-
సమస్యలు పరిష్కరించకుంటే సమరమే
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించకుంటే సమరం చేయాల్సి ఉంటుందని తెలంగాణ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఆ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదల, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, కోశాధికారి డాక్టర్ కిరణ్ ప్రకాష్, ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎల్.రమేష్ ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు సహా అదనపు డీఎంఈ స్థాయి వరకు బోధనా వైద్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రతీ నెలా జరుగుతున్న సమీక్ష సమావేశంలో కేవలం లక్ష్యాలు ఇవ్వటమే కాక, వైద్యుల సమస్యల గురించి కూడా చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. సమస్యల విషయంలో గత ఏడాది నిరసన తెలిపినప్పుడు మంత్రి హరీశ్ రావు భరోసాతో వెనక్కి తగ్గినప్పటికీ, అందులో అనేక సమస్యలు అలాగే పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తామని, అప్పటినుంచి నిర్ణీత వారం రోజుల సమయంలో స్పందించకపోతే, ‘చలో హైదరాబాద్‘ అనే నినాదంతో పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. -
జూడాల సంఘం అధ్యక్షుడిగా కౌశిక్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘంనూతన కార్యవర్గం ఏర్పాౖటెంది. సంఘం అధ్యక్షునిగా డాక్టర్ పింజర్ల కౌశిక్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్కే అనిల్కుమార్, ఉపాధ్యక్షులుగా డి.శ్రీనాథ్, ప్రణయ్ మోతె, అరుణ్కుమార్, కౌశిక్ జోషి, తాన్యా జరార్, ప్రత్యూష్రాజ్లు ఎన్నికయ్యారు. -
‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’.. బాబా రామ్దేవ్కు హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్దేవ్కు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కోవిడ్పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా రామ్దేవ్ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా రామ్దేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అని పేర్కొన్నారు జస్టిస్ అనుప్ జైరాం భంభాని. మరోవైపు.. పతాంజలి కరోనిల్ను సవాల్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అఖిల్ సిబాల్. ఎలాంటి ట్రయల్స్, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్దేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. ఇదీ చదవండి: బాబా రామ్దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
ఆపి 40 వార్షిక సదస్సు
ప్రతి భారతీయుడు గర్వించేలా ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) 40వ వార్షిక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. టెక్సస్లోని శాన్ అంటోనియో నగరంలో జూన్ 23 నుంచి 26 వరకు ఈ వేడుకలు జరుగుతాయని ఆపి అధ్యక్షులు డాక్టర్ అనుపమ గొటిముకుల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని ఆమె తెలిపారు. అందుకోసం కోసం కన్వెన్షన్ చైర్ డాక్టర్ జయేష్ షా, సీఈవో అడివి వెంకీ భారతదేశంలో వైద్యవిద్యను అభ్యసించి ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం తొలినాళ్లలో అమెరికా వచ్చిన వాళ్లు అనేక రకాలైన వివక్షలకు గురయ్యారన్నారని తెలిపారు. మొక్కవోని ధైర్యంతో ఆ కష్టాలను అధిగమించి గౌరవంగా అమెరికా రాష్ట్రాల్లో నిలబడటానికి వైద్యులంతా కలిసి 1980 కాలంలో ఏర్పాటు చేసుకున్నదే ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అని అనుపమ గొటిముకుల తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్స్ ప్రధానంగా ఎదుర్కుంటున్న మెడికేర్ పేమెంట్ కట్స్చి, ఇమ్మిగ్రేషన్ అంశాలలో ప్రధానమైన గ్రీన్ కార్డ్ బ్లాకేజ్ గురించి అమెరికాలోని చట్టసభల ప్రతినిధులతో ఆపి తరఫున చర్చించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సదస్సులో విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని అనుపమ వెల్లడించారు. సత్కారం అందుకునే వారిలో సునీల్ గావాస్కర్ (క్రికెటర్), డాక్టర్ రాహుల్ గుప్త (డైరెక్టర్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ), డాక్టర్ సౌజన్య మోహన్ (టెక్సస్ గ్రూప్), ప్రైమ్ హెల్త్ కేర్ సిఇఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, సైంటిస్ట్ పీటర్ జె హెటెజ్, సాధ్వి భగవతి సరస్వతి, అష్టాంగయోగ పరమగురు శరత్ జాయిన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జాక్ రెస్నెక్ జూనియర్లలు ఉన్నారు. డాక్టర్ దువ్వూరుకి పురస్కారం ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నతమైన సేవల్ని అందిస్తున్నందుకు ప్రముఖ వైద్యనిపుణులు, అపి ఓవర్సీస్ కో ఆర్డినేటర్డా క్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి కి స్పెషల్ సర్వీస్ అవార్డును అందించి శాన్ అంటోనియో వేదిక మీద ఘనంగా సత్కరిస్తున్నామని అధ్యక్షురాలు అనుపమ గొటిముకుల వెల్లడించారు. -
కనీసం 6 నెలలు బదిలీలు ఆపండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్సుందర్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బదిలీల విషయమై పక్షం రోజులుగా ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా, రోడ్లెక్కి నిరసనలు చేయకుండా, శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మొర పెట్టుకున్నా స్పందన రాలేదన్నారు. బదిలీల విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్సుందర్ ఆరోపించారు. కేజీహెచ్లో ఉన్న 300 మందికి పైగా వైద్యులు ఐదేళ్లు పైబడి ఉన్నారని, వారందరినీ ఒకేసారి బదిలీ చేస్తే వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోవడమే గాక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు డాక్టర్ సుందరరాజు, కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నానిని మళ్లీ గెలిపించాలని..
7న మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్!
షా డీప్ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సరిహద్దు చెక్ పోస్ట్లలో ప్రత్యేక నిఘా
క్రిమినల్స్కు ఓటేస్తే అంతా దోపిడీ
No Headline
వైఎస్సార్సీపీతోనే ప్రజలకు మేలు
అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే
No Headline
No Headline
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement