-
జగిత్యాల: పేరుకే పంచాయతీలు..!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నిధులు లేక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పంచాయతీలుగా గుర్తించి ఆర్నెళ్లయినా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటే అతిశయోక్తికాదు. పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రత్యేక అధికారులకు పాలనపగ్గాలు అందించడం.. అదనపు బాధ్యతలతో వారు సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 500 జనాభా దాటిన తండాలను చాయతీలుగా చేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న పంచాయతీలు గిరిజన తండాలకు, గిరిజనేతర శివారు గ్రామాలకు దూరంగా ఉండి, తక్కువ జనాభా కలిగి ఉన్నా అట్టి తండాలను, శివారు గ్రామాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించి, రాష్ట్ర అవతరణ రోజైన జూన్ రెండు నుంచి తండాల్లో ప్రత్యేక పంచాయతీల పాలన ఆరంభించింది. పంచాయతీలు 21 జిల్లాలో మొత్తం 380 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జూన్ 2న జిల్లాలో గిరిజన, గిరజనేతర జనాభా ప్రాతిపదికన కొత్తగా 60 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. గతంలోనే రాయికల్ మండలం జగన్నాథపూర్ గిరిజన గ్రామపంచాయతీగా ఉండగా.. కొత్తగా 20 తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించగా..ఇక్కడ 100 శాతం గిరిజనులే ఉన్నారు. మండలాల వారీగా గిరిజన గ్రామపంచాయతీలు సారంగాపూర్ మండలంలో భీంరెడ్డిగూడెం, ధర్మనాయక్తండా, మ్యాడారం తండా, లచ్చనాయక్తండా, నాయికపుగూడెం బీర్పూర్ మండలంలో చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, కందెనకుంట, రాయికల్ మండలం అలియనాయక్తండా, జగన్నాథపూర్, కైరిగూడెం, మంత్యనాయక్తండా, లొక్యనాయక్తండా, వాల్మీకితండా, మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ తండా, వాల్గొండతం డా, మెట్పల్లి మండలంలో ఏఎస్ఆర్ తండా, కేసీఆర్ తండా, పటిమిడి తండా, ఇబ్రహీంపట్నంలో తిమ్మాపూర్ తండా, కథలాపూర్లో రాజారంతండాలు కొడిమ్యాల మండలంలో గంగారాంతండా గిరిజన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా అభివృద్ధి లేదు గ్రామపంచాయతీలు ఏర్పాటు జరిగినా తండా పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మినహాయించి ప్రభుత్వం నుంచి ఇతర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలే దు. దీంతో పంచాయతీల ఏర్పాటు ద్వారా పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమిలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. జూన్ 2న పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని పంచా యతీ కార్యాలయాలను ప్రారంభించారు. పంచా యతీలు ఏర్పాటు జరిగినా, ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో సరిౖయెన ఫర్నిచర్ కూడా అందుబాటులో లేదు. కొత్తగా నిధులు లేవు గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇన్చార్జి కార్యదర్శి పేరును జమ చేశారు. ఈ నిధులను తండాలోని వీధిదీపాల ఏర్పా టు, బావుల్లో క్లోరినేషన్ నిర్వహించడంతోపాటు, మురికి కాల్వలను శుభ్రం చేయడానికి వినియోగించారు. ఇతరనిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. అధికారుల హాజరు చుట్టచూపే ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారే తప్ప, గిరి జనులతో ఎలాంటి ప్రత్యేక సమావేశాలు జరప డం లేదని సమాచారం. చుట్టపుచూపుగా గ్రామాలకు వస్తున్నారని, తండాల్లోని సమస్యలపై చర్చలు నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. -
ఆడజన్మకు ఎన్ని శాపాలో..?
► తండాల్లో కొనసాగుతున్న భ్రూణ హత్యలు ► పేదరికంతో శిశువులను అమ్ముకుంటున్న గిరిజనులు మంచాల: ఓ వైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ... తమదైన ముద్ర వేస్తున్నారు. పురుషులకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా విద్య, వైద్యం వంటి ఉన్నత రంగాల్లో ముందుంటున్నారు. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణ విషయంలో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. అయినా నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాతా–శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు మాత్రం ఆశించిన్నంతగా రావడం లేదు. అందుకు నిదర్శనం మంచాల మండలంలోని లోయపల్లి అనుబంధ గ్రామాలైన ఆంబోత్ తండా, సత్తి తండా, గిరిజన తండాలు. మంచాల మండలం పూర్తిగా వెనుకబడి ప్రాంతం. గిరిజన తండాలు కూడా అధికంగా ఉన్నాయి. మంచాల మండల వ్యాప్తంగా తొమ్మిదేళ్ల కాలంలో ఐదు కేసులు నమోదు కాగా, కేవలం ఒక ఆంబోత్ తండాలో మాత్రం శిశు విక్రయాలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి. అనేక మంది ఆడ పిల్లలను శిశు విహార్కు తరలించడం జరిగింది. ప్రధానంగా మంచాల మండలంలో గిరిజన గ్రామాల్లోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. చెన్నారెడ్డి గూడ గ్రామంలో రెండు, బోడకొండ గ్రామంలో రెండు, ఎల్లమ్మ తండా, బండలేమూర్ గ్రామంలో ఒకటి చొప్పున జరిగాయి. ఆంబోత్ తండాలో.... మంచాల మండలంలో లోయపల్లి అనుబంధ గ్రామం ఆంబోత్ తండా. ఈ తండాలో 1260 మంది జనాభా ఉంది. 258 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 240 కుటుంబాలు ఎస్టీ వర్గానికి చెందినవారు. మరో 18 బీసీ కుటుంబాలు ఉన్నాయి. ఈ తండాలోనే అధికంగా శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. చాలామంది పేదరికం పేరుతో ఆడపిల్లలపై వివక్షతో సాకలేమని ఐసీడీయస్ అధికారులకు అప్పగిస్తున్నారు. 8) 2016 డిసెంబర్ 5న ( సూజాత–సేవ దంపతులు) మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. తాజాగా సత్తి తండాలో వనిత– జవహర్ అనే దంపతులు ఇబ్రహీం పట్నంలో ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్వాహకుల సహాయంతో మరో ఆడపిల్లను విక్రయించడం జరిగింది. ఇలా వెలుగుచూసిన కేసులు కొన్నే. అయితే గుట్టుచప్పుడు గాకుండా, వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ తండాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మహిళలు ముందుకు రావడం లేదు. తండాలో 25 నుండి 30 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. గిరిజన తండాల్లో ఆడ పిల్లలపై వివక్ష చూపిస్తున్నారు. ఐసీడీయస్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష రూపు మాపాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సృష్టికి మూలమైన ఆడపిల్లలు వివక్షతకు, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆడపిల్లల విక్రయాలు 1) 2007 నవంబర్ నెలలో (లలిత– లక్కు దంపతులు) 2) 2008 జూలై 4న (రంగలి– తావు దంపతులు) 3) 2010మే 14న (బిచ్చి–బాలు దంపతులు) 4) 2015 మార్చి 10న (మాధవి– శంకర్ దంపతులు) 5) 2015 ఏప్రిల్ 6న (సంధ్య –లచ్చిరాం దంపతులు) 6) 2015 ఏప్రిల్ 13న (అనిత– రవి దంపతులు) 7) 2015 జూన్ 4న (సునీత– భాస్కర్ దంపతులు ) -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
తండా నుంచి వండర్
తల్లిదండ్రులు నిరక్షరాస్యులు... నివసించేది మారుమూల తండా.. కుటుంబంలో తనతో పాటు తన కంటే పెద్దవారైన ముగ్గురిని చదివించడానికి వారు పడిన కష్టాన్ని చూశాడు. అన్నం పెట్టే సాగుభూమిని అమ్ముతున్న కన్నవారి ఆవేదనను గమనించాడు. మళ్లీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే తాను బాగా చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదగాలని అప్పట్లోనే నిర్ణరుుంచుకున్నాడు. అంతటితోనే వదిలివేయకుండా కష్టపడి చదివాడు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న ఆయన.. ఎన్నో లక్షల మంది కలలు కనే సివిల్ సర్వీస్పై దృష్టిపెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికయ్యూడు. తద్వారా తల్లిదండ్రులతో పాటు తండాకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఐజీ స్థాయిలో పనిచేస్తున్నాడు. ఉన్నత చదువుల ద్వారా వ్యక్తికి గుర్తింపు రావడమే కాకుండా.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుందనేది అందరికీ తెలిసిందే. ఈ విషయూన్ని చిన్నతనంలోనే ఆ వ్యక్తి గుర్తించారు. ఇంకేం.. చదువులో ఎక్కడా వెనుకబడలేదు. ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగినా ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో బీటెక్ సీటు సాధించాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ సివిల్స్పై మక్కువతో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాడు. ఇవన్నీ ఏదో నగరం, పట్టణ ప్రాంతానికి చెందిన వ్యక్తి వివరాలు కాదు... డోర్నకల్ నియోజకవర్గం ఉయ్యూలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని చాప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్ స్ఫూర్తిదాయక విశేషాలివి. - డోర్నకల్ చదువులో ఫస్ట్ లక్ష్మణ్ లక్ష్మణ్ చిన్ననాటి నుండే చదువుల్లో విశేషంగా రాణించేవాడు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు డోర్నకల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన లక్ష్మణ్ ఆరు నుండి పదో తరగతి వరకు కల్లూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్ నాగార్జునసాగర్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత బీటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కాన్పూర్ ఐఐటీలో, ఉస్మానియా యునివర్సిటీలో ఎంబీఏ చదివారు. అరుుతే, సివిల్స్కు ఎంపికై ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా లక్ష్మణ్ చదువు కొనసాగించారు. ప్రతిష్టాత్మక బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పీజీపీఎం చదివిన ఆయన పబ్లిక్ సర్వీస్కు చెందిన ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ కోర్సును అమెరికాలోని మోడల్ విత్ మాక్స్వెల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, సైరాకూర్ యునివర్సిటీలో పూర్తి చేశారు. కుటుంబమంతా విద్యావంతులే... గుగులోత్ గోల్యానాయక్, సాలమ్మ సంతానమంతా విద్యావంతులే. ఎలాంటి వసతులు లేని చాప్లాతండాలో వ్యవసాయం చేసుకుంటున్న గోల్యానాయక్ తన పిల్లలను పట్టుదలతో చదివించగా అందరూ ప్రయోజకులయ్యారు. గోల్యానాయక్కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె రంగమ్మ ఏడో తరగతి వరకు చదవగా అదే తండాకు చెందిన పాండునాయక్తో వివాహం జరిగింది. రంగమ్మ గతంలో ఉయ్యాలవాడ సర్పంచ్గా, డోర్నకల్ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేయగా, ప్రస్తుతం డోర్నకల్ పీఏసీఎస్ డెరైక్టర్గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె కొర్ర చుక్కమ్మ హైదరాబాద్లో ఎల్ఐసీ అధికారిగా, మూడో కుమార్తె భూక్యా సత్యమ్మ ట్రాన్స్కో డీఈగా పని చేస్తున్నారు. నాలుగో సంతానమైన లక్ష్మణ్ ఐపీఎస్కు ఎంపిక కాగా, చిన్నకుమారుడు రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. డోర్నకల్ మండలం ఉయ్యలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని చాప్లాతండాకు చెందిన గుగులోత్ గోల్యానాయక్, సాలమ్మకు ఐదుగురు సంతానం. వీరిలో నాలుగో సంతానం, కుమారుల్లో మొదటి వాడైన లక్ష్మణ్ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు. 19ఏళ్ల క్రితం 1997లో సివిల్స్ రాసిన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపిక కాగా, కేరళ కేడర్కు నియమించారు. కేరళ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన లక్ష్మణ్ పోలీస్ శాఖలో వివిధ స్థాయిలో పనిచేసి ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) స్థాయిలో.. ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ట్రావెన్కోర్ సిమెంట్స్ లిమిటెడ్(టీసీఎల్) ఎండీగా పని చేస్తున్నారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు గోల్యానాయక్, సాలమ్మతోపాటు పెద్ద సోదరి బానోత్ రంగమ్మ, బావ పాండూనాయక్ ప్రస్తుతం చాప్లాతండాలోనే ఉంటున్నారు. తీరిక వేళల్లో చాప్లాతండాకు వచ్చి తల్లిదండ్రులు, తండావాసులను కలిసే లక్ష్మణ్... మాజీ పోలీసు అధికారి డీటీ.నాయక్ కుమార్తె, వైద్యురాలు కవితను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటి వరకు పనిచేసిన హోదాలు {పస్తుతం కేరళ రాష్ట్రంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) హోదాలో ట్రావెన్కోర్ సిమెంట్స్ లిమిటెడ్(టీసీఎల్) మేనేజింగ్ డెరైక్టర్గా పని చేస్తున్న గుగులోతు లక్ష్మణ్ గతంలో అనేక హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. వాటి వివరాలు... అలెప్పుజా, అలువా, మలప్పురం, కోజికోడ్లో ఏఎఎస్పీగా.. మలప్పురం జిల్లాలో జారుుంట్ ఎస్పీగా.. {తివేంద్రం జిల్లాలో రూరల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్)గా.. {తివేంద్రం ఎస్ఏపీ బెటాలియన్ కమాండెంట్గా.. {తివేంద్రంలోని కేరళ పోలీసు కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ హెడ్గా.. కేరళ పోలీసు టెలీ కమ్యునికేషన్స్ ఇన్చార్జి హెడ్గా.. తిరువనంతపురంలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఏఐజీ(అడ్మినిస్టేషన్)గా.. హైదరాబాద్ బీసీఆర్(డీఆర్సీ), అడ్మినిస్ట్రేషన్, ఎస్టేట్, హెచ్ఆర్(ఐఆర్), డీఐఎస్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్ సర్వీసెస్) అండ్ సెక్యూరిటీ ఎట్ బీఎస్ఈ హెడ్గా.. బీఎస్ఈ, ఎస్ఎంఈ సీఈఓగా.. తిరువనంతపురంలోని మత్స్య ఫెడ్ మేనేజింగ్ డెరైక్టర్గా.. కొచ్చిలోని కౌన్సిల్ ఫర్ ఫుడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(సీఎఫ్ఆర్డీ) సీఈఓగా.. కేరళ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ సప్లై కో మేనేజింగ్ డెరైక్టర్గా.. చదువును నిర్లక్ష్యం చేయవద్దు. యువతీ, యువకులు చదువులను నిర్లక్ష్యం చేయవద్దు. చదువుల్లో రాణిస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చు. కష్టపడి చదవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. విద్యార్థి దశలో కష్టపడి చదివితే భవిష్యత్ మొత్తం అందంగా ఉంటుందనే విషయూన్ని గుర్తించారు. చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదిగిన వారికి సమాజం, కుటుంబం, బంధువుల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. చదువు విలువ తెలుసు కాబట్టే నేను ఐపీఎస్కు ఎంపికయ్యూక కూడా పలు కోర్సులు పూర్తి చేశాను . - గుగులోత్ లక్ష్మణ్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేరళ కేరళ ఐజీగా చాప్లా తండా వాసి {sావెన్కోర్ సిమెంట్స్ లిమిటెడ్ (టీసీఎల్) ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ మొదటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం ఐపీఎస్కు ఎంపికయ్యూక కూడాచదువు కొనసాగింపుఐఐఎంలో ఎంబీఏ, అమెరికాలో ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ కోర్సు -
‘ఫిట్స్’తో గజగజ..
కౌడిపల్లి: మెదక్ జిల్లాలోని రెండు గ్రామాలు, ఓ తండా ఫిట్స్తో గజగజలాడుతున్నాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో వణికించిన ఈ జబ్బు తిరిగి అలజడి రేపుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కౌడిపల్లి మండలంలోని భుజిరంపేట, వెంకటాపూర్లతో పాటు మరో తండాలో ఫిట్స్తో గత 15 రోజుల్లో 40 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది ఇదే రోజుల్లో.. గతేడాది ఇవే గ్రామాల్లో పలువురికి ఫిట్స్ వచ్చాయి. అప్పటి కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయంటూ, మైకం కమ్మి కిందపడిపోతున్నారు. గాయాలకు గురవుతున్నా తెలియనంతగా సొమ్మసిల్లిపోతున్నారు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఏమీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితికి గురవుతున్న వారి ప్రవర్తనను బట్టి ఫిట్స్గా భావించి పక్కనున్న వారు బాధితుల చేతిలో తాళాలు పెట్టడం, నుదుటపై వేలితో ఒత్తడం వంటివి చేస్తున్నారు. ఫిట్స్తోనే మృతి చెందాడు! వెంకటాపూర్కి చెందిన ఒడిగంటి భిక్షపతి (42) గత సోమవారం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా నీటికుంటలో బోర్లాపడిఉన్నాడు. ఫిట్స్ రావడంతోనే కుంటలో పడి మృతిచెందాడని గ్రామస్తులు అంటున్నారు. తనకు అనారోగ్యమంటే తెలియదని, కానీ నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కిందపడిపోయానని, అరగంట తరువాత కోలుకున్నానని వెంకటాపూర్కి చెందిన పుట్టి వెంకటేశం తన అనుభవాన్ని చెప్పాడు. ఎంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి భుజిరంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో బాధితుల్ని గురువారం కౌడిపల్లి పీహెచ్సీకి తరలించారు. సమస్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీపీ తెలిపారు. 2 గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆందోళన వద్దు..వైద్యపరీక్షలు నిర్వహిస్తాం భుజిరంపేట, వెంకటాపూర్లలో పలువురు ఫిట్స్కు గురవుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆందోళన అవసరం లేదని డీఎంఅండ్హెచ్ఓ బాలాజీపవార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన కౌడిపల్లి పీహెచ్సీని సందర్శించారు. ఫిట్స్తో అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement