-
స్వీపరే దొంగోడు
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో కలకలం సృష్టించిన ‘తుపాకీ బుల్లెట్స్’ మాయం కేసును ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు ఛేదించారు. పోలీసు జాగిలం నిందితున్ని పసిగట్టడడంతో స్వీపరే దొంగోడుగా గుర్తించారు. వివరాల్లోకి వెలితే... నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆదివారం 15 రౌండ్ల రైఫిల్ బుల్లెట్స్ మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. ఏఆర్ కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న స్వీపర్ (హోంగార్డు) పెన్నోబిలేసు తుపాకీ (రైఫిల్) నుంచి 15 రౌండ్ల బుల్లెట్స్ దొంగిలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వీపర్ తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు 303 రైఫిల్ను కార్యాలయంలో అప్పగించే సమయంలో తుపాకీ రౌండ్స్ పరిశీలించారు. 15 రౌండ్లు బుల్లెట్లు తక్కువ ఉండడంతో కార్యాలయం అంతా వెతికారు. విషయాన్ని ఏఆర్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ అనుమానితులను గుర్తించారు. టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? రైఫిల్ బుల్లెట్ల చోరీ వెనుక పలు కారణాలున్నట్లు తెలుస్తోంది. తాగుడుకు బానిసైన స్వీపర్ పెన్నోబిలేసును ఏఆర్ అధికారులు, సిబ్బంది చులకనగా మాట్లాడేవారని సమాచారం. ఘటనకు ముందు రోజు అందరి ఎదుట మందలించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో 303 రైఫిల్ బుల్లెట్లు విక్రయించడం ద్వారా కొంత సొమ్ము చేసుకోవచ్చునని స్వీపర్ భావించి దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసువర్గాలు వెల్లడించాయి. నిందితున్ని గుర్తించిన జాగిలం పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం ఉదయం అనుమానితులను ఏఆర్ డీఎస్పీ సమక్షంలో టూటౌన్ సీఐ ఆరోహణరావు, ఎస్ఐ శివగంగాధర్రెడ్డిలు విచారించారు. విచారణలో ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు పోలీసుజాగిలాన్ని రప్పించి విచారించారు. జాగిలం నేరుగా బుల్లెట్లు చోరీ చేసిన స్వీపర్ పెన్నోబిలేసు వద్దకు వెళ్లింది. విషయం బయట పడడంతో స్వీపర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఏఆర్ కార్యాలయ ఆవరణలో చెత్తకుప్పలో దాచిపెట్టిన బుల్లెట్లను అధికారులు అప్పగించాడు. స్వీపర్పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకీ నిర్వహణలో బాధ్యతారాహిత్యం కింద కానిస్టేబుల్ సోమశేఖరనాయుడుపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. -
ఎయిర్పోర్టులో 32 లైవ్ బుల్లెట్లు స్వాధీనం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్పోర్టులో తనిఖీలలో రాజ్కుమార్ అనే వ్యక్తి నుంచి 32 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు ఉండటంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో ప్రయాణికుడు రాజ్కుమార్ తెలిపాడు. రాజ్కుమార్ హైదరాబాద్కు చెందినవాడని పోలీసులు వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. తల్లీకూతుళ్ల అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు విదేశీ మహిళలు బుల్లెట్లతో సంచరిస్తూ కలకలం సృష్టించారు. కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానితులుగా గుర్తించి ఇద్దరు మహిళలను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళల లగేజీని పూర్తిగా పరిశీలించగా వారి వద్ద కొన్ని బుల్లెట్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మొదటగా వారి హ్యాండ్ బ్యాగ్స్ స్కాన్ చేయగా ఎదో ఉన్నట్లు అనుమానం వచ్చి, లగేజీని పూర్తిగా చెక్ చేయడంతో వారి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించామని వారిద్దరూ తల్లీకూతుళ్లు అని అధికారులు వెల్లడించారు. నేతాజీ ఎయిర్ పోర్టు నుంచి ఎమిరేట్స్ విమానంలో వారు దుబాయ్ కి వెళ్లి, అక్కడి నుంచి ఇటలీకి వెళ్లనున్నట్లు ఆ మహిళలు చెప్పారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఆ తల్లీకూతుళ్లు ఫ్రాన్స్ కు చెందిన వారిని, ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement