-
ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ
RIL Director Anant Ambani దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ భారీ విరాళమిచ్చింది.భారీ వర్షాలు , వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి వాటితో అతలా కుతమైన ఉత్తరాఖండ్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ప్రతినిది తనయ్ ద్వివేది ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’) ఈ మేరకు అనంత్ అంబానీ ఒక లేఖ రాశారు. తాము అందించిన సాయం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నామని ని అంబానీ సిఎం ధామీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్ ద్వారా తాము పలు విద్య సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 10 సంవత్సరాలకు పైగా రాష్ట్రానికి భాగస్వామిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా మన్నారు. మరోవైపు ఆర్ఐఎల్కు, అనంత్ అంబానీకి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) కాగా రిలయన్స్ ఫౌండేషన్ 2021లో కోవిడ్-19 సహాయ చర్యలకు మద్దతుగా ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి రూ. 5 కోట్లను అందించింది. మహమ్మారిపై సమిష్టి పోరాటంలో దేశం పట్ల ఆర్థిక సహాయం చేయడం తన కర్తవ్యమని కంపెనీ తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ , కేదార్నాథ్ ఆలయ కమిటీలకు ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత ఏడాది రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జనంతో జననేత మమేకం
సాక్షి అమలాపురం/అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఆంక్షలు పక్కన పెట్టి బాధితులతో మమేకమయ్యారు. అభిమానంతో చొచ్చుకువస్తున్న మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులను భద్రతా సిబ్బంది అడ్డుకోగా.. వారిని వారించి తన దగ్గరకు రప్పించుకుని మరీ మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. జగనన్నా.. అని ఆప్యాయంగా పిలుస్తూ వచ్చిన వారిని అక్కన చేర్చుకున్నారు. ‘జగన్ మావయ్యా’ అని బిగ్గరగా అరిచిన చిన్నారులను పిలిపించుకుని సెల్ఫీలు తీయించుకున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా, చెమటలు కక్కుతూన్నా బాధితుల బాధలు ఓపికగా విన్నారు. వరద బాధతులను స్థానిక వలంటీర్లు సీఎం జగన్కు పరిచయం చేశారు. వరద సహాయం సరిగ్గా అందిందా లేదా? అని వారి సమక్షంలోనే సీఎం తెలుసుకున్నారు. లంకాఫ్ ఠాన్నేలంకకు చెందిన జయలక్ష్మి అనే మహిళ తన పెన్షన్ వేరే ఊరిలో ఉందని, ఇబ్బంది పడుతున్నానని చెప్పగానే సీఎం స్పందించి.. స్థానిక వలంటీర్ను పిలిచి దరఖాస్తు చేయించాలని చెప్పారు. తనను కలిసిన విద్యార్థులను విద్యా కానుక వచ్చిందా? అని అడిగారు. వరద సాయం పంపిణీలో పొరపాటులుంటే చెబితే సరిదిద్దుకుంటామన్నారు. ప్రభుత్వం, అధికారులు, వలంటీర్లు ఇంటింటికీ వచ్చి వరద సాయాన్ని అందించారని, ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకుందని ముంపు గ్రామాల ప్రజలు సీఎంకు తెలిపారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రామాలయంపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే మా ధైర్యం వరదలతో చాలా కష్టపడుతున్నాం. నష్టపోతున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వరద వచ్చిన ప్రతిసారీ ఎంతో సాయం చేస్తోంది. ఊరు చుట్టూ వరదనీరు చేరినా పడవల్లో వచ్చి మరీ అధికారులు మాకు భోజనాలు, తాగునీరు అందించారు. గ్రామస్తులకే కాదు పశువులకు సైతం దాణా అందజేశారు. పేద, ధనిక తేడా లేకుండా ఇంటింటికీ రెండు వేల సాయం చేసి, దెబ్బతిన్న పూరిగుడిసెలకు 10 వేలు అందించారు. మీరే మా ధైర్యం. మీ మేలు ఎప్పటికీ మరచిపోం. – దుర్గాదేవి, కూనలంక, ముమ్మిడివరం మండలం మాకేం లోటు లేదు ఈ నాలుగేళ్లలో జగనన్న వచ్చిన దగ్గర నుండి మా పేదలందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకేం లోటు లేదు. కలెక్టర్ నుండి వలంటీర్ వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి సాయం అందించారు. నిత్యావసరాలు మొదలు భోజనాలు, తాగునీళ్ల దాకా సమస్తం మాకు లోటు లేకుండా పంపించారు. డ్యామేజ్ అయిన ఇళ్లకు రూ.10 వేలు అందించారు. మా లంక గ్రామాల ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – పోతుల భారతి, కొండుకుదురులంక గ్రామం, తొత్తరమూడివారిపేట, అయినవిల్లి మండలం మాట నిలబెట్టుకున్నారు జగనన్న పాలనలో మాకెప్పుడూ అన్నివిధాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. అమ్మ ఒడి, విద్యాదీవెన వస్తున్నాయి. ఎంత వరకూ కావాలన్నా చదువుకోండి చదివిస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. వరద సహాయక చర్యల్లో ఏ లోపం లేకుండా సమస్తం మాకు అందించి ఆదుకున్నందుకు ప్రభుత్వానికి, జగనన్నకు ధన్యవాదాలు. – పట్టా రజనీ, పొట్టిలంక మళ్లీ మీరే సీఎం కావాలి మీ నాన్నగారు నాకు చాలా మేలు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే అటెండర్లను పంపించారు. 16 ఏళ్లు అయ్యింది. బాగా ఉన్నాను. మీరు వచ్చాక íపింఛన్ అందుతోంది. వరద వచ్చినప్పుడల్లా వెంటనే 25 కేజీల బియ్యం, పప్పు, ఆయిలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలిచి మళ్లీ సీఎంగా రావాలి. – నల్లా వెంకాయమ్మ, కూనలంక, ముమ్మిడివరం మండలం జగనన్న పాలన ఒక వరం జగనన్న పంపిన అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చి వరదల సమయంలో మమ్మల్ని ఆదుకుంది. అందుకు మా కొండుకుదురు ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. మా ఎమ్మెల్యే, కలెక్టర్, రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అందరూ మాకు వెన్నంటి నిలిచారు. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్న పాలన మావంటి వారికి ఒక వరం. – నక్కా శ్రీనివాస్, పొట్టిలంక మీరే వస్తారని అనుకోలేదు వరదల సమయంలో చాలా కష్టపడుతున్నాం. పశువులకు మేత అందక మా మగవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి మేత తెస్తున్నారు. అప్పుడు మీరే మేత పంపి చాలా మంచి పని చేశారు. ఈసారి రెండు రోజులు అన్నం పెట్టారు. తినని వాళ్లకు బతిమాలి అన్నం పెట్టారు. మా జగన్ ఉండగా మాకు లోటు ఉండదు. గతంలో ఎంతోమంది వచ్చి రోడ్డు మీద నుంచే వెళ్లేవారు. మా బిడ్డ మా దగ్గరకు ఇలా వస్తారని అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది. – బుద్దా నాగవేణి, కూనలంక, ముమ్మిడివరం మండలం మా గ్రామానికి వచ్చిన తొలి సీఎం మీరే ఎన్నిసార్లు వరద వచ్చి మా ఊళ్లు మునిగినా ఒక్క ముఖ్యమంత్రి కూడా మా గ్రామానికి వచ్చిన పాపాన పోలేదు. మా దగ్గరకు వచ్చి మా బాగోగులు అడిగిన తొలి ముఖ్యమంత్రి మీరే. మాకు ఏం కావాలో అది ఇచ్చారు. నవరత్నాలన్నింటిని ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. చమురు సంస్థల నుంచి మత్స్యకార భరోసా ఇచ్చిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. – శేరు గంగ, లంకాఫ్ ఠానేల్లంక,ముమ్మిడివరం మండలం -
ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు
సాక్షి, అమరావతి/ సాక్షి, పాడేరు: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎంతో ముందుచూపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడమే రామోజీరావు అక్కసుకు కారణమైంది. ఎలాంటి నష్టం జరగకుండా, ఏ లోటూ లేకుండా వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండటం చూసి ఆయన తట్టుకోలేక కన్నీటి వరద కారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ నిరంతర పర్యవేక్షణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం మొత్తం గోదావరి వరద బాధితులకు సహాయక చర్యల్లో నిమగ్నమైనా ఈనాడు మాత్రం అవి కనపడకుండా కళ్లు మూసుకొని, అధికార యంత్రాంగం మొద్దునిద్రలో ఉన్నట్లుగా భ్రమిస్తోంది. ఆ భ్రమలనే వార్తలుగా మలచి సీఎం వైఎస్ జగన్ పైన, ప్రభుత్వం పైన రకరకాల పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వరదల సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. జూలై 28వ తేదీన ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు ఆగమేఘాలపై తీసుకునేలా యంత్రాంగాన్ని నడిపించారు. చదవండి: ‘టీడీపీ కార్యాలయంలో జై జగన్ నినాదాలు’ గ్రామ వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది వరద ప్రభావిత గ్రామాల్లోనే మకాం వేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వంలోకంటె ఇప్పుడు ఎంతో మిన్నగా వరద సహాయక చర్యలు చేపట్టారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చింతూరు పునరావాస కేంద్రంలో కూరగాయలు పంపిణీ చేస్తున్న సిబ్బంది 85 పునరావాస కేంద్రాలకు 49 వేల మంది తరలింపు వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 237 గ్రామాల్లోని 49,262 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. 10 లాంచీలు, 230 బోట్లతో బాధితుల్ని పెద్దఎత్తున తరలించే దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. పది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ముంపు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించారు. తా గునీరు, నిత్యావసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. అవసరమైన వారికి వెంటనే వైద్యం అందించేందుకు వైద్య బృందాలను నియమించారు. బాధితులకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి క్షణం అందుబాటులో ఉంటున్నారు. బాధితులకు నిత్యావసరాలకు లోటు రాకుండా అన్ని రకాల సరకులని స్టాక్ పాయింట్లకు ముందే పంపించారు. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిలు ఇస్తున్నారు. ముందే రూ.12 కోట్లు విడుదల వరద సహాయక చర్యల కోసం సీఎం జగన్ 5 జిల్లాలకు తక్షణమే రూ.12 కోట్లు విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా వరదల సమయంలోనే ముందుగా నిధులు విడుదల చేయలేదు. చంద్రబాబు హయాంలో వరదలు వచ్చి, అంతా మునిగిపోయి ప్రజలు గగ్గోలు పెట్టిన తర్వాత అరకొరగా నిధులిచ్చేవారు. దీంతో జిల్లా కలెక్టర్లు రకరకాల ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సహాయక చర్యల ప్రారంభానికి ముందే నిధులిచ్చే సంప్రదాయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వరద బాధితులకు అందించే ప్రత్యేక ఆర్తిక సాయం విషయంలోనూ సీఎం సరికొత్త రీతిలో ముందుకెళుతుండడం ఈనాడుకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు హయాంలో ఈ ప్రత్యేక సాయం ఊసే ఉండేది కాదు. వరద తగ్గిన తర్వాత తెలుగు తమ్ముళ్లు బాధితులకు ఇచ్చినట్లు రాసేసుకుని ఆ సొమ్ముని మింగేసేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా వరద తగ్గిన తర్వాత బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.1,000 నుంచి రూ. 2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవేమీ కనిపించని ఈనాడు ఈనాడు బృందం తిరిగినట్లుగా చెప్పుకొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ చర్యలు విస్పష్టంగా కనిపిస్తున్నా, అక్కడ ఏదీ జరగనట్లే అబద్ధాలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వరదలపై ముఖ్యమంత్రి ముందస్తుగా ఆదేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్తో సహా అధికార యంత్రాంగం చింతూరులో మకాం వేసింది. వరదపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిద్ధం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచింది. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో 177 గ్రామాలు వరదలకు ప్రభావితమవగా 110 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 24,279 కుటుంబాలను తరలించింది. బాధితులకు సత్వర సాయం వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం నాలుగు మండలాల్లో ముందుగానే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిత్యావసర సరకులను నిల్వ చేసింది. ముంపు ప్రాంతాల్లో జూలై, ఆగస్టు నెలల రేషన్ను ముందుగానే పంపిణీ చేసింది. నాలుగు మండలాల్లో సహాయక చర్యల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు సీఎం జగన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా నాలుగు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించాం. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించి వారికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశాం. గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాం. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాం. గోదావరి, శబరి నదుల్లో వరద తగ్గడంతో ఆయా ముంపు గ్రామాల్లో సహాయక కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నాం. – సుమిత్కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా అన్ని విధాలుగా ఆదుకున్నారు పునరావాస కేంద్రంలో తలదాచుకున్న మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. పక్కా భవనంలో విద్యుత్ సౌకర్యంతో పాటు నిత్యావసరాలు కొరత లేకుండా అందించింది. ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటూ మా బాగోగులు చూసుకున్నారు – కొండా సరోజిని, చింతూరు అన్ని సౌకర్యాలు కల్పించారు ఇంటి సమీపంలోకి వరద వస్తుండడంతో గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తాగు నీటికి ఇబ్బంది లేదు. బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు అందించారు. – మాటూరి శ్రీనివాసరావు, చింతూరు శబరిఒడ్డు అధికారులు అప్రమత్తం చేశారు వరద సమాచారంపై అధికారులు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. – బొర్రా పద్మారెడ్డి, వడ్డిగూడెం, వీఆర్పురం మండలం అధికారుల స్పందన బాగుంది వరదల సమయంలో అధికారుల స్పందన బాగుంది. ప్రభుత్వం చేపట్టిన సహా యక కార్యక్రమాలతో అందరం సురక్షితంగా ఉన్నాం. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మాకందరికీ నీరు, బియ్యం, పాలు సహా అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఏ లోటూ రాకుండా చూస్తున్నారు. – యడ్ల బాయమ్మ, టేకులబోరు, కూనవరం మండలం -
ఏపీలో ముమ్మరంగా సాగుతున్న వరద సహాయక చర్యలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వరద గుప్పిట్లో అనంతపురం
సాక్షి ప్రతినిధి, అనంతపురం/కర్నూలు (అగ్రికల్చర్): భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కకావికలమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో అనంతపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయదుర్గంలో 14.6, బుక్కరాయసముద్రంలో 12, పెద్దపప్పూరులో 11.6, గుత్తిలో 9.8, పుట్లూరులో 8.5, యాడికిలో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ప్రధానంగా అనంతపురం మండలం కక్కలపల్లి, కాటిగాని కాలువ, కట్టకిందపల్లి, ఆలమూరు, కామారుపల్లి, సజ్జల కాలువ, కురుగుంట, కొడిమి, రాచానపల్లి, ఎ.నారాయణపురం తదితర ప్రాంతాలతో పాటు రుద్రంపేట, చంద్రబాబు కొట్టాల, విమలా ఫారుఖ్నగర్, సుందరయ్య కాలనీ, వికలాంగుల కాలనీ, జాకీర్ కొట్టాల, నగరంలోని ఆజాద్నగర్, విశ్వశాంతి నగర్, హనుమాన్ కాలనీ, శాంతినగర్, ప్రశాంతి నగర్, రంగస్వామి నగర్, రజక నగర్, ఆదర్శ నగర్, యువజన కాలనీ, నాలుగు, ఐదు, ఆరో రోడ్డు, సోమనాథ నగర్, సుఖదేవ నగర్, శ్రీశ్రీనగర్, గౌరవ్ గార్డెన్, తడకలేరు తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంక పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బుక్కరాయసముద్రం వద్ద వాగులో సిమెంట్ కంటైనర్ బోల్తాపడింది. అనంతపురం ఐదో రోడ్డులో ఆహార పొట్లాల పంపిణీ ఉమ్మడి కర్నూలులో భారీ వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సగటున 85.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. దేవనకొండలో రికార్డు స్థాయిలో 160.2 మి.మీ. వర్షం కురిసింది. నందవరంలో 112.6, బనగానపల్లెలో 107.4, పగిడ్యాలలో 98.2, పెద్దకడబూరులో 97.2, గోనెగండ్లలో 96.2, వెల్దుర్తిలో 96.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. హంద్రీ నది, వేదావతి నదితోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాలతో వెల్దుర్తి మండలంలో నాలుగు మట్టి మిద్దెలు కూలిపోయాయి. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదావతి నది పొంగిపొర్లడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సీఎం చొరవతో సహాయక చర్యలు వేగవంతం అనంతపురంలో జిల్లాలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించడంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత ప్రజలకు అన్న పానీయాలు, నిత్యావసర వస్తువులు, మందులు అందజేస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మేయర్ వసీం, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు లోతట్టు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement