-
‘‘ఆయన్ని నమ్మకద్రోహి, అవకాశవాది అనడం మేలు’’
ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును కీర్తిస్తూ చాలామంది చాలా మాటలు అంటూంటారు. మీడియా మొఘల్ వంటి భుజకీర్తులు చాలానే తొడుగుతూంటారు. ఈ జాబితాలోకి నమ్మకద్రోహి, అవకాశవాదీ వంటివి కూడా చేరిస్తే బాగుంటుందేమో అంటున్నారు ఆయన తోడల్లుడు... డాల్ఫిన్ అప్పారావు! విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఈనాడు కార్యాలయం డాల్ఫిన్ అప్పారావు, ఈయన మేనమామలదే. వ్యాపారం కోసమని 33 ఏళ్లపాటు వాడుకోమని లీజుకిస్తే రామోజీరావు మోసం చేశాడని, గడవు తీరిన తరువాత కూడా రకరకాల కారణాలు, పేచీలతో కోర్టుల చుట్టూ తిప్పుతూ స్థలం ఖాళీ చేయకుండా తనకు ద్రోహం తలపెట్టారని ఆయన ఈమధ్యే ‘సాక్షి’ టీవీతో తన గోడు వెళ్లబోసుకున్నారు. రామోజీరావు నమ్మిన వాళ్లను మోసం చేయడం ఇదే మొదటిసారి కాదులెండి. 1974లో విశాఖపట్నంలో ఈనాడు మొదలైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ ఉదంతాలకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వార్తా పత్రికల్లోనూ అచ్చు అయ్యాయి. అక్కడేం జరిగింది? విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు తన మొట్టమొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ స్థలం ఎవరిదన్న విషయం తెలిసింది కొద్దిమందికే. ఈశ్వర కుమార్ వర్మ అనే వ్యక్తి ఈ స్థలాన్ని రామోజీరావుకు లీజుకిచ్చారు. దీర్ఘకాలిక లీజు. కచ్చితంగా చెప్పాలంటే 33 ఏళ్లు. హైదరాబాద్లోని సోమాజీగూడలో ఉన్న ఈనాడు ప్రధాన కార్యాలయం కూడా ఈ కుటుంబానిదేనని, రెండు చోట్లా లీజు గడువు ముగిసిన తరువాత కూడా స్థలం ఖాళీ చేసి యజమానులకు అప్పగించకుండా రామోజీ తన పేచీకోరు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని డాల్ఫిన్ అప్పారావు సాక్షి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదంత ఒక ఎత్తు అయితే లీజుకు తీసుకున్న స్థలం తన సొంతమైనట్లు రోడ్డు విస్తరణ కోసమని ప్రభుత్వానికి అప్పగించడం.. ప్రతిగా అందే పరిహారాన్ని కూడా తన ఖాతాల్లో, తనవారి ఖాతాల్లో వేయించుకోవడం ఇంకో ఎత్తు. విశాఖపట్నం స్థలం 2.70 ఎకరాల్లో సుమారు 517 చ.మీటర్ల స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి (రోడ్డు విస్తరణ కోసం) అప్పగించినందుకు గాను పరిహారంగా ఇచ్చిన 872 చ.మీటర్ల స్థలాన్ని రామోజీ తన పేరుతో రాయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. అందుకేనేమో.. డాల్ఫిన్ అప్పారావు కూడా రామోజీని ‘కఠిన దుర్మార్గుడు’ అని అభివర్ణించారు. ఈశ్వర కుమార్ వర్మ కుటుంబానికే చెందిన స్థలంలో హైదరాబాద్లోని ఈనాడు కేంద్ర కార్యాలయం నిర్మించారని చెప్పుకున్నాం కదా.. ఈ విషయంలోనూ రామోజీరావు ఆడిన డ్రామా అంత ఇంత కాదని డాల్ఫిన్ అప్పారావు చెబుతారు. లీజు ముగిసిన తరువాత స్థలాన్ని ఖాళీ చేయకపోగా...స్థలాన్ని తనకే అమ్మేయాలని డిమాండ్ చేయడం.. అది కూడా పావల అర్ధకు ఇచ్చేయాలని చెప్పడం రామోజీరావు నైజాన్ని బయటపెడుతుందన్న విమర్శలున్నాయి. ఆఖరుకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత గతిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఈనాడు ప్రధాన కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆయన కొనుగోలు చేయాల్సి వచ్చింది! ఏతావాతా.. లీజు పేరుతో స్థలం తీసుకోవడం.. గడువు తీరినా ఖాళీ చేయకపోవడం.. పత్రికను అడ్డుపెట్టుకుని లీజుదారులను బెదిరించడం.. కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా అలసిపోయేలా చేసి రాజీకి ఒప్పించడం! ఇదీ రామోజీ మోడస్ ఆపరాండీ అంటారు డాల్ఫిన్ అప్పారావు. హైదరాబాద్, విజయవాడ స్థల వివాదాలను పరిశీలిస్తే ఇవన్నీ నిజమేనని అంగీకరించక తప్పదు! డాల్ఫిన్ అప్పారావు మాటల్లోనే చెప్పాలంటే న్యాయం జరగడంలో కొంత ఆలస్యమైతే కావచ్చు కానీ.. ఎప్పటికైనా సత్యం, ధర్మం గెలిచి తీరుతాయి! ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! -
‘ఈనాడు’ స్థల వివాదం కొలిక్కి
రెండ్రోజుల్లో స్థలాన్ని యజమానికి అప్పగిస్తాం ఆర్సీసీకి ఈనాడు న్యాయవాదుల నివేదన తుది తీర్పు నేటికి వాయిదా విశాఖపట్నం, న్యూస్లైన్-లీగల్: విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. సీతమ్మధారలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలాన్ని రెండు రోజుల్లోనే ఖాళీ చేసి సంబంధిత యజమాని ఆదిత్య వర్మకు అప్పగిస్తామని ఆ సంస్థ తరఫు న్యాయవాదులు మంగళవారం అద్దె నియంత్రణ న్యాయస్థానం (ఆర్సీసీ)కి తెలియజేశారు. అయితే కార్యాలయాన్ని ఖాళీ చేసే విషయంలో సుప్రీంకోర్టు ఏ మాత్రం గడువు ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్సీ కోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్నారు. తుది తీర్పు నిమిత్తం కేసును బుధవారానికి వాయిదా వేశారు. ఆ స్థలంలో ఈనాడు కార్యాలయం కొనసాగాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థల యజమాని వర్మకు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ఈనెల 10లోగా రూ. 2.60 కోట్ల బకాయిలు, నెలకు రూ. 17 లక్షల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. ఈ దృష్ట్యానే ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్లతో హుటాహుటిన ఆ స్థలాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రవేశద్వారం వద్ద దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ‘ఈనాడు’ బోర్డును మంగళవారం తొలగించారు. బుధవారం సాయంత్రానికల్లా 2.78 ఎకరాల స్థలాన్ని, అందులో ఉన్న పది భవనాలను ఖాళీ చేసి ఇస్తామని ఈనాడు న్యాయవాదులు కోర్టుకు తెలిపారని వర్మ తరఫు న్యాయవాది వీవీ రవిప్రసాద్ వివరించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement