-
తాలిబన్లు ఏమంటారో, ఎగుమతులపై భారత్లో ఆందోళనలు
హైదరాబాద్: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్కు భారత్ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది. ఆ దేశానికి ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ తెలిపారు. 2020–21లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
ఔషధ రాజధానిగా తెలంగాణ
ఐపీఎస్ఎఫ్ వరల్డ్ కాంగ్రెస్లో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగానికి రాజధానిగా తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐపీఎస్ఎఫ్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్తంగా శుక్రవారం హోటల్ మారియట్లో 61వ వరల్డ్ కాంగ్రెస్-2015ను నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశమంతటా తయారవుతున్న బల్క్ డ్రగ్స్లో తెలంగాణ నుంచే 40 శాతం ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్లలో మూడోవంతు టీకాలు హైదరాబాద్లో ఉత్పత్తి చేసినవేనన్నారు. ఇండియాతో పాటు అన్ని దేశాలు పరిశోధనల కోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్నాయని, అయితే సమాజానికి మేలు చేయని పరిశోధనల వలన ఎటువంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువైన ఔషధాలను అందించాల్సిన కర్తవ్యం ఔషధ రంగ నిపుణులపై ఉందన్నారు. హైదరాబాద్లో లైఫ్సెన్సైస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధ రంగ పరిశోధనల ఫలితాలను మేళవించి సమాజానికి మేలు జరిగే విధంగా కొత్త ఆవిష్కరణలు తెచ్చేందుకు ఈ సదస్సు దోహదపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సురేశ్ మాట్లాడుతూ.. భారతీయ ఔషధ మండలిలో 10 లక్షల మంది ఔషధ రంగ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ప్రకటించారు. ఏటా లక్షమంది ఫార్మసీ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు నర్సింహారె డ్డి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రావు వడ్లమూడి, ఉపాధ్యక్షుడు టీవీ నారాయణ, ఐపీఎస్ఎఫ్ అధ్యక్షురాలు పరాంక్, వరల్డ్ కాంగ్రెస్-2015 చైర్పర్సన్ నేహా దెంబ్లా, ప్రోగ్రామ్ కన్వీనర్ జైపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, 55 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement