-
విశాఖలో ముగిసిన ‘విరాట్’ పర్వం!
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి 2016 అక్టోబర్లో నిష్క్రమించింది. అప్పట్లో దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్గా మార్చాలని భావించారు. కేంద్ర ప్రభుత్వం విరాట్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఏపీకి అందించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దులో విరాట్ను మ్యూజియం, స్టార్ హోటల్గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను రూపొందించాలని చెన్నైకి చెందిన నాటెక్స్ మేరీటైమ్ ప్రైవేట్ లిమిటెడ్కు గత టీడీపీ ప్రభుత్వం రూ.1.50 లక్షలు కేటాయించింది. అయితే సుమారు రూ.700 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయ భారాన్ని భరించలేమంటూ టీడీపీ సర్కార్ చివరకు చేతులెత్తేసింది. దీంతో మహారాష్ట్ర తెరపైకి వచ్చి మ్యూజియంని తాము ఏర్పాటు చేసుకుంటామంటూ విరాట్ని ముంబై నావల్ డాక్ యార్డుకి తరలించింది. చివరికి ఈ నౌకని గుజరాత్కు చెందిన శ్రీరామ్ గ్రూప్ రూ.38.54 కోట్లకు వేలంలో దక్కించుకుంది. విరాట్ ప్రాజెక్టు వివరాలివీ.. ► యుద్ధ నౌకలోని 1,500 గదులను ఫైవ్ స్టార్ హంగులతో పర్యాటక హోటల్గా మార్చాలని నిర్ణయించారు. ► 500 మందికిపైగా కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతోపాటు మిగిలిన భాగాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► వీటితోపాటు స్పోర్ట్స్, యాకింగ్, సెయిలింగ్, గ్లైడింగ్, క్రూయిజింగ్ వంటి సౌకర్యాల్ని కల్పించాలని భావించారు. ఐఎన్ఎస్ విరాట్ విశేషాలివీ... ► 1959లో బ్రిటిష్ నౌకాదళంలో సేవలందించింది. ► 1987లో రూ.604.50 కోట్లకు భారత్ కొనుగోలు చేసి ఐఎన్ఎస్ విరాట్గా పేరు మార్చింది. ► ఐఎన్ఎస్ విరాట్ భారత జలాల్లో ప్రవేశించాక 22 మంది కెప్టెన్లు విధులు నిర్వర్తించారు. ఇందులో ఐదుగురు భారత నౌకాదళానికి చీఫ్ స్థానాన్ని అధిష్టించారు. ► ప్రపంచంలో సుదీర్ఘ కాలం (2,250 రోజులు (విధుల్లో ఉన్న కాలం)) సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌకగా గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకుంది. అందుకే ఈ నౌకని ది గ్రాండ్ ఓల్డ్ లేడీ అని అంటారు. ► మొత్తం 10,94,215 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ఈ దూరం 27సార్లు భూమిని చుట్టి రావడంతో సమానం. ► యుద్ధ సమయంలో ఒకేసారి 26 యుద్ధ విమానాల్ని తీసుకెళ్లగలిగే సామర్థ్యం సొంతం. ► ఈ నౌక బరువు 28,700 టన్నులు, పొడవు 226.5 మీటర్లు, వెడల్పు 48.78 మీటర్లు. చివరిసారిగా విశాఖలోనే... భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన విరాట్.. అనేక చారిత్రక విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. చివరిసారిగా విశాఖ సముద్ర జలాల్లోనే విహరించింది. 2016 ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో ఐఎన్ఎస్ విరాట్ తళుక్కున మెరిసింది. ఐఎఫ్ఆర్ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆఖరి అవకాశమూ చేజారింది...!! విరాట్ని వేలంలో దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్.. మ్యూజియంగా మార్చేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. రూ.100 కోట్లకి నౌకని ఇస్తామని, అక్టోబర్ 15లోగా ముందుకు రావాలంటూ ప్రకటించింది. దీనికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తే అమ్మేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే.. గడువు ముగిసే నాటికి ఎన్వోసీ రాకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గుజరాత్ మారిటైమ్ బోర్డు అనుమతి రాగానే.. త్వరలోనే నౌకను విచ్ఛిన్నం చేసి తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలు పెడతామని తెలిపింది. అయితే.. ఇండియా, బ్రిటన్ జాతీయ గౌరవంగా భావించాల్సిన ఐఎన్ఎస్ విరాట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిసెంబర్ 4న ది హెర్మస్ విరాట్ హెరిటేజ్ ట్రస్ట్.. ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఇంకా ప్రధాని కార్యాలయ వర్గాలు స్పందించలేదు. -
‘మోదీకి కుటుంబం లేకనే ఎక్కడికీ వెళ్లట్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరణంలో నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శల వరకు హద్దులు మీరుతున్నాయి. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. ‘ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లడం సర్వసాధారణం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆయన భార్య సోనియా గాంధీతో కలిసి వెళ్లారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం (భార్య) లేదు కాబట్టి ఎక్కడికీ వెళ్లడంలేదు. కేవలం ఆయనొక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.’’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని చేసన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాజీవ్ కోసం ప్రత్యేకంగా విరాట్ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. #WATCH Anand Sharma, Congress on PM Modi's comment on INS Viraat: Any PM would do so but this PM has no family,if he had family then he would also be going there, but he goes alone because he has no connect with a family or any respect for family values. (09/05/2019) pic.twitter.com/N9sKN7iQ2D — ANI (@ANI) May 10, 2019 -
రాజీవ్ గాంధీ ప్రస్తావన ఎందుకో!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో తరచు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పదే పదే రఫేల్ యుద్ధ విమానాల స్కామ్ గురించి ప్రస్తావిస్తున్నందుకు ప్రతిగా రాజీవ్ గాంధీ గురించి ప్రస్తావిస్తున్నారా ? అదే నిజమైతే ‘బోఫోర్స్’ ముడుపుల స్కామ్కు మాత్రమే పరిమితం కావాలి? ఆ స్కామ్ కారణంగానే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ నరేంద్ర మోదీ తాజాగా ఆరోపించారు. నాడు రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా వెంటనే నాటి మేటి పార్లమెంట్ సభ్యులు అటల్ బిహారి వాజపేయి, భూపేశ్ గుప్తా, జైపాల్ రెడ్డి, ఇంద్రజిత్ గుప్తాలు ఎండగట్టేవాళ్లు. వాళ్లే కాకుండా నాడు బీజేపీ కూడా ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకలో ఎందుకు వెళ్లారని రాజీవ్ గాంధీని ప్రశ్నించలేదు. కాకపోతే అందులో లక్ష్యదీవులకు వెళితే ఎవరిని అతిథులుగా తీసుకెళ్లారంటూ అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి కష్ణలాల్ శర్మ ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్ను తీసుకెళ్లారంటూ ఆయనే ఆ తర్వాత పేరు వెల్లడించారు. రాజీవ్ గాంధీ 1987, డిసెంబర్ నెలలో లక్షదీవుల్లో జరిగిన ‘ఐలాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ’ అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయనతోపాటు ఆయన భార్య సోనియా గాంధీ కూడా వెళ్లారు. నాడు ఆయన కోసం ప్రత్యేకంగా విరాట్ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ కూడా ఇచ్చారు. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. నాడు నౌకలోఉన్న పలువురు నౌకాదళం అధికారులు కూడా మోదీ ఆరోపణలను ఖండించారు. రాజీవ్ తన అధికార పర్యటనలకు సోనియా గాంధీని వెంట తీసుకెళ్లేవారు. ఇక విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఆయన తన పిల్లలలోపాటు అజితాబచ్చన్, అమితాబ్బచ్చన్, వారి పిల్లలకు ఎక్కువగా తీసుకెళ్లేవారు. వారంతా ఎక్కువగా ఇటలీకే వెళ్లేవారు. మెర్సిడెస్ బెంచీ లాంటి లగ్జరీ కార్లను నడుపుకుంటే తిరిగే అలవాటున్న రాజీవ్ వ్యక్తిగత పర్యటనలకు ప్రత్యేక విమానాలనుగానీ, నౌకలనుగానీ ఏనాడు ఉపయోగించలేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం మంచి చెడుల ప్రస్తావన పక్కన పెడితే ఆయన కృషి కారణంగానే దేశానికి కంప్యూటర్లు, సెల్ఫోన్లు వచ్చాయి. అదే కంప్యూటర్ను ఉపయోగించి నాడు రాజీవ్ గాంధీ లక్షదీవులకు విహార యాత్రకు వెళ్లారా, లేదా ? అన్న విషయాన్ని నేడు సులువుగానే తెలుసుకోవచ్చు. నేడు దేశాన్ని కరువు, కాటకాలు, మంచినీటి సమస్య, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, పర్యావరణం లాంటి ఎన్నో సమస్యలు పీడిస్తుండగా రాజకీయ నేతలు వ్యక్తిగత, కుటుంబ దూషణలకు దిగడం ఏమిటో !? -
కెనడా పౌరుడిని ఎందుకు వెంట తీసుకెళ్లినట్టు?
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన క్రమంలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో యుద్ధానికి దిగుతున్నాయి. దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కూడా రాజీవ్ గాంధీతో పాటు నెహ్రూపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య(దివ్యా స్పందన) ట్విటర్ వేదికగా నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వ వివాదాన్ని ప్రస్తావిస్తూ... ‘ నరేంద్ర మోదీ కెనడా పౌరుడైన అక్షయ్కుమార్ను ఐఎన్ఎస్ సుమిత్రలో విహారానికి తీసుకువెళ్లారు. ఇది సరైందేనా? ఈ వివాదం గురించి గతంలో వచ్చిన ఆర్టికల్ చూడండి’ అంటూ ఓ వార్తకు సంబంధించిన లింక్ను తన ట్వీట్కు జత చేశారు. కాగా ఐఎన్ఎస్ విరాట్లో ప్రయాణించిన సమయంలో రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇద్దరు అధికారులు మాత్రమే వారి వెంట ఉన్నారని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పస్రిచా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక రమ్య ట్వీట్కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2016కు అక్షయ్, కంగనాలను అప్పటి రాష్ట్రపతి, రక్షణ మంత్రి ఆహ్వానించారు. వారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ప్రధాని మోదీ కూడా ఒక అతిథిలాగే వెళ్లారు’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ‘ అవును ఏ పార్టీ నాయకులైనా, ప్రధానులైనా సరే విదేశీ పౌరులను ఇలా మన యుద్ధనౌకల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించడం సరికాదు’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. Yeh teek tha? @narendramodi you took a Canadian citizen @akshaykumar with you on-board INS Sumitra. #SabseBadaJhootaModi Here’s the link to the article, most of us have not forgotten this controversy : https://t.co/jrPNUvk2Py pic.twitter.com/SWkl78rA4F — Divya Spandana/Ramya (@divyaspandana) May 9, 2019 -
‘ఇంత పిరికి ప్రధానిని ఎన్నడూ చూడలేదు’
ప్రతాపగఢ్/జౌన్పూర్: నరేంద్ర మోదీ కన్నా పిరికి, బలహీన ప్రధానిని తానెప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాపగఢ్, జౌన్పూర్ల్లో ప్రియాంక గురువారం ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఈయన (మోదీ) కన్నా ఎక్కువగా భయపడే, బలహీన ప్రధానిని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక అన్నారు. మాజీ ప్రధాని, ప్రియాంక తండ్రి దివంగత రాజీవ్ గాంధీపై మోదీ ఇటీవల పలు ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. బుధవారం మోదీ మాట్లాడుతూ యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ను రాజీవ్ తన వ్యక్తిగత ట్యాక్సీలా ఉపయోగించుకుని అందులో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారని మోదీ అన్నారు. ఆ మరుసటిరోజే ప్రియాంక మాట్లాడుతూ ‘నెరవేర్చని హామీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. విపరీత ప్రచారం, ప్రముఖ టీవీ కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లో బలం రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం. ఆ ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించే శక్తి ఉండాలి. ప్రతిపక్షం ఏం చెబుతుందో వినే శక్తి ఉండాలి. మరి ఈ ప్రధాని మన మాటలు చెవికెక్కించుకోవడం అటుంచితే, ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు’ అని ప్రియాంక అన్నారు. తన ప్రచారాలతో మోదీ వాస్తవాలను కప్పిపుచ్చి, అంతా బ్రహ్మాండం, అద్భుతమని నమ్మిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement