-
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
హీరోయిన్స్గా రఫ్ఫాడించిన హీరోల కూతుర్లు వీళ్లే.. (ఫొటోలు)
-
దూసుకుపోతున్న గ్లామర్ హీరోయిన్స్.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే
-
ఈ హీరోయిన్స్ కు అన్ని ప్లాపులే పాపం..
-
ఆ ట్విస్ట్లు తెలుసుకోవడానికి వచ్చేస్తున్నారీ సైంటిస్ట్స్
అంతరిక్షంలో ఏం ఉందో తెలుసుకోవాలి.. కావాలి ఓ సైంటిస్ట్. అంతరిక్షానికి పంపడానికి రాకెట్ కావాలి.. ఆ రాకెట్ తయారీకి కావాలి ఓ సైంటిస్ట్. కళ్లు చెదిరే రంగు రాయి దొరికింది. ఆ రాయి విలువ తెలియాలంటే కావాలి ఓ సైంటిస్ట్. సైంటిస్ట్లు చేసే ట్విస్ట్లు భలే ఉంటాయి. సిల్వర్ స్క్రీన్పై ఆ ట్విస్ట్లు చాలా మజానిస్తాయి. నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాల్లో సైంటిస్టులుగా కనిపించనున్న స్టార్స్ ఎవరో చూద్దాం. మొన్నామధ్య బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ చేరుకుని పరిశోధనలు చేశారు. ‘ప్రాజెక్ట్ కె’ సక్సెస్ కావడం కోసమే అమితాబ్ ఈ ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారట. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ అని, ఈ చిత్రానికి టైమ్ ట్రావెల్ టచ్ ఉందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారన్నది తాజా వార్త. పరిశోధనల్లో భాగంగా అమితాబ్ చేసే ఓ ప్రయోగం వల్లే ‘ప్రాజెక్ట్ కె’ కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందట. ఈ ‘ప్రాజెక్ట్ కె’లో సైంటిస్ట్గా అమితాబ్ ఇచ్చే ట్విస్టులు చూడాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక హిందీలో రూపొందిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ప్రధాన తారాగణంగా నటించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్ర దర్శకుడు. ఈ మూవీలో నాగార్జున పురాతత్త్వ శాస్త్రవేత్తగా కనిపిస్తారు. నాగార్జున చేసే పరిశోధనల నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ కథ మొదలవుతుందట. అలాగే ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ఓ కీలక పాత్ర చేశారు. షారుక్ సైంటిస్ట్ అనేది బాలీవుడ్ టాక్. శివలో (‘బ్రహ్మాస్త్ర’లో రణ్బీర్ పాత్ర పేరు) అతీంద్రీయ శక్తులు ఉన్నాయని సైంటిస్ట్గా ఈ సినిమాలో షారుక్ ఇచ్చే ట్విస్ట్తోనే కథ అసలు మలుపు తిరుగుతుందట. నాగార్జున, షారుక్ సైంటిస్ట్లుగా ఆడియన్స్కు ఎలాంటి ట్విస్ట్లు ఇస్తారనేది ఈ ఏడాదిలోనే చూడొచ్చు. షారుక్ ఖాన్, మాధవన్ ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ను ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల కానుంది. సేమ్ టు సేమ్ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున చేసిన పురాతత్త్వ శాస్త్రవేత్తగానే అక్షయ్ కుమార్ నటించారు. అక్షయ్ కుమార్ హీరోగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో హిందీలో ‘రామ సేతు’ అనే చిత్రం రూపొందింది. ఇందులోనే పురాతత్త్వ శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ నటించారు. రావణుడి బారి నుండి తన భార్య సీతను రక్షించడానికి భారతదేశం, శ్రీలంక మధ్య రాముడు నిర్మించినట్లుగా చెప్పుకుంటున్న రామసేతు అనే బ్రిడ్జ్ ఉన్న మాట నిజమా? కాదా? అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. ఈ బ్రిడ్జ్ను పూర్తి చేయడానికి శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ ఏం చేశారు? అనే అంశంతో కథ సాగుతుందట. హీరోయిన్లుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేశారు సత్యదేవ్. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఖగోళ శాస్త్రవేత్త, ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. కొన్ని అభియోగాల వల్ల నంబి నారాయణన్ ఇస్రో నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఈ పరిణామాలు, ఇస్రోలో ఆయన చేసిన పరిశోధనలు వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో నంబి నారాయణన్గా మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం వహించి, నిర్మించారు. నటి సిమ్రాన్ కీలక పాత్ర చేశారు. ‘బ్రహ్మాస్త్ర’లో ఓ గెస్ట్ రోల్ చేసినట్లుగానే ఈ చిత్రంలో కూడా షారుక్ అతిథిగా కనిపిస్తారని టాక్. అక్షయ్ కుమార్, హన్సిక ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను ఈ ఏడాది జూలై 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్ హన్సిక ఓ సైన్స్ ల్యాబ్లో సైంటిస్ట్గా జాయినయ్యారు. తన నెక్ట్స్ ఫిల్మ్ కోసమే హన్సిక సైంటిస్ట్గా మారారు. కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేత్ర అనే యంగ్ సైంటిస్ట్గా కనిపిస్తారు హన్సిక. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఆరంభమైంది. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో ఓ భారీ సైన్స్ ల్యాబ్ సెట్ వేశారు. షూటింగ్ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ పేర్కొంది. వీరితోపాటు మరికొందరు సినీ తారలు వెండితెర సైంటిస్టులుగా కనిపించనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement