-
బస్సులో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి బిస్కెట్లు
కర్నూలు: హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.5.04 కోట్ల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, నగదును ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా స్వామి అయ్యప్ప ట్రావెల్స్ బస్సులో సేలం పట్టణానికి చిందిన దేవరాజు, సెల్వరాజు, కుమారవేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్లకు చెందిన బ్యాగుల్లో 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, రూ.90 లక్షల నగదు బయటపడ్డాయి. పట్టుబడిన వెండి విలువ రూ.18.52 లక్షలు, బంగారం విలువ రూ.3.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నగలు, నగదుకు సంబంధించి జీఎస్టీ, ఈ–వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ వంటివి చూపకపోవడంతో సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
కారులో బంగారం బిస్కట్లు పట్టివేత
-
భారీగా బంగారు బిస్కట్లు స్వాధీనం
సాక్షి, చెన్నై: సముద్ర మార్గంద్వారా దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి బోటులో అక్రమంగా తరలిస్తున్న అయదున్నర కిలోల బంగారం తనిఖీల్లో పట్టుబడింది. తమిళనాడులోని రామేశ్వరంలోని మండపం తీరం ద్వారా రవాణా చేస్తుండగా నిఘా అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్పై రహస్య సమాచారాన్ని అందుకున్న పోలీసులు, కస్టమ్స్ శాఖ అధికారులతో కూడిన బృందం శ్రీలంక నుంచి వస్తున్న పడవను అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన నాజిర్ అనే వ్యక్తిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అతనినుంచి 5.5 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటిన్నర రూపాయలని ప్రకటించారు. నజీర్ తోపాటు పడవను కూడా స్వాధీనం చేసున్నామని, విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. -
బూట్లలో బంగారం బిస్కెట్లు
► రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం ► బెంగళూరు ఎయిర్పోర్టులో ఒకరి అరెస్ట్ బెంగళూరు : ఎవరికీ అనుమానం రాకూడదని వేసుకున్న బూట్లలో బంగారాన్ని దాచాడు. కానీ అలా వేసుకున్న బూట్లతో సరిగ్గా నడవలేక దొరికిపోయాడు. మంగళవారం వీఎం ఫహాద్ (37) అనే ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి బెంగుళూరుకు వచ్చాడు. కెంపెగౌడ విమానాశ్రయంలో దర్జాగా దిగిన ఆ యువకుడు విమానాశ్రయంలో అటుఇటుగా నడుస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అతడి నడక తీరులో తేడా కనిపించడంతో అనుమానంతో ఆ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. తేడాతో నడుస్తున్నందున ముందుగా అతడు వేసుకున్న బూట్లను విప్పించగా... ఆశ్చర్యం... దాచిన బంగారం బయటపడింది. అయితే ఆ ప్రయాణికుడు ఏకంగా 58 లక్షల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను బూట్లతో దాచి తరలిస్తున్నాడు. తులాల్లో కాదు ఏకంగా రెండు కిలోల బంగారు బిస్కెట్లను బూట్లతో ఉంచినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో అధికారులు ఫహాద్ నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఫహాద్ గోవాకు చెందిన వ్యక్తి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడు తరలిస్తున్న బిస్కెట్ల ధర మార్కెట్ లో సుమారు 58.60 లక్షల రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. -
లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్.. మహిళల అరెస్టు
చెన్నై: విదేశాల నుంచి చాటుమాటుగా బంగారం తరలిస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఒకే రోజు ఏడుగురు మహిళలు పట్టుబడడం చెన్నై విమానాశ్రయం చరిత్రలో ఇదే ప్రథమం. కౌలాలంపూర్ నుంచి గురువారం రాత్రి చెన్నైకి వచ్చిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో దిగిన రాణి (43)ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె లోదుస్తుల్లో 14 బంగారు బిస్కెట్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్క బంగారం బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉందని చెప్పారు. అలాగే సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో నగరానికి వచ్చిన శ్రీలంకకు చెందిన వడివళగి (48) పింగారా (40) శివగంగైకి చెందిన మారియమ్మాళ్ (50), జీనత్ (38)లను తనిఖీ చేశారు. ఈ నలుగురు మహిళలు 1550 గ్రాముల బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డారు. సింగపూర్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి చెందిన కనియమ్మాళ్ (39) తన సెల్ ఫోన్లో బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్ను ఉంచి తెస్తుండగా దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురు మహిళల నుంచి ఒకే రోజు రూ. కోటి విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరందరినీ విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో పట్టుబడిన మహిళలంతా స్మగ్లింగ్ ముఠాకు చెందిన వారుగా నిర్థారించినట్లు చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
మోదీది సవతి తల్లి ప్రేమ
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement