-
యాప్ సాఫ్ట్వేర్లపై వ్యయాలు 15% అప్
న్యూఢిల్లీ: దేశీయంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై కంపెనీలు చేసే వ్యయాలు 2023లో 14.9 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఇందులో అత్యధిక భాగం వాటా కస్టమర్ ఎక్స్పీరియన్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ల వ్యయాలదే ఉండనుంది. ప్రస్తుత ఏడాది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై వ్యయాలు 14.6 శాతం పెరిగి 4.15 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది. డిజిటల్ బాట పట్టే క్రమంలో దేశీ కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై చేసే వ్యయాల్లో భాగంగా సాఫ్ట్వేర్పైనా గణనీయంగా వెచ్చించనున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ నేహా గుప్తా పేర్కొన్నారు. వ్యాపారాల్లో అన్ని అంశాలను నిర్వహించుకునేందుకు కంపెనీలు..సాఫ్ట్వేర్లపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపారు. అయితే, 2021తో పోలిస్తే 2022లో సాఫ్ట్వేర్పై వ్యయాలు కొంత తగ్గవచ్చని నేహా వివరించారు. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వ్యాపారాలకు అనిశ్చితి పెరగడం ఇందుకు కారణమని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. ► కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) సాఫ్ట్వేర్పై వ్యయాలు 2022లో 18.1 శాతం పెరిగి 1.13 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. వచ్చే ఏడాది 18.5 శాతం పెరిగి 1.34 బిలియన్ డాలర్లకు చేరతాయి. ► 2023లో ఈమెయిల్, ఆథరింగ్ విభాగం 16.5 శాతం పెరిగి 768 మిలియన్ డాలర్లకు చేరుతుంది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ 10.3 శాతం పెరిగి 566 మిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది. అనలిటిక్స్ ప్లాట్ఫాం 18.5 శాతం (495 మిలియన్ డాలర్లకు), కంటెంట్ సర్వీసులు 14.8 శాతం (366 మిలియన్ డాలర్లకు), సప్లై చెయిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్పై వ్యయాలు 11.4 శాతం (241 మిలియన్ డాలర్లకు) వృద్ధి చెందనున్నాయి. -
అంతా 5జీ మయం, 2024 కి ఎంత పెరుగుతుందంటే
5జీ..! హ్యూమన్ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చేసుందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరగడం వల్ల 5జీ నెట్ వర్క్ సంస్థలు 2021లో 19.91 బిలియన్ డాలర్లను అర్జించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ డేటాను విడుదల చేసింది. 5జీ నెట్ వర్క్. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ, మొబైల్ నెట్ వర్కింగ్ వ్యవస్థతో పాటు..వర్చవల్ రియాల్టీ, ఓటీటీ,ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది. అయితే దీని వల్ల దేశ భద్రత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నా..టెక్నాలజీతో వాటన్నింటికి చెక్ పెట్టొచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయా సంస్థలు 5జీ టెక్నాలజీని విస్తరించే పనిలోపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్-19 వల్ల యూజర్లు ఆల్ట్రా ఫాస్ట్ బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీకి ఆప్టిమైజ్ అవ్వడంతో పాటు స్ట్రీమింగ్ వీడియోస్, ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా అప్లికేషన్ల వినియోగం పెరిగిందని గ్రాంట్రార్ రీసెర్చ్ సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు.5జీ వైర్లెస్ నెట్ వర్క్ ఇన్ఫ్రాస్టెక్చర్ మార్కెట్ విస్తరించడంతో పాటు..కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)తో 5జీ నెట్ వర్క్తో పనిచేసే ఫోన్ల వినియోగం పెరిగిందని వెల్లడించారు. దీంతో 2020 లో 5జీ నెట్ వర్క్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ వినియోగం వల్ల వరల్డ్ వైడ్గా 13.7బిలియన్ల రెవెన్యూ రాగా..2021లో 39 శాతం పెరిగి 19.91 బిలియన్ డాలర్లు చేరుకున్నట్లు ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ రిపోర్ట్లో పేర్కొంది. టైర్ 1 సిటీస్లో 60శాతం వినియోగం గ్రాంటర్ రిపోర్ట్ ప్రకారం.. 2020లో 10 శాతం వినియోగంలో ఉన్న సీపీసీ నెట్ వర్క్ 2024కి 60శాతం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా టైర్ 1 సిటీస్ లో ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఎవెల్యూషన్ (ఎల్టీఈ) కమ్యూనికేషన్ తో వినియోగించే 4జీ నెట్ వర్క్ నుంచి 5జీ నెట్ వర్క్కు మార్చుకుంటారని గ్రాంటార్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు. -
2020లో తగ్గిన స్మార్ట్ఫోన్ అమ్మకాలు
2020 నాల్గవ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 5.4% తగ్గాయని గార్ట్నర్ కొత్త నివేదిక తెలిపింది. 2020 ఏడాది మొత్తంలో అమ్మకాలు కరోనా కారణంగా 12.5శాతం తగ్గాయి. నాల్గవ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ అమ్మకాల విషయంలో 20.8 శాతం వాటాతో ఆపిల్ అగ్ర స్థానంలో ఉంది. గార్ట్నర్ ప్రకారం.. మన దేశంలో అక్టోబర్ 23న విడుదలైన ఆపిల్ 12 సిరీస్ 5జీ ఐఫోన్ లు నాల్గవ త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ 16.2 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన షియోమీ, ఒప్పో, హువావే వరుసగా మూడవ, నాల్గవ మరియు ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి. "2020 నాలుగో త్రైమాసికంలో 5జి స్మార్ట్ఫోన్లు, లోయర్-టు-మిడ్-టైర్ స్మార్ట్ఫోన్ల రాకతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల క్షీణత కొంతమేర తగ్గింది" అని గార్ట్నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా అన్నారు. కరోనా కారణంగా వినియోగదారులు తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. మార్కెట్లోకి కొత్తగా విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్లు, ప్రో-కెమెరా ఫీచర్లు కొంతమంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఆపిల్ నాల్గవ త్రైమాసికంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ 2020 ఏడాది మొత్తం అమ్మకాలలో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది పోలిస్తే 2020లో శామ్సంగ్ 14.6శాతం క్షీణతను నమోదు చేసింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో క్షీణత భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడిసి) ప్రకారం.. 2020లో కరోనా కారణంగా భారత్లో మొబైల్ ఎగుమతులు 2శాతం మేర తగ్గాయని తెలిపింది. 2009 తరువాత భారత్లో మొబైల్ అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి. చదవండి: ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఏడు స్క్రీన్ల ల్యాప్టాప్ను చూశారా! -
అవుట్సోర్సింగ్కు అనిశ్చితి ముప్పు
బెంగళూరు: అంతర్జాతీయ అవుట్సోర్సింగ్ మార్కెట్కు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిపరమైన ముప్పు పొంచి ఉందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ పేర్కొంది. కంపెనీలు సాధ్యమైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. ఆన్షోర్, ఆఫ్షోర్ వనరుల మేళవింపుతో కంపెనీలు అనుసరిస్తున్న విధానంతో డిమాండ్, సరఫరాపరంగా కొన్నాళ్లుగా విదేశీ అవుట్సోర్సింగ్ మార్కెట్ స్థిరంగా ఉంటోందని గార్ట్నర్ తెలిపింది. అయితే, శ్రీలంకలో ఉగ్రవాద దాడులు, అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదం, హాంకాంగ్లో రాజకీయ ఆందోళనలు మొదలైన వాటితో సరఫరాపరమైన అనిశ్చితి తలెత్తిందని ఒక నివేదికలో వివరించింది. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ మొదలైన దేశాలకు చైనా దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐటీ అప్లికేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసులు అందిస్తోంది. భారతీయ అవుట్సోర్సింగ్ సంస్థలు .. అంతర్జాతీయంగా సేవల ద్వారా గతేడాది 45 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. అయితే, తాజాగా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలతో ఐటీ సేవల విషయంలో చైనాకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని గార్ట్నర్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆఫ్షోర్ అవుట్సోర్సింగ్ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడం శ్రేయస్కరమని సూచించింది. -
ఆన్లైన్ షాపింగ్ జబ్బే..!
బెంగళూరు: డిజిటల్ మాధ్యమాల దుర్వినియోగం కారణంగా 2024 యేడాదికల్లా ఆన్లైన్ షాపింగ్ ఒక వ్యసనపరమైన రుగ్మతగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తించింది. ఆన్లైన్ షాపింగ్ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగా లక్షలాది మంది ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని అంతర్జాతీయ అధ్యయన సంస్థ గార్టనర్ అభిప్రాయపడింది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు చేసే వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఎడాపెడా కొనేసే అలవాటు వల్ల ఒత్తిడికీ, మానసిక ఆందోళనకు గురవుతారని డబ్ల్యూహెచ్వో గుర్తించినట్టు గార్టనర్ నిర్వహించిన అధ్యయనం చెప్పింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో పుస్తక సమీక్ష
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement