-
కోట గేట్లు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న జీహెచ్ ఎంసీ కార్మికులు
-
మంచి మాట: మాటల పాఠాలు
ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే. లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు. ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం. – రోచిష్మాన్ మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు. మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం. మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు. మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. -
కోతులతో కష్టాలు కనుమా.. కొండెంగలను తెచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఇంతకు ముందు పంట పొలాలకు రక్షణ కోసం కంచెలు వేయడం చూశాం. వివిధ రకాల పశువులు, పక్షులు, అడవి జాతి జంతువులతో పంట నష్టపోకుండా పొలం చుట్టూ రకరకాల బొమ్మలు, వైర్లు, టపాకాయలు, దిష్టి బొమ్మలు, సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇంటిపై కప్పులపై బొమ్మలు, కరెంట్ తీగలు, కంచె వేయడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇంటి పైకప్పులపై కంచెలు కనిపిస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇలాంటి జాగత్త్రలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యం అనిపించినా.. అక్షరాలా నిజమే. ఒకప్పుడు కేవలం అటవీ పరిసర ప్రాంతాలు, పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఊళ్ళల్లోనే కాదు పట్టణాల్లోనూ వానరాల సంచారం తీవ్రమైంది. కొండెంగలను తెచ్చినా.. కోతుల కట్టడి కోసం చాలా ఊళ్ళల్లో, కాలనీల్లో స్థానికులు తలాకొంత వేసుకుని వాటి రక్షణకు కొండెంగలను తెచ్చి పెట్టుకున్నారు. కానీ ఒక దిక్కున కొండెంగలను ఏర్పాటు చేస్తే మరో దిక్కున కోతులు చొరబడుతున్నాయి.. అన్ని చోట్లా పెట్టేందుకు ఎక్కువగా కొండెంగలు కావాల్సి ఉన్నా వాటి కొరత నేపథ్యంలో గ్రామస్తులకు విసుగొచ్చి చివరికి తీసుకువచ్చిన కొండెంగలను కూడా అడవిలో వదిలేశారంటే వానర సైన్యం సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు, కోతులు పట్టితెచ్చిన వారికి 2 రూ.వేల నుంచి పదివేలు ముట్టజెప్పినా... ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ కోతుల బెడద తప్పడంలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కోతులు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కానరావడం లేదు. ఈ మధ్య మా ఊళ్లో ఓ ఇంట్లోకి కోతి వెళ్లింది. పొరపాటున ఇంటి డోర్లాక్ పడటంతో వందలాది కోతులు ఇంటిని చుట్టుముట్టి నానారభస చేసి. పైకప్పును పూర్తిగా పాడు చేశాయి. ఆ సమయంలో ఇంట్లో మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏమిటి? – గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ–2, ముస్తాబాద్ -
ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె!
అడవుల్లో పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ ఏనుగులు ఆహారం కోసం కొత్త ప్రాంతాల్లోకి చొరబడాల్సిన పరిస్థితుల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతులు, గ్రామీణుల ప్రాణాలతోపాటు పంటలకు, పశువులకు రక్షణ కొరవడుతున్నది. ఏనుగులు–మనుషుల సంఘర్ణణను నివారించేందుకు కంచె పంటగా మల్బరీ మొక్కలను సాగు చేయటం, తేనెటీగల పెట్టెలతో కంచెను ఏర్పాటు చేయటం సత్ఫలితాలనిస్తున్న విషయమై గత వారం చర్చించుకున్నాం. ఈ వారం మరో బయోఫెన్స్ గురించి పరిశీలిద్దాం. పంట పొలాలు, గ్రామాల చుట్టూ నిమ్మ చెట్లతో దట్టమైన కంచెను ఏర్పాటు చేసుకుంటే ఏనుగుల బెడద నుంచి బయటపడిన అస్సాం రైతుల అనుభవం గురించి తెలుసుకుందాం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలోని శివసాగర్ జిల్లాలో గతంలో ఏనుగులు–మనుషుల ఘర్షణ. ప్రాణనష్టంతో పాటు పంట నష్టం సంఘటనలు తరచూ వినిపిస్తూ ఉండేవి. ఏనుగుల గుంపులో 150–200 నుంచి నాలుగైదు వరకు ఏనుగులు ఉంటాయి. అయితే, గత నాలుగేళ్లుగా ఏనుగుల దాడుల బాధ తప్పిందని సౌరగూరి ప్రాంత రైతులు సంతోషిస్తున్నారు. నిమ్మ చెట్లతో బయోఫెన్స్లు నిర్మించుకోవటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గౌహతి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అరణ్యక్ వీరికి అండగా నిలిచింది. నిమ్మ కంచెలపై అవగాహన కల్పించటంతోపాటు మొక్కలను సైతం అందించింది. జిగ్జాగ్ పద్ధతిలో మూడు వరుసలుగా నిమ్మ మొక్కలను దగ్గర దగ్గరగా నాటుకోవాలి. రెండు మూడు ఏళ్లు పెరిగేటప్పటికి నిమ్మ మొక్కల కొమ్మలు కలిసిపోయి ఏనుగులు దూరి రావటానికి వీలుకాదు. నిమ్మ చెట్లకుండే ముళ్లు, నిమ్మకాయల వాసన.. ఈ రెండిటి వల్ల ఏనుగులు నిమ్మ కంచెలు దాటి రాలేకపోతున్నట్లు అరణ్యక్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి రక్షించడంతో పాటు రైతులకు నిమ్మకాయల విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది. నాలుగేళ్ల క్రితం నిమ్మ మొక్కల కంచె నాటిన హజారికా అనే రైతు వారానికి వెయ్యి వరకు నిమ్మకాలను కోసి విక్రయిస్తున్నారు. ఆఫ్సీజన్లోలో నిమ్మకాయ రూ.5 కి అమ్ముతున్నారు. సీజన్లో అయితే రూ.2–3కు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానిక వాతావరణం, పర్యావరణం, మట్టి స్వభావాన్ని బట్టి బయోఫెన్స్ రకాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ‘తేనెటీగ పెట్టెలతో కూడిన కంచెలు వర్షపాతం తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తేనెటీగలు మనుగడ సాగించలేవు. వెదురు మొక్కలతో కంచెలు స్వతహాగా వెదరు పెరిగే ప్రాంతాల్లో పర్వాలేదు. ఇతర ప్రాంతాల్లో వెదురు కంచెలు ఏర్పాటు చేస్తే.. ఇతర చెట్లను పెరగనీయకుండా ఇవే విస్తరించి జీవవైవిధ్యానికి ముప్పు తెస్తాయి. నిమ్మ చెట్లు, మొగలి ఆకారంలో ఉండే కిత్లలి (అగవె) జాతి తుప్పలతోనూ బయెఫెన్స్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతానికి ఏది అనువైనదో గ్రహించాలి. ఏనుగుల రాకపోకలకు ఇబ్బంది లేకుండానే ఘర్షణలు నివారించి సహజీవన సూత్రాన్ని పాటించడానికి ‘కంచె తోటలు’ ఉపకరిస్తుండటం విశేషం. -
ఫెన్సింగ్ ఎక్కిన మొసలి!
నీటిలో ఉండే ప్రాణి ఏదంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది మొసలి. వీటిని ఎప్పుడు నీటిలో లేదా, భూమిపై పాకడం మాత్రమే చూశాం. కానీ ఫెన్సింగ్ ఎక్కడం ఎప్పుడైన చూశారా.. లేదంటే వెంటనే ఫేస్బుక్ తెరవండి మరి. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టీనా స్టేవర్ట్ అనే మహిళ, జాక్స్న్ విల్లేలోని నావల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఓ భారీ మొసలి(ఎలిగేటర్) ఫెన్సింగ్(కంచె)ను అలవోకగా ఎక్కుతుండటం చూసి తన మొబైల్లో వీడియో తీసింది. వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. ‘మొసళ్లు అంటే నీటిలో లేదా నేల మీద పాకడం మాత్రమే చూశాం. కానీ ఈ రోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ భారీ మొసలి కంచెను ఎక్కడం చూసి నేను ఆశ్యర్యానికి గురయ్యాను’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో, ఫొటోలకు ఇప్పటివరకు వేలల్లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యంతో ‘ఇది అరుదైన ఘటన.. భయంగా ఉన్నా బాగుంది’ అని ‘దూరం నుంచి చూసినప్పటికి..ఇది మంచి అనుభవం’ అంటూ ఒకరు.. నేను ఈ జాతి జంతు ప్రేమికున్ని కానీ.. నాకు ఇప్పటి వరకు తెలియదు ఇవి అలా ఫెన్సింగ్ ఎక్కగలవని!’ అంటూ అశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement