-
వారికోసం సొంతిళ్లు
తారలందరూ ఒకేలా ఉండరు. అలాగే వారి ఆలోచన, దృక్పథం వేర్వేరుగా ఉంటాయి. సంపాదించడం ఒక ఎత్తు అయితే అందులో ఇతరులకు సాయం చేయడానికి మంచి మనసుండాలి. అనుష్క, అజిత్తో కలిసి నటించిన చిత్రం ఎన్నైఅరిందాల్ ఫిబ్రవరి 5 న తెరపైకి రానుం ది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో అజిత్ నుంచి ముఖ్యంగా మూడు అంశాలను తెలుసుకున్నారట. అందులో ఒకటి ఇతరులను గౌరవించడం, మరొకటి బిరియాని చేయడం. మూడవది తన కోసం శ్రమించే వారికి తగిన సాయం చేయడం, అజిత్ ఎన్నై అరిందాల్ చిత్ర షూటింగ్ సమయంలోనే తన ఇంటిలో, తోటలో పని చేసే వారికి చెన్నై తూర్పు సముద్ర తీర ప్రాంతంలో సొంత గృహాలను నిర్మించి ఇచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నటి అనుష్క తనవద్ద పని చేస్తున్న వాళ్లకు హైదరాబాద్లో ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి అనుష్క మాట్లాడుతూ ఒక సాధారణ యోగా టీచర్ అయిన తాను ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. తన కోసం రాత్రి, పగలు శ్రమిస్తున్న తన చుట్టూ వున్న వారు కారణమేనన్నారు. అలాంటివారి కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతోనే వారికి ఇళ్లు కట్టిస్తున్నా అని వివరించారు. తానొక నటి నన్న విషయాన్ని పక్కన పెడితే అందరిలానే అన్ని భావాలు కలిగిన సరాసరి మనిషినేనని అనుష్క పేర్కొ న్నారు. -
ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా
ఎన్నై అరిందాల్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. అజిత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఎన్నై అరిందాల్. త్రిష, అనుష్క కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్మీనన్ దర్శకత్వంలో శ్రీసాయిరాం పిక్చర్స్ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. అయితే ఎన్నై అరిందాల్ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామని నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు. అయినా చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవలే సెన్సార్కు వెళ్లింది. సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్రానికి ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం లేకపోవడంతో నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఏదేమైనా ఎన్నై అరిందాల్ చిత్రం వాయిదాల పర్వం అజిత్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తోందన్నది నిజం. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement