ఐబీఎస్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాస్కెట్ బాల్ పోటీ మెదటి మ్యాచ్ లో ఐబీఎస్ హైదరాబాద్, ఐఎఫ్ఎంఆర్ తలపడగా.... ఐబీఎస్ హైదరాబాద్ 36-9 స్కోరుతో ఐబీఎస్ హైదరాబాద్ గెలుపు సాధించింది. రెండో మ్యాచ్ లో ఐఎంటీ హైదరాబాద్ టీమ్ ఐఎఫ్ఎంఆర్ జట్టుపై విజయం సాధించింది. వాలీబాల్ పోటీలు వాలీబాల్ క్రీడల్లో రెండు మ్యాచ్ లు జరుగగా.. మొదటి మ్యాచ్ ధృవ కాలేజీ 11-25, 17-25 స్కోరుతో ఐఎఫ్ఎమ్ఆర్ పై విజయాన్ని అందుకోగా, రెండో మ్యాచ్ లో ఐఎంటీ హైదరాబాద్, ఎస్ఐబీఎంపై విజయం సొంతం చేసుకుంది. మూడు సెట్లలో రెండు సెట్లలో ఐఎంటీ హైదరాబాద్ విజయాన్ని కైవసం చేసుకొంది. టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ లో ఐబీఎస్ హైదరాబాద్ 3-0 స్కోరుతో ఐఎంటీ హైదరాబాద్ పై విజయాన్ని సాధించింది. రెండో మ్యాచ్ లో ఐఎఫ్ఎంఆర్ 3-1 స్కోరుతో ఐఎంటీ హైదరాబాద్ పై గెలుపొందింది. మూడో మ్యాచ్ లో ఐఎంటీ హైదరాబాద్ 3-0 తేడాతో గెలుపోందింది. ఇక నాలుగో మ్యాచ్ లో ఐబిఎస్ హైదరాబాద్ 3-0 తేడాతో గెలిచింది. మహిళల విభాగంలో ఐబీఎస్ హైదరాబాద్, ఎస్ ఐబీఎమ్ పై 3-0 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. త్రోబాల్ పోటీలు ఐఎంటీ హైదరాబాద్, ఎస్ ఐబిఎమ్ తో త్రోబాల్ క్రీడలో తలపడగా ఐఎంటీ హైదరాబాద్ విజేతగా నిలిచింది. -
అనిశ్చితి తొలిగాకే రాష్ట్రంలో విస్తరణ : రమేష్ అయ్యర్
బ్యాంకింగ్ లెసైన్స్ పోటీ నుంచి తప్పుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ ఇప్పుడు పూర్తి స్థాయి నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష లోపు గృహ రుణ మార్కెట్పై ప్రధానంగా దృష్టి సారించడమే కాకుండా త్వరలోనే మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు ఎంఅండ్ఎం ఫైనాన్స్ ఎండీ, సీఈవో రమేష్ అయ్యర్ తెలిపారు. హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) నిర్వహిస్తున్న బిజినెస్ ఓరియంటేషన్ (బీఓపీ) కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయ్యర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న వడ్డీరేట్లు, తగ్గుతున్న జీడీపీ వంటివి ఎన్బీఎఫ్సీలను ఇబ్బంది పెడుతున్నాయి. మీ సంగతేంటి? ఇవి ప్రధాన సమస్యలే కానీ.. మాపై పెద్దగా ప్రభావం చూపటంలేదు. గత త్రైమాసికంలో 30 శాతం వృద్ధిని నమోదు చేశాం. ఈ రెండు సమస్యల వల్ల రుణాలిచ్చే ఎన్బీఎఫ్సీల సంఖ్య తగ్గడం, బ్యాంకులు రుణాలివ్వడానికి వెనకడుగు వేయడం వంటివి జరుగుతున్నాయి. అంతేతప్ప ఎన్బీఎఫ్సీల లిక్విడిటీ (నగదు లభ్యత)పై ఎలాంటి ఒత్తిడి లేదు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో చాలా డిమాండ్ ఉంది. వడ్డీ రేట్లు పెరుగుతుండటం వల్ల లాభాలపై ఏమైనా ఒత్తిడుందా? లాభాలపై పెద్దగా ఒత్తిడి లేదు. గత త్రైమాసిక నికర లాభంలో 18 శాతం వృద్ధిని నమోదు చేశాం. నికర వడ్డీ లాభదాయకత (ఎన్ఐఎం-నిమ్) 8-9 శాతంగా ఉంది. మొన్న ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచాక మేం పెంచలేదు. ప్రస్తుతం పండుగల ఆఫర్ నడుస్తోంది. దీని తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. మున్ముందు కూడా నిమ్ ఈ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నాం వడ్డీరేట్ల కదలికలు ఎలా ఉండొచ్చు? వడ్డీరేట్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉండవు. ఒకస్థాయికి చేరాక అక్కడ స్థిరపడటం లేదా కిందికి దిగి రావడం జరుగుతుంది. ప్రస్తుత స్థాయి నుంచి వడ్డీరేట్లు మరో పావు శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఏ రంగాల నుంచి డిమాండ్ ఉంది? ఈ ఏడాది రుతుపవనాలు బాగుండటంతో గ్రామాల్లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. పండుగల సందర్భంగా అక్టోబర్ నెల చాలా బాగుంది. ముఖ్యంగా ట్రాక్టర్లు, చిన్న కార్లు, ఎల్సీడీలు, యుటిలిటీ వెహికల్స్ నుంచి డిమాండ్ అధికంగా ఉంది. ఇదే సమయంలో భారీ వాణిజ్య వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉంది. గ్రామాల్లో గృహరుణాలకు డిమాండ్ ఎలా ఉంది? డిమాండ్ చాలా బాగుంది. మూడేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏటా రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తోంది. గతేడాది రూ.500 కోట్లుగా ఉన్న బ్యాలెన్స్షీట్ ప్రస్తుతం రూ.1,000 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాదికి రూ.1,200 కోట్లకు చేరుకోవడమే కాకుండా 2015 మార్చి నాటికి రూ.4,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సగటు రుణ విలువ లక్ష రూపాయల లోపే ఉండటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ సేవలను అందిస్తుండగా, మరో రెండు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాం. బ్యాంకు లెసైన్స్ రేసు నుంచి చివర్లో ఎందుకు తప్పుకున్నారు? కొత్త బ్యాంకుల కోసం ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు ఎంఅండ్ఎం వంటి పెద్ద ఎన్బీఎఫ్సీలకు ఎటువంటి లాభం చేకూర్చే విధంగా లేవు. ముఖ్యంగా 18 నెలల్లో అన్ని ఎన్బీఎఫ్సీ శాఖలను బ్యాంకు శాఖలుగా మార్చడం అన్నది చాలా కష్టంతో కూడుకున్నది. ఈ గడువును పెంచమని అడిగినా ఆర్బీఐ స్పందించలేదు. అలాగే 25 శాతం శాఖలు అప్పటి వరకు బ్యాంకులు లేని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్న షరతు కూడా అడ్డంకిగా మారింది. ఇప్పటికే 675 శాఖలను కలిగిన మేము 25 శాతం అంటే కొత్తగా దాదాపు 170 శాఖలను బ్యాంకులు లేని గ్రామాల్లో ఏర్పాటు చేయడం అన్నది చాలా కష్టం. ఎలా చూసినా పెద్ద ఎన్బీఎఫ్సీలకు ఈ మార్గదర్శకాలు ప్రయోజనకరంగా లేవన్న ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకున్నాం. ఈ ఏడాది ఎటువంటి వృద్ధిని అంచనా వేస్తున్నారు? విస్తరణ ఎలా? మొదటి ఆరు నెలల్లో రుణాల మంజూరులో 12 శాతం వృద్ధిని నమోదు చేశాం. ఇదే సమయంలో నిర్వహిస్తున్న ఆస్తుల విలువ 30 శాతం పెరిగి రూ.30,000 కోట్లు దాటింది. ఇదే విధమైన వృద్ధిని కొనసాగించగలమన్న ధీమా ఉంది. ఇక వ్యాపార విస్తరణకు వస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 675 శాఖలున్నాయి. మార్చి నాటికి మరో 30 శాఖలను ఏర్పాటు చేయనున్నాం. ఏటా కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. హౌసింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ వ్యాపారాల్లో ఇప్పటికే అడుగుపెట్టగా త్వరలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టనున్నాం. ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం లభించింది. పూర్తి అనుమతులు వచ్చి కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇంకో ఆరు నెలల సమయం పడుతుంది. రాష్ట్రంలో వ్యాపార విస్తరణ...? రాష్ట్ర విభజన సమస్య వలన గడచిన ఏడాదిగా రాష్ట్రంలో వ్యాపారం దెబ్బతింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే ఈ విభజన సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఆ తర్వాతే ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement