-
Andhra Pradesh: 3 క్యాన్సర్ ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించేలా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీనివల్ల చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిస్థాయిలో చికిత్సలు, ఇతర సేవలు అందాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయని ఇవికాకుండా క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. వీటితో పాటు గతంలోనే ప్రకటించిన విధంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. మరిన్ని సేవలకు గ్రీన్ సిగ్నల్ ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని సేవలందించేందుకు వీలుగా విశాఖ కేజీహెచ్లో కొత్త ఎంఆర్ఐ, కాకినాడ జీజీహెచ్లో ఎంఆర్ఐ, క్యాథ్ల్యాబ్, కర్నూలులో క్యాథ్ల్యాబ్, పాడేరు, అరకు ఆస్పత్రుల్లో అనïస్థీషియా, ఆప్తాలమిక్, ఈఎన్టీ సేవలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.37.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఆరోగ్యశ్రీ యాప్.. పటిష్టంగా ఆరోగ్యమిత్ర ఆరోగ్యశ్రీ సేవలు సమర్థంగా అందించేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో సందేహాల నివృత్తి ఏర్పాట్లు కూడా ఉండాలని స్పష్టం చేశారు. యాప్ను ఆరోగ్య మిత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆరోగ్య మిత్రలకు సెల్ఫోన్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సేవలపై సచివాలయాల్లో హోర్డింగ్స్ ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఆస్పత్రులపై అందరికీ అవగాహన కల్పించేలా గ్రామ సచివాలయాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందాలంటే ఎక్కడకు వెళ్లాలో సూచిస్తూ సమాచారం ఉండాలని, ఇందుకు విలేజ్ క్లినిక్ రిఫరల్ పాయింట్ కావాలని స్పష్టం చేశారు. విలేజ్ క్లినిక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఆస్పత్రికి వెళ్లాలి? ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ లభిస్తాయన్నది రోగులకు స్పష్టంగా తెలియాలని, దీనిపై సరైన మార్గదర్శనం చేయాలన్నారు. 108లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలని, ఈ మేరకు 104ను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో రిఫరల్ అన్నది చాలా కీలకమైన అంశమని, ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అధికారులు దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మంచి కండిషన్లో 108, 104 వాహనాలు.. 108, 104 వాహనాలు అత్యంత సమర్థంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. రోగులకు వేగంగా సేవలు అందించడంలో వాహనాలే కీలకమని, జిల్లాను యూనిట్గా తీసుకుని వాహనాలు మంచి కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదనంగా బఫర్ వెహికల్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఆరోగ్య ఆసరా ద్వారా రోగులకు డిశ్చార్జి అయిన రోజు నుంచే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అందించాలని పునరుద్ఘాటించారు. ఫొటోలతో స్పష్టంగా వ్యత్యాసం విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు–నేడు పనుల ప్రగతిని ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నాడు – నేడు ద్వారా చేపడుతున్న ఏ కార్యక్రమమైనా సరే గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలన్నారు. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో తెలియజేసేలా ఫొటోలు ఉండాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే సేవల పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇందులో సిబ్బంది పాత్ర కీలకమని, ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను వారికి వివరించాలన్నారు. వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని అధికారులకు నిర్దేశం చేశారు. విలేజ్ క్లినిక్స్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేసి వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలని సూచించారు. రక్తహీనత నివారణలో రాష్ట్రమే ఫస్ట్ రక్త హీనత నివారణకు ఆరు రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలియచేశారు. రక్త హీనత నివారణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా నిలిచినట్లు వెల్లడించారు. దేశవ్యాప్త సగటు 40.5 శాతం కాగా 75.3 పాయింట్లతో ఇండెక్స్లో ఏపీ ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు 58 పాయింట్లు వచ్చినట్లు వివరించారు. అంగన్వాడీలు, విలేజ్క్లినిక్స్ ద్వారా రక్తహీనత నివారణ కార్యక్రమాలు చురుగ్గా సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీ వార్మింగ్కు వినియోగించే మందులు కచ్చితంగా జీఎంపీ ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. జనవరిలోగా డబుల్ డోసులు పూర్తవ్వాలి.. కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని నిర్దేశిత వయసు వారందరికీ జనవరిలోగా డబుల్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం జగన్ సూచించారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ను పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు ఉన్న పరిష్కారమని స్పష్టం చేశారు. హాజరైన మంత్రి, ఉన్నతాధికారులు.. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజ్మెంట్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఎ.బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్ నవీన్కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ మాటే వినిపించకూడదు.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు వివరించారు. ప్రతి ఆస్పత్రిలో పడకలు, వైద్యులు సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు ప్రదర్శించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సిబ్బంది లేకపోవడం వల్ల సేవలు అందలేదన్న మాటే వినిపించకూడదన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు తగినంత మంది సిబ్బంది ఉండాలని, ఇవి రెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వారంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ► ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చరికలతో ఎయిర్పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఆంక్షలు ► మరో వారం రోజుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు ► ప్రస్తుతం కొనసాగుతున్న 32వ దఫా ఫీవర్ సర్వే ► రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ యాక్టివ్ కేసులు 1,912 ► రికవరీ రేటు 99.21 శాతం ► రోజూ పాజిటివిటీ రేటు 0.52 శాతం ► 104 కాల్సెంటర్కు వచ్చిన కాల్స్ 718 ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో 109 ప్రాంత్లాలో 144 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ఇప్పటివరకు 121 ప్లాంట్ల పూర్తి. ఈ నెలాఖరు నాటికి అన్నిచోట్లా ప్లాంట్లు అందుబాటులోకి. ► 69 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు. ఇప్పటికే 43 ఆస్పత్రుల్లో సిద్ధం. ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 23,457. డీ టైప్ ఆక్సిజన్ సిలిండర్లు 27,311 -
3 ప్రాంతాల్లో క్యాన్సర్ ఆస్పత్రులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో ఆయన సమావేశమయ్యారు. ప్రజారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్ నివారణ, చికిత్సలు, ఆధునిక విధానాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరాలను వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా... రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు – నేడు, వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించాం. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు పరస్పరం ఆలోచనలు పంచుకున్నాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రులు నెలకొల్పి అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పించారు. వివిధ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను దీనికిందకు తేవాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళిక. క్యాన్సర్ రోగులందరికీ చికిత్సలు అందుబాటులోకి తీసుకు రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. చిన్న గ్రామంలో క్యాన్సర్ రోగి ఉన్నా చికిత్స కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆశయం. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే చికిత్స లభ్యమయ్యేలా చూడాలన్న ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగింది. రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేయడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో సమావేశం కావడం ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు గొప్ప అడుగు పడింది. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయి. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం, కొత్తవి ఏర్పాటు చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది. -
మరిన్ని ఆరోగ్య సేవలు ప్రైవేటుపరం
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్ల విలువైన ఆరోగ్య సేవలను ప్రైవేటు పరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల వేళ మిగిలిన వాటిని కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగించాలంటూ కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మీపై చర్యలు తప్పవంటూ ఆరోగ్య శాఖ సలహాదారు, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. వందలాది కోట్ల రూపాయల విలువైన పనులు ఎవరికివ్వాలో ముందే నిర్ణయించి పేరుకు టెండర్లు నిర్వహిస్తున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత టెలీ ఆఫ్తల్మాలజీ(కంటి పరీక్షలు) సేవలు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా ప్రభుత్వ పెద్దలు ముందే నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు సదరు కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా నిబంధనలు రూపొందించడమే ఇందుకు ఉదాహరణ అని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) కింద కేన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలుస్తున్నారు. ఒక్కో జిల్లాలో రూ.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాల్సిన ఈ ఆస్పత్రులను కూడా ఓ కార్పొరేట్ కంపెనీకి కట్టబెడుతున్నారు. ఆ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులే టెండర్ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చారంటే.. ఇక టెండర్ల ప్రక్రియ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రూ.550 కోట్లయ్యే ఈ ప్రాజెక్టు వారికి అప్పజెప్పడంతో పాటు ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేషెంట్లను కూడా అక్కడికే తీసుకెళ్లేలా నిబంధనలు రూపొందించడం గమనార్హం. టీబీ రోగులకు మందులు అందజేయడాన్ని కూడా ప్రైవేటుకు అప్పజెప్పి భారీగా లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా అందినకాడికి దండుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖ సలహాదారు నేతృత్వంలో.. వైద్య విద్యా శాఖ, మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థల్లోనే ఎక్కువ టెండర్లున్నాయి. ఈ రెండు విభాగాలకు ఎన్ఎండీ ఫరూక్ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ పెద్దలే.. ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేటు కన్సల్టెంట్.. తనకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు దక్కేలా డాక్యుమెంట్లు రూపొందించి పనులు చక్కబెడుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఓ అధికారి సాక్షికి తెలిపారు. ఉన్నతాధికారులు, సలహాదారు నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఇదంతా చేస్తున్నట్టు వివరించారు. పైగా ఇటీవల కాలంలో చాలామంది అధికారులు ఈ శాఖలో పనిచేయలేమంటూ బలవంతంగా బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దీంతో అన్ని విభాగాలకు ఒకరే ఇన్చార్జిగా ఉండటంతో.. వీరి పని మరింత సులువైంది. -
విశాఖ, నెల్లూరు, కర్నూలుల్లో కేన్సర్ ఆసుపత్రులు
గుంటూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 84 పీహెచ్సీలకు రూ. 101 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 800 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 500 వైద్యుల పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే రాష్ట్రంలో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించామని కామినేని పేర్కొన్నారు. రూ. 225 కోట్లతో వైద్య పరికరాల తయారీ కోసం విశాఖలో మెడ్టెక్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాట్కో సాయంతో రూ. 10 కోట్లతో గుంటూరులో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని... ఈ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కేన్సర్ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు కామినేని తెలిపారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో విమ్స్ ప్రారంభిస్తామన్నారు. -
ఏపీలో మూడు కేన్సర్ ఆస్పత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కొత్తగా మూడు కేన్సర్ ఆస్ప్రతులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పారు. వీటితో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంపై చాలా ప్రభావం పడిందని ఆయన అన్నారు. పెద్దపెద్ద ఆస్పత్రులన్నీ.. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేటు రంగంలో గానీ అన్నీ గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలోనే అభివృద్ధి చెందాయన్నారు. మొత్తం 13 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement