-
గోడను బద్దలు కొట్టి.. రూ.55 లక్షలు దోపిడీ
న్యూఢిల్లీ: ఓ దొంగల ముఠా ఢిల్లీలోని షాహదారాలో ఓ బ్యాంకులో రూ.55 లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ గోడను పగలగొట్టి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలిపారు. దొంగలు డ్రిల్తో సహా అవసరమైన అన్ని పరికరాలతో వచ్చినట్లు పేర్కొన్నారు. నగదు లాకర్లను పగులగొట్టి డబ్బులు దొంగిలించడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని అన్నారు. కాగా, డబ్బును ఖజానాలోని ఓ గదిలో ఉంచినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇక ఇతర భాగాలలో ఉంచిన అన్ని లాకర్లలోని నగదు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు.. -
కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి..
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో దొంగలు రెచ్చిపోయారు. జాతీయ రహదా రిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఓ ఏటీఎంలో చోరీ చేశారు. అందు లోంచి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. మరో ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశా రు. ఎస్ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్స్టేజీ వద్ద నిలిపి ఉంచిన ఓ కారును దొంగి లించిన దుండగులు పట్టణంలోని ఎస్బీఐ పక్కన ఉన్న ఏటీఎం సెంటర్కు చేరుకున్నారు. ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలపైకి పొగను పంపి మెషీన్ను ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహ నం రావడంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకుని కారులో పరారయ్యారు. ఏటీఎం లో చోరీకి జరిగిన ప్రయత్నాన్ని గుర్తించిన పో లీసులు వెంటనే తేరుకుని జాతీయ రహదారి వెంట గల ఏటీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. క్యాష్ ర్యాక్లను బయటికి తీసిన దుండగులు అందులోని రూ.7.12 లక్షలను అపహరించారు. వాహనాలు అపహరించి ప్రయాణం.. దుండగులు వాహనాలను అపహరించి అందులో ప్రయాణించారు. మొదట వట్టిమర్తి లో అపహరించిన ఇండికా కారులో వెలిమినేడు వరకు వచ్చిన దుండగులు అక్కడే దానిని వదిలేశారు. అనంతరం వెలిమినేడుకు చెందిన సంగప్ప అనే వ్యక్తి క్వాలిస్ వాహనాన్ని దొంగిలించి పంతంగి టోల్ప్లాజా వద్దకు చేరుకుని దానిని కూడా అక్కడే వదిలి పరారయ్యారు. చోరీకి రెండు బృందాలుగా వచ్చి నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
లాయర్ ఫీజు ఇచ్చేందుకు చోరీలు
బనశంకరి (కర్ణాటక): జైలు నుంచి విడుదల కావడానికి జామీను ఇప్పించిన న్యాయవాదికి డబ్బు చెల్లించడానికి ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను శుక్రవారం కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్, వసీమ్ గతంలో అనేక ఇళ్లలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీరిద్దరికి న్యాయవాది జామీను ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. న్యాయవాది ఫీజు చెల్లించడానికి జైలు నుంచి విడుదలైన అనంతరం సయ్యద్, వసీమ్ ఇద్దరూ మళ్లీ చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చోరీసొత్తును బంగారు దుకాణాల్లో విక్రయించి న్యాయవాదికి ఫీజు చెల్లించి మిగిలిన డబ్బుతో జల్సాలు చేసేవారు. కోరమంగళ మాత్రమే కాకుండా ఆడుగోడి, తిలక్నగర, బొమ్మనహళ్లితో పాటు ఆరుకు పైగా పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెలుగుచూసిందని బెంగళూరు దక్షిణ డీసీపీ ఇషాపంత్ తెలిపారు. -
వేసవి.. జాగ్రత్త సుమా
సాక్షి, మిర్యాలగూడ అర్బన్ : వేసవి కాలం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చాయి కదా అని ఇంటికి తాళం వేసి ఊర్లకెలుతున్నారా..? అయితే మీ విలువైన వస్తువులు జాగ్రత్త.. దొంగలు వాటిని మాయం చేయొచ్చు. రాత్రి సమయంలో ఉక్కపోతను భరించలేకుండా మేడపైన పడుకుంటున్నారా..? అయితే మీ ఇంటి తాళం తీసి దొంగలు తెల్లవారే సరికి మీ విలువైన సొత్తును అపహరిం చొచ్చు. వేసవి కాలం దొంగతనాలకు అనువైన సమయం అని పోలీసులు పేర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చని వారు అంటున్నారు. రాత్రి సమయంలో గస్తీలు పెంచినా ప్రజలు అప్రమత్తంగా లేనిదే దొంగతనాలకు చెక్పెట్టడం సాధ్యం కాదంటున్నారు పోలీసులు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతూ విలువైన సొత్తును మాయం చేస్తున్నారు. ముందుగా కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇండ్లను గుర్తించి చోరీ లకు పక్కా స్కెచ్ వేస్తారు. రాత్రి సమయంలో ఇంటితాళం పగులగొట్టి ఇంట్లోని విలువైన సొమ్మును చోరీ చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఊర్లకు వేళ్లే వారు విలువైన వస్తువులు బంగారం, వెండి, డబ్బులను ఇంట్లో పెట్టుకోక పోవడమే మంచిది. వాటిని బ్యాంకుల్లో ఉంచితే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. ఇంటికి తాళం వేసి ఊరికెళ్లే పరిస్థితుల్లో దగ్గర్లోని పోలీస్స్టేషన్లో సమాచారం అందిస్తే రాత్రి సమయంలో పోలీసులు ఆ కాలనీల్లో గస్తీని పెంచుతారు. కానీ ప్రజలు ఈ విషయాలను పట్టించుకోకుండా వెళుతుండటంతో తమ విలువైన సొత్తును పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లో స్పందన ఉంటేనే దొంగతనాలనునివారించే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చే సమయంలో ఇంటినంబర్, కాలనీ పేరు, యజమాని ఫోన్నంబర్తోపాటు లాండ్మార్కు వివరాలను పోలీసులకు అందిస్తే గస్తీని పెంచి నిఘా పెడతారు. పోలీసులు రాత్రి సమయంలో గస్తీ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా తమ బాధ్యతగా భావించి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలను నివారించే వీలుందని వారు పేర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటించాలి.. వేసవిలో ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాతావరణం వేడెక్కి రాత్రి సమయంలో ఉక్కపోత భరించలేనంతగా ఉంటుంది. ఇంట్లో నిద్రించేందుకు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దీంతో ఎక్కువగా ఇంటి ఆవరణలో, మేడపైన నిద్రించేందుకు ఇష్టపడతారు. ఇలాంటి రోజుల్లో కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచి స్తున్నారు. సొత్తు మాయమైన తర్వాత బాధపడే కంటే ముందు.జాగ్రత్తలు పాటించి తమ విలువైన సొమ్మును భద్రపర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంటికి వేసే తాళాలు సైతం మార్కెట్లో బ్రాండెడ్ దొరుకుతున్నాయి. తాళం టచ్ చేస్తే అ లారం మోగే తాళాలు అందుబాటులోకి వచ్చా యి. ఇలాంటి వాటిని వాడితే కొంత మేరకు దొం గతనాలను అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ముఖ్యమే.. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంటిని నిర్మించుకుంటున్న ప్రజలు కేవలం తక్కువ ఖర్చు అయ్యే సీసీ కెమరాల ఏర్పాటుపై శ్రద్ధ చూపడం లేదు. కాలనీ కమిటీలు ఏర్పడి సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకుంటే కాలనీలో సంచరించే కొత్త వ్యక్తుల గురించిన వివరాలు అందులో నమోదయ్యే అవకాశం ఉంటుంది. అనుమానం వచ్చిన వ్యక్తులను గుర్తించే వీలు కలుగుతుంది. ఇంటి పరిసరాల్లో సైతం సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. దొంతనాలు జరిగిన వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించి సొత్తును రికవరీ చేసే అవకాశముంటుదని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రజలు సహకరించాలి వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాలను అరికట్టడంలో పోలీసు శాఖ ఎంతగా శ్రమిస్తుందో ప్రజలు తమ బాధ్యతగా సహకరించాలి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. కొద్ది పాటి జాగ్రత్తలు పాటించి మీ విలువైన వస్తువులు చోరీకి గురి కాకుండా చూసుకోవాలి. ఇప్పటికే రాత్రి సమయంలో కాలనీల్లో పోలీసు గస్తీలను ముమ్మరం చేశాం. – పి.శ్రీనివాస్, డీఎస్పీ మిర్యాలగూడ -
పిజ్జా డెలివరీ అంటేనే భయపడిపోతున్నారు
నోయిడా: సాధారణంగా దొంగలంటే డబ్బుకోసం, విలువైన వస్తువుల కోసం తెగబడుతుంటారు. కానీ, ఆహారపదార్థాలకోసం దొంగతనాలు మాత్రం చాలా అరుదు. దేశంలో దొంగతనాల ఘటనలకు పేరు నోయిడా. ఇక్కడ దొంగతనం పేరుతో వార్తా రాలేదంటే మాత్రం అది కచ్చితంగా రికార్డు అనుకోవాల్సిందే. ఎందుకంటే నోయిడాలో ప్రతి రోజు ఏదో ఒక చోట తప్పనిసరిగా దొంగతనం జరగడం.. అది పత్రికల్లో రావడం పరిపాటి. ఆయుధాలు ధరించి మరీ ఈ దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే, ఇక్కడ తాజాగా జరుగుతున్న దొంగతనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడు ఇక్కడ దొంగల కన్ను పిజ్జాలపై పడింది. అవును వారానికి కనీసం పదుల సంఖ్యలో పిజ్జాలను దొంగలు ఎత్తుకెళుతున్నారట. అయితే, దీనిని పెద్ద నేరంగా పరిగణించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోతుండటం గమనార్హం. కచ్చితంగా ఎన్ని పిజ్జాల దొంగతనానికి గురవుతున్నాయనే విషయం చెప్పలేంగానీ వారానికి కనీసం పన్నెండుకు పైగా పిజ్జాలు మాయమవుతున్నాయని చెప్పగలం అని స్వయంగా పిజ్జా డెలివరీ బాయ్లు చెబుతున్నారు. తాము పిజ్జాలు తీసుకెళుతుండగా ఆయుధాలు ధరించి వచ్చి బెదిరించి పట్టుకెళుతున్నారని, అందుకే పిజ్జాలు డెలివరీకి తీసుకెళ్లాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
Advertisement