-
పేస్ 'పవర్' సరిపోతుందా!
సాక్షి క్రీడా విభాగం : కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్గా మారాక భారత జట్టు ఉపఖండంలో లేదంటే వెస్టిండీస్ గడ్డపైనే టెస్టు మ్యాచ్లు ఆడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో విండీస్ వేదికలు కూడా పేస్కు అనుకూలించకుండా నిర్జీవంగా మారాయి. కాబట్టి భారత్లోని మైదానాలకు, అక్కడి పిచ్లకు పెద్ద తేడా లేకుండా పోయింది. ఇలాంటి చోట మన పేస్ బౌలర్లకు ఎప్పుడూ పరీక్ష ఎదురు కాలేదు. వికెట్లు తీయాలంటూ వారిపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో పాటు ఒక క్రతువు నిర్వహించినట్లే కొన్ని ఓవర్లు వేసి తప్పుకోవడం రొటీన్గా మారిపోయింది. ఆ తర్వాత అశ్విన్, జడేజాలు మ్యాచ్ను తమ చేతుల్లోకి తీసుకొని విజయంవైపు సాగిపోవడం మనకు దాదాపు అన్ని సిరీస్లలో కనిపించిన ఒకే తరహా దృశ్యం. తాము విఫలమైనా స్పిన్నర్లు ఆదుకోగలరనే ధీమాతో పేస్ బౌలర్లపై ఒత్తిడి కూడా పెరగలేదు. విదేశాల్లో స్పిన్నర్ల వల్ల సాధ్యం కాని చోట ప్రధాన బాధ్యతను మోయలేక మన ఫాస్ట్ బౌలర్లు గతి తప్పారు. ఫిట్నెస్ సమస్యలు, చివరి సెషన్కు వచ్చే సరికి ఓపిక లేక డస్సిపోయి కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. విదేశాల్లో గత కొన్ని టెస్టులు చూస్తే ఇది అర్థమవుతుంది. జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాపై 136 ఓవర్లు... వెలింగ్టన్లో న్యూజిలాండ్పై 210 ఓవర్లు వేసినా ఆలౌట్ చేయలేక పోవడం... నాటింగ్హామ్లో ఇంగ్లండ్ ఆఖరి వికెట్కు ఏకంగా 198 పరుగులు జోడించడం... బ్రిస్బేన్లో చివరి నలుగురు ఆసీస్ బ్యాట్స్మెన్ కలిసి 195 పరుగులు జత చేసి టీమ్ స్కోరును రెట్టింపు చేయడం దానికి ఉదాహరణలు. ఈ అన్ని సందర్భాల్లోనూ భారత్ గెలిచే అవకాశమున్నా... దానిని కోల్పోయింది. కోహ్లి భిన్నంగా... ధోని కెప్టెన్సీలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలలో కలిపి 2 టెస్టులు గెలిచి 13 ఓడింది. ఇందులో ఒక్క 2010 డర్బన్ టెస్టులో మాత్రం భారత్ పూర్తిగా పేస్ బౌలింగ్ సత్తాతో గెలిచింది. 2014 లార్డ్స్ టెస్టులో ఇషాంత్ బాగా బౌలింగ్ చేసినా... అదంతా ధోని చలవే! సరిగ్గా చెప్పాలంటే ఆ ఇన్నింగ్స్లో ఇషాంత్ను చిన్న పిల్లాడిలా మార్గనిర్దేశనం చేస్తూ బంతి బంతికీ ఒక్కో వ్యూహంతో ధోని ఇంగ్లండ్ ఆట కట్టించాడు. వీటిని మినహాయిస్తే మిగతా సందర్భాల్లో పేస్ బౌలింగ్ పరంగా అద్భుతాన్ని ఆశిస్తూ ధోని ప్రేక్షక పాత్రకే ఎక్కువగా పరిమితమయ్యాడు. బౌలర్లు ప్రభావం చూపించాల్సిన చోట కూడా బ్యాటింగ్నే నమ్ముకోగా... మన పేసర్లు అతి సులువుగా, ధారాళంగా పరుగులు ఇచ్చేవారు. అందరూ కలిసి సుదీర్ఘ ఓవర్లు వేసే ప్రయత్నం చేసినా ప్రతీ సిరీస్లో ఎవరో ఒకరు గాయపడ్డారు. 2011–12 ఆస్ట్రేలియా సిరీస్లో జహీర్ చివరి వరకు కొనసాగినా అతి పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇప్పుడు కోహ్లి అలా వేచి చూసే వ్యక్తి కాదు. సరిగ్గా చెప్పాలంటే ధోని తన ఆటగాళ్లు తమంతట తాముగా కొంత బాధ్యత తీసుకోవాలని, సొంతంగా ఆలోచించాలని భావించేవాడు. కానీ విరాట్ మాత్రం దానిని డిమాండ్ చేస్తున్నాడు. తనకు ఎలా కావాలో గట్టిగా చెప్పి చేయించుకునే రకం అతను. కాబట్టి ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేసేందుకు, సుదీర్ఘ స్పెల్స్కు బౌలర్లు సిద్ధంగా ఉండాల్సిందే. ఆట మార్చుకోవాల్సిందే... ఐదేళ్ల క్రితం 2012 సీజన్లో సొంతగడ్డపై భారత్ మ్యాచ్లు ఆడిన సమయంలో ఫాస్ట్ బౌలర్ల ఉనికే దాదాపుగా కనిపించలేదు. టీమ్ ఆడిన సగం మ్యాచుల్లో కూడా ఏ ఒక్క పేసర్ బరిలోకి దిగలేదు. అశ్విన్ వేసిన ఓవర్లలో నాలుగో వంతు కూడా ఒక పేసర్ వేయలేదు. ఆ తర్వాతి విదేశీ పర్యటనల్లో ఇదే జట్టును దెబ్బ తీసింది. ఇప్పుడు సుదీర్ఘంగా సొంతగడ్డపై ఆడిన తర్వాత వరుసగా విదేశీ టూర్లకు భారత్ సిద్ధమవుతోంది. అయితే గతంతో పోలిస్తే ఇటీవల మన పేసర్లు కూడా ఎక్కువగా బౌలింగ్ చేయడం కొంత మెరుగైన విషయం. ఇప్పుడు మన పేసర్లలో అనుభవం పెరగడమే కాదు ఫిట్నెస్ కూడా చాలా బాగుంది. రనప్ సమస్య చక్కదిద్దుకున్న తర్వాత షమీలో సత్తా పెరిగింది. దక్షిణాఫ్రికా గడ్డపై షమీ నుంచి కోహ్లి ఎంతో ఆశిస్తున్నాడు. అయితే అతను తన ఫిట్నెస్ను కాపాడుకోవడమే కీలకం. బౌలింగ్ చేసే తీరులో చిన్న మార్పు మన పేసర్లకు మరింత అనుకూలంగా మార్చవచ్చు. భారత్లో సాధారణంగా నేరుగా స్టంప్స్పైకి బంతులు విసిరి మనోళ్లు ఎక్కువగా వికెట్లు రాబట్టారు. మన పేసర్లు పడగొట్టిన వికెట్లలో 45.5 శాతం బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ కావడం దీనికి నిదర్శనం. ఇక్కడి నెమ్మదైన పిచ్లపై అది పని చేసింది. అదే దక్షిణాఫ్రికాలో పరిస్థితి భిన్నం. గత పదేళ్లలో దక్షిణాఫ్రికాలో అలాంటి బౌలింగ్కు 28 శాతం మాత్రమే వికెట్లు లభించాయి. అక్కడ ఎక్కువగా ఆఫ్ స్టంప్పై దాడి చేయాల్సి ఉంటుంది. బయటికి వెళుతూ బ్యాట్ ఎడ్జ్ తీసుకునేలా బంతులు సంధించాలి. దాని కోసం బౌలర్లు లెంగ్త్ను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు తగిన ఫలితాలు లభిస్తాయి. తుది జట్టులో షమీ, ఇషాంత్ ఖాయం కాగా... మూడో స్థానం కోసం భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ల మధ్య పోటీ ఉంది. జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంపికైనా ఆడే అవకాశాలు తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అన్ని విధాలా మెరుగైన పేస్ బౌలింగ్ దళమే. అయితే తమపై ఉన్న ఒత్తిడిని అధిగమిస్తే సఫారీ సిరీస్ మనకు చిరస్మరణీయం కాగలదు. తొలి టెస్టులో స్టెయిన్కు నో చాన్స్! గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ బరిలోకి దిగడం మరింత ఆలస్యం కానుంది. భారత్తో శుక్రవారం నుంచి కేప్టౌన్లో జరిగే తొలి టెస్టు తుది జట్టులో అతనికి అవకాశం లభించకపోవచ్చని స్వయంగా కోచ్ ఒటిస్ గిబ్సన్ వెల్లడించారు. స్టెయిన్ ఫిట్గానే ఉన్నా ముగ్గురు పేసర్లతో కూడిన తమ జట్టు కూర్పులో అతనికి స్థానం కష్టమని ఆయన చెప్పారు. దాదాపు ఏడాది తర్వాత వస్తున్న స్టెయిన్ తొలి టెస్టులో ఏదైనా జరిగి మధ్యలోనే తప్పుకునే ప్రమాదం కూడా ఉందన్న గిబ్సన్... పేస్కు అనుకూలించే తర్వాతి రెండు టెస్టు వేదికలపై మాత్రం స్టెయిన్ ఉంటాడని సంకేతమిచ్చారు. -
కొత్త బుల్లెట్..
►భారత పేస్ బౌలింగ్ ఆశాకిరణం నాథూ సింగ్ ► పేదరికం దాటి ప్లే గ్రౌండ్లోకి ► ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు ఫాస్ట్ బౌలింగ్ అతనికి సహజసిద్ధంగా అబ్బింది. వేగం గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన పని లేదు...దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ చెప్పిన మాట. ఈ కుర్రాడిలో చాలా ప్రతిభ ఉంది. జాగ్రత్తగా కాపాడుకుంటే గొప్ప ఫాస్ట్ బౌలర్ కాగలడు... రాజస్థాన్ క్రికెట్కు రాహుల్ ద్రవిడ్ సూచన. చాలా రోజుల తర్వాత భారత్లో అసలైన పేస్ బౌలింగ్ చూస్తున్నా. ఆ వేగం అసాధారణం... అతని బౌలింగ్లో అవుటయ్యాక గౌతమ్ గంభీర్ స్పందన. గణాంకాలతోనే ఆటగాళ్లను ఎంపిక చేస్తే సెలక్టర్లు ఎందుకు. ప్రతిభను గుర్తించడం కూడా మా పని. నాలుగే ఫస్ట్క్లాస్ మ్యాచ్ల తర్వాత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వివరణ. ఇదంతా 20 ఏళ్ల రాజస్థాన్ బౌలర్ నాథూ సింగ్పై కురుస్తున్న ప్రశంసల వర్షం. అసలు ఆ కుర్రాడిలో అంతగా ఏముంది? ‘అమ్మా నాన్న’ పచ్చబొట్టు ఈతరం కుర్ర క్రికెటర్లలో చాలా మందికి టాటూస్ సరదా ఉండటం సహజం. వింత వింత బొమ్మలతో పాటు ఏవో కొటేషన్లు చేతులు, భుజాలంతా పరచుకుంటాయి. కానీ ఎంత మంది 20 ఏళ్ల ఫస్ట్క్లాస్ స్థాయి క్రికెటర్లు ‘అమ్మా నాన్న’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంటారు? అలా చేసేవాడు ఏదో పాతకాలం వాడిలాగా కనిపిస్తాడు. కానీ పేదరికంలో పుట్టి పెరిగిన ఆ క్రికెటర్ తన తల్లిదండ్రులు తన కోసం పడిన శ్రమను, సర్వస్వాన్ని పణంగా పెట్టడాన్ని అనుక్షణం గుర్తు తెచ్చుకునేందుకు అలా చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఇటీవల చిన్న పట్టణాల నుంచి కూడా భారత క్రికెట్లోకి ఆటగాళ్లు వస్తున్నారనే మాట తరచుగా వినిపిస్తోంది. కానీ అవి చిన్న పట్టణాలు కావచ్చు. కానీ వారిలో చాలా మంది చిన్నవారేమీ కాదు. మంచి నేపథ్యం ఉన్నవారే. కానీ జైపూర్కు చెందిన నాథూ సింగ్ మాత్రం పేదరికానికి చిరునామాలాగే పెరిగాడు. అయితే అది అతని ప్రతిభను అడ్డుకోలేదు. ఇప్పుడు భారత్లో అత్యంత వేగంగా బంతులు విసురుతున్న బౌలర్గా నాథూ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతను వేసే ఏ బంతీ కూడా 140 కిలోమీటర్ల వేగానికి తగ్గడం లేదు. లెదర్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన మూడేళ్ల లోపే రాజస్థాన్ సీనియర్ జట్టులోకి వచ్చిన నాథూ సింగ్... తన తొలి రంజీ ట్రోఫీ సీజన్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తండ్రి కష్టార్జితంతో... నాథూ తండ్రి భరత్ సింగ్ వైర్ల ఫ్యాక్టరీలో లేబర్. మూడేళ్ల క్రితం వరకు కూడా నాథూ మదిలో సీరియస్ క్రికెట్ ఆలోచనే రాలేదు. 17 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి కొద్ది రోజుల్లో ఏదో ఒక ఫ్యాక్టరీలో లేబర్గా చేరిపోదామని సిద్ధమైపోయాడు. టెన్నిస్ బాల్తో వేగంగా బౌలిం గ్ చేయడమే అతనికి తెలుసు. కానీ కొందరు మిత్రులకు అది కూడా చాలా వేగంగా అనిపించి ప్రోత్సహించారు. కోచింగ్ అకాడమీలో చేరేం దుకు తండ్రి వద్ద అప్పటివరకు ఉన్న మొత్తం పొదుపు రూ. 10 వేలు పెట్టేశారు. జిల్లా స్థాయి టోర్నీల్లో సంచలన ప్రదర్శనతో ఏడాది తిరిగే లోపు రాజస్థాన్ అండర్-19 జట్టులోకి వచ్చేశాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను తప్పు చేస్తున్నానేమో, అనవసరంగా అమ్మా నాన్నని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది. కానీ దేవుడు అండగా నిలిచాడు. ఆరంభంలో డబ్బులు లేక బాగా ఇబ్బంది పడ్డాను. రాజస్థాన్ సీనియర్ బౌలర్లు దీపక్ చహర్, అనికేత్ చౌదరి తమ షూస్, స్పైక్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. మొదటి మ్యాచ్ ఫీజు అమ్మానాన్నలకు ఇచ్చిన రోజు వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపిం చింది’ అని హైదరాబాద్లో విజయ్ హజారే టోర్నీ ఆడేం దుకు వచ్చిన నాథూ ఉద్వేగంగా చెప్పుకున్నాడు. రంజీ ట్రోఫీలోకి... అండర్-19 ప్రదర్శనతో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడి కోచ్ సెంథిల్ పర్యవేక్షణలో నాథూ వేగం మరింత పెరిగింది. ఇక్కడే చీఫ్ కోచ్ గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా)ను తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో వెంకటేశ్ ప్రసాద్ సూచనలు కూడా పనికొచ్చాయి. వేగంతో పాటు కచ్చితత్వం కూడా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా తొలిసారి రంజీ ట్రోఫీ ఆడే అవకాశం కలిగింది. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ దిశగా సాగుతున్న గంభీర్... నాథూ అద్భుతమైన బంతికి ఎల్బీగా వెనుదిరగడంతో ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఆ ఇన్నింగ్స్లో మొత్తం 7 వికెట్లు పడగొట్టిన అతనికి మరో మూడు మ్యాచ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. ‘ఇంత తొందరగా ఆమ్లా, డివిలియర్స్లకు బౌలింగ్ చేస్తానని అనుకోలేదు. చాలా సార్లు చక్కటి బంతులతో వారిని ఇబ్బంది పెట్టగలిగాను’ అని ఆ మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. ఇన్స్వింగ్ స్పెషల్... మెక్గ్రాత్ విశ్లేషించినట్లు నాథూ సింగ్లో పేస్, స్వింగ్ సహజ సిద్ధంగా వచ్చాయి. ‘నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఎలా బౌలింగ్ వేసేవాడినో ఇప్పుడూ అలాగే వేస్తున్నాను. పిచ్ను బట్టి లెంగ్త్ను మార్చుకుంటానంతే. బంతిని స్వింగ్ చేసేందుకు, కట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయలేదు. ఇవన్నీ టెన్నిస్ బాల్తో నేను స్వయంగా నేర్చుకున్నవే. నాకు నేను ఇన్స్వింగ్ బౌలర్గా భావిస్తా’ అని నాథూ అంటున్నాడు. నాథూ గొప్పతనం ఒక మ్యాచ్కో, సెషన్కో పరిమితం కాలేదు. అతనిలో సహజ సిద్ధమైన వేగం ఉంది. 70 ఓవర్ల తర్వాత పాతబడిన బంతితోనూ... ఒక రోజులో తన 18వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే వేగం కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ వ్యవస్థ ద్వారా కాకుండా సొంతంగా శ్రమించి వెలుగులోకి వచ్చిన ఒక యువ క్రికెటర్ భవిష్యత్తులో కూడా ఇలాగే సత్తా చాటాలని ఆశిద్దాం. ఆరంభంలో వేగంగా వేసి తర్వాత మీడియం పేస్గా మారిన చాలా మంది బౌలర్లలాగా నేనూ కావొద్దని అంతా చెబుతున్నారు. అలా అని నాపై ఒత్తిడి ఏమీ లేదు. ఇకపై కూడా వేగం పెరుగుతుందే తప్ప తగ్గదు. నేను అతిగా ఏదీ ఆశించడం లేదు. ఇప్పటి వరకు నా వద్దకు ఏది వస్తే దానినే అందుకున్నాను. రంజీల్లో అవకాశం కూడా అలాంటిదే. ఇప్పుడే భారత్కు ఆడటంలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. ఫాస్ట్ బౌలర్ను అనిపించుకునేందుకు, కండలు పెంచుకునే జిమ్కు వెళ్లి భారీ ఎక్సర్సైజ్లు కూడా అసలు ఏమీ చేయను. స్పీడ్ గన్లను కూడా చూస్తూ కూర్చోను. ఎవరో చెబితేనే నా వేగం ఎంత అనేది తెలిసింది. నాకు తెలిసిందల్లా మైదానంలోకి దిగిన తర్వాత సాధ్యమైనంత వేగంగా బంతిని విసరడం. ఎన్నో ఏళ్లుగా అదే చేస్తున్నాను. దీని కోసం ప్రత్యేక సలహాలు తీసుకోలేదు. ఏ పేస్ బౌలర్నూ ఎలా వేయాలని అడగలేదు. నేను ఆదర్శంగా భావించే ఫాస్ట్ బౌలర్ అంటూ ఎవరూ లేరు. పేదరికాన్ని అనుభవించిన నేను ఈ స్థాయికి రావడమే గొప్ప. ఎంతో మంది సహకారం వల్లే ఇది సాధ్యమైంది. -‘సాక్షి’తో నాథూ సింగ్, ఫాస్ట్ బౌలర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement