-
బరువు తక్కువ బాల్యం!
సాక్షి, అమరావతి: ఆటపాటలతో ఆనందంగా బాల్యాన్ని గడపాల్సిన చిన్నారులు బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతో భారంగా గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న లక్షల మంది చిన్నారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద సర్కారు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా చిన్నారులను పౌష్టికాహార లోపం పట్టిపీడించడం గమనార్హం. ఊబకాయం, ఎదుగుదల లోపాలు రాష్ట్రంలోని పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 23.82 లక్షల మంది ఉండగా ఏకంగా 36.4 శాతం అంటే 8.69 లక్షల మందిలో ఎదుగుదల సరిగా లేదని తేలింది. మరోవైపు ఊబకాయం ముప్పు కూడా విస్తరిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో 12.7 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఊబకాయంతో బాధపడుతుండగా ఈ ఏడాది జనవరి నాటికి ఇది 14.6 శాతానికి పెరిగింది. 3.45 లక్షల మంది చిన్నారులు ఊబకాయంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. కర్నూలులో పౌష్టికాహార లేమి కర్నూలు జిల్లా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాల్లో ఐదేళ్లలోపు పిల్లలు 2.75 లక్షల మంది ఉండగా 1.24 లక్షల మందిలో ఎదుగుదల సరిగా లేదు. ఇదే జిల్లాలో 56,600 మంది తక్కువ బరువుతో సతమతం అవుతున్నారు. 26,500 మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 21,800 మందిలో ఎత్తుకు తగినట్లుగా బరువు లేదు. ఎస్టీల పరిస్థితి దయనీయం ఇక ఇతర మండలాలకన్నా ఎస్టీలు అధికంగా నివసించే 30 మండలాల్లో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వ నివేదికలో స్పష్టమైంది. 30 ఎస్టీ మండలాల్లో బరువు తక్కువగల పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సగటున బరువు తక్కువ పిల్లలు రెండు శాతం మంది ఉంటే 30 ఎస్టీ మండలాల్లో ఏకంగా 4.2 శాతం మంది బరువు తక్కువగల పిల్లలున్నారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 14 శాతం మంది తక్కువ బరువున్న పిల్లలున్నారు. ఊబకాయం కలిగిన పిల్లల సంఖ్య శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మినహా అన్ని చోట్లా పెరగడం ఆందోళన కలిగిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
క్లర్కు కాదు.. ఖతర్నాక్
సాక్షిప్రతినిధి, నల్లగొండ :స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ సెలవుపై వెళ్లిపోవడానికి ప్రధానకారణంగా చెబుతున్న రూ.8కోట్ల కందిపప్పు, శనగల సరఫరా కాంట్రాక్టు వివాదాస్పదం కావడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 2.41లక్షల మంది లబ్ధిదారులకు ఉద్దేశించిన పథకాలు పక్కదారి పడుతున్నాయి. కందిపప్పు, శెనగలు, గుడ్లు .. ఇలా, ఏ సరుకూ సక్రమంగా సరఫరా కావడం లేదు. సరుకుల సరఫరాలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు ఏజెన్సీ ‘కేంద్రీయ భండార్’ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించిన పీడీని మందలించడమే కాకుండా, సదరు ఏజెన్సీ నుంచి రూ.11ల క్షలు రికవరీ చేయాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. తిరిగి అదే ఏజెన్సీ ఈసారి కూడా టెండరు దక్కించుకునేందుకు నానాతిప్పలే పడుతోంది. నిబంధనలకు పాతర.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) భ్రష్టు పట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టులు పొందుతున్న వారు తలా కొంచెం తినిపించి, తాము మిగిలించుకునేందుకు కాంట్రాక్టు నిబంధనలకు పాతరేస్తున్నారు. మొన్నమొన్నటి దాకా అమలులో ఉన్న కాంట్రాక్టు సమయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. సరుకుల సరఫరా కాంట్రాక్టులో భాగంగా, స్థానికంగా లభ్యమయ్యే కందిపప్పును అరకేజీ, కేజీ ప్యాకింగుల్లో సరఫరా చేయాల్సి ఉండగా, అదేమీ పట్టించుకోవడం లేదు. అదే మాదిరిగా, స్థానికంగా లభ్యమయ్యే కందిపప్పు కాకుండా, చౌకగా దొరికే ‘టాంజానీయా’ దేశం నుంచి ఇక్కడకు దిగుమతి అవుతున్న నాసిరకం పప్పును సరఫరా చేశారు. ఇక, కందిపప్పు లోడ్లు సీడీపీఓ పాయింట్లకు చేరినప్పుడు కచ్చితంగా వేయింగ్ బ్రిడ్జి నుంచి తూకం వేయించి తీసుకున్న బిల్లులు చూపించాలి. కానీ, అది ఎక్కడా అమలు కావడం లేదు. అంతే కాకుండా, సివిల్ సప్లయీస్ అధికారులు పప్పులో తేమశాతాన్ని పరీక్షించి ఓకే చేస్తేనే సరుకు దించుకోవాలి. కానీ, ఎక్కడా తనిఖీలు జరగకుండా కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు లాభం చేస్తున్నారు. ఈ విషయంలో ఆరోపణలు రావడం వల్లే జిల్లా ఉన్నతాధికారులు పీడీని మందలించడంతో ఆమె సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు కందిపప్పు, శెనగలు సరఫరా చేసే కాంట్రాక్టు ఈ ఏడాది జూన్తోనే ముగిసినా, రెండు నెలలపాటు అదనంగా ఎందుకు గడువు పొడిగించారన్న ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం లేదు. ఇదివరకు గుడ్ల సరఫరా విషయంలోనూ కాంట్రాక్టు సంస్థకు ఇదే తరహా మినహాయింపులు ఇచ్చి టెండర్లు జరగకుండా చూశారు. ఇప్పుడు కూడా టెండర్లు పిలవాల్సిన సమయం కంటే రెండు నెలలు ఆలస్యంగా పిలిచారు. ఇలా సహకరించినందుకు భారీగానే ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి కార్యాలయానికి కనీసం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల దాకా చేతులు తడిపినట్లు తెలుస్తోంది. అదే మాదిరిగా, సరుకు ఎలా ఉన్నా , ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అన్లోడ్ చేసుకుని సహకరిస్తున్నందుకు కొందరు సీడీపీఓలకు ప్రతినెలా రూ.5వేల దాకా నెలవారీ పర్సెంటేజీలు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులు కలిసి ప్రభుత్వ సొమ్మును పంచేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement