-
మద్యం ఎంతైనా తాగండి, కానీ.. : డిప్యూటీ సీఎం
పెరవలి: మద్యం ఎంతైనా తాగండి అది మీఇష్టం, కానీ రోడ్డుపైకి వస్తే మాత్రం కేసులు పెడతాం అని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెరవలిలో రూ.68 లక్షలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రం లో శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలంటే ఇటువంటి కేసులు తప్పవన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం వలన ప్రమాదాల బారిని పడుతున్నారని, వీటి నివారణ కోసమే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లు వంటివి నిర్వహిస్తున్నారన్నారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మ్ట్ వాడాలని అది మీ రక్షణకేగానీ మా గురించి కాదన్నారు. ఈ నాలుగేళ్లలో 40 పోలీస్ స్టేషన్లకు భ వనాలు నిర్మించామని, అందులో పెరవలి పోలీస్ స్టేషన్ ఒకటన్నారు. నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. యువత పెడదోవ పట్టటానికి సెల్ఫోన్లు కారణమని వారికి అవి అందకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. జిల్లాకు పోలీసుల కొరత: మంత్రి పితాని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నారని, వెంటనే భర్తీ చేయాలని కోరారు. హోం మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రం మొత్తం మీద 6వేల పోస్టులు భర్తీ చేయగా అందులో జిల్లాకు 350 మందిని కేటాయించామన్నారు. అవసరమైతే మరింత మందిని పెంచుతామన్నారు. ఇంటికి తీసుకెళ్లి తాగండి : మంత్రి జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. మద్యం తాగొద్దని తాము చెప్పబోమని, ఇంటికి తీసుకెళ్లి తాగాలని చూచించారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రసంగించారు. పోలీస్ స్టేషన్ ఆ వరణలో మొక్కలు నాటారు. మంత్రులు రాజప్ప, పితాని, జవహర్, ఎస్పీ రవిప్రకాశ్లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరావు, సీఐ అప్పలస్వామి, ఎస్సై పి. నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు అతికాల కుసుమాంజలిరమ్యశ్రీ, ఎంపీపీ నల్లి శిరీష, సర్పంచ్ సలాది సత్యవతి, ఎంపీటీసీ సభ్యురాలు ఆగిర్తి స్వరూపారాణి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదు
హోంమంత్రి చినరాజప్ప సాక్షి, విజయవాడ బ్యూరో: ముద్రగడ పద్మనాభం పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదని హోమంత్రి చినరాజప్ప చెప్పారు. తుని ఘటనలో అరెస్టయిన వారిని విడుదల చేయిస్తామని, వారిపై కేసులు ఎత్తివేస్తామనే హామీ తాము ఇవ్వలేదన్నారు. అరెస్టులు కోర్టు పరిధిలో ఉన్న అంశమని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోబోమన్నారు. బుధవారం రాత్రి సీఎం కార్యాలయం వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ దీక్ష విరమణ పట్ల ఆయన కుమారుడు బాలు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.వాటిని ఖండిస్తున్నామన్నారు. తుని ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, అమాయకులను వేధించేది లేదనేదే తాము ఒప్పుకున్నామని చెప్పారు. ఫ్లూయిడ్స్ ఎక్కించిన నేపథ్యంలో ఆయన దీక్ష విరమించినట్లేనని చెప్పారు. -
దురాగతాలపై పోరుబాటే
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొని తీరతాం అధికార పార్టీకి వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక ఎస్.యానాం సర్పంచ్పై దాడి పట్ల ఆగ్రహం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజం అమలాపురం : ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల సొంత మండలమైన ఉప్పలగుప్తం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న దాడుల పట్ల ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తీవ్రంగా స్పందించారు. హోం మంత్రిని మచ్చిక చేసుకోవాలనో, ఎమ్మెల్యే వత్తిడి చేశారనో అధికారపార్టీకి చెందినవారు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై భగ్గుమన్నారు. అధికారపార్టీ అండదండలతో జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని, తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్ష నాయకులను దారికి తెచ్చుకోవాలన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ఎలుగెత్తారు. గత శనివారం ఎస్.యానాం సర్పంచ్ 70 ఏళ్ల పెట్టా వెంకట్రావుపై టీడీపీకి చెందినవారు దాడి చేయగానే బాధితుడైన ఆయనపైనే తిరిగి హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులైన తమ పార్టీ వారికి న్యాయం చేయకుంటే ఎంతవరకు వెళ్లేందుకైనా వెనుకాడేది లేదని అన్నారు. ఆమరణదీక్షకు సిద్ధం : విశ్వరూప్ ‘టీడీపీహయాంలో కారంచేడులో జరిగిన సంఘటన ఇప్పుడు అమలాపురంలో పునరావృతమయ్యేలా ఉంది. ఎస్సీ అధికారులను వేధిస్తున్నారు. దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు దళితులపై దాడులు చేస్తుంటే పోలీసులు వారికి అండగా ఉంటున్నారు. ఎస్.యానాం సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై దాడి కేసులో న్యాయం చేయకుంటే అమలాపురంలో ఆమరణదీక్ష చేస్తాను’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం వద్ద సోమవారం జరిగిన అమలాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ హోం మంత్రి చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుల అండ ఉందంటూ ఉప్పలగుప్తం మండలంలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామానికి చెందిన కొంతమంది సర్పంచ్పై దాడి చేయడమే కాక ఆయనను తీసుకు వెళుతున్న అంబులెన్స్పై కూడా దాడి చేశారని అన్నారు. అటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు దెబ్బలుతిని ఆస్పత్రి పాలైన 70 ఏళ్ల సర్పంచ్ హత్యాయత్నానికి పాల్పడినట్టు 307 కేసు పెట్టడం హాస్యాస్పదమన్నారు. హోంమంత్రి రాజప్ప నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్స్టేషన్ కేంద్రంగా అధికార దర్పం : బోస్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ దళితపేటలో ఇంటి వద్దనున్న వ్యక్తిని కొట్టేందుకు వెళ్లారంటే దాడి చేసేవారికి గల అధికారపార్టీ దన్నును అర్థం చేసుకోవచ్చన్నారు. సర్పంచ్పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేసి, అతనిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. దాడి జరగడానికి ముందు సర్పంచ్ రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు కేసు కట్టలేదో చెప్పాలన్నారు. దళితులు ఫిర్యాదు చేసినప్పుడు కేసులు పెట్టకుంటే వారు కూడా ముద్దాయిలవుతారని ఎస్సీఎస్టీ అట్రాసిటీలో ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. హోంమంత్రికి బయపడి బాధితులకు అన్యాయం చేస్తున్నందున ఎస్.యానాం దాడి కేసులో ఇతర ప్రాంతానికి చెందిన డీఎస్పీతో విచారణ చేయించాలన్నారు. ‘అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అభివృద్ధి చేద్దామని లేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దానితో పోలీస్ స్టేషన్ కేంద్రంగా అధికార దర్పాన్ని ఇలా ప్రదర్శిస్తుండడం భావ్యం కాదు’ అని హితవు పలికారు. ఇది ఆపకపోతే ఢిల్లీ తరహా తీర్పు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు ఆపకుంటే ఉద్యమించయినా అధికార పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజప్ప గౌరవాన్ని నిలుపుకోవాలి : కుడుపూడి కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ కోనసీమలో పార్టీల మధ్య కక్షా రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేవని, హోంమంత్రి రాజప్ప తన మండలంలో జరుగుతున్న దాడులపై స్పందించాలని అన్నారు. సర్పంచ్పై దాడి విషయంలో న్యాయంగా దర్యాప్తు చేయించి గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, ఉప్పలగుప్తం ఎంపీపీ శిరంగు రాజా ఎస్.యానాం ఘటన జరిగిన తీరును వివరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఐ.వి.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శులు వాసంశెట్టి సుభాష్, గనిశెట్టి రమణలాల్, సుంకర సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నంతోపాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నాయకులు కాకినాడ వెళ్లి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. -
'కోడిపందాలకి అనుమతి ఇవ్వలేదు'
భీమవరం: కోడి పందాలకు ప్రభుత్వ పరంగా అనుమతులు ఎప్పుడూ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందాలు నిర్వహించడంపై ఆయన పై విధంగా స్పందించారు. తమ దృష్టికి వచ్చిన కొంత మందిపై కేసులు నమెదు చేస్తామని చిన రాజప్ప చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement